-
తలసేమియాపై అవగాహన
మంచిర్యాలటౌన్: తలసేమియా, సికిల్సెల్ వ్యాధి ని నివారించేందుకు ఆ వ్యాధిపై అందరూ అవగా హన కలిగి ఉండాలని రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో ని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్ సభ్యులకు తలసేమియా వ్యాధిపై ఆదివారం అవగాహన కల్పించారు. పెళ్లికి ముందు హెచ్బీఏ2 రక్త పరీక్షలు చేసుకుని ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు హిమోగ్లోబిన్ 9.5 గ్రాములు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాకర్ క్లబ్ ప్రెసిడెంట్ వీరస్వామి, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ పాల్గొన్నారు. -
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య శ్రీరాంపూర్: సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్లో యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఆదాయ పన్ను మాఫీకి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇంకా ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనే హామీ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్మికులు కాంగ్రెస్ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, రేగుంట చంద్రశేఖర్, మోత్కూరు కొమురయ్య, జోగుల మల్లయ్య, చంద్రమోహన్, అప్రోజ్ ఖాన్, మారుపల్లి సారయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
● టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాతమంచిర్యాల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ భవన్లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం–పార్లమెంటు ఎన్నికల్లో మన కర్తవ్యం’అనే అంశపై ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా నిరంతర దాడి చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదమేనన్నారు. కులం, మతం పేరుతో భావో ద్వేగాలను రెచ్చగొడుతుందని, మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీ చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీ ఆర్ను ఓడించినట్లే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబన్న, నాయకులు రాంచంద్రారెడ్డి, బచ్చలి ప్రవీణ్కుమార్, గోనెల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు మునీర్, కాంగ్రెస్ నాయకులు కే.రవి, శ్యాంసుందర్ రెడ్డి, జైపాల్సింగ్, దేవి సత్యం, తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి పాతమంచిర్యాల: ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న బీజేపీ మళ్లీ అధికారంలోకొస్తే దేశ భవిష్యత్ అంధకారంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల సీపీఐ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ శ్రమజీవుల హక్కులను హరిస్తోందన్నారు. సంఘ్ పరివార్ శక్తుల ఎజెండాలో పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతపాలన సాగించిందని, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిందన్నారు. ఫోన్ట్యాపింగ్తో దిగజారుడు రాజకీయాలు చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం
బెల్లంపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంటా చౌరస్తా వద్ద పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ద్రాక్ష పండ్లను తూకం వేసి అమ్ముతూ ప్రచారం నిర్వహించారు. తోపుడు బండ్ల వద్దకు వెళ్లి పండ్లను విక్రయిస్తూ ప్రచారం చేశారు. ఓటు కోసం వాగు దాటి..వేమనపల్లి: చామనపల్లి గ్రామ పంచాయతీ బద్దంపల్లి పోలింగ్ స్టేషన్ 204 పరిధిలోని చామన్పల్లిలో ఒకే ఒక్క దివ్యాంగురాలు లచ్చక్క ఓటు వేయాల్సి ఉంది. ఆమె చేత ఓటు వేయించేందుకు పీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం బద్దంపల్లి పోలింగ్స్టేషన్కు వెళ్లారు. చామనపల్లికి వెళ్లేందుకు మార్గమధ్యలో పెద్దవాగు ఉండడంతో టాటా ఏసీ వాహనం వాగులో దాటలేని పరిస్థితి. పంచాయతీ కార్యదర్శి ట్రాక్టర్ ఏర్పాటు చేయగా దానికి తాడుకట్టి టాటాఏసీని ఇసుకలోంచి లాక్కుంటూ అవతలి వైపునకు దాటించారు. ఆతర్వాత ఎన్నికల వాహనంలో చామనపల్లికి వెళ్లి దివ్యాంగురాలితో ఓటు వేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కుమారస్వామి, ఓపీఓ మొగిళి, ఎంఓ ప్రశాంత్, కిరణ్, ఏఎస్సై మజీరోద్దీన్, వీడియోగ్రాఫర్ రమణ, బీఎల్ఓ మానపల్లి పద్మ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement