-
వడ్ల కొనుగోళ్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం
నారాయణఖేడ్: వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడంపై ఖేడ్ ఆర్డీఓ అశోక చక్రవర్తి ఐకేపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 24న ‘పక్షం రోజులుగా పడిగాపులు’ శీర్షిక ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని తుర్కాపల్లి, ర్యాకల్, నిజాంపేట్ మండలంలోని రాంరెడ్డిపేట్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. తుర్కాపల్లిలో 5 లారీల వరకు లోడ్ అయ్యే ధాన్యం పక్షం రోజులుగా ఎందుకు నిల్వ ఉందని ప్రశ్నించారు. తూకం వేయడంలో జాప్యమెందుకు జరుగుతుందని నిలదీశారు. లారీలు తెప్పించి రెండు రోజుల్లో ధాన్యం మిల్లుకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద టెంటు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై మండి పడ్డారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ తహపీల్దార్ అనుదీప్, ఐకేపీ ఏపీఎం టీక్యానాయక్, డీటీసీఎస్ మహేష్, సీసీ అశోక్గౌడ్ తదితరులు ఉన్నారు. ‘సాక్షి’ కథనానికి స్పందన ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన ఆర్డీఓ -
చట్టాలపై అవగాహన అవసరం
జోగిపేట(అందోల్): మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సమన్వయకర్త పల్లవి సూచించారు. శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అందోల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మెప్మా అధికారి బిక్షపతి, టీఎంసీ అండ్ జెండర్ స్పెషలిస్ట్ విశాల, డీఎల్ఎఫ్ సభ్యులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
జిన్నారం(పటాన్చెరు): ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ భారతి హోళి కేరి సూచించారు. గుమ్మడిదల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, రైతులు దిగాలు చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధు, అధికారులు పాల్గొన్నారు.పౌరసరఫరాల శాఖ కమిషనర్ భారతి హోళి కేరి -
రైతు ఆత్మహత్యాయత్నం
జహీరాబాద్: భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన రైతు కీరూ రాథోడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి అన్న జ్ఞానేందర్ కథనం మేరకు.. కీరు తండ్రి రాంచందర్ సూర్య, అతడి అన్న లక్ష్మన్ సూర్యల పేరిట 14 ఎకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాలు లక్ష్మణ్ అమ్ముకున్నాడు. మిగితా భూమి ధరణి మూలంగా రికార్డుల నుంచి మాయమైంది. వీరి ఉమ్మడి కుటుంబమే కబ్జాలో ఉన్నప్పటికీ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతోపాటు 140 సర్వే నంబర్లో 1.20 ఎకరాల భూమి కీరు కుటుంబం పేరిట ఉంది. ఇందులో నుంచి 10 గుంటల భూమి తనకే వస్తుందని, పాలివారు మాత్రం వేధింపులకు గురి చేస్తూ పోలీసులను ఆశ్రయించి వత్తిడి చేస్తున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై రూరల్ ఎస్ఐ ప్రసాద్రావు స్పందిస్తూ భూ వివాదం విషయాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని, ఫిర్యాదు దారుడికి చెప్పినట్లు పేర్కొన్నారు. రైతు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో.. -
ఇంటి నిర్మాణం.. మరింత భారం
సామాన్యులకు సొంతింటి కల పెను భారంగా మారింది. రోజురోజుకూ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ధరలను చూస్తే ఇంటి నిర్మాణం జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతేడాదితో పోల్చితే రెండింతలు పెరిగాయి. – జహీరాబాద్ టౌన్: ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబటం లేదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, పీవీసీ విద్యుత్, ప్లంబింగ్ మెటీరియల్, కలర్స్, కూలీ రేట్లు ఇలా ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే గతంలో కంటే అదనంగా ఐదారు లక్షల భారం పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా సొంతింటి నిర్మాణం మొదలు పెట్టాలనుకునే వారు ధరలను చూసి సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు. ఇసుక రేటు డబుల్ ఇళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కట్టడానికి ఉపయోగించే ఇసుక టన్నుకు రూ.2800 వరకు పలుకుతోంది. ప్లాస్టింగ్కు వాడే సన్నరకం ఇసుక టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం ఇసుక రేటు టన్నుకు రూ. 1300 ఉండగా ప్రస్తుతం డబుల్ అయ్యింది. ఇసుక కొరతతో పాటు ఓవర్ లోడ్కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పునాదులు, స్లాబ్కు ఉపయోగించే కంకర ధర కూడా పెరిగింది. టన్నుకు రూ.1500 నుంచి రూ. 2,500 వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కలర్, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వాపోతున్నారు. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం ఉన్నవాటికి చాలా వ్యత్యాసం ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.జహీరాబాద్లో నిర్మాణంలో ఉన్న భవనం భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం స్టీల్, ఇసుక, సిమెంట్ ధరలకు రెక్కలు పెరిగిన కూలీ రేట్లు బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలుపనులు తగ్గాయి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో నిర్మాణం పనులు తగ్గాయి. ఇసుక, సిమెంట్, స్టీల్, డస్ట్, కంకర్, ఇతర మెటిరియల్ రేట్లు భారీగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఒప్పందం చేసుకున్న పనులకు నష్టం వస్తుంది. ఇసుక రేటు రెండింతలు అయ్యింది. ఇసుకకే సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లేబర్ చార్జీలు కూడా పెంచారు. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి. లేదంటే నిర్మాణం రంగం దెబ్బతింటుంది. –మురళీ, కాంట్రాక్టర్, జహీరాబాద్ ఆకాశాన్నంటుతున్న ధరలు కొవిడ్ తరువాత ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి అవసరం పెరిగింది. అద్దెలు కట్టలేక తమకు ఉన్న స్థలాల్లో నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి మొదలైన ధరల మోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా లేబర్ చార్జీలు పెరిగాయి. ఆ తరువాత మిగతా ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గత సంవత్సరం చదరపు అడుగు రూ.1400 నుంచి రూ.1500 వరకు ఖర్చు అయ్యేది. అదే కాంట్రాక్టుకు ఇస్తే రూ.1600 నుంచి రూ.1700 వరకు వ్యయం చేయాల్సి వచ్చేది. ఇంటీరియర్స్కు అదనం. ప్రస్తుతం పెరిగిన ధరలతో సొంతంగా ఇల్లు కట్టించుకున్నా రూ.1800 నుంచి రూ.1900 వరకు అవుతుండగా, కాంట్రాక్టుకు ఇస్తే రూ. 2000 నుంచి రూ.2200 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇసుక టన్ను ధర రూ.2800 వరకు పలుకుతోంది. స్టీల్ టన్ను రూ. 60 వేలకు పెరిగింది. సిమెంట్ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ. 360 వరకు ఉంది. కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. -
30 ఏళ్లకు ఆలయానికి ఉత్సవ విగ్రహాలు
జోగిపేట(అందోల్): చారిత్రాత్మకమైన అందోలులోని శ్రీ రంగనాథ ఆలయానికి చెందిన పంచలోహాలకు చెందిన ఉత్సవ విగ్రహాలు ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత శుక్రవారం ఆలయానికి చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోలులోని రంగనాథ దేవాలయానికి చెందిన శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యబామ, నాలుగు ఆల్వార్ల విగ్రహాలు, తదితర పూజా సామగ్రిని 1992వ సంవత్సరంలో అప్పటి పూజారులు ఈ విగ్రహాలకు ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు, రక్షణ విషయంలో ఇబ్బందులుగా ఉన్నాయని తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో నాచారంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవాలయ అధికారులకు అప్పగించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయాన్ని తెలుసుకొని విగ్రహాలను యథావిధిగా అందోలు దేవాలయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉత్సవ విగహ్రలకు పూజలు నిర్వహించాలన్నదే మంత్రి ఉద్దేశ్యమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.నాచారం దేవాలయం నుంచి తరలింపు -
‘ఉపాధి’తో పల్లెల ప్రగతి
హుస్నాబాద్రూరల్: పల్లెల అభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఉపయోగపడతాయని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిశాఖ పరిపాలన అధికారి స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్, నాగారం, పోతారం(ఎస్) గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను చూసి సంరక్షకులను అభినందించారు. తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేసే పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను వినియోగించుకొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పనులను వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తే రైతులకు ఉపయోగపడటమే కాకుండా కూలీలకు పనులు దొరుకుతాయని చెప్పారు. గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణం, పేదల భూమి సదను చేయడం, చెరువు మట్టి తరలించడం లాంటి పనులు చేసుకోవచ్చని చెప్పారు. వీరి వెంట ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, టీఏ పరశురాం తదితరులు ఉన్నారు. నిధులను సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి స్వామి గౌడ్ -
తొలిరోజు ప్రశాంతం
● ప్రారంభమైన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ● పర్యవేక్షించిన అధికారులు కొండాపూర్(సంగారెడ్డి): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు జరగగా, ద్వితీయ పంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. మొదటి రోజు శుక్రవారం తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2936 మంది విద్యార్థులకు గానూ 2722 మంది హాజరయ్యారు. 214 మంది గైర్హాజయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 849 మంది విద్యార్థులకు 789 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 60 విద్యార్థులు గైర్హాజరయ్యారు. -
గ్రామం యూనిట్గా లేనట్టేనా?
● కొత్త పంటల బీమా పథకం అమలుకు కసరత్తు ● మండలం యూనిట్గానే పరిగణన ● గ్రామం యూనిట్గా తీసుకునేందుకు నిబంధనలు అడ్డు! ● ఇలా అయితే రైతులకు నామమాత్రంగా అందనున్న పరిహారం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం అమలుపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు షురూ చేసింది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బీమా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ ఈ పథకం అమలు దిశగా చర్యలు చేపట్టింది. అయితే నిబంధనల కారణంగా జిల్లాలో గ్రామం యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కావడం లేదని వ్యవసాయశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాలో సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో కనీసం 25 శాతానికి మించి విస్తీర్ణం ఉన్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్గా తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం పంటల విస్తీర్ణంలో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. పత్తి, వరి అత్యధికంగా సాగవుతున్నప్పటికీ.. ఈ రెండు పంటల విస్తీర్ణాలు సుమారు 15 శాతంలోపే ఉన్నాయి. దీంతో జిల్లాలో అన్ని పంటలు మండల యూనిట్గానే ఈ పథకం అమలు కానుంది. గ్రామం యూనిట్గా తీసుకుంటేనే మేలు పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్గా అమలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగి పంటలు దెబ్బతిన్నప్పుడు పంట నష్టాన్ని గ్రామం యూనిట్గా లెక్కిస్తే రైతులకు ఎక్కువ మొత్తంలో పరిహారం అందుతుంది. మండలం యూనిట్గా అమలు చేస్తే పంట నష్ట పరిహారం నామమాత్రంగా వస్తుంది. ఒక్కోసారి పరిహారం అందకుండా నిబంధనలు అడ్డు వస్తుంటాయి. దీంతో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో తరచూ ప్రకృతి వైపరీత్యాలు జిల్లాలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయి రైతులపై కొలుకోలేని దెబ్బ పడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో కురిసిన అధిక వర్షాలకు జిల్లాలో వరి, ఉల్లి, జొన్న, మక్క పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మామిడి కాయలు నేల రాలాయి. ఇతర ఉద్యానవన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంతకు ముందు యాసంగి సీజనులో కురిసిన అకాల వర్షాలకు సుమారు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలా వడగండ్ల వానలు, అకాల వర్షాలు జిల్లా రైతాంగాన్ని నిండా ముంచుతున్నాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నిర్ణయిస్తున్నప్పటికీ.. నిబంధనలు సాకుగా చూపి అధికారులు నష్టాన్ని తక్కువగా అంచనా వేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకం అమలైతే పరిహారం అంది కొంతమేర ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. రైతులకు అవగాహన పంటల బీమా పథకంపై రైతులకు ప్రాథమికంగా అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవగాహణ కార్యక్రమంలో కొందరు రైతులు కూడా పాల్గొన్నారు. వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ పథకం గురించి వారికి వివరించారు.ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం పంటల బీమా పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. పంటల వారీగా సాగు విస్తీర్ణాలు లెక్కించాం. ఈ పథకంపై రైతులకు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఏ పంటలు గ్రామం యూనిట్గా, ఏఏ పంటలు మండలం యూనిట్ పరిధిలోకి వస్తాయనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఈ పథకం కోసం రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. – నర్సింహరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
స్తంభంపైనే లైన్మన్ మృతి
● వైర్లు సరి చేస్తుండగా కరెంట్ షాక్ ● మునిపల్లి మండలంలో ఘటన మునిపల్లి(అందోల్): విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో లైన్మన్ షాక్ గురై స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన మునిపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ కథనం మేరకు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన బాల్రాజ్ (22)కి ఏడు నెలల కిందట మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట, మల్లిఖార్జునపల్లి, బుస్సారెడ్డిపల్లి గ్రామాలకు లైన్మన్గా ఉద్యోగం వచ్చింది. తరచూ వర్షాలు పడుతుండడంతో ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా విద్యుత్ స్తంభాలపై వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మల్లిఖార్జునపల్లి గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాల్రాజ్ విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తున్నాడు. ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావ డంతో విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనే మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
శివ్వంపేట(నర్సాపూర్): పదహారు రోజుల కిందట మృతి చెందిన వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం పోలీసులు పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి పోతులబోగూడ గ్రామానికి చెందిన కొంటి పోచయ్య(60) నీటికుంటలో పడి మృతి చెందడంతో సహజ మరణం అనుకొని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భూమి అమ్మకం విషయంలో పోచయ్య అడ్డొస్తున్నాడని నెపంతో రియల్ వ్యాపారులు హత్య చేశారని ఆరోపణలు వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్ సీఐ కృష్ణ నేతృత్వంలో పలువురు అనుమానితులను విచారించారు. శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎస్ఐ మహిపాల్రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అజారుద్దీన్ పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా మృతికి సంబంధించి నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
సజావుగా పాలిసెట్
సంగారెడ్డి టౌన్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి గురువారం నిర్వహించిన పాలిసెట్ –2024 సజావుగా సాగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఏడు సెంటర్లలో మొత్తం 2420 మంది విద్యార్థులకు గాను 2200 మంది పరీక్ష రాసినట్లు సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. 220 మంది గైర్హాజరయ్యారన్నారు. నకిలీలు విక్రయిస్తే చర్యలు నారాయణఖేడ్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఖేడ్ ఏడీఏ నూతన్ ప్రసాద్ స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని విత్తన, ఎరువులు, పురుగుమందుల సమీకృత డీలర్లతో శుక్రవారం ఖేడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని సూచించారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు అమ్మితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పత్తి విత్తనాలలో గ్లైఫోసెట్ విత్తనాలు అమ్మొద్దని తెలిపారు. స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులు శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్చారి, శశాంక్, వెంకటేశం పాల్గొన్నారు. వైభవంగా కుంకుమార్చన రామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ టౌన్షిప్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిత్య హోమం, కుంకుమార్చన, మహాలక్ష్మీ హోమం, విష్ణుసహస్రనామ పారయణం, చక్ర మండలారాధన, రథోత్సవం కార్యక్రమాలు చేపట్టారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ప్రధాన అర్చకులు భార్గవ్ లక్ష్మీనరసింహస్వామి తెలిపారు. కంపోస్టు ఎరువు తయారు చేయాలిఝరాసంగం(జహీరాబాద్): చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సూచించారు. శుక్రవారం ఝరాసంగం, కప్పాడ్ గ్రామాలను ఆయన సందర్శించారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, నర్సరీ తోపాటు పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. కప్పాడ్లోని వైకుంఠధామం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం ఝరాసంగం పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మయ్య పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, స్వప్న పాల్గొన్నారు. -
రైతులను వేధిస్తే చర్యలు తప్పవు
పుల్కల్(అందోల్): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను వేధిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వల్లూరి క్రాంతి అదికారులను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు రైస్మిల్లులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే పుల్కల్లో అమ్మ ఆదర్శ పాఠఽశాల పథకం కింద చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఏజెన్సీలకు సూచించారు. అనంతరం పుల్కల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ తేమ శాతంపై వ్యవసాయశాఖ ఏఈఓ వేధిస్తున్నారని కలెక్టర్కు రైతులు మొర పెట్టుకున్నారు. రైతులను వేధిస్తే చర్యలు తప్పవని ఉద్యోగులను కలెక్టర్ హెచ్చరించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం కోడూరు రైస్మిల్లును సందర్శించి పరిశీలించారు. జూన్ 6 వరకు యూనిఫాంలు అందించాలి సంగారెడ్డి టౌన్: జూన్ 6 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందేలా చూడాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని డీఆర్డీఏ ఆవరణలో కుట్టు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుట్టు అవకాశాన్ని స్వయం సహకార సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ, డీఆర్డీఏ, మెప్మా అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.పుల్కల్ పీఏసీఎస్ సీఈఓ, ఏఈఓపై కలెక్టర్ క్రాంతి ఆగ్రహం -
ప్రాణం తీసిన ఈత సరదా
నీట మునిగి బాలుడు మృతి నర్సాపూర్ రూరల్: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృత్యువాత పడిన ఘటన నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని హనుమంతపూర్లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై పుష్పరాజ్, స్థానికుల కథనం మేరకు.. నర్సాపూర్ పట్టణానికి చెందిన చాంద్ పాషా, ఉస్మాన్ బీ దంపతుల కుమారుడు ఆసీఫ్(12) స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు హనుమంతపూర్ చెరువులోకి వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో ఆసీఫ్ నీట మునిగి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మంజీరాలో మునిగి వ్యక్తి..పాపన్నపేట(మెదక్): ప్రమాదవశాత్తు మంజీరాలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రామతీర్థం శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ కథనం మేరకు.. మండల పరిధిలోని జయపురం గ్రామానికి చెందిన బజారు కిష్టయ్య (35) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సమీప బంధువుల పెళ్లి నిమిత్తం రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలిసి రామతీర్థం గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు బంధువులతో కలిసి మంజీరానది వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా కిష్టయ్య ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే ఉన్న బంధువులు గమనించి కాపాడేందుకు యత్నించినా సాధ్య పడలేదు. పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య మమతతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
తల్లిదండ్రులకు గుడి కట్టిన తనయులు
అక్కన్నపేట(హుస్నాబాద్): తల్లిదండ్రులకు గుడి కట్టారు. గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు తనయులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన గొట్టె కొమురవ్వ–కనకయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోగా, ఏడాది కిందట తండ్రి మృతి చెందాడు. శుక్రవారం తండ్రి కనకయ్య మొదటి వర్ధంతి సందర్భంగా గుడిలో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కుమారులు గొట్టె సదయ్య(వ్యవసాయం), మహేందర్(వ్యవసాయం), చిరంజీవి(ప్రైవేట్లో ఉద్యోగం)హైదరాబాద్లో చేస్తున్నాడు. తమను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే తమ వ్యవసాయ పొలంలో ప్రత్యేకంగా గుడి నిర్మించి అందులో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించారు. తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్న అన్నదమ్ములను చూసి గ్రామస్తులు ఎంతో గర్విస్తున్నారు. ఇలాంటి కొడుకలను కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులని గ్రామస్తులు అంటున్నారు. -
ఇంటి నంబర్లు ‘ఫేక్’
ఆ స్థలంలో ఇల్లు లేకున్నా ఉన్నట్లుగా దొంగ తక్పట్టీలు సృష్టించి 59 జీఓకు దరఖాస్తు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో 4–47/5/ఏ, 4–47/5/బీ, 4–47/5/సీ, 4–47/5/డీ, 4–47/5/ఈ, 4–47/5/ఎఫ్ ఇంటి నెంబర్లు గ్రామ పంచాయతీ నుంచి జారీ చేయకున్నా.. కేటాయించినట్లు దరఖాస్తు చేశారు. తక్పట్టీలు దొంగవి సృష్టించి 59 జీఓ కోసం దరఖాస్తు చేశారు. ఇలా దొంగ తక్పట్టీలు ఒక్క మిట్టపల్లి పరిధిలోనే కాకుండా చాలా చోట్ల సృష్టించి ప్రభుత్వంను, అధికారులను తప్పుతోవ పట్టించి ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. ఈ ఇంటి నంబర్లు జారీ చేయలేదని, రికార్డుల్లో లేదని మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్ తెలిపారు. సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 58, 59 జీఓలను విడుదల చేసింది. ఇదే అదనుగా చేసుకొని కొందరు రియల్టర్లు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను అధికారుల సహకారంతో పాగా వేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశారు. ఎన్నికల ముందు అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే అందరికీ క్రమబద్ధీకరించారు. దీంతో ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాదారుల చేతుల్లో చేరిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 8,304 దరఖాస్తులు ప్రభుత్వ స్థలాల్లో 2014 కంటే ముందు ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు 58, 59 జీవోలను ప్రభుత్వం విడుదల చేసి మార్చి 31, 2022 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 4,196 మంది దరఖాస్తు చేశారు. మరోసారి జీఓను పునరుద్ధరించి జూన్ 2, 2020 వరకు ఇంటి నిర్మాణం చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. మే 31, 2023 వరకు దరఖాస్తులు స్వీకరించగా 4,018 వచ్చాయి. 2020 జూన్ 2 వ తేదీ కంటే ముందు నిర్మించిన ఇంటి వివరాలు, ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లు, కుళాయి పన్ను, స్థలం సంక్రమించిన తీరు, సర్వే నంబర్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలు తదితర వాటితో ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. వీటి పరిశీలనకు జిల్లా అధికారులను ఒక్కో మండలానికి కేటాయించి దరఖాస్తులను పరిశీలించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. మూడు దఫాల్లో రుసుమును చెల్లించే వెసులు బాటును కల్పించారు. 58 జీఓకు సంబంధించిన దరఖాస్తుల్లో 125 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ఉచితంగానే క్రమబద్ధీకరించారు. 59 జీఓలో పరిధిలోకి 250 చదరపు గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్ విలువలో 50 శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఉన్న ఇళ్లకు 75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేశారు. ఫేక్ తక్పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఈ ఫేక్ తక్పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి స్వయంగా ప్రింటింగ్ చేయించి చాలా మందికి ఇలా తక్ పట్టీలు రాసి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో తక్పట్టీకి స్థలంను బట్టీ డబ్బులు వసూలు చేశారని తెలిసింది. ఇలా దొంగ తక్పట్టీలను సృష్టించి ఇచ్చారు.ఇంటి నంబర్ రికార్డుల్లో పరిశీలించకుండానే...దరఖాస్తు దారుడు పేర్కొన్న ఇంటి నంబర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉందా లేదా అని పరిశీలించకుండానే పలువురు అధికారులు ఆమోదం తెలిపారు. అలాగే ఆ స్థలంలో దరఖాస్తు దారుడు ఇంటి నిర్మాణం చేశాడా లేదా అని సైతం పరిశీలించలేదు. విచారణలో భాగంగా ఇంటి ముందు దరఖాస్తు దారుడి ఫొటోను కూడా తీసుకోవాల్సిండగా ఇతరుల గృహాల వద్ద ఫొటోలు తీసి ఆన్లైన్లో అధికారులు అప్లోడ్ చేశారు. పరిశీలనకు వెళ్లిన అధికారులు పలువురు కాసులకు ఆశ పడి ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కారని ప్రచారం జరుగుతోంది. ఇల్లే లేకుండా దొంగ తక్ పట్టీలు, ఇంటి నంబర్ను సృష్టించిన వారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.59 జీఓకు దరఖాస్తులు దొంగ తక్పట్టీలను సృష్టించిన పలువురు దరఖాస్తు దారులు జిల్లాలో 8వేల మంది క్రమ బద్ధీకరణకు దరఖాస్తు ఇంటినంబర్లు రికార్డుల్లో పరిశీలించకుండానే పలువురు అధికారులు అమోదం ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతంచర్యలు తీసుకుంటాం ఇంటి నిర్మాణం చేపడితేనే ఇంటి నంబర్ను గ్రామ పంచాయతీ కేటాయిస్తుంది. ఎవరైనా తప్పుడు తక్పట్టీలు ద్వారా ఇంటి నంబర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి పై క్రిమినల్ కేసులు సైతం పెడుతాం. – దేవకి దేవి, డీపీఓ -
కారు బోల్తా.. ఒకరు మృతి
చిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపు బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం టీ.మాందాపూర్ తండా–మెదక్ మండలం కాజీపల్లి గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. మెదక్ పట్టణ నవాబ్పేటకు చెందిన మేకల మహేశ్(32), అదే ప్రాంతానికి విజయ్కుమార్, పెరక రాజు, రాజు మెదక్ – చేగుంట ప్రధాన రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రగాయాలతో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మగ్గురికి గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటు వైపు వస్తున్న జెడ్పీ చైర్మన్ హేమలతగౌడ్ విషయం గమనించి కారులో ఇరుక్కుపోయిన వారిని తన సిబ్బందితో పాటు భర్త శేఖర్గౌడ్ సాయంతో బయటకు తీశారు. వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నశంకరంపేట పోలీస్లు వివరాలు నమోదు చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు దుబ్బాకరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గంగరాజు కథనం మేరకు.. మండలంలోని గంభీర్ పూర్ గ్రామానికి చెందిన పర్స కనకయ్య (56) కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం టీవీఎస్ ఎక్సెల్పై దుబ్బాకకు వచ్చి, తిరిగి వెళ్తున్నాడు. ఆరేపల్లి గ్రామ కమాన్ వద్ద నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సాయి కిరణ్ రెడ్డి కారులో అతివేగంగా వచ్చి కనకయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనకయ్యకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఓఆర్ఆర్పై మహిళను ఢీకొట్టిన కారు పటాన్చెరు టౌన్: ఓఆర్ఆర్ పై మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీడీఎల్ సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం పాటీ గ్రామ శివారులో నారాయణ కాలేజ్ సమీపంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న మంగమ్మ ఓఆర్ఆర్ పై కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఉదయం డివైడర్ మధ్యలో పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా, హైదరాబాద్ గచ్చిబౌలి వైపు నుంచి పటాన్చెరు వైపు వస్తున్న కారు మంగమ్మను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. గాయపడిన మంగమ్మ భర్త బోజియా ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్, బైక్ ఢీ.. హుస్నాబాద్: ఆర్టీసీ బస్, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కోహెడ మండలం రాంచంద్రాపూర్కు చెందిన దావ రాములు (42) హుస్నాబాద్ నియోజకవర్గం నవాబుపేటకు బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో హుస్నాబాద్ పట్టణ శివారులోకి రాగానే కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మాచాపూర్లో హైనా కలకలం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మాచాపూర్ హైనా దాడులు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం హైనా దాడిలో 65 జీవాలు మృతి చెందిన ఘటన మరువక ముందే శనివారం గ్రామానికి చెందిన రేగుల బాలయ్య, ఏదుల్ల మోహన్రెడ్డి పశువుల పాకలపై దాడి చేసి రెండు గేదె పిల్లలు (దూడలు)ను హత మార్చింది. దీంతో రైతులు బోరున విలపించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో రాత్రి బోన్లు, ఫ్లాష్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.రెండు దూడలు మృతి -
పేద విద్యార్థుల అభివృద్ధికి కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాల లో చదివే పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తెల్లాపూ ర్ నైబర్హూడ్ అసోసియేషన్ ఎడ్యుకేషన్ వాలంటరీ గ్రూప్ ఎంతో కృషి చేస్తుందని నైబర్హూడ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరగారి రమణ అన్నారు. శుక్రవారం నైబర్హూడ్ ఎడ్యుకేషన్ వాలంటరీ గ్రూప్ ఆధ్వర్యంలో తెల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్ నైబర్హూడ్ ఎడ్యుకేషన్ వాలంటరీ గ్రూపు ఆధ్వర్యంలో ఈ ఏడాది తెల్లాపూర్లోని మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే 120 మంది విద్యార్థులకు నల్లగండ్లలోని ఇంజనీరింగ్ స్కూల్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో అంతర్జాతీయ పాఠశాలలో చదివే 36 మంది విద్యార్థులు వీరికి విద్యాభోదన చేశారని వివరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమ కన్వీనర్ కవిత జాలే, కో ఆర్టినేటర్లు కత్వాయని, రవి రమణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మదన్, రామమూర్తి పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతో దిగుబడులు
సిద్దిపేటఅర్బన్: నాణ్యమైన విత్తనాలతోపాటు నేల రకాన్ని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులతోపాటు ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీదేవి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వరిలో దొడ్డు రకం, సన్న రకాలు, కందిలో దొడ్డు రకానికి సంబంధించిన విత్తనాలను ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రతీ ఏడాది నేల భూసార పరీక్ష చేయించుకోవాలని, నేల రకాలను బట్టి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల విత్తనాలు పరిశోధన కేంద్రం వద్ద అందుబాటులో ఉంటాయని, అవసరం ఉన్న రైతులు విత్తనాలు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. పచ్చి రొట్ట ఎరువులను సాగు చేసి దుక్కిలో కలియదున్నుకోవాలని, దీని వల్ల భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు దొరకని వారు పెసర విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. సిరిసిల్లలోని బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ జీ. శ్రీదేవి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు విత్తన మేళాను నిర్వహిస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులు వివిధ పంటలలో పురుగు మందుల వాడకం, మానవ, పర్యావరణ వ్యవస్థపై పురుగు మందుల అవశేషాల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవి -
గర్భిణితో అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగి
నర్సాపూర్: వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణితో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించడంతో విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి స్కానింగ్ కోసం కుటుంబ సభ్యులతో వచ్చింది. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు వద్ద అటెండర్గా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అమీర్కు స్కానింగ్ విభాగం వద్ద పేషెంట్ల జాబితా రాసే పని అప్పగించారు. జాబితా రాస్తున్న అమీర్ కొందరిని స్కానింగ్ చేసే గదిలోకి రావాలని సూచించాడు. ఓ గర్భిణి గదిలోకి వెళ్లగానే ఆమెతో అమీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అరుస్తూ బయటకు వచ్చి కుటంబీకులతో విషయాన్ని చె ప్పింది. వెంటనే వారు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పావనికి ఫిర్యాదు చేశా రు. ఈ విషయమై డాక్టర్ పావని మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అమీర్ను విధుల నుంచి తొలగించామన్నారు. విధుల నుంచి తొలగింపు -
లభించని ఆచూకీ
వెంకటేశం కోసం ముమ్మరంగా గాలింపు కల్హేర్(నారాయణఖేడ్): గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన మల్దోడ్డి వెంకటేశం ఆచూకీ లభించలేదు. శుక్రవారం నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్రెడ్డి, కల్హేర్ ఎస్ఐ వెంకటేశం, ఎస్బీ, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా పెద్దకోడల్గల్ వద్ద దొరికిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వెంకటేశంను తరలించిన వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశంను జుక్కల్ సమీపంలో ఓ ఫాంహౌస్లో విడిచినట్లు డ్రైవర్ చెప్పిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మహారాష్ట్రలోని దెగ్లూర్, తదితర ప్రాంతాల్లో గాలించారు. అనుమానిత వ్యక్తికి సంబంధించిన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. రేషన్ బియ్యం పట్టివేత గజ్వేల్రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తుర్కపల్లి మండలం దయమండ తండాకు చెందిన వంకోదాత వెంకటేశ్, వంకోదాత చిన్నలు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు రైడ్ చేసి ట్రాలీ ఆటోలో ఉన్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అక్రమంగా మట్టి తరలింపు 9 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ కోహెడరూరల్(హుస్నాబాద్): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న వాహనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, కోహెడ పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. మండలంలోని కూరెళ్ల గ్రామంలోని పెద్ద చెరువు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన తిప్పారపు నవీన్చారి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచరం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి 9 ట్రాక్టర్లతో పాటు జేసీబీలను పట్టుకున్నట్లు తెలిపారు. ఐదుగురిపై కేసుకొండపాక(గజ్వేల్): భూతగాదా విషయంలో దాడికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండలంలోని దోమలోనిపల్లికి చెందిన అబ్బు కనకవ్వ, మరిది అబ్బు క్రిష్ణమూర్తిలకు ఒకే శివారులో వ్యవసాయ భూమి ఉంది. అబ్బు కనకవ్వకు చెందిన వ్యవసాయ భూమిని క్రిష్ణమూర్తి కుటుంబీకులు శుక్రవారం ట్రాక్టర్తో దున్నుతున్నారు. మా భూమిని ఎందుకు దున్నుతున్నారని కనకవ్వ అడగడంతో మీ భూమి ఎక్కడిదంటూ బూతు మాటలు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఆమె కుమారులపై కట్టెలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు అబ్బు క్రిష్ణ మూర్తి, పిండి ఎల్లాలు, పిండి కవిత, అబ్బు యాదవ్వ, అబ్బు లింగంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిద్రలోనే డ్రైవర్ మృతి చిన్నశంకరంపేట(మెదక్): నిద్రలోనే కంటైనర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్సింగి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వల్లూర్ జాతీయ రహదారి పక్కన ఓ దాబా వద్ద రాజస్తాన్కు చెందిన డ్రైవర్ మనోజ్కుమార్ (36) గురువారం రాత్రి భోజనం చేసి కంటైనర్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి మృతి చెంది ఉన్నట్లు దాబా యజమాణి బిష్నోమ్ మనిష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ అహ్మద్ మొహినొద్దీన్ తెలిపారు. చేపలు పడుతుండగా.. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి తూప్రాన్: చేపల వేటకు వెళ్లి వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని ఘనపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన గుడ్ల శ్రీశైలం(45) గ్రామ సమీపంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గౌతమ్మ చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలను విద్యుత్ వైరు సాయంతో పడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
మట్టి పరీక్షలు..
భూసార పరీక్షలతో ఆశించిన దిగుబడులు ● నమూనాల సేకరణకు ఇదే సరైన సమయం ● కేవీకేలో మట్టి పరీక్షలుకేవీకేలో భూసార పరీక్షలు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల రైతులకు ఉపయోగంగా ఉంటుంది. మండలంలోని దిడిగి శివారులో గల కేవీకేలో ప్రతి నిత్యం భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా 2,500 నుంచి 3,000 వరకు పరీక్షలు చేసి రైతులకు రిపోర్టులు అందజేస్తున్నాం. వేసవి కాలం ఇందుకు అనువైన సమయం. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని రైతులు మట్టి నమూనాలు కేవీకేలో అందించవచ్చు. తండాలు, గ్రామాలకు వెళ్లి ఈ విషయమై రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. –ఇ.స్వామి, భూసార పరీక్షల నిపుణుడు -
సెగ్రిగేషన్ షెడ్ల లక్ష్యాలను చేరుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబావట్పల్లి(అందోల్): సెగ్రిగేషన్ షెడ్ల లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా అన్నారు. గురువారం మండల పరిధిలోని మర్వెళ్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్యార్డు, రైతువేదిక, నర్సరీలతోపాటు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తడి చెత్తతో వర్మి కంపోస్టు ఎరువులు తయారుచేసి నర్సరీలకు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లు ప్రతి గ్రామంలో వినియోగంలో ఉండేలా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కోసం నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నా రు. ప్లాస్టిక్ వినియోగం తగ్గేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీఓ యూసుఫ్, పంచాయతీ కార్యదర్శులు మంజురేకర్, మల్లేశం పాల్గొన్నారు. -
విష ప్రయోగమా?.. భానుడి ప్రతాపమా?
మిరుదొడ్డి పెద్ద చెరువులో చేపలు మృత్యువాత మిరుదొడ్డి పెద్ద చెరువులో అనూహ్య రీతిలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేల సంఖ్యలో మృతిచెందుతుండటంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలకు నీరు వేడెక్కి చేపలు మృత్యువాత పడుతున్నాయా? లేక ఎవరైనా చెరువులో విష ప్రయోగం చేశారా? అన్న విషయమై మత్స్యకారులు అయోమయానికి గురవుతున్నారు. సంబంధిత జిల్లా మత్స్య శాఖ అధికారులు వెంటనే స్పందించి చేపల మృతికి గల కారణాలు తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. మరోవైపు కుళ్లిపోతున్న చేపలతో చెరువు అంతా దుర్గంధం నెలకొంది. – మిరుదొడ్డి(దుబ్బాక)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మౌంట్ ఎవరెస్ట్పై పర్యాటకుల తాకిడి
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Sakshi News Cartoon: అనవసరంగా తనని పాలిటిక్స్లోకి లాగొద్దంటున్నాడ్సార్!
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement