-
వైభవంగా వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలో అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవారిని కొలువుంచి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రశాంతంగా ‘నీట్’ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఇండస్, ఏ క్యాంపులోని మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, మదర్ థెరిస్సా ఫార్మసీ కాలేజీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీ, శ్రీలక్ష్మీ స్కూల్ (సంసిద్ధ్), అథెనా స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,944 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకోగా.. 4,838 మంది హాజరయ్యారు. 106 మంది గైర్హాజరయ్యారు. ఎన్టీఏ నిబంధనల మేరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. సెగలు..భగభగలు ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్)/మహానంది: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది వరకు 46 డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది గరిష్టంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది కర్నూలులో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి 45.9 డిగ్రీలకు చేరింది. ఉదయం పూట గాలిలో తేమ 60 నుంచి 70 శాతం, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం ఉండాలి. గాలిలో తేమ శాతం కనిష్టస్థాయికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఆదివారం నంద్యాలలో 45.8, సంజామలలో 45.4, కోవెలకుంట్లలో 44.7, బేతంచెర్లలో 44.5, ఎమ్మిగనూరులో 44.6,సి.బెళగల్లో 45.3, కల్లూరులో 44.8, కోసిగిలో 44.6, గూడూరులో 43.2, హొళగుందలో 43.7,కౌతాళంలో 44, మంత్రాలయంలో 41.4, పెద్దకడుబూరులో 43.2, బనగానపల్లెలో 43, డోన్లో 44.2, మహానందిలో 43.7, పాణ్యంలో 41.8, రుద్రవరంలో 41.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఫెసిలిటేషన్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం ఫెసిలిటేషన్ కేంద్రం ఆళ్లగడ్డ వైపీపీఎం హై స్కూల్, జూనియర్ కాలేజ్, ఆళ్లగడ్డ నంద్యాల బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజ్, నంద్యాల బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బనగానపల్లె నందికొట్కూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, నందికొట్కూరు డోన్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్, పత్తికొండ శ్రీశైలం ప్రభుత్వ బాలుర హైస్కూల్, ఆత్మకూరు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: జిల్లాలో సోమవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6,7,8 తేదీలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశా మన్నారు. ఎన్నికల పోలింగ్ విధులలో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,372 మంది, బనగానపల్లెలో 2,858, డోన్లో 1,970, నందికొట్కూరులో 2,224, నంద్యాలలో 4,800, శ్రీశైలంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. హోం ఓటింగ్ సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత వ్యక్తులు శనివారం నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న విషయం రాజకీయ పార్టీలు గమనించాలన్నారు. అత్యవసర సేవలు, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది ఎక్కడైతే పని చేస్తూ ఫామ్– 12ఈ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి ప్రాంతంలోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. పాణ్యం, గడివేముల మండలాలకు సంబంధించి అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొదట ఎక్కడ శిక్షణ పొందారో ఆయా ప్రాంతాల్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. -
ఇంట్లోనే ఓటేశారు
● జిల్లా వ్యాప్తంగా 504 మంది ఓటు హక్కు వినియోగంనంద్యాల: సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు కావాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు రాలేని వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ను ప్రవేశ పెట్టింది. 2024 ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాలో 312 మంది 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, 591 మంది విభిన్న ప్రతిభావంతులు మొత్తం 904 మంది హోం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శనివారం, ఆదివారాల్లో జరిగిన హోం ఓటింగ్లో వృద్ధులు 164 మంది, విభిన్న ప్రతిభావంతులు 340 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు హోం ఓటరు వద్దకు వెళ్లి పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మధ్య వారి ఓటు వినియోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు హోం ఓటింగ్ కొనసాగనుంది. ఇల్లే పోలింగ్ కేంద్రం... డోన్ టౌన్/బనగానపల్లె రూరల్: వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగం కోసం ఇంటినే పోలింగ్ కేంద్రంగా మార్చేశారు. రహస్య ఓటింగ్ ప్రక్రియ దెబ్బతినండా, నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. డోన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేశ్వరరెడ్డి ఆదివారం ఉదయం డోన్ పట్టణంలో హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లకు నోడల్ అధికారి శ్రీనివాసులు, సెక్టోరల్ అధికారి అబ్దుల్ షఫితో పాటు ప్రైసెడింగ్ అధికారులు, అసెంబ్లీ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్, మైక్రో అబ్జర్వర్స్ ఓపీఓలు, వీఆర్వోలు, బూత్ లెవల్ సిబ్బంది పాల్గొన్నారు. బనగానపల్లె నియోజవర్గంలో మొత్తం 158 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 65 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కామేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గం హోమ్ ఓటేసిన వారు వృద్ధులు దివ్యాంగులు, రోగులు ఆళ్లగడ్డ 28 153 శ్రీశైలం 15 10 నందికొట్కూరు 57 69 నంద్యాల 19 22 బనగానపల్లె 24 41 డోన్ 21 45 మొత్తం 164 340 -
ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట
● ఐదేళ్లలో తలుపుతట్టిన సంక్షేమ పథకాలు ● సచివాలయం, విలేజ్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రాలతో మారిన రూపురేఖలు ● వలంటీర్ల సేవలతో సరికొత్త చరిత్ర ● లంచాలతో పనిలేదు, ఆఫీసుల మెట్లు ఎక్కే పనిలేదు ● కర్నూలు నుంచి బేతంచెర్ల మధ్య ‘సాక్షి’ రోడ్ షోఉదయం 6.30 గంటలు. కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా నుంచి నంద్యాల రోడ్డుకు వెళ్తుంటే కార్పొరేషన్ పరిధిలో కేసీ కెనాల్ పక్కనే ఏర్పాటు చేసిన హాకర్స్ జోన్ వద్ద వీధి వ్యాపారుల కోలాహలం కనిపించింది. ఏమ్మా.. వ్యాపారం ఎలాగుందని చౌడమ్మ అనే మహిళను ప్రశ్నించగా ఎంతో సంతోషంగా చాలా బాగుంది సార్ అని చెప్పింది. గతంలో తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ, ఎండకు ఎండుతూ వానకు నానుతూ చానా కష్టాలు పడ్డామంది. ఇప్పుడు యా బాధ లేదు. హాయిగా నీడ పట్టున వ్యాపారం చేసుకుంటున్నామంది. ప్రభుత్వం నుంచి ఏమైనా మేలు జరిగిందా? అని ప్రశ్నిస్తే.. పిల్లలకు అమ్మ ఒడి, తల్లికి పింఛను, తనకు ఇంటి స్థలం ఇచ్చారని తెలిపింది. పక్కనున్న వ్యాపారులదీ ఇదే మాట. ఎక్కడికీ పోయే పని లేకుండా అన్ని పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయని సంబరపడ్డారు. అక్కడి నుంచి తాండ్రపాడు మీదుగా నేషనల్ హైవే చేరుకున్నాం. ‘ఆరులైన్ల సూరత్ హైవే’ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలా.. నన్నూరు మీదుగా ఓర్వకల్లు ఎయిర్పోర్డు చేరుకున్నాం. టీడీపీ ప్రభుత్వం రూ.38కోట్లు ఖర్చు చేసి హడావుడిగా ప్రారంభోత్సవం చేసినా, ఒక్క విమాన సర్వీసు నడపలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తిం చేసింది. ప్రస్తుతం వైజాగ్, చైన్నె, బెంగళూరుకు సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుండి ముందుకెళ్తే 90శాతం పూర్తయి చివరి దశలో ఉన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ప్లాంటు కన్పించింది. ఈ ప్రాంతంలో 10,900 ఎకరాలను ప్రభుత్వం మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తోంది. సిగాచీ, ఆర్పీఎస్ లాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. మారుతి–సుజుకికి కూడా ఫార్మా కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. అక్కడి నుండి హుస్సేనాపురం చేరుకున్నాం. పాణ్యం నియోజకవర్గం. ఊళ్లోకి వెళ్లగానే రచ్చకట్టపైన కొందరు పడుకుని సేద తీరుతున్నారు. అందరూ రైతులే. ఏమన్నా! ఎన్నికల పరిస్థితి ఇలా ఉందని మాట కలిపాం. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వంల ఎవరికీ ఎలాంటి కష్టం లేదు. ఎన్ని పథకాలు వస్తున్నాయో కూడా చెప్పలేం. వలంటీర్లు వస్తున్నారు, వేలిముద్రలు వేయించుకుంటున్నారు.. డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి. ఎవ్వరికీ లంచం ఇచ్చే పనిలేదు, యాడికీ పోయే పనిలేకుండా అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి.. ఇంతకంటే ఏం కావాల..’ అని వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయనే మళ్లీ కల్పించుకొని ఊర్లనే సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఏర్పాటు చేసినారని.. శానా మంచి జరిగిందన్నారు. అక్కడి నుండి ఊళ్లోకి వెళ్లాం. రామలక్ష్మి అనే పెద్దావిడను పలకరించాం. ఏం పెద్దమ్మా.. రాజకీయం ఎలా ఉందని అడిగితే ‘మంచి సేసినోడికే అండగా ఉండాలయ్యా. లేదంటే పాపం!’ అని సెప్పింది. ఆమె ఇంటి ఎదురుగా తోపుడు బండిపై బట్టలు ఐరన్ చేస్తున్న నాగలక్ష్మిని పలకరించాం. ఆమెదీ అదే మాట. అలాగే ముందుకెళ్లాం.. మద్దమ్మ అనే ముసలావిడతో మాట్లాడితే.. గతంలో పించిని కోసం వెళ్లి శానా అవస్థలు పడేటోళ్లమంది. కూడు నీళ్లు లేకుండా ఆఫీసు కాడా ఉండాల్సి వచ్చేదంది. ఇప్పుడు నిద్ర మంచానే వచ్చి అవ్వా ఇదిగే నీ పించిను డబ్బులంటూ వలంటీర్లు చేతిలో పెడుతున్నారు. మాలెక్క ముసిలోళ్లకు శానా మంచి సేసినాడు నాయనా అంది. అక్కడి నుంచి తిరిగి హైవేకు వచ్చి సోమయాజులపల్లెకు పోయినాం. రాములమ్మ అనే వృద్ధురాలిని పలకరించాం. ‘భర్త చనిపోయాడు. పింఛన్ వస్తోంది. చేయూత వస్తోంది. ఈ డబ్బులతోనే అద్దె ఇంట్లో బతుకుతున్నా. ఇదీ లేకపోతే నా పరిస్థితి ఏంటయ్యా! ఆ మహానుభావుడి సలవే! అంది. పాలనపై స్పష్టత అక్కడి నుండి వెంకటాపురం వెళ్లాం. ఎండకు చెట్టుకింద అరుగుపై పది మందికి పైగా పడుకున్యారు. మేం వెళ్లగానే అంతా లేచి కూర్చన్యారు. వారితో కాసేపు మాట్లాడాం. రేపు ఒకటో తారీఖు.. పింఛన్ రావాల. ఇంతకు ముందు ఇంటికి తెచ్చిస్తుండ్రి. ఇప్పుడు ఆ నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబు చేసిన పనికి అకౌంట్లలో వేస్తారంట అని వెంకటేశ్వర్లు అనే రైతు బండిపై కూర్చుని వ్యంగంగా అన్యాడు. దీంతో రోజువారీ మార్పులతో పాటు పాలన, విధానపరమైన నిర్ణయాలపై పల్లె ప్రజలకు ఎంత స్పష్టమైన అవగాహన ఉందో స్పష్టమైంది. ఇంతలోనే వెంకట్రాముడు అనే మరో రైతు మాట్లాడుతూ మా ఊరంతా మంచిగా ఉంటామయ్యా! ఓట్లు వచ్చినప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్లు వేసుకుంటారు. మాకు ఎవరు మంచి చేసింటే వాళ్లకే ఓటు వేస్తాం అన్యారు. నంద్యాల జిల్లా ప్రజల మాట ఇదే.. అక్కడి నుండి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం గోరుమానుకొండ చేరుకున్నాం. అక్కడ విశ్వేశ్వరి, నాగమ్మ అనే ఇద్దరు మహిళలతో మాట్లాడాం. ఇద్దరి బిడ్డలకు అమ్మఒడి వస్తోంది. డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీతోనే తీసుకుంటున్నారు. అనారోగ్యం వస్తే పక్కనే ఉన్న ఆస్పత్రికి వెళుతూ సంతోషంగా ఉన్నాం. బడి, సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఒక్కమాటలో చెప్పాలంటే మా ఊరు మారింది.’ అని సంబరపడ్డారు. అక్కడి నుండి బేతంచెర్లకు బయలుదేరాం. దారిలో యూరోపియన్ మోడల్ భవనాలు కన్పించాయి. మహాత్మజ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ. విదేశాల్లో ఉన్నట్లు అన్పించింది. రూ.36కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ తరగుతులు మొదలవుతాయి. అక్కడి నుంచి కాస్త ముందుకుపోతే మరో యూరోపియన్ మోడల్ నిర్మాణాలు. రూ.8కోట్లతో ఓ ఐటీఐ కాలేజీ, పక్కనే రూ.4కోట్లతో ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రం. బహుశా రాష్ట్రంలో ఇలాంటి అద్భుత కట్టడాలు ఎక్కడ లేవు అన్పించింది. -
5 నిముషాల్లో పనయింది
నేను బ్యాంకులో పాసుబుక్కులు పెట్టి క్రాప్లోను తెచ్చుకున్నా! రెన్యువల్ చేసేందుకు వెళ్తే నా ఐదెకరాల్లో 2.5 ఎకరాలు నా పేరుతో లేదన్నారు. తీరా చూస్తే భర్త చనిపోతే ఓ మహిళ తన పేరుతో భూమి మార్చుకునేటప్పుడు నా భూమి ఆమె పేరున మారిపోయింది. నేను సచివాలయానికి వెళ్లా. అర్ధగంటలో వాళ్లు చూసి ప్రింట్ తీసిచ్చి ఓర్వకల్కు పంపినారు. అక్కడ 5 నిమిషాల్లో నా పని అయిపోయింది. ఇట్లాంటి సమస్య గత ప్రభుత్వంలో వచ్చింటే ఎన్ని నెలలు తిరగాల్సి వచ్చో. – వెంకటేశ్వర్లు, హుసేనాపురం ఇంత మంచి సేసినోన్ని యాడా సూడల్యా నాకు 10 ఎకరాలుంది. రైతుభరోసా, చేయూత, మా కొడుకు పిల్లోళ్లకు అమ్మ ఒడి వచ్చాంది. ఇంగో విషయం. నాకు కాలు దెబ్బతింటే ఇంతకు ముందు కర్నూలు గౌరీగోపాల్ ఆస్పత్రికి వెళ్లా. రూ.1.50లక్షలు అయింది. బాక్కాలేదు. తర్వాత నేను కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లి పదిరోజులుంటి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ సేసినారు. రూ.2,850 నా డబ్బులతో బయట మందులు తెస్తే అది కూడా ఇచ్చినారు. ఇంటికి వస్తే నేను ఇంటి వద్దే ఉన్నానని ఆరోగ్య ఆసరా ద్వారా రూ.30వేలు ఇచ్చినారు. ఇంత మంచి చేసినోన్ని, పెభుత్వాన్ని నా జీవితంలో సూడల్యా. – అబ్దుల్ రసూల్, హుసేనాపురం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement