-
టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్
మాచర్ల రూరల్: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ వారికి గ్రామంలో స్వాగతం పలికి భోజనం పెడతామంటూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసి అడ్డుకోబోయిన పోలీసు తల పగలకొట్టిన సంఘటన ఆదివారం మండలంలోని అడుగురాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి పి.అనిల్కుమార్ యాదవ్ను పిలిపించాలంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పీఆర్కే సతీమణి పిన్నెల్లి రమాదేవి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి కార్యకర్తలు, నాయకులకు భోజనం ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, మరికొందరు ఆదివారం వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి దాడికి దిగి గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువురికి సద్దుబాటు చేసే ప్రయత్నంలో టీడీపీ నాయకులు పోలీసులపై తిరగబడి దాడి చేశారు. ఈ సమయంలో హెడ్ కానిస్టేబుల్ మోడవత్ సాంబశివ నాయక్ తలకు తీవ్రగాయమైంది. ఆయనతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎన్నికల్లో ఓట్ల కోసం టీడీపీ నాయకులు వర్గాలు, గొడవలు సృష్టిస్తున్న టీడీపీ నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి
ఎంపీ అభ్యర్థి పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి గురజాల: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డి కావాలా...గ్రామాల్లో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టే చంద్రబాబునాయుడు కావాలా అని ఎంపీ అభ్యర్థి పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పులిపాడు, గంగవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు పాఠశాలలు బాగుపరచి విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని, వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ ఇచ్చే విధంగా చూడాలన్న ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి అయిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చిన ఆలోచనలతో చంద్రబాబుకు నిద్రపట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పేరుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. సామాజిక న్యాయం వైఎస్సార్ సీపీలో వుందన్నారు. పాలనా సౌలభ్యంలో భాగంగా గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. రాజశేఖర్రెడ్డి కడుపున పులి లాంటి జగన్మోహన్రెడ్డి పుట్టాడని నా కడుపున పప్పు ముద్ద లాంటి లోకేష్ పుట్టాడాని చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి, సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), మండల కన్వీనర్ సిద్దాడపు గాంధీ, కొమ్మినేని బుజ్జి, కొమ్మినేని రవిశంకర్, మన్నెం గురవయ్య, పరిమి శ్రీను, ఎం శ్రీనివాసరావు, ఓర్సు కొండలు, మాటూరి మరియదాసు, కో ఆప్షన్ మెంబర్ షేక్ పీర్ అహ్మద్, బి బ్రహ్మం, కావూరి అంజిబాబు, తదితరులున్నారు. -
ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం
పిడుగురాళ్ల: ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉంటుందని వైఎస్సార్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి వాసవీ అమ్మవారి చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్ది అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం జగన్ మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించడం వల్ల ప్రతి ఆర్యవైశ్య వ్యాపారాలు బాగున్నాయన్నారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ది కావాలా, డబ్బులు, అహంకారం, పెత్తందారుల వ్యవస్థల కావాలో మీరు నిర్ణయించుకోవాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, నర్సరావుపేట పార్లమెంట్ పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ చింతా వెంకట రామరావు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భవనాశి యల్లారావు, వివిధ అసోసియేషన్ అధ్యక్షులు, దేవస్థాన అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి వ్యాపారాలకు తోడుగా నిలబడతాం రాజకీయంగా సముచిత స్థానం కల్పించింది వైఎస్సార్సీపీనే ఆర్యవైశ్యులంతా వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి -
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు
సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును, వారి కూటమిని నమ్మలేక, వారి మేనిఫెస్టో పై విశ్వాసం లేక జగనన్న మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయని జలవనరుల శాఖా మంత్రి, నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర లో భాగంగా జరిగిన చేరికల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా 1,2 వార్డుల నుంచి 60 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు.ఒకటవ వార్డు కౌన్సిలర్ వరికల్లు కోటేశ్వరావు, స్థానిక నాయకులు నిజాంపట్నం అమరేంద్రల ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల్లో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నే రానున్నారని, ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారన్నారు. కూటమిగా వచ్చినా, కట్టకట్టుకు వచ్చినా జగనన్నను ఎవరూ ఆపలేరన్నారు. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే కూటమిగా వస్తున్నారని, అబద్దపు వాగ్దానాలతోనైనా సరే అధికారం చేపట్టాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు..కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెండెం బాబురావు, జిల్లా గ్రంధాల యాల సంస్ధ మాజీ ఛైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి, పక్కాల సూరిబాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ నాగుర్మీరాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు ఉన్నారు. కారెంపూడి: కారెంపూడి మండలంలో టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామానికి చెందిన మరో 35 కుటుంబాలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల అభ్యున్నతికి చేకూర్చిన లబ్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పేటసన్నెగండ్ల గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పెదకూరపాడు: కూటమిలో కుమ్ములాటలతో టీడీపీ,జనసేన పార్టీ నుండి వైఎస్సార్సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలు వీడి వైఎస్సార్సీపీలోకి చేరారు. మండలంలోని పాటిబండ్ల, హుస్సెన్నగరం, బలుసుపాడు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వాసించారు. అనంతరం శంకరరావు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారరని, పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. -
రాజకీయంగా ప్రోత్సహించా
సత్తెనపల్లి: ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సాయం చేసి బ్రతికించిన వ్యక్తులు, నావల్ల పదవులు పొంది లాభం పొందిన వారు అవసరమైన సమయంలో నన్ను వదిలి మోసం చేసి వెళ్లారనే బాధ గుండెను పిండేస్తుందని, ఇదేనా మానవ సంబంధాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి , నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. పట్టణంలోని గోసంరక్షణశాలలో జరిగిన ఆర్యవైశ్య కుటుంబాల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో ఎవరినీ వేధించలేదని, అక్రమంగా సంపాదించలేదన్నారు. నియోజక వర్గంలో ఆర్యవైశ్యులను రాజకీయంగా ప్రోత్సహించానని గుర్తు చేశారు. పట్టణంలో మాత్రమే ప్రత్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉండటంతోనే ఈ వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టానని స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కూడా నాకు అవసరమైన సమయంలో అండగా ఉన్నారన్నారు. పదవికోసం పాకులాడే వ్యక్తిని కాదని, పదవి వస్తుందంటే ఏ పార్టీలోపడితే ఆ పార్టీలోకి చొరబడే వ్యక్తిని కాదు, ఏ జెండా పడితే ఆ జెండా మోసే వ్యక్తిని కాదన్నారు. నాకు నచ్చితేనే ఆ పార్టీలో ఉంటానని, నాకు రాజశేఖరరెడ్డి నచ్చాడు కాబట్టే కాంగ్రెస్లో ఆయన వెంట నడిచానన్నారు. రాజశేఖరరెడ్డి మరణంతో కాంగ్రెస్ను కాదని జగన్ మోహన్రెడ్డి వెంట మొదటిగా తిరిగినటువంటి వ్యక్తినన్నారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనుకున్నారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎన్విరాన్ మెంట్ కార్పోరేషన్ డెవలప్మెంట్ ఛైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, మున్సిపల్ ఛైర్మన్ చల్లంచర్ల లక్ష్మీతులసీ, చల్లంచర్ల సాంబశివరావు, ఆర్యవైశ్య నాయకులు పెరు మాళ్ళ లక్ష్మీ శివనారాయణ, వెలుగూరి శరత్ బాబు, అచ్యుతశివప్రసాద్, శింగరి నాగ భూషణం, పొట్టి రాజేశ్వర రావు, కూకుట్ల లక్ష్మీ,కొత్త రామకృష్ణ,తల్లం సతీష్, భవిరిశెట్టి సుభ్రమణ్యం, దేవర శెట్టి రవికుమార్, దేవతి సుబ్బారావు, పెద్దసంఖ్యలో ఆర్యవైశ్యులు కుటుంబ సభ్యులతో సహా హజరయ్యారు. వ్యాపారులను దోచుకునే మనస్తత్వం నాది కాదు నేను ప్రాణం పోసిన వారు నన్ను వదిలి వెళ్ళినా లెక్కచేయను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement