-
No Headline
మార్కాపురం: పశ్చిమ ప్రకాశం.. అద్భుతం. చరిత్ర ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు నెలవు. చూడగా.. చూడగా మైమరిచే విహార ప్రదేశం.నాలుగు యుగాల చరిత్రకు సాక్షాత్కారంగా నిలిచే నాలుగు రాజప్రాకార గోపురాల మార్కాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం, శ్రీశైల మహా పుణ్యక్షేత్రానికి తూర్పు ద్వారంగా ఉన్న త్రిపురాంతకం పుణ్యక్షేత్రం, ప్రకృతి సోయగాల మధ్య కొలువైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి, పులులకు, నెమళ్లకు, జింకలకు, దుప్పులకు, కొండచిలువలకు, చిరుతలకు, ఎలుగుబంట్లు, ఎన్నో వ్యాధులకు అవసరమైన వనమూలికల సంపద కలిగిన నల్లమల అటవీ ప్రాంతం పశ్చిమ ప్రకాశం ప్రత్యేకత. శ్రీశైలానికి ముఖద్వారం యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధి పెద్దదోర్నాల ప్రముఖ శివక్షేత్రం శ్రీశైలానికి ముఖద్వారంగా ఉంది. అటు విశాఖ నుంచి ఇటు తిరుపతి వరకు శ్రీశైలానికి వెళ్లే భక్తులు దోర్నాల మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం మరుపురాని మధురానుభూతిని నింపుతుంది. పర్యాటకుల కోసం అటవీశాఖ నల్లమల అటవీ ప్రాంతంలో దోర్నాల– శ్రీశైలం మధ్య జంగిల్ సఫారీ ఏర్పాటు చేసింది. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టాప్ లెస్ వాహనంలో ప్రకృతి అందాలను, వన్యప్రాణులను వీక్షించవచ్చు. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, అందమైన పక్షులు, ఆకాశాన్ని అంటే చెట్లు చూస్తూ అటవీ ప్రాంతమంతా తిరగవచ్చు. బిర బిర పారే కృష్ణమ్మ శ్రీశైలం మల్లన్న చెంత పరవళ్లు తొక్కుతుంది. వీరభద్రుని స్థావరాలు, భారీ ఆకృతిలో భైరవ విగ్రహాలు, ప్రాచీన దేవాలయాలు, నల్లమల అటవీ ప్రాంతంలో అనేకం ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం చూసి తీరాల్సిందే. ప్రకృతి సిద్ధంగా ఉన్న సినిమా సెట్టింగ్లు ఎన్నో దర్శనమిస్తాయి. మార్కాపురం నుంచి శ్రీశైలానికి ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఒంగోలు నుంచి 170 కిలోమీటర్ల దూరంలో మార్కాపురం నుంచి 90 కిలో మీటర్ల దురంలో శ్రీశైలం ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ డిపోల బస్సులు దోర్నాల–మార్కాపురం మీదుగా శ్రీశైలం వెళ్తాయి. -
ఎన్నికల ప్రత్యేక అధికారుల నియామకం
ఒంగోలు టౌన్: ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో భాగంగా ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ పీవీఆర్ఎస్ఎస్ఎంవీఆర్ వర్మ, ఎస్పీ (ఎన్సీ) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీ హైమావతి, సెబ్ అడిషనల్ ఎస్పీ కాకినాడ కె.శ్రీలక్ష్మిని ప్రకాశం జిల్లాకు కేటాయించారు. వెంటనే యూనిట్ ఆఫీసర్కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేటి నుంచి డిగ్రీ మూల్యాంకనం ఒంగోలు: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి తమ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు స్థానిక డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, క్యాంపు నోడల్ ఆఫీసర్ డాక్టర్ డి.కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు జరుగుతుందన్నారు. ఇంగ్లిషు, తెలుగు, సంస్కృతం, హిందీ, ఎకనామిక్స్, కామర్స్, గణితం, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సబ్జక్టుల జవాబు పత్రాలకు మూల్యాంకనం మొదలవుతుందన్నారు. పొదిలి, దర్శి, అద్దంకి, ఒంగోలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులంతా తప్పనిసరిగా తాము పనిచేసే కాలేజీలో రిలీవింగ్ తీసుకుని క్యాంపునకు హాజరుకావాలన్నారు. రిలీవింగ్ ఆధారంగా యూనివర్శిటీ వారు పంపిన జాబితా ప్రకారం పేపర్లు ఇస్తారని, ముందుగా వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లాకు చేరిన 1473 సర్వీసు ఓట్లు ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో సర్వీసు ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాకు సర్వీసు ఓట్లు రిజిస్టర్ పోస్టు ద్వారా 1473 ఓట్లు చేరాయి. శనివారం 40 సర్వీసు ఓట్లు పోస్టు ద్వారా చేరాయి. వచ్చిన ఓట్లను ఎన్నికల విభాగం అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ల్లో వేసి భద్రపరిచారు. మొత్తం 6693 సర్వీసు ఓట్లు ఉండగా ఇప్పటికి 1473 ఓట్లు జిల్లాకు చేరాయి. సర్వీసు ఓట్లను జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు భద్రపరుస్తారని అధికారులు తెలిపారు. దీనిలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పొగాకు గరిష్ట ధర రూ.322 కొండపి (సింగరాయకొండ): కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం ఈ సీజన్లోని అత్యధికంగా గరిష్ట ధర కేజీ రూ.322 పలికింది. కనిష్ట ధర రూ.205, సరాసరి రూ.258.84 వచ్చింది. వేలంలో కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతులు 902 బేళ్లను వేలానికి తీసుకురాగా 845 బేళ్లు కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 57 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర వేలంలో 24 మంది వ్యాపారులు పాల్గొన్నారు. పొగాకు వేలానికి నాణ్యమైన బేళ్లను తీసుకురావాలని, అలాంటి బేళ్లకు వేలంలో అధిక ధరలు పొందవచ్చని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. పొగాకు రైతులకు ఆయన సూచనలిచ్చారు. -
యుగాల చరిత్ర.. చెన్నకేశవుడి ఆలయం..
మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇటీవలే ఆలయాన్ని సుమారు రూ.8 కోట్లతో అభివృద్ధి చేశారు. నాలుగు యుగాల్లో స్వామివారి ఆలయం ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయంలో 18 శాసనాలు ఉన్నాయి. అస్థాన మండపంలో స్తంభాలన్నీ ఏకశిలా నిర్మితాలే. అస్థాన మండపం చుట్టూ ఉండే చుంచు ఒకే రాతితో అనేక వంపులు తిరిగి ఉండటం విశేషం. ఆలయ మధ్య రంగంలో అన్నదమ్ములు ఒకరు చేసే పనిని మరొకరు చూడకుండా కేవలం శబ్ధ గ్రహణశక్తితో రెండు స్తంభాలను ఒకే మాదిరిగా నిర్మించారు. దీంతో వీటిని అన్నదమ్ముల స్తంభాలుగా పేర్కొంటారు. ఆలయ శిల్పాలు నాటి కళాకారుల నైపుణ్యం కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. డిసెంబర్ నెలలో సూర్యభగవానుని కిరణాలు స్వామి వారి పాదాలను తాకటం ఆలయం ప్రత్యేకత. ప్రస్తుతం ఆలయంలో 4 రాజగోపురాలను నిర్మిస్తున్నారు. -
తీర ప్రాంతాల్లో గాలివాన
ఒంగోలు రూరల్: మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి గాలితో కూడిన వర్షం కురిసింది. సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, అనంతరం తుఫాన్గా మారిన నేపథ్యంలో వాతావరణంలో కూడా వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై సన్నపాటి జల్లులతో మొదలై సాయంత్రానికి వర్షం కురిసింది. వాతావరణశాఖ సూచనల మేరకు రెవెన్యూ, మత్స్యశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారి సూచనల మేరకు మత్స్యకారులు పడవలను తీరం నుంచి కాస్త దూరంగా తరలించారు. గుండాయపాలెం వద్ద అలల ఎత్తు పెరిగడంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని తెలిపారు. పలు రేవుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగరవేసిన నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలోని పడవలు, బోట్లు, ఇంజిన్ బోట్లు, వలలు జెట్టి వద్దకు చేరుస్తున్నారు. -
అల్లర్లు జరగకుండా చూడాలి
దర్శి: ఎన్నికల కౌంటింగ్ రోజు గ్రామాల్లో అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులను ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి ఆదేశించారు. దర్శి డీఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఎన్నికల సమీక్ష సమావేశానికి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి ఐజీ హాజరయ్యారు. ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు చేశారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాల్సిన గ్రామాలపై సమీక్షించారు. దర్శి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు, వాటిపై నమోదైన కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలు, అక్కడి తాజా పరిస్థితులు, పలు కేసుల గురించి వాకబు చేశారు. తరచూ గ్రామాల్లో పర్యటించి ఎలాంటి కేసులు ఉత్పన్నం కాకుండా, ప్రశాంతత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు సెక్షన్ 144 పీఆర్సీ అమలు చేయాలని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి లేదని అన్నారు. గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెడు నడత కలిగిన వారిని బైండోవర్ చేయాలని, వారిపై నిఘా ఉంచి కౌన్సిలింగ్లు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఆ తర్వాత కూడా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఐజీ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో డీఎస్పీ అశోక్వర్దన్, సీఐలు సమీఉల్లా, మల్లికార్జునరావు, సుబ్బారావు, డివిజిన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలిన ఐజీ, ఎస్పీలు... ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన మహిళా పోలీస్ కట్టా అనూషపై ఎన్నికల రోజు టీడీపీ మూకలు దాడి చేయడం, దానిపై పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు కట్టకపైగా, టీడీపీ నేతలను పోలీస్స్టేషన్కు పిలిచి రాజీ చేసుకోవాలంటూ మహిళా పోలీస్పై ఒత్తిడి చేయడం, అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కేసు కట్టకుండా ఆమె ఇచ్చిన ఫిర్యాదు వెనక్కు ఇచ్చి పంపడంపై ఐజీని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఎస్పీ, డీఎస్పీ స్పందిస్తూ కేసు కట్టామని బదులిచ్చారు. ఆ మహిళా పోలీస్ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించగా, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాత్రమే కేసు కట్టారని, ముందుగా కేసు కట్టకుండా రాజీ చేయాలని టీడీపీ నేతలను కూర్చోబెట్టి ఆమైపె ఎందుకు ఒత్తిడి తెచ్చారని, రాజీ చేసుకోలేదని ఆమె ఫిర్యాదును వెనక్కు ఎందుకు ఇచ్చారని విలేకరుల ప్రశ్నించారు. దానికి ఐజీ త్రిపాఠి స్పందిస్తూ వెనుక వైపున్న ఎస్పీ వంక వేలు చూపిస్తూ.. వారు చెప్తారంటూ సమాధానం దాటవేశారు. ఐజీతో పాటు ఎస్పీ కూడా నీళ్లు నములుతూ వారి వాహనాలు ఎక్కి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానిక పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత పనైంది. డివిజిన్ స్థాయి ఎన్నికల సమీక్ష సమావేశంలో ఐజీ త్రిపాఠి -
శ్రీశైలానికి తూర్పు ద్వారం త్రిపురాంతకం..
శ్రీశైల పుణ్యక్షేత్రాల్లో అష్ట ద్వారాల్లో తూర్పుదిక్కున ఉన్న ద్వారమే ఈ త్రిపురాంతకేశ్వర స్వామి క్షేత్రం. శ్రీశైలం దేవస్థానం కంటే ముందుగానే ఈ దేవాలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయానికి నాలుగు దిక్కుల మహాద్వారాలు, వాటిపై ద్వార మండపాలు ఉన్నాయి. శ్రీ త్రిపురాంతకేశ్వర ఆలయాన్ని శ్రీచక్రంపై నిర్మించారు. ఆలయం బయట తూర్పు వైపు నుంచి లోనికి ప్రవేశించే మార్గం కుడివైపున ఒక రాతిపై స్వామి వారి పాదముద్రలు ఉన్నాయి. ఇక్కడే ఇంద్రుడు పూజించినట్లు చెప్పే శివలింగం ఉంది. మార్కాపురం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, యర్రగొండపాలెం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్కాపురం నుంచి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. శుక్రవారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. -
భార్య హత్యకేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష
ఒంగోలు: భార్య శీలాన్ని శంకించి హత్య చేసిన కేసులో నిందితుడు కొర్రపాటి ఏడుకొండలుకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి శనివారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తాళ్లూరు మండలం కొర్రపాటి వారిపాలెంకు చెందిన కొర్రపాటి ఏడుకొండలు.. దర్శి మండలం వీరాయపాలెంకు చెందిన సనుమూరి అంజలిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఉపాధి నిమిత్తం వీరు స్థానిక మంగమూరు రోడ్డులోని సుందర్నగర్లో అద్దె ఇంట్లో జీవనం సాగించేవారు. అనేక సార్లు అంజలి శీలాన్ని శంకించి అనేక మార్లు నిందితుడు అంజలిపై గొడవపడేవాడు. ఈ క్రమంలో 2017 అక్టోబరు 23న రాత్రి 7గంటల సమయంలో మార్బుల్ రాయితో అంజలి తలమీద క్రూరంగా కొట్టగా బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై అప్పటి తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. ఒంగోలు కోర్టులో చార్జిషీట్ ఫైల్ దాఖలు చేయగా జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నిందితునిపై నేరం రుజువు కావడంతో నిందితుడైన మృతురాలి భర్త కొర్రపాటి ఏడుకొండలుకు యావజ్జీవ జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.వసుంధర వాదించారు. ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్, పది పరీక్షలు ఒంగోలు: ఇంటర్, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 7430 మంది జనరల్ విద్యార్థులకుగాను 6924 మంది, 669 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 614 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 487 మంది జనరల్ విద్యార్థులకుగాను 410 మంది, 272 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 235 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తి ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆర్ఐవో ఎ.సైమన్ విక్టర్ తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జరిగిన హిందీ పరీక్షకు 801 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. 22 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు కేవలం 231 మంది మాత్రమే హాజరయ్యారు. 570 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో డి.సుభద్ర తెలిపారు. -
నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు అర్బన్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సూచించారు. శనివారం స్పందన భవనంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. దీనిలో కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ఘర్షణలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
చీరాల రూరల్: ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లు, గొడవలకు పాల్పడిన వారిని గుర్తించి రౌడీషీట్లు తెరవడమే కాకుండా నగర బహిష్కరణలు కూడా చేస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి హెచ్చరించారు. శనివారం చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్ను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఐజీ సందర్శించారు. నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల తదనంతర పరిణామాలు, ఘర్షణలపై నమోదు చేసిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలపై సమీక్షించారు. -
ఘనంగా వేణుగోపాలస్వామి కల్యాణం
నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పెంటాల జ్యోతి శ్రీనివాసరావు, ఈఓ మీనిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదపండితుల సమక్షంలో కన్నుల పండువగా కల్యాణం జరిగింది. మాగులూరి శ్రీనివాసరావు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి వారు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. వైభవంగా రథోత్సవం... శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం అనంతరం శనివారం సాయంత్రం తెలగ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఉప్పుగుండూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. పూజారి దీవి శ్రీధర్బాబు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పూజారులు శ్రీనివాసరావు, రంగయ్య పంతులు, సిబ్బంది వేణు, సుబ్బారావు, దేవస్థాన కమిటీ సభ్యులు, వివేకానందస్వామి కమిటీ సభ్యులు కే శ్రీనివాసరావు, పీ శివాజీ, కే శంకరరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు -
దేవరాయల కాలం నాటి కంభం చెరువు
శ్రీ కృష్ణదేవరాయులు సతీమణి వరదరాజమ్మ నిర్మించిన కంభం చెరువు ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువుగా ఖ్యాతిగాంచింది. 2020వ సంవత్సరంలో ఐసీఐడీ సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా కంభం చెరువు ఎంపికై ంది. ప్రపంచ వ్యాప్తంగా 14 కట్టడాలను గుర్తించగా వాటిలో కంభం చెరువకు స్థానం దక్కడం విశేషం. అలాగే ప్రకృతి సోయగాల నడుమ జలజల ప్రవహించే గుండ్లకమ్మ పరవళ్లతో రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి ఆలయం, ఆలయ పరిసరాల్లోని జలపాతం, కొండకోనలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రతి శనివారం ఆలయాన్ని తెరుస్తారు. -
కీర్తి పొందిన చందవరం బౌద్ధక్షేత్రం
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపంగా చందవరం ప్రసిద్ధి చెందింది. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో నిర్మితమైన ఈ క్షేత్రం త్రిపురాంతకేశ్వర క్షేత్రానికి అతి దగ్గరలో ఉంది. దొనకొండ మండలంలోని చందవరం–వెల్లంపల్లిల నడుమ గుండ్లకమ్మ నదిఒడ్డున విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో గల బౌద్ధ స్థూపం 150 అడుగుల ఎత్తైన కొండపై కొలువు తీరి 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తులో ఉంది. గౌతమ బుద్ధుడు, ధ్యానంలో నిమగ్నమై ఉన్న పాలరాతి శిల్పాలు, బౌద్ధరామాలు, విశ్రాంతి గదులు, బౌద్ధ సన్యాసుల ఆశ్రమ గదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ బౌద్ధరామంలో ముఖ్య సంఘటనలు, ధర్మబోధనలను విశదపరిచే స్తంభాలు ఉన్నాయి. త్రిపురాంతకం నుంచి ఆటోలో వెళ్లవచ్చు. -
వెంకటేశ్వరస్వామి కల్యాణం
కమనీయం.. మద్దిపాడు: జిల్లాలో ప్రసిద్దిగాంచిన మద్దిపాడు మండలంలోని మల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఆగమ ప్రవర దివి వెంకటశేషాచార్యులు కల్యాణం జరిపించారు. స్వామివారికి తలంబ్రాలను గుండ్లాపల్లి గ్రామానికి చెందిన పల్లకి సుబ్బరామిరెడ్డి, నాగమ్మ, మణికంఠ శ్రీనివాసరెడ్డి, తరుణాదిత్య నాగకృష్ణ సాయికుమార్రెడ్డి, భరణి కృష్ణమోహన్రెడ్డి తీసుకురాగా, స్వామివారి కల్యాణం ప్రారంభమైంది. స్వామివారి కల్యాణం సందర్భంగా వెంకటేశ్వరస్వామి కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వరస్వామి కొలువుదీరగా కల్యాణకర్త వెంకటాచార్యులు వేద మంత్రాలు పఠిస్తూ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆ సమయంలో భక్తులు గోవిందనామాలు గట్టిగా పలకడంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ముందుగా ఘోర కవి సంపత్, గుండ్లాపల్లి కృష్ణయ్య బృందం తరంగ కాలక్షేపం నిర్వహించారు. భక్తులు తరంగ కాలక్షేపాన్ని ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగితేలారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులు ఆలయంలో స్వామివారి మూలవిరాట్ను దర్శించుకోవడానికి క్యూకట్టారు. స్వామివారిని దర్శించుకుని వివిధ కుల సంఘాలు అన్నదాన సత్రాలలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కల్యాణాన్ని సుమారు 20 వేల మందికిపైగా భక్తులు వీక్షించారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించిన పోలీసులు... ఒంగోలు రూరల్ సీఐ టీఎక్స్ అజయ్కుమార్ ఆధ్వర్యంలో మద్దిపాడు ఎస్ఐ వి.మహేష్ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. వలంటీర్లు ఆలయంలోకి భక్తులను క్యూలో పంపుతూ ప్రతిఒక్కరికీ స్వామివారి దర్శనం కల్పించేలా పనిచేశారు. వెంకటేశ్వరస్వామి భక్త బృందం లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసింది. స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు... మల్లవరం వెంకటేశ్వరస్వామి కల్యాణం అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణం వెంకటాచార్యులు రాజశేఖరాచార్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను ఆయనకు అందించారు. గోవిందనామంతో మార్మోగిన మల్లవరం స్వామివారి కల్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో అన్నదానం -
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
● జిల్లా విజిలెన్స్ ఏడీ ఈరేష్ ముండ్లమూరు: అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విజిలెన్స్ ఏడీ ఎం ఈరేష్ అన్నారు. మండలంలోని చిలకలేరు నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాంతంలో మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ట్రాక్టర్ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఇసుక అవసరమైన వారు నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులను సంప్రదించి ఇసుకను పొందవచ్చన్నారు. తనిఖీల్లో ఎస్ఈబీ సీఐ సుందరరామయ్య, ఇరిగేషన్ ఏఈ మధుసూదనరావు, డీటీ పుల్లారెడ్డి, వీఆర్వో బ్రహ్మతేజ పాల్గొన్నారు. -
జంతు సంరక్షణ జిల్లా నోడల్ అధికారిగా ఏఎస్పీ
ఒంగోలు టౌన్: జంతు సంరక్షణ జిల్లా నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు నియమితులయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన నియామకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి జంతువుల అక్రమ రవాణా, గోవధ నిరోధానికి గాను జిల్లా ఒక నోడల్ అధికారిని నియమించారు. ఇక నుంచి జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో న్యాయస్థానం ఆదేశాలు, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆంధ్రప్రదేశ్ గోవధ నిర్మూలన, జంతు సంరక్షణ చట్టం–1977, జంతు రవాణా నిబంధనల చట్టం– 1978, జంతు రవాణా (సవరణ) నిబంధనలు–2001 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. గోవధ, పశువుల అక్రమ రవాణాపై పోలీసు కంట్రోలు రూం వాట్సప్ నంబర్ 9121102266కు కానీ డయల్ 112,100కు కానీ నోడల్ ఆఫీసర్ ఫోన్ నంబర్ 9121102101కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి ఉచిత వక్త శిక్షణ తరగతులు ఒంగోలు టౌన్: స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరంట్స్ (స్టెప్) ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి రెండో రోజుల పాటు ఉచిత వక్త శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు స్టెప్ జిల్లా కార్యదర్శి ఎం. ధనరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాళ్లూరు మండలంలోని శ్రీ రమణరావు, సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమంలో తరగతులు జరుగుతాయన్నారు. శిక్షణలో పాల్గొనేవారికి ఉచిత వసతి, భోజనం, మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తారన్నారు. శిక్షణ తరువాత సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 29వ తేదీ సాయంత్రంలోపు వేదిక వద్దకు హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9491710716 నంబర్కు ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు. -
లాభాలు మెండు..
వేసవి దుక్కులు ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసేందుకు రైతులు వేసవి దుక్కులు దున్నుకుంటున్నారు. తొలకరికి ముందే వేసవి దుక్కులతో రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. వరి, కంది, శనగ, జొన్న, మినుములు, పెసలు, పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉంచారు. ఒంగోలు సెంట్రల్: ఖరీఫ్ పంటల సాగుకు రైతన్నలు సమాయత్తమవుతున్నారు. పంటలు వేయటానికి ముందు పొలాల్లో వేసవి దుక్కులు దున్నుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఖరీఫ్లో 9,25,767.5 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతాయి. అందులో అత్యధికంగా 4,34,883.5 ఎకరాల్లో ప్రధాన పంటలు సాగవుతాయి. అందులో 1,82,507 ఎకరాల్లో కంది, పత్తి 78,905 ఎకరాలు, మిరప 59,682 ఎకరాలు, మిరప, వరి 35,195 ఎకరాల్లో, మినుము 6,300 ఎకరాల్లో, పచ్చ పెసర 2652.5 ఎకరాలు, ఆముదాలు 4,307.5 ఎకరాల్లో ఇతర ఉద్యాన పంటలు, కూరగాయలు 60,232 ఎకరాలు, పొగాకు 5102.5 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఖరీఫ్లో పంటలు సాగు చేసే రైతులకు కావాల్సిన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచింది. ఖరీఫ్ సీజన్కు 8893 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. విత్తనాల కేటాయింపు ఇలా... జిల్లాలో 616 రైతు భరోసా కేంద్రాల పరిధిలో సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాల సరఫరాకు సిద్ధమైంది. వరి విత్తనాలు క్వింటా రూ.500 సబ్సిడీపై 4 వేల క్వింటాళ్లు సరఫరా చేయనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. అందులో వరిలో బీపీటీ–5204 రకం 2 వేల క్వింటాళ్లు, ఎన్ఎల్ఆర్ 33892 రకం 800 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్ 15048 రకం 400 క్వింటాళ్లు, కేఎన్ఎల్ 1638 రకం 400 క్వింటాళ్లు, ఎంపీయూ 1271 రకం 400 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. జూన్ 10వ వరకు ఈ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. కంది రకంలో 1500 క్వింటాళ్లు అందులో ఎల్ఆర్జీ 750 క్వింటాళ్లు, బీఎస్ఎంఆర్ 736 రకం 750 క్వింటాళ్లు జూన్ 15 వరకు 30 శాతం సబ్సిడీపై అందించనున్నారు. మినుములు 30 శాతం సబ్సిడీపై పలు రకాలు 500 క్వింటాళ్లు, పచ్చ పెసలు 120 క్వింటాళ్లు, పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లిపెసర 50 శాతం సబ్సిడీపై 2773, శనగలు 40 శాతం సబ్సిడీపై జేజే–11 రకం 1999 క్వింటాళ్లు, కాగ్–2 రకం 2000 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వేసవి దుక్కులు ఎప్పుడు చేయాలంటే.. పంట కోసిన తర్వాత తొలకరి వానలు కురిసే వరకు భూమి ఖాళీగా ఉంటుంది. రెండు నుంచి మూడు నెలల పాటు భూమి ఎండకు ఎండి గట్టిపడుతుంది. మే, జూన్ నెలల్లో తొలకరి వానలు పడగానే రైతులు తమ పొలంలో ఏ పంట వేయాలో, వేయబోయే పంటను బట్టి ఎన్నిసార్లు భూమి దున్నాలో నిర్ణయించుకుంటాడు. ఏటా ఒకే లోతుకు భూమిని దున్నడం వల్ల నల్లరేగడి భూముల్లో అడుగున గట్టి పొరలు ఏర్పడతాయి. ఈ పొరల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా చేయటమే కాకుండా మొక్క వేళ్లు లోపలికి వెళ్లకుండా చేస్తాయి. దీంతో అవి గిడసబారిపోతాయి. ఇది పంట దిగుబడిపై అధిక ప్రభావం చూపుతుంది. వేసవి కాలంలో దుక్కులు లోతుగా దున్నటం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు. భూమి లోపల ఉండే క్రిమికీటకాలు భూ పైపొరల్లోకి వచ్చి ఎండ వేడిమికి చనిపోతాయి. ఎండాకాలం దుక్కి లోతుగా దున్నటంతో వర్షాకాలంలో పడే వర్షాలకు భూమి గుల్లగా తయారై పంట వేయడానికి అనుకూలంగా మారుతుంది. అలా కాకుండా తొలకరిలో వర్షాలు పడిన తర్వాత దుక్కి దున్నితే పంటకు అనుకూలంగా ఉండదు. రైతులు ఏ పంట సాగుచేయాలనుకున్నా వేసవి దుక్కలతోనే అధిక ప్రయోజనం చేకూరుతుంది. వీటి వల్ల కొన్ని రకాల క్రిమికీటకాలు లార్వా, గుడ్డు దశలో నశిస్తాయి. ఈ దుక్కల వల్ల రసాయన మందుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతన్న ఆర్బీకేల్లో రైతుల కోసం సబ్సిడీపై విత్తనాలు ఈ సీజన్కు 8893 క్వింటాళ్లు కేటాయింపు వేసవి దుక్కులతో క్రిమి కీటకాలు నాశనం, కలుపు సమస్యకు చెక్ -
ఈదురు గాలులతో వర్షం
● గాలికి లేచిన గృహాల పైకప్పులు మార్కాపురం: మార్కాపురం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వేములకోట, కొట్టాలపల్లి, వేములపేట, నికరంపల్లి, చింతగుంట్ల తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. మండలంలోని నికరంపల్లి గ్రామానికి చెందిన గుండారెడ్డి నారాయణమ్మ ఇంటి పైకప్పు రేకులు లేచిపోవడంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం జరిగింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరిగి 5.30 గంటలకల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మొట్టుపల్లె గ్రామంలో ఈదురు గాలులు కొమరోలు: మండలంలోని మొట్టుపల్లె గ్రామంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం శుక్రవారం సాయంత్రం కురిసింది. దీంతో నాగం రమణయ్య, నాగం నాగార్జున నివాసాలపై ఉన్న రేకుల షెడ్లు గాలులకు ఎరిగిపోయి పక్కవీధిలో పడ్డాయి. గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షానికి గృహంలో ఉన్న ధాన్యాలు, సామగ్రి నానిపోయాయి. గుంతపల్లె గ్రామానికి పీరయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మొట్టుపల్లె గ్రామ సమీపంలో భారీ వృక్షం కూలడంతో పీరయ్యపై పడింది. దీనితో పీరయ్య కాలు విరగడంతో 108 సహాయంతో పీరయ్యను గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ సూచించారు. శుక్రవారం స్పందన భవనంలో ఆర్ఓ(రిటర్నింగ్ అధికారులు), ఏఆర్ఓ (అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు), అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చిన్న పొరపాటు కూడా జరగకుండా నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహనతో ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. సిబ్బంది ఉదయం 5 గంటలకే కేటాయించిన లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు సర్వీసు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన చేసుకుని పక్కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్మీనా, డీఆర్ఓ శ్రీలత, ఒంగోలు, దర్శి, కనిగిరి, వైపాలెం, కొండపి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణలో కలెక్టర్ దినేష్కుమార్ -
ఈవీఎం, స్ట్రాంగ్ రూముల పరిశీలన
● పాల్గొన్న కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికలకు సంబంధించి జరిగిన పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములను కలెక్టర్ దినేష్కుమార్ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీళ్లు, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. అనంతరం అక్కడే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ రూముల్లోకి ఈవీఎంలను తీసుకువెళ్లేందుకు ఏజెంట్లను అనుమతించేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ శ్రీలత, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్మీనా, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్, కాలేషాబేగ్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
రగ్బీ జిల్లా జట్టు ఎంపిక
తాళ్లూరు (ముండ్లమూరు): ప్రకాశం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ (18 ఏళ్ల వయసు లోపు) బాల బాలికల జట్ల ఎంపిక ఈ నెల 27వ తేదీన మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్ రవిప్రసాద్రెడ్డి శుక్రవారం ఒక ప్రకనటలో తెలిపారు. రగ్బీ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, నాలుగు పాస్ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో భీమిలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి ఎస్ శ్రీకాంత్ గణేష్ తెలిపారు. డీఎల్పీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ మార్కాపురం టౌన్: మార్కాపురం డివిజన్ పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జీ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ దినేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు మార్కాపురంలోని డీఎల్పీఓ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేయడంతో ఆమె జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో డీపీవో విచారణ నిర్వహించి కలెక్టర్కు నివేదిక పంపడంతో శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడికి బెయిల్ దర్శి: ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు వీసీరెడ్డికి బెయిల్ మంజూరైంది. దర్శి సబ్ జైల్లో ఉన్న వీసీరెడ్డి శుక్రవారం బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో దర్శి పట్టణంలోని పోలింగ్ బూత్లో ఈవీఎంలు పగులగొట్టిన వీసీరెడ్డిని పోలీసులు పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 22వ తేదీన అద్దంకి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. సెల్యూట్ కొట్టలేదని.. ● అటెండర్పై భగ్గుమన్న ఉన్నతాధికారి ● నెలజీతం కట్ చేయాలంటూ సూపరింటెండెంట్కు ఆదేశం ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్లో ఒక ఉన్నతాధికారి కారిడార్లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంభోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు. అటెండర్ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు కనిగిరి రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ జే ఉషారాణి తెలిపారు. స్థానిక కళాశాలలో శుక్రవారం సీపీడీసీ సభ్యులు, కళాశాల సిబ్బంది, ఏపీ ఈడబ్ల్యూడీసీ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం ఉషా 2024 పథకం కింద మంజూరైన నిధులను కళాశాలలో నూతన తరగతి గదుల నిర్మాణం, కళాశాల భవనాల పునరుద్ధరణ, భౌతిక, డిజిటల్ తరగతులలో మౌలిక వసతుల కల్పన, వైఫై కనెక్టివీటి, నాలుగు కాంపోనెంట్స్కు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, కళాశాల సీపీడీసీ సభ్యుడు ముక్కు బాలకష్ణారెడ్డి, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి, రాచమళ్ల శ్రీనివాసులరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
ప్రయోజనాలు..
● మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది ● వేసవి దుక్కుల వల్ల భూమి వదులుగా అవుతుంది. తద్వారా భూమిలోని క్రిమికిటకాలు పూర్తిగా చనిపోతాయి. ● వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. పంట వేసినప్పుడు మొక్క వేర్లు లోపలికి నీరు వెళ్లి బలంగా ఉంటాయి. ● చీడ పురుగులు నశిస్తాయి. తద్వారా పురుగు మందుల వాడకం తగ్గుతుంది. భూములు సారవంతంగా మారతాయి. ● అధిక వర్షాలు కురిసినా భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. ● భూమి పొరల్లోకి గాలి వెళ్లి మొక్కల వేరు వ్యవస్థ విస్తరించి మొక్కలు బలంగా ఉంటాయి. ● లోతు ఎక్కువగా దున్నటం వల్ల కలుపు గింజలు బయట పడతాయి. వాటిని పక్షులు తినటంతో కలుపు కూడా తగ్గుతుంది. కొన్ని రకాల కలుపు మొలక బయటపడి వేడికి చనిపోతాయి. ● అధిక వర్షాలు కురిసినా భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. ● మొలక శాతం పెరుగుతుంది. సకాలంలో పంట వేసుకోవటానికి పొలం అనుకూలంగా మారుతుంది. ● సేంద్రియ, రసాయన ఎరువులు కలిపి దున్నినట్లుగా మారుతుంది. ● పత్తి, మిరప, మొక్కజొన్న వంటి మోడులు భూమి లో అడుగు భాగానికి చేరి కుళ్లి ఎరువుగా మారతాయి. ● అలాగే చెరువు, కుంట మట్టిని వేసి పొలం దున్నటంతో భూసారం మరింత పెరుగుతుంది. -
తమ్ముడిని చంపేసిన రైల్వే టీసీ
సింగరాయకొండ: అన్నాదమ్ముల మధ్య ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాలు హత్యకు దారితీశాయి. అన్న కొట్టిన దెబ్బలు తాళలేక తమ్ముడు చొప్పర శివశంకర్(37) మృతి చెందాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ వెంకటేశ్వరకాలనీలో చోటుచేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్బాబు, సీఐ దాచేపల్లి రంగనాథ్ పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర కాలనీకి చెందిన చొప్పర శివకృష్ణ, శివశంకర్ ఇద్దరు అన్నదమ్ములు. వీరి తండ్రి జాలయ్య రైల్వేలో వాచ్మెన్గా పనిచేస్తూ 2008వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శివకృష్ణ సౌత్ కోస్టల్ రైల్వేలో టీసీగా ఎంపికవడంతో తమ్ముడికి పొలం, ఇంటి స్థలం ఇచ్చి బతుకుదెరువు చూపారు. అప్పటి నుంచి శివశంకర్పై ద్వేషం పెంచుకున్న శివకృష్ణ తరచూ గొడవపడుతుండేవాడు. ప్రస్తుతం శివకృష్ణ ఒంగోలులో నివసిస్తుండగా, శివశంకర్ తన తల్లిదండ్రులతో కలిసి మూలగుంటపాడులో జీవిస్తున్నాడు. శివశంకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి వేళ వివాదం కుమార్తెకు పుట్టు వెంట్రుకలు తీస్తున్న నేపథ్యంలో మూలగుంటపాడులో ఉంటున్న తండ్రి జాలయ్యను తీసుకెళ్లేందుకు శివకృష్ణ గురువారం అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఈ సందర్భంగా శివకృష్ణ తన తండ్రి జాలయ్యను ఖర్చుల కోసం 5 వేల రూపాయలు అడగ్గా ఇద్దరి మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. తండ్రిని పక్కకు తీసుకెళ్లేందుకు శివశంకర్ అడ్డురాగా.. అన్నాదమ్ముల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. శివకృష్ణ తన తమ్ముడి చాతీపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు తలపై తీవ్ర గాయం చేశాడు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న శివశంకర్ తానే స్వయంగా 108కు ఫోన్ చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. ఆస్పత్రి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు సిఫార్సు చేశారు. ఒంగోలు వెళ్తుండగా మార్గమధ్యంలో శివశంకర్ కన్నుమూశాడు. ఈ ఘటనపై తండ్రి జాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాచేపల్లి రంగనాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై టి.శ్రీరామ్, సిబ్బంది ఉన్నారు. ఆస్తి పంపకాల విషయంలో తమ్ముడిపై ద్వేషం పెంచుకున్న అన్న గురువారం అర్ధరాత్రి వేళ అన్నదమ్ముల మధ్య మల్లయుద్ధం అన్నకొట్టిన దెబ్బలు తాళలేక కన్నుమూసిన తమ్ముడు నిందితుడు సౌత్ కోస్టల్ రైల్వేలో టీసీ.. హతుడు పెయింటర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు -
No Headline
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నించాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్తో 2020లో వివాహమైంది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి–బ్లాక్లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్తో పంపించారు. కిరాతకంగా హత్య చేసి.. రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్ను నిలిపివేశారు. అనంతరం మధులత మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్కు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పసికందు ముందే హత్య కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా.. బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు. అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శనివారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కిరాతకుడు హైదరాబాద్లోని బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త మృతురాలు గొట్లగట్టుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధులత ఘటనపై పలు అనుమానాలు -
ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం
కొత్తపట్నం: మోటారు సైకిల్ను ఫోర్ వీలర్ ఆటో ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఒంగోలు–కొత్తపట్నం మధ్యలో నల్లవాగు బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపట్నం మండలం కె.పల్లిపాలెం గ్రామానికి చెందిన సైకం నాగార్జున(29) బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పని నిమిత్తం పల్లెపాలెం నుంచి బైక్పై ఒంగోలు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నల్లవాగు సమీపంలో ఒంగోలు నుంచి కొత్తపట్నం వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై బి.సాంబశివరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement