రాయవరం: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ శనివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,644 పోలింగ్ బూత్ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు రిజర్వు సిబ్బందితో సహా 13,582 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏప్రిల్ 15న పీఓ, ఏపీఓలకు తొలి విడత శిక్షణ నిర్వహించారు. అనంతరం ఓపీఓలుగా ఎంపికైన వారికి అమలాపురంలో శిక్షణ ఇచ్చారు. అనంతరం రెండో విడత శిక్షణ ఉద్యోగులకు పోలింగ్ విధులు కేటాయించిన నియోజకవర్గ కేంద్రాల్లోనే నిర్వహించారు. పీఓ, ఏపీఓలతో పాటు ఓపీఓలకు పోలింగ్ విధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ రిసీవింగ్, పోలింగ్ రోజు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహణ, అనంతరం పోలింగ్ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను వివరించారు. ఈవీఎంలను ఎలా ఉపయోగించాలి? బ్యాలెట్ యూనిట్ను వీవీ ప్యాట్, కంట్రోల్ యూనిట్తో ఏ విధంగా అనుసంధానించాలనే విషయాలపై తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ ఇచ్చారు.
పోలింగ్ సిబ్బందికి ముగిసిన శిక్షణ
Published Sun, May 5 2024 8:15 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్
పెన్సిల్ లెడ్పై వాసవీ చరిత్ర
మామిడిలో పండు ఈగ ఉధృతి
హెచ్ఐవీ రోగులకు సత్వర వైద్యం
ఆధ్యాత్మికతతో విరాజిల్లిన పెనుగొండ
ఏడుగురిపై విద్యుత్ చౌర్యం కేసుల నమోదు
పశుపక్ష్యాదుల దాహం తీరుస్తూ..
రైల్వే పురస్కారాలు ప్రదానం
164 ఏళ్ల కట్టడం నేలమట్టం
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
తప్పక చదవండి
- దాడిచేసింది వారు.. మాపై కేసులా?
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
Advertisement