-
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
● మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆదిలాబాద్టౌన్: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో బీజేపీని ఓడించాలనే నినాదంతో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. యాత్రకు స్థానిక కార్మిక, ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అనంతరం నేతాజీచౌక్లోని కార్మికుల అడ్డావద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. గడిచిన పదేళ్లలో జిల్లా అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. సీసీఐని తెరిపించలేదని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు ఎలాంటి నిధులు కేటాయించలేదని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇండియా కుటమి అభ్యర్థి సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాల్ చేయండి.. కథలు వినండి
● 040–45209722కు డయల్ చేస్తే చాలు.. ఆనందం కలిగించే కథలెన్నో ● కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు 040–45209722 నంబర్కు డయల్ చేసి ఆసక్తి, ఆనందం కలిగించే వివిధ కథలను హాయిగా వినవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రూమ్ టు రీడ్ కార్యక్రమంలో భాగంగా వినిపించే కథలతో కూడిన పోస్టర్ను శనివారం తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించడం ద్వారా వారిలో మౌఖిక భాష వికాస అభివృద్ధి , అభ్యసన సామర్థ్యాలను సాధించవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులలో అభ్యసన కొనసాగింపు కోసం రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్, జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈ నంబర్ను రూపొందించిందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ కథలను వినిపించడం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ డయల్ నంబర్ను అందరికీ అందుబాటులో ఉండేలా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఏఏంవో శ్రీకాంత్గౌడ్, సెక్టోరియల్ అధికారి జే. నారాయణ, సొహైల్, రూమ్ టు రీడ్ జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్, సభ్యులు చంద్రశేఖర్, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
మరోసారి మోదీనే ప్రధాని
● ఓటమి భయంతోనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం ● బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాథోడ్ ఆదిలాబాద్టౌన్: ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు తన పనితీరుతో భారతదేశ ప్రతిష్టతను ప్రపంచానికి చాటిన నరేంద్రమోదీ మరోసారి ప్రధానిగా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పంచవటి హోటల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మూడుసార్లు మద్దతు ధరలను పెంచినట్లు గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 400 ఎంపీ సీట్లతో మరోసారి కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడబోతుందన్నారు. దీ న్ని ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో రా జ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా తమ వైపు ఉన్నారని, అబద్దాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్కు వారే తగిన బుద్ది చెబుతారన్నారు. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని కొత్త, పాత క్యాడర్ కలిసి తమ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో రాజస్తాన్ ఎమ్మెల్యే గోవర్దన్వర్మ, నాయకులు వి.ఆధినాత్, లాలామున్నా, గటిక క్రాంతి, మోహన్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. ఓటింగ్ సరళిపై వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఈసీ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులంతా ఈ నెల 8 వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు జీఎస్ ఎస్టేట్లోని ఓ నివాసానికి వెళ్లి హోంఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్బోథ్: పోస్టల్ బ్యాలెట్, హోంఓటింగ్ ప్రక్రి య కొనసాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఓ టింగ్ ఈ నెల 8వ తేదీతో ముగుస్తుంది. శని వా రం బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా 166 మంది ఉద్యోగులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోంఓటింగ్ ద్వారా 110 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
● డీఎస్పీ జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్రాంతినగర్లో అనుమతి లేకుండా రోడ్డు పక్కన ఒక మతానికి సంబంధించిన జెండా గద్దెను నిర్మించారన్నారు. వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి లేవని మున్సిపల్ అధికారులు రోడ్డుకు ప్రమాదకరంగా ఉందని తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘటనలో ఓ వర్గం వ్యక్తులు గుమిగూడి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. ప్రతి చర్యగా మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు నినాదాలు చేయగా ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి జెండాలైనా, విగ్రహాల ఏర్పాటుకై నా సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా గుమిగూడినా, ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement