-
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అధికారంలోకి వచ్చాక, మంచినీళ్ల కష్టం వచ్చిందని విమర్శించారు. ఎక్కడ పోతే ఎక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం లేదని దుయ్యట్టారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా అని ప్రశ్నించారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలోఎమ్మెల్యే హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒకరేమో దేవుని చూపించి ఓట్లు అడుగుతున్నారు..ఇంకొకరమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహాంకారంతో ఉన్నారని, వారిని భూమి మీదకు దించాలని పేర్కొన్నారు. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు.. తెలంగాణ భవిష్యత్కు జరుగుతున్న ఎన్నికలు ఇవని అననారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఆగస్టు 15 డెడ్లైన్.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్కు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. కాగా, మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. మీరు రండి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాంఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి..ఆగస్ట్ 15 లోపు పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు… pic.twitter.com/jUVKakgdYf— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024Video Credit: Telugu Scribeఇదే సమయంలో సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఖమ్మం: ‘వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి.. మళ్లీ వచ్చే ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని రేవంత్రెడ్డి నయా నాటకం మొదలుపెట్టిండు. మిస్టర్ రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తారీఖులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా? నువ్వు పార్టీ రద్దు చేసుకుంటవా అని రేవంత్రెడ్డి నన్ను అంటున్నడు. ఖమ్మం నుంచి మళ్లీ చెబుతున్నా. నేను సవాల్ను స్వీకరిస్తున్నా.ఇచ్చిన మాట ప్రకారం వడ్డీతో సహా రూ.39వేల కోట్లు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ఈనెల 26న ఉదయం 10గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు వస్తా, నువ్వు రా. అక్కడ బాండ్ పేపర్పై రాసి ప్రమాణం చేయి. నువ్వు అమలు చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేస్తా. మళ్లీ పోటీ కూడా చేయను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.బుధవారం సంగారెడ్డిలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి తీరును విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్రెడ్డిది పూటకోసారి మాట మార్చడం ఆయన నైజం అన్నారు. రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారన్నారు.ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నానని సోనియా సంతకాలతో బాండు పేపర్లు రాయించి పంపిణీ చేశారని. రాహుల్, ప్రియాంకగాం«దీలతో ప్రకటన చేయించారని గుర్తు చేశారు. 120 రోజులు గడుస్తున్నా, హామీలు అమలు చేయకుండా ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మేలా లేక దేవుడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గార్యంటీల అమలుకు శాసనసభ తొలి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మడమ తిప్పారని, రూ.2లక్షల రుణమాఫీకి విధివిధానాలనే ఖరారు చేయలేదని, మరోమారు గడువు పెడుతున్న రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న సాయం 4 నెలలుగా ఇవ్వకుండా ఒక్కో మహిళకు రూ.పది వేల బాకీ పడ్డారని, కల్యాణలక్ష్మి లబి్ధదారులకు తులం బంగారం, రైతుభరోసా సాయం ఎకరానికి రూ.15 వేలు, వరికి క్వింటాల్కు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.4 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ ఎందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా పార్టీల నేతలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. -
యువతి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ మండలం మక్తమాసన్పల్లి గ్రామానికి చెందిన అక్షయతో శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్గౌడ్కు గత నెల 30న వివాహమైంది. ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి అత్తగారింటి నుంచి అక్షయ వెళ్లిపోయింది. ఓ యువకుడి బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నవీన్గౌడ్ తండ్రి వెంకట్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. వడదెబ్బకు గురై పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, 5.2 ఎత్తు, చామన చాయ రంగుతో, తెలుపు రంగు షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే డయల్ 100 లేదా సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమి విక్రయంనిందితుడి రిమాండ్ రామచంద్రాపురం(పటాన్చెరు): ఒక వ్యక్తికి సంబంధించిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయించిన వ్యక్తిని బుధవారం రిమాండ్కు తరలించారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్లో నివాసం ఉండే మనోజ్కుమార్జైన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 177లోని 2.27గుంటల భూమిని గతంలో ఆ భూమికి సంబంధించిన భూ యజమానులు ఇతరులకు విక్రయించారు. అయితే భూమిని విక్రయించారని తెలిసి కూడా మనోజ్కుమార్ జైన్ వారి కుటుంబ సభ్యులతో కుమ్ముకై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూమిని మనోజ్కుమార్ జైన్ 2006లో తన పేరు పైన సేల్ డిడ్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ను చూపించి 2023లో కమిడి రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలుసుకున్న అసలు భూమి యాజమాని సుభాష్గౌడ్ కొల్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మనోజ్ కుమార్ జైన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గృహోపకరణాలు దగ్ధం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యుత్ హై ఓల్టేజీతో మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలోని పలు వార్డుల్లో గృహోపకరణాలు బుధవారం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒక్కసారిగా హైఓల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్ బల్బులు పేలిపోయాయి. ఫ్రిజ్లు, టీవీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 40 ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
మైనార్టీలకు అండగా సీఎం వైఎస్ జగన్
No Headline
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
శ్రమజీవుల కేంద్రం.. రాయదుర్గం
నాటు పడవ బోల్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement