-
అవినీతి చిట్టా..
అశోక్ అండ్ కో ● ఉపాధి హామీ పథకంలో భాగంగా నియోజకవర్గంలో మెటల్, బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించగా అశోక్రెడ్డి బినామీలు, అనుచరులు గద్దల్లా వాలిపోయారు. గోవిందాపురం, యర్రబాలెం, బార్లకుంట, అయ్యవారిపల్లెలో చేపట్టిన బీటీ రోడ్ల పనుల్లో రూ.1.20 కోట్లు కమీషన్ అశోక్రెడ్డి గల్లా పెట్టెకే చేరాయన్న ఆరోపణలున్నాయి. నాసిరకంగా నిర్మించిన ఈ రోడ్లన్నీ కొద్ది రోజులకే గోతులమయమయ్యాయి. ● గిద్దలూరు–జేబీకేపురం మధ్య రైల్వే అండర్పాస్ వర్క్ కాంట్రాక్టర్ను ముత్తుముల సోదరుడు బెదిరించి రూ.30 లక్షలు గుంజడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ● నియోజకవర్గంలో 181 చెక్డ్యామ్లు నిర్మించేందుకు రూ.16.57 కోట్లు కేటాయించారు. వీటిలో ఎక్కువ శాతం చెక్డ్యామ్లు ప్రజలకు ఉపయోగం లేని చోట నిర్మించడం గమనార్హం. ఒక్కసారి కురిసిన భారీ వర్షానికే సగానికి పైగా చెక్డ్యామ్లు కొట్టుకుపోయి టీడీపీ నేతల అవినీతి దందాను బట్టబయలు చేశాయి. చెక్డ్యామ్ల పనులను గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు నామినేషన్ పద్ధతిపై కేటాయించగా 10 నుంచి 15 శాతం వరకు కమీషన్ పుచ్చుకుని కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం, వారు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పెద్ద మొత్తం ప్రజా ధనం వృథా అయింది. ● ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకంలో అశోక్రెడ్డి బినామీలు, అనుచరులకే చోటుదక్కింది. మొక్కలు నాటకపోయినా నాటినట్లు రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల ఉపాధి హామీ నిధులు బొక్కేశారు. ● వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లోనూ అవినీతి రాజ్యమేలింది. టీడీపీ నేతలే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి ముత్తుములకు ముడుపులిచ్చి మరీ పనులు దక్కించుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేశారని 2018–19 మధ్య బీజేపీ నేతలు ధర్నాలు చేశారు. -
చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మైనారిటీలకు న్యాయం జరిగింది. సీఎం వైఎస్ జగన్ చట్టసభల్లో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు. మైనారిటీ ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రిని చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా టీడీపీ మూడు సీట్లే ఇచ్చింది. – ఎండీ గఫార్ అలీఖాన్, కరస్పాండెంట్, ఎంజీ బీఈడీ కళాశాల, కంభం ముస్లింలంతా జగన్ వెంటే.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ వల్ల ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. షాదీ తోఫా, మౌజన్, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ జగన్ అండగా నిలిచారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీకి రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతాం. – మహమ్మద్ ఇబ్రహీం, రిటైర్డ్ టీచర్ ముస్లింల వంచకుడు చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. హామీల అమలుపై ప్రశ్నించిన మైనారిటీ యువకులపై కేసులు పెట్టి వేధించారు. జగనన్న పాలనలో మౌజమ్ల గౌవర వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, ఇమామ్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఆదుకున్నారు. షాదీతోఫాను రూ.లక్షకు పెంచి అండగా ఉన్నారు. టీడీపీకి ముస్లింలు ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్టే. బీజేపీతో కలిసి కుట్రలు చేసే పార్టీలకు ముస్లింలంతా ఓటుతో బుద్ధి చెప్పాలి. – షేక్ ఖాజా హుస్సేన్, కంభం బాబే పెద్ద భూచోడు వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే జరగుతోంది. రూ.3 వేల కోట్లకు ఖర్చుతో బృహత్తర కార్యక్రమం చేపట్టిన సీఎం వైఎస్ జగన్ బొమ్మలు ఎక్కడా వేయకూడదనే హక్కు టీడీపీ వాళ్లకు ఎక్కడిది? పండగ సరుకులపైనే నీచంగా బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకోవచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం గురించి ఎక్కడా ఆనవాళ్లు ఉండకూడదంటే ఎలా? సీఎం వైఎస్ జగన్ పాలనలోనే వేల మంది రైతులకు భూ హక్కులు వచ్చాయి. రీసర్వేతో సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని నమ్ముతున్నాం. పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇస్తే ఓర్చుకోలేని కులోన్మాదులు ప్రజల భూముల గురించి నీతి వాక్యాలు చెబితే నమ్మేవాళ్లు ఎవరూ లేరు. – ఎద్దు నగేష్ -
No Headline
● గడప గడపకు నాగార్జున కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగులుప్పలపాడు: నమ్ముకున్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రజలందరూ దీవించాలని బురిడీ చంద్రబాబు మాయలో పడ్డొద్దని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి మేరుగు నాగార్జున అన్నారు. గడప గడపకు నాగార్జున కార్యక్రమంలో భాగంగా శనివారం మట్టిగుంట, ఈదుమూడి, ముప్పాళ్ల మద్దిరాల, ఒమ్మెవరం, పోతవరం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడారు. తన ఎన్నికల హామీలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ మాటను నెరవేర్చి అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందించి అందరికీ మంచి చేసిన నాయకుడి పాలనను తిరిగి మనందరం ఆశీర్వదించాలని కోరారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్లీ ఎగరాలని, దీనికి అనుగుణంగానే అందరం సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనపై నిరంతరం ఎల్లో మీడియా విషం కక్కుతూ ప్రజలకు మేలు చేస్తున్న వ్యవస్థలపై కూడా కుట్రలు పన్నడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల గ్రామంలో మాజీ సర్పంచ్ పులిపాటి శ్రీమాన్ తన అనుచరులతో కలిసి టీడీపీని వీడి మంత్రి నాగార్జున సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఒమ్మెవరం గ్రామంలో జనసేన నుంచి యువకులు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ మంత్రి మేరుగు వైఎస్సార్ సీపీ జెండా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ దంపతులు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, యాదాల రత్నభారతి అశోక్, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, కూనం పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ మున్నంగి రమ్య, సర్పంచ్లు పాలేరు అనీలా నాగేశ్వరరావు, శీలం రేణుక సురేష్, పోలినేని కోటేశ్వరరావు, జెట్టి శ్రీనివాసరావు, తగిరిస సుబ్బారావు, గండు వెంకట్రావు, హరిబాబు, నల్లూరి దానియేలు, నార్నె హరిబాబు, నల్లూరి సుబ్బారావు, చావల వెంకట్రావు, వీరనారాయణ, అంజయ్య, వెంకటేష్, అశోక్ తదితరులు ఉన్నారు. -
No Headline
● ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని కరవది, పాతపాడు, మండువారిపాలెం గ్రామాల్లో బాలినేని రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కరవది గ్రామంలో ఎంపీటీసీ మన్నె శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ వాక కృష్ణారెడ్డి, నాయకులు, ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు భూమిపట్టా ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లు, డొంక రోడ్డును మెటల్ రోడ్డుగా మార్పులు చేశామని చెప్పారు. కాలనీలో డ్రైనేజీలు, సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టారన్నారు. నాడు–నేడు కింద జెడ్పీ హైస్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని, పీహెచ్సీకి నూతన భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఒంగోలు నగరంలో 25 వేల గృహ పట్టాలు ఇచ్చామన్నారు. పోతురాజు కాలువ శుద్దీకరణ పనులు, డంపింగ్ యార్డ్, హైటెన్షన్ వైర్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పూర్తయిందన్నారు. గ్రామ చెరువు పూడిక తీసి, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని బాలినేని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ డీ కోటేశ్వరరావు, ఎంపీపీ మల్లిఖార్జున రెడ్డి, వైస్సార్ సీపీ ప్రెసిడెంట్ చుంచు రామకృష్ణ. సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, క్రాంతి, పాలపర్తి రమేష్, దార్ల బాబు, మిదశాల కృష్ణ, అంకారావు, ప్రసన్న రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, మాజీ సర్పంచ్లు రాఘవ, వెంకటేశ్వర్లు, చుండూరి రవి, మేడికొండ కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, పెరకంసుబ్బారావు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పక్కాగా నిర్వహించాలి
ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండటం వల్ల ఓటర్లకు అవసరమైన తాగునీరు, టెంట్లు, కుర్చీలు, హెల్ప్డెస్క్ ఏర్పాటు తదితర అంశాల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, హోమ్ ఓటింగ్, ఈవీఎంల కమిషనింగ్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. పొరుగు జిల్లాలో ఓటు ఉండి ప్రస్తుతం ప్రకాశంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్తో పాటు ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి, ఓఎంసీ కమిషనర్ జస్వంతరావు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement