బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్‌ అంధకారం | Sakshi
Sakshi News home page

బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్‌ అంధకారం

Published Mon, May 6 2024 7:15 AM

బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్‌ అంధకారం

● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి

పాతమంచిర్యాల: ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న బీజేపీ మళ్లీ అధికారంలోకొస్తే దేశ భవిష్యత్‌ అంధకారంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో చెన్నూర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల సీపీఐ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ శ్రమజీవుల హక్కులను హరిస్తోందన్నారు. సంఘ్‌ పరివార్‌ శక్తుల ఎజెండాలో పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతపాలన సాగించిందని, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిందన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌తో దిగజారుడు రాజకీయాలు చేశారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్‌, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ అలీఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement