-
రైతుకు రాజసం...
ఐదేళ్లలో రైతుల కోసం అమలు చేసిన పథకాలు, లబ్ధి ఇలా.. పథకం రైతులు చేకూరిన లబ్ధి (రూ.) వైఎస్సార్ రైతు భరోసా 1,45,890 482,58,00,000 (ఏడాదికి సగటున) వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ 1,07,272 15,63,00,000 పెట్టుబడి రాయితీ 1,08,176 93,37,19,127 ఉచిత పంటల బీమా 2,89,745 1,105,40,49,036 (ఏడాదికి సగటున) వైఎస్సార్ పంటల బీమా 72,267 1,30,95,00,708 వైఎస్సార్ పశు నష్ట బీమా 482 1,27,51,751 ఫ పండగలా మారిన సాగు ఫ అండగా నిలిచిన జగనన్న సర్కారు ఫ ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి పెద్దపీట ఫ జిల్లాలో 499 రైతు భరోసా కేంద్రాలతో చేరువైన సేవలు ఫ పాడి రైతులకూ అనేక పథకాలు సాక్షి, అమలాపురం/కొత్తపేట: దేశానికే అన్నం పెట్టే రైతన్నకు రాజసం వచ్చింది.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో సాగు పండగలా మారింది.. గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగలా మార్చింది.. గత ఎన్నికల ముందు పుడమి పుత్రుల కష్టాలు చూసిన సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి ఊపిరినిచ్చింది. విత్తు నుంచి పంట విక్రయం వరకూ బాధ్యత తీసుకుంది. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, ఆక్వా సర్వీసులకు రూ.1.50కు యూనిట్ విద్యుత్, పశుక్రాంతి, ఉచిత పశువుల బీమా, ఉద్యాన పంటలకు కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌస్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతులకు సాగు పెట్టుబడి తగ్గించింది. రైతు భరోసా కేంద్రాలతో క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక దన్ను, సాగు మెలకువలు అందించింది. ఈ ఆర్కేబీల్లో ఆయా ప్రాంతాల్లో ఏ పంట సాగు ఎక్కువగా జరుగుతుందో గుర్తించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ), విలేజ్ ఫిషరీష్ అసిస్టెంట్ (వీఎఫ్వో), విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ (వీవీఏ)లను నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో రైతులకు అండదండగా నిలిచి సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోతే.. తడిచి, దెబ్బతిన్న పంటను కొనుగోలు చేయడం, నష్టపోయిన తరువాత పంట కాలంలోనే ఇన్ఫుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), పంటల బీమా పరిహారం అందించడం వంటి వాటితో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పగలూ వ్యవసాయ విద్యుత్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. జిల్లాలో 20,452 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 11,900లకు పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే జిల్లాలో 4,200లకు పైగా ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రూ.1.50 చొప్పున రాయితీపై విద్యుత్ అందుతోంది. ఏడాదికి రూ.70 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. పాడి రైతులకు పాల వెల్లువ ప్రభుత్వం అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో పాడి రైతుల నుంచి నేరుగా పాల సేకరణ చేస్తున్నారు. తొలి దశలో 19 మండలాల్లో మొత్తం 195 ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఏఎంసీయూ)లు, ఐదు బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)ల ద్వారా పాల సేకరణకు అధికారులు సన్నాహాలు చేశారు. రోజుకు 25 వేల లీటర్ల పాల సేకరణకు సిద్ధమవుతున్నారు. మిగిలిన ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే అమూల్ కొనుగోలు చేసే పాల ధర అధికంగా ఉంది. ఇది పాడి రైతులకు లాభసాటిగా మారింది. వ్యవసాయం.. సేవలు సమస్తం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఆర్బీకే ఏర్పాటైంది. దీని పరిధిలో 2019–20లో 429 మంది రైతులకు రూ.81.90 లక్షలు, 2020–21లో 449 మందికి రూ.87.55 లక్షలు, 2021–22లో 511 మందికి రూ.99.64 లక్షలు, 2022–23లో 438 మందికి రూ.85.41 లక్షలు, 2023–24లో రైతులకు రూ.52.32 లక్షల చొప్పున రైతు భరోసా వచ్చింది. మొత్తం ఈ ఆర్బీకే పరిధిలో రూ.4.68 కోట్లు రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిగా అందించారు. పంట నష్టపోయిన ఐదుగురు రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.34,530 వరకూ వచ్చింది. ఇప్పటి వరకూ 80.75 మెట్రిక్ టన్నుల ఎరువులను ఈ కేంద్రం ద్వారా రైతులు కొనుగోలు చేశారు. ఇలా జిల్లాలో ఏర్పాటైన 499 ఆర్బీకేల ద్వారా రైతన్నలకు సేవలు అందుతున్నాయి. బీమా సొమ్ము వస్తుంది.. నేను 2.50 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాను. 2022లో గోదావరి వరదలకు నష్ట పరిహారంగా ప్రభుత్వం రూ. 25 వేలు అందించింది. ఇది కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం బీమా పథకం అమలు చేసింది. దీంతో మరో రూ.25 వేలు అందింది. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన అరటి పంటకు జిల్లా యూనిట్గా పంటల బీమా అమలు చేయడంతో పరిహారం వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం మండల యూనిట్గా వైఎస్సార్ ఉచిత బీమా చేయడంతో రైతులందరికీ పంట బీమా వర్తిస్తోంది. –బండారు శ్రీనివాసరావు (దొరబాబు), రైతు, వానపల్లి, కొత్తపేట మండలం క్రమం తప్పకుండా రైతు భరోసా నా సొంత భూమి మూడెకరాలతో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని అరటి, కంద, పసుపు పంట పండిస్తున్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రమం తప్పకుండా రైతు భరోసా, ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం అందుతుంది. ఏటా ఆర్బీ కింద రూ.13,500, మూడేళ్లు ఇన్పుట్ రాయితీ ద్వారా రూ.53 వేలు, సున్నా వడ్డీ రాయితీ కింద రూ.27 వేలు అందింది. గతంలో రుణమాఫీ పేరుతో సున్నా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇప్పుడు క్రమం తప్పకుండా వస్తోంది. –ఇందుకూరు కృష్ణంరాజు, ఉద్యాన రైతు, ఉచ్చిలి, ఆత్రేయపురం మండలం అరటికి బీమా.. పంటకు ధీమా వివిధ సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన అరటి పంటకు జిల్లా యూనిట్గా పంటల బీమా అమలుతో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల పంట నష్టం జరిగినా క్రాఫ్ ఇన్సూరెన్స్ వర్తించేది కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లా యూనిట్ను మండల యూనిట్గా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేయడంతో నష్టపోయిన రైతులందరికీ బీమా వర్తిస్తుంది. గతంలో అరటి పంటను బీమా పథకంలో జిల్లా యూనిట్గా పరిగణించేవారు. అరటి పంటల బీమా రుసుం ఎకరానికి రూ.2 వేలు ఉండేది. ఆ మొత్తాన్ని చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చెల్లించలేకపోయేవారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సంభవిస్తాయి. కానీ గతంలో బీమా పథకం డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టేవారు. ఈ పథకం ఆరు నెలలు అంటే డిసెంబర్ నుంచి జూన్ వరకూ వర్తిస్తుంది. ఆ సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పెద్దగా నష్టం ఉండేది కాదు. ఇలా ఆ కాలానికి క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులు ఆ మొత్తాన్ని నష్టపోయేవారు. అత్యధిక విస్తీర్ణంలో పండిస్తున్న అరటికి బీమా వర్తింపజేయడంతో పాటు గ్రామం యూనిట్గా లేదా కనీసం మండలం యూనిట్గా అయినా పరిగణించాలని, అధికారుల నివేదికను 2020 అక్టోబర్ 28న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రత్యేకంగా కలసి సమర్పించారు. ఫలితంగా గత విధానాలను సడలించి ఉద్యాన పంటలను ముఖ్యంగా అరటిని వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో చేర్చారు. మండలం యూనిట్గా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఖరీఫ్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారంతో ముగిశాయని డీఐఈఓ వనుము సోమశేఖరరావు ఓ ప్రకటనతో పేర్కొన్నారు. గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ శనివారంతో ముగిశాయన్నారు. అమలాపురం, కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించామన్నారు. జనరల్ కోర్సులకు సంబంధించి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిపామన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ‘నైతికత–మానవ విలువలు’ పరీక్ష జూన్ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 7న ‘పర్యావరణ విద్య’ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని డీఐఈఓ వివరించారు. -
పోలింగ్ సిబ్బందికి ముగిసిన శిక్షణ
రాయవరం: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ శనివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,644 పోలింగ్ బూత్ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు రిజర్వు సిబ్బందితో సహా 13,582 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏప్రిల్ 15న పీఓ, ఏపీఓలకు తొలి విడత శిక్షణ నిర్వహించారు. అనంతరం ఓపీఓలుగా ఎంపికైన వారికి అమలాపురంలో శిక్షణ ఇచ్చారు. అనంతరం రెండో విడత శిక్షణ ఉద్యోగులకు పోలింగ్ విధులు కేటాయించిన నియోజకవర్గ కేంద్రాల్లోనే నిర్వహించారు. పీఓ, ఏపీఓలతో పాటు ఓపీఓలకు పోలింగ్ విధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ రిసీవింగ్, పోలింగ్ రోజు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహణ, అనంతరం పోలింగ్ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను వివరించారు. ఈవీఎంలను ఎలా ఉపయోగించాలి? బ్యాలెట్ యూనిట్ను వీవీ ప్యాట్, కంట్రోల్ యూనిట్తో ఏ విధంగా అనుసంధానించాలనే విషయాలపై తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ ఇచ్చారు. -
శ్రీనివాసా.. శ్రీచిద్విలాసా
ఫ భక్తులతో పోటెత్తిన వాడపల్లి ఫ ఒక్కరోజే రూ. 37.04 లక్షల ఆదాయం ఆత్రేయపురం: శ్రీనివాసా... శ్రీ వేంకటేశా అంటూ భక్తులు తన్మయత్వం చెందారు.. ఆ వాడపల్లి స్వామివారిని చూసి భక్తిపారవశ్యంతో ఓలలాడారు.. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారితో పాటు ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణోత్సవాలు తిలకించే, ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. వీరికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ ద్వారా సుమారు రూ.37,04,739 ఆదాయం సమకూరింది. ఆలయం వద్ద ఏర్పాటైన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పందిళ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మందపల్లిలో తైలాభిషేకాలు కొత్తపేట: మందపల్లిలో మందేశ్వరస్వామి దేవస్థానానికి రూ. 2,06,872 ఆదాయం సమకూరిందని సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. తైలాభి షేకాల ద్వారా రూ.1,73,050, అన్న ప్రసాదం విరాళాలుగా రూ.33,822 వచ్చిందన్నారు. -
వైఎస్సార్ సీపీలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం
ఫ సుభాష్ వ్యాఖ్యలు సరికావు ఫ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, పార్టీ శెట్టిబలిజ నాయకులు అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం లభించిందని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ శెట్టిబలిజ నాయకులు స్పష్టం చేశారు. అమలాపురానికి చెందిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ శెట్టిబలిజలకు వైఎస్సార్ సీపీ ఏమీ చేయలేదని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీతో పాటు పార్టీ నాయకులు ఖండించారు. స్థానిక వాసర్ల గార్డెన్స్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, పార్టీ శెట్టిబలిజ నాయకులు మాట్లాడారు. బోడసకుర్రులో కూటమి అభ్యర్థులు, టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో శెట్టిబలిజలపై సుభాష్ చేసిన తప్పుడు ఆరోపణలపై వారు నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇద్దరు శెట్టిబలిజ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి సగర్వంగా ఆ చట్టసభకు తొలిసారి పంపించారని గుర్తు చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్, ఎమ్మెల్సీలతో పాటు జెడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ పదవులు ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో శెట్టిబలిజలకు వైఎస్సార్ సీపీ టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని మాట్లాడుతూ సుభాష్ టీడీపీ అభ్యర్థిగా మాట్లాడాలే తప్ప అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకు వచ్చి కుల రాజకీయాలు చేయడం, వైఎస్సార్ సీపీ శెట్టిబలిజలకు ఏమీ చేయలేదని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొందరు శెట్టిబలిజ నాయకులు బ్రోకర్లని వ్యాఖ్యానించిన సుభాష్ అమలాపురంలో ఒకప్పుడు వైఎస్సార్ సీపీ నాయకులైన అతని తండ్రి తదితరులు బ్రోకర్లు అవుతారా...? అని ఎదురు ప్రశ్నించారు. గతంలో సుభాష్కు వైఎస్సార్ సీపీ సముచిత స్థానమే ఇచ్చిందని గుర్తు చేశారు. తన వ్యక్తిగత స్వార్థ రాజకీయాలపరంగా అతనికి వ్యక్తిగతంగా ఏర్పడిన బాధను అదేదో మొత్తం శెట్టిబలిజ జాతికి అన్యాయం జరిగిపోయినట్లు, వైఎస్సార్ సీపీ తననేదో అగౌరపరిచినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కులాన్ని రెచ్చగొట్టే స్థాయిలో మాట్లాడే సుభాష్ తన వైఖరి మార్చుకోవాలని, రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా శెట్టిబలిజలు ఉన్న విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ దంగేటి డోలామణి, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, నాయకులు కుడుపూడి భరత్ భూషణ్, చిట్టూరి పెదబాబు, వాసర్ల వెంకన్న, కుడుపూడి త్రినాథ్, కముజు రమణ తదితరులు పాల్గొని సుభాష్ వ్యాఖ్యలను ఖండించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
అమ్మవారికి గాజుల శోభ
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement