-
బంజారాహిల్స్ పబ్లో అసభ్య డ్యాన్స్లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్పై శనివారం రాత్రి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకర డ్యాన్స్లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
అవన్నీ అపోహలే
మేకల కళ్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులకు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2023 ద్వారా మరింత రక్షణ లభిస్తుందని భూ చట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) స్పష్టం చేశారు. ఈ చట్టంపై ఉన్న అపోహలు, అనుమానాలు సత్యదూరమైనవన్నారు. ఈ చట్టం వస్తే ఆంధ్రప్రదేశ్లోని భూములకు గ్యారంటీ లభిస్తుందన్నారు. ఈ గ్యారంటీకి ప్రభుత్వం సరి్టఫికెట్ ఇస్తుందని తెలిపారు.ఈ చట్టం భూముల రక్షణ కోసమే కానీ భక్షణ కోసం కాదని తేలి్చచెప్పారు. రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి హక్కుల గ్యారంటీ పత్రం వస్తే ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో భూములు కొంటారన్నారు. దీంతో పెట్టుబడులు పెరుగుతాయని, నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదని, ఆ కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందన్నారు. నలభై ఏళ్లుగా ఎలాంటి చట్టం రావాలని ఆశించామో, భూహక్కులకు ఎలాంటి భద్రత కలగాలని అనుకున్నామో అలాంటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ చట్టమని తెలిపారు. ఇలాంటి చట్టంపై అపోహలను సృష్టించడం, వాటిని సమరి్థస్తూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు.ఎవరూ చేయలేకపోయిన ఈ చట్టం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం కారణంగానే అమల్లోకి వస్తోందన్నారు. ఇలాంటి చట్టాన్ని తేవాలని 1908లో రిజి్రస్టేషన్ల చట్టం, 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం రూపొందిస్తున్నప్పుడే అనుకున్నారన్నారు. ఈ మేరకు సునీల్ కుమార్ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి సంబంధించి అనేక అనుమానాలను నివృత్తి చేశారు. ప్రశ్న: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తెచ్చిందా? సునీల్: ఈ చట్టం లక్ష్యమే ఆస్తులు లేదా భూములకు రక్షణ కల్పించడం, ప్రభుత్వం తరఫున గ్యారంటీ సరి్టఫికెట్ ఇవ్వడం. ఏదైనా తేడా వస్తే సదరు ఆస్తి లేదా భూమికి పరిహారం చెల్లించడం. లాక్కోవడం, లాక్కోవాలనుకోవడం ఈ చట్టం ద్వారానే కష్టమవుతుంది. అలాంటి వాళ్ల ఆటలు ఈ చట్టంతో సాగవు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూముల యాజమాన్య పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయా? సునీల్: ఇప్పటివరకు రైతుల చేతుల్లో భూమికి సంబంధించిన పాస్ పుస్తకం మాత్రమే ఉంది. ప్రభుత్వం చేతిలో ఆ భూమి రికార్డులు, సాగు వివరాలతో కూడిన అడంగల్ ఉన్నాయి. ప్రస్తుతం భూములకు సంబంధించి మొత్తం 40 రకాల రిజిస్టర్లు ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇన్ని రిజిస్టర్లు ఉండవు.. ఒక్కటే రిజిస్టర్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ రికార్డులుండే రిజిస్టర్కు అదనంగా ప్రభుత్వం యజమానులకు గ్యారంటీ సరి్టఫికెట్, యాజమాన్య పత్రంఅందజేస్తుంది. భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలను యజమానులకే ఇస్తుంది. ప్రశ్న: ఇప్పటికే పాస్ çపుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నవారు కూడా ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలా? సునీల్: ఇది కూడా వాస్తవం కాదు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 1బీ రికార్డు ఉంది. భూముల సర్వే ద్వారా కొత్త రికార్డు తయారవుతుంది. ఈ రికార్డుల ఆధారంగా టైటిల్ రిజి్రస్టేషన్ అధికారి (టీఆర్వో) రిజిస్టర్ తయారు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యాకే శాశ్వత రిజిస్టర్ రూపొందిస్తారు. రైతులు లేదా యజమానులు వెళ్లి వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూతగాదాల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదా? సునీల్: ఇప్పుడున్న విధానం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను రెవెన్యూ అధికారులే సరిదిద్దుతారు. యాజమాన్య వివాదాల కోసం మాత్రమే సివిల్ కోర్టులకు వెళుతున్నారు. కొత్త చట్టం వచ్చాక కూడా రెవెన్యూ రికార్డుల్లో మార్పుల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫోరంకు వెళ్లొచ్చు. యాజమాన్య వివాదాలుంటే హైకోర్టుకెళ్లొచ్చు. ప్రశ్న: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్వోకు సమాచారమివ్వాలా? సునీల్: ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదు. అసలు కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తోంది. ఒకవేళ కోర్టులకు వెళ్లినా ఏళ్లతరబడి జాప్యం జరగదు. రికార్డులన్నీ పకడ్బందీగా ఉంటాయి. యాజమాన్య హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి కేసులు కూడా త్వరగా పరిష్కారమవుతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచి్చన గ్యారంటీ తప్పయితే సదరు రైతుకు పరిహారం లభిస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు? సునీల్: ఈ చట్టం ద్వారా ప్రతి గ్రామానికి టైటిల్ రిజిస్టర్ వస్తుంది. ఈ రిజిస్టర్లోని రికార్డులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏవైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ గ్యారంటీకి అనుగుణంగా రిజిస్టర్లో మార్పులు చేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులకు మాత్రమే ఉంటుంది. వారి అధికారాల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు. ప్రశ్న: కొత్త చట్టం ద్వారా వారసత్వ హక్కుల వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? సునీల్: వారసత్వ హక్కుల్లో ఎలాంటి వివాదాలూ లేకపోతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో) చేస్తారు. వివాదం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. సివిల్ కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును టీఆర్వో రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రశ్న: వందేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న భూముల సర్వే ప్రాధాన్యత ఏంటి? సునీల్: వాస్తవానికి భూముల సర్వేలు ప్రతి 30 ఏళ్లకోసారి జరగాలి. ఏపీలో 1910 తర్వాత సర్వే రికార్డులు రూపొందాయి. ఇప్పుడు 110 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేందుకు భూముల సర్వేలే పునాది. ఇప్పుడు ఏపీలోని నాలుగువేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. సమస్యలు పరిష్కారమయ్యాకే సర్వే రికార్డులు రూపొందిస్తారు. ప్రశ్న: ఇలాంటి చట్టం ఎక్కడైనా అమల్లో ఉందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆ్రస్టేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. భూముల హక్కులకు గ్యారంటీ ఉంటే జీడీపీ పెరుగుతుందనే శాస్త్రీయ లెక్కలున్నాయి. ప్రశ్న: ఇది కేంద్ర చట్టమా? రాష్ట్ర ప్రభుత్వ చట్టమా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1987లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్ను ప్రణాళికా సంఘం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచి్చంది. ఆ తర్వాత 2008లో కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. ఈ చట్టాన్నయినా లేదంటే మహారాష్ట్రలో అమల్లో ఉన్న చట్టాన్నయినా, లేదంటే ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు చేసుకుని కొత్త చట్టం చేసుకోవాలని సూచించింది. ప్రశ్న: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచి్చందా? సునీల్: ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. ఆ తర్వాతే చట్టం అమల్లోకి వస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూముల హక్కులపై స్పష్టత, భద్రత, భరోసా వస్తాయి. సమస్యల పరిష్కారం, లావాదేవీల బదలాయింపు సులభమవుతుంది. ఇప్పుడు ఉన్న రికార్డులు, చట్టాలు హక్కుల నిరూపణలకు అంతిమ సాక్ష్యాలు కావు. ఇవన్నీ తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొత్త చట్టం వచి్చంది. ఇది తప్పకుండా రైతులకు మేలు చేసే చట్టమే. ఈ చట్టం అమలులో ఇబ్బందులను అధిగమించగలిగితే ఏపీలోని ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ప్రతి భూమికి, ఆస్తికి రక్షణ లభిస్తుంది. ప్రశ్న: ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయా? సునీల్: చెల్లకుండా పోవడానికి ఇవేమీ రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు కాదు. జాతీయ స్థాయిలో చర్చించి ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ లాంటివి సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన చట్టం. ఒకేరోజు చెల్లకుండా పోవు. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలాను క్రమంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ ఇచ్చాక మాత్రమే పాత రికార్డులు చెల్లవు. ప్రశ్న: భూహక్కులకు సంబంధించి వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు? సునీల్: భూరికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 124 చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. ప్రశ్న: ఈ చట్టం వ్యవసాయ భూములకేనా? వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తిస్తుందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం అన్ని రకాల భూములు, ఆస్తులకు వర్తిస్తుంది. గతంలో వ్యవసాయ భూముల రికార్డులు రెవెన్యూ శాఖ దగ్గర ఉంటే.. ఆస్తుల వివరాలు స్థానిక సంస్థల వద్ద ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని భూములు, ఆస్తులకు ఒకటే రిజిస్టర్.. ఒకటే మ్యుటేషన్. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వచ్చాక రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? సునీల్: భూ రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఈ చట్టం ద్వారా ప్రధాన మార్పులు వస్తాయి. ఇప్పటివరకు స్టాంపు కాగితాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అత్యంత భద్రతతో ప్రభుత్వ గ్యారంటీతో కూడిన డాక్యుమెంట్లు వస్తాయి. హక్కులను కూడా టీఆర్వోనే బదలాయిస్తాడు కాబట్టి మ్యుటేషన్ అవసరముండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు డీడ్స్ రిజి్రస్టేషన్ జరగ్గా ఇక నుంచి టైటిల్ రిజి్రస్టేషన్ జరుగుతుంది. ప్రశ్న: ఈ చట్టం అమలు పట్ల న్యాయవాదులకున్న అభ్యంతరాలేంటి? సునీల్: ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల లిటిగేషన్లు తగ్గిపోతాయి. కోర్టుల్లోఉన్న కేసుల్లో 66 శాతం భూ వివాదాల కేసులే. చట్టం అమల్లోకి వస్తే అది 10 శాతానికి తగ్గిపోతుంది. భూవివాదాల పరిష్కారం వల్ల నేరాలు కూడా తగ్గిపోతాయి. దీంతో సివిల్ కేసుల కోసం ప్రజలు కోర్టులకు వెళ్లాల్సినఅవసరం ఉండదేమో. ప్రశ్న: ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకూడదా? సునీల్: కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు.. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లకు ఇదే పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వ్యాక్సినేషన్ సరి్టఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. ఈనాడు కథనం కల్పితం ఉమ్మడి కర్నూలు జిల్లాకుచెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్కే రాలేదు కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు వెల్లడి కర్నూలు(సెంట్రల్): ‘‘ఈనాడులో మీ భూమి మీదికాదు శీర్షికన ప్రచురితమైన కథనం పూర్తిగా ఊహాజనితం. కలి్పతం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్ కోసం వెళ్తే టైటిల్ రిజి్రస్టార్ ఆఫీసర్(టీఆర్ఓ) అనుమతి తీసుకొని వస్తేనే రిజి్రస్టేషన్ చేస్తామని చెప్పినట్లు ఆ కథనంలో ఉన్న విషయం అవాస్తవం’’అని కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు స్పష్టం చేశారు. తన పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచారణ చేయించామన్నారు. గోవిందరెడ్డి పేరుతో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్ జరగలేదన్నారు. కనీసం సదరు వ్యక్తి సందేహా నివృత్తి కోసం కూడా రాలేదన్నారు. ఇంతవరకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. పూర్వం నుంచి అమల్లో ఉన్న రిజి్రస్టేషన్ చట్టం ప్రకారం ఆన్లైన్ 1బీ, అడంగల్ చూసి మాత్రమే వ్యవసాయ భూములు రిజి్రస్టేషన్లు చేస్తున్నామన్నారు.అపోహలు వద్దు ‘ఈ భూమి మీది కాదు’రాతలు కలి్పతం మాత్రమే శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ స్పష్టీకరణ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం జిల్లాలోని 13 సబ్–రిజి్రస్టార్ కార్యాలయాలకు సాంబశివుడు అనే పేరుతో ఏ వ్యక్తీ రిజి్రస్టేషన్ కోసం గానీ, తన భూమి రిజి్రస్టేషన్ విషయమై సందేహ నివృత్తి కోసం గానీ రాలేదని జిల్లా రిజి్రస్టార్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఈనాడు దిన పత్రికలో ‘ఈ భూమి మీది కాదు’ శీర్షికతో వచ్చిన కథనం కేవలం ఊహాజనితం, కల్పితం మాత్రమేనని ఖండించారు.భూ యాజమాన్య హక్కు చట్టం అనేది రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదిత, సంప్రదింపుల దశలోనే ఉందన్నారు. ఈ చట్టం ప్రతిపాదిత వివరాల్లో రిజి్రస్టేషన్ కార్యాలయాల పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. రిజి్రస్టేషన్ కార్యాలయాల్లో ఇంతకు ముందు ఏ పద్ధతిలో రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఎవరా సుబ్బారావు? ఈనాడులో తప్పుడు కథనం అటువంటిదేమీ లేదన్న అమలాçపురం జిల్లా రిజిస్ట్రార్ సాక్షి, అమలాపురం: జగన్ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వస్తోందని, దీని వల్ల అమలాపురానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని ఊరూ పేరూ లేని మరో వ్యక్తి పేరిట రాసేశారని ఈనాడు ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జిల్లా రిజి్రస్టేషన్, స్టాంపుల శాఖ రిజి్రస్టార్ బి.శ్రీనివాస్ రాత పూర్వకంగా ఖండించారు. సుబ్బారావు అనే పేరుతో ఏ వ్యక్తీ జిల్లాలోని 15 సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కోసం రాలేదని, కనీసం సందేహ నివృత్తికి కూడా సుబ్బారావు తమ కార్యాలయాలను సంప్రదించలేదని నిర్ధారించారు. అసలు భూ యాజమాన్య హక్కు రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి నిబంధనలు ఇంకా రూపొందించకపోతే కొత్త రిజిస్ట్రేషన్ ఎక్కడుందని ప్రశి్నంచారు. ఈనాడులో వచి్చన కథనంపై శాఖాపరమైన చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా, ఎవరా సుబ్బారావు అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్రెడ్డి
కె.రాహుల్తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకే అనుకూల వాతావరణం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్బూత్ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. హైదరాబాద్ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. రేవంత్కు ముందుంది ముసళ్ల పండుగ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం. -
వడదెబ్బతో 16 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 16 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవోగా పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బత్తుల భూమయ్య వడదెబ్బతో హఠాన్మరణానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల విజిలెన్స్ బృందంలో పనిచేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎండలోనే ఆయన పనిచేయాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండవేడికి వడదెబ్బకు గురైన ఆయన చొప్పదండిలోని స్వగృహంలో వేకువజామున కుప్పకూలిపోయారు.అలాగే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళ శివారు గొండుగూడెంకు చెందిన కొమురం సోము (58) ఎండకు తాళలేక మృతిచెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్ రామన్న (45) శుక్రవారం గజ్వేల్లో జరిగిన ఎన్నికల శిక్షణకు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, రాత్రి ఆయన ఆరోగ్య క్షీణించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు.నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు (56) మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంటి సమీపంలో కింద పడిపోయారు. ఆయనను 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొల్లాపూర్ మండలంలోనే ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రు నాయక్ (80) కొల్లాపూర్ వెళ్లి మధ్యాహ్నం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గొడిశాల దేవయ్య(70) ఎండ తీవ్రతకు మృతిచెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో వడ్డె యాదయ్య (72) పత్తికట్టె తొలగించే పనులు చేస్తుండగా సొమ్మసిల్లి మృతి చెందారు. అలాగే గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన స్పృహ తప్పి పడిపోయిన వర్గల్ మండలం వేలూరుకు చెందిన దార నాగయ్య(45)ను పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ కారణంగా శనివారం ఆరుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామానికి చెందిన ఆకుల భాస్కర్ (25), హరియా తండాకు చెందిన శతాధిక వృద్ధుడు బాదావత్ నర్సింహ(100) ఎండ వేడికి తాళలేక చనిపోయారు. నర్సంపేట మండలం ఇప్పల్తండాకు చెందిన అజ్మీర మంగ్యా (45) అనే రైతు ఎండ తీవ్రతకు మృతిచెందారు.ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన వంక లక్షి్మ(67) వడదెబ్బతో తనువు చాలించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాం«దీనగర్కు చెందిన ఆవుల కనకయ్య(75) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేకల లస్మయ్య (56) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. పనిచేస్తున్న చోటే..కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో భూమిని రాములు (71) ఉపాధిహామీ పనుల్లో భాగంగా పలుగుతో మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడి చేరుకున్న వైద్యులు రాములును పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా వరుసగా ఉపాధి పనులకు హాజరు కావడంతో రాములుకు వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన మహిళా కూలీ బోల్లబోయిన వనమాల (45) ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందారు. -
మండే ఎండలు X మధుమేహం!
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు. ఎన్నో సమస్యలకు చాన్స్.. ∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు. ∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. ∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement