పిడుగురాళ్ల: ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉంటుందని వైఎస్సార్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి వాసవీ అమ్మవారి చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్ది అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం జగన్ మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించడం వల్ల ప్రతి ఆర్యవైశ్య వ్యాపారాలు బాగున్నాయన్నారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ది కావాలా, డబ్బులు, అహంకారం, పెత్తందారుల వ్యవస్థల కావాలో మీరు నిర్ణయించుకోవాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, నర్సరావుపేట పార్లమెంట్ పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ చింతా వెంకట రామరావు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భవనాశి యల్లారావు, వివిధ అసోసియేషన్ అధ్యక్షులు, దేవస్థాన అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వారి వ్యాపారాలకు తోడుగా నిలబడతాం రాజకీయంగా సముచిత స్థానం కల్పించింది వైఎస్సార్సీపీనే ఆర్యవైశ్యులంతా వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి