-
రూ.200 కోట్లతో మౌలిక వసతుల కల్పన
ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో గత 59 నెలల్లో రూ.200 కోట్లకు పైగా నిధులతో మౌలిక వసతులు కల్పించినట్టు వైఎస్సార్సీపీ ఉండి అసెంబ్లీ అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. మండలంలోని గొల్లలకోడేరు సంజన అపార్ట్మెంట్స్ ప్రాంతంలో ఆదివారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మా ట్లాడుతూ ప్రతి ఇంటికీ నవరత్నాల పేరుతో పేదలకు మేలు చేశారన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరి గిందన్నారు. అపార్టుమెంట్ వాసులకు మంచినీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ చేకూరి నరేంద్ర రాజు, గాదె రాజు వీరభద్రరాజు, అప్పలరాజు, జీవీఎల్ నర్సింహరావు, నేతల సాల్మన్, అవుడు శ్రీనివాస్, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట
పాలకోడేరు: సీఎం జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని, అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించారని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని వేండ్ర అగ్రహారం, రామచంద్రపురం గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ సోదరుడు పెన్మెత్స గోపాలకృష్ణంరాజు, ఎంపీపీ భూపతిరాజు చంటిరాజుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. అన్నివర్గాలకు సమన్యాయం చేశారని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు బీసీలకు చేసింది ఏమీ లేదని జగన్ ప్రభుత్వంలోనే బీసీలు అభివృద్ధి సాధించారన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్కు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. విస్సాకోడేరు సర్పంచ్లు బొల్లా శ్రీనివాస్, చింతపల్లి వెంకటనారాయణ, గొరగనమూడి మాజీ సర్పంచ్ చెల్లబోయిన పాపారావు, బొక్కా రాంబాబు, భూపతిరాజు వంశీకృష్ణంరాజు, పాలా శ్రీనివాస్, నాయకులు ఉన్నారు. -
జంపింగ్ జపాంగ్
పార్టీలు మారడంలో దిట్ట వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం మనకు అధికారమే ముఖ్యం. పార్టీ కాదు..ప్యారాచుట్ నేత అంజిబాబు ● ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు ఝలక్ ● ఈసారి భీమవరం జనసేన అభ్యర్థిగా పోటీ ● కేడర్ను పట్టించుకోని పులపర్తి ● ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని జనసేన శ్రేణుల ఆందోళన ● అంటీముట్టనట్టుగా టీడీపీ, బీజేపీ నేతలు ● గతంలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్ అవతారం ● మున్సిపల్ స్థలంలో పార్కింగ్ ఫీజుల వసూళ్లు ● కరోనా సమయంలో ప్రజలను కన్నెత్తి చూడని వైనం సాక్షి, భీమవరం: పార్టీతో, కేడర్తో ఆయనకు పనుండదు.. అధికారమే పరమావధి.. పరాజయం చెందితే తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కంటికే కనిపించరు.. అందుకే ఆయన్ను ఏరుదాటాక తెప్ప తగలేసే రకమని కొందరు.. ప్యారాచూట్ నేతని మరికొందరు చెప్పుకుంటుంటారు. స్వతహాగా వ్యాపారంలో రాణించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరింత వెనకేసుకున్నారంటారు. చివరకు తన మల్టీఫ్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కోట్లాది రూపాయల పార్కింగ్ ఫీజు రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ఘనుడిగా పేరొందారు భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు). కండువాలు మారుస్తూ.. కృష్ణా జిల్లాకు చెందిన అంజిబాబు భీమవరంలో స్థి రపడ్డారు. వ్యాపారవేత్తగా ఉన్న ఆయన 2009లో దివంగత వైఎస్సార్ చలవతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ కేడర్ ఆయన విజయానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడింది అంతంతమాత్రమే. ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ ఆయనే. బినామీ పేర్లతో అన్ని పనులు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. కాంగ్రెస్ కేడర్ను గాలికొదిలేసి 2014 ఎన్నికల్లో పార్టీ ఫిరాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోగా ఆ పార్టీ శ్రేణులు ఆయన కోసం పనిచేశాయి. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అంజిబాబుకు వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఘోర పరాజయం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్పై ఓటమి చెందిన పులపర్తి ఐదేళ్లుగా టీడీపీకి, ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూట మి పొత్తులో భాగంగా భీమవరం సీటు జనసేనకు రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కండువా కప్పుకుని మరోమారు తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రజలను పట్టించుకోలేదు : గత ఎన్నికల్లో ఓట మి అనంతరం టీడీపీ శ్రేణులకు, తనను నమ్ముకుని ఓటేసిన ప్రజలకు ముఖం చూపించకుండా చక్కగా తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అండగా కనీసం సేవా కార్యక్రమాలు నిర్వహించలేదు. మర లా ఎన్నికలు రావడంతో ఇప్పుడు గుర్తొచ్చామా అని పులపర్తిపై ప్రజలు మండిపడుతున్నారు. మింగుడుపడని వైఖరి పులపర్తి వైఖరి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్కు మింగుడుపడటం లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అంజిబాబు పార్టీ పటిష్టతకు, నాయకులు, కార్యకర్తల బాగోగులు గురించి పట్టించుకోరన్న పేరుంది. తన వెన్నంటి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలను కనీసం సంప్రదించకుండా ఆయన పార్టీ మారిపోతుంటారంటారు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే టీడీపీ నాయకులు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క జనసేన కేడర్ ఎన్నికల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఉన్నారంట. పదేళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబుకు తన వ్యాపార ప్రయోజనాలే ప్రధానమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్గా వందల కోట్లు వెనకేసుకున్నారంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీర ప్రాంత ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు సంకల్పించిన ప్రాజెక్టు విషయంలోనూ వ్యాపార ధోరణి చూపించారంటారు. ప్రాజెక్టు కోసమని భీమవరం రూరల్ మండలం చిన అమిరంలో సుమారు 50 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి తన సొంతానికి వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. భీమవరంలోని తన మల్లీఫ్లెక్స్ వద్ద ఆర్అండ్బీ, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా పార్కింగ్ ఏర్పాటుచేసి పదేళ్ల పాటు కో ట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశా రు. 2019లో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికై న గ్రంధి శ్రీనివాస్ కన్నెర్రజేయడంతో పార్కింగ్ ఫీజు అక్రమ వసూళ్లకు తెరపడింది. -
సంక్షేమ సారథికి అండగా నిలుద్దాం
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం అర్బన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన సంక్షేమ సారధి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉందామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని పెదగరువు, వెంప, శ్రీరామపురం గ్రామాల్లో మేమంతా సిధ్ధం ఇంటింటికి ప్రచారం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 58 నెలల్లో రైతుభరోసా, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, చేయూత, జగనన్న చేదోడు, పింఛన్లు వంటి నవరత్నాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి పథకాన్ని వలంటీర్ల ద్వారా ఇంటికే నేరుగా అందించారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. పట్టణంలో రూ.130 కోట్లతో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే తనను, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరాజు, మండల అధ్యక్షుడు తిరుమాని ఏడుకొండలు, జేసీఎస్ కన్వీనర్ కోమటి రాంబాబు, సీనియర్ నాయకులు అల్లూరి కృష్ణంరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు, కలిదిండి అప్పలరాజు, శ్రీరామపురం ఫణిరాజు, కలిదిండి సోమ సుందరరాజు, సానబోయిన సత్యనారాయణ, త్రిమూర్తులు, కొట్టి కుటుంబరావు, ఆరేటి పెద్దబ్బు తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్ పరిశీలన
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న కమిషనింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సుమిత్కుమార్, ఆర్ఓ కె.చెన్నయ్య పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. తణుకులో.. తణుకు: తణుకు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్కుమార్ ఆదివారం పరిశీలించారు. స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఈనెల 6, 7 తేదీల్లో జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీవీ రమణ, అధికారులు ఉన్నారు. ఉద్యోగుల ఓటు హక్కు తిరస్కరించొద్దు ఉండి: ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోను ఓటు హక్కును తిరస్కరించవద్దని జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సీవీ ప్రవీణ్ ఆదిత్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు ఫారం–12ను సకాలంలో సమర్పించకపోవడం వల్ల ఓటు వినియోగించుకోలేకపోతున్నారనే విష యం తమ దృష్టికి వచ్చిందన్నారు. స్పాట్లోనే ఫారం–12 స్వీకరించి ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు ఈనెల 1వ తేదీ నాటికి ఫారం–12ను సమర్పించలేకపోతే ఏ ఆర్వో పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో ఆ ఆర్వోకు ఫారం–12 సమర్పించేందుకు, ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని ఆదేశించారు. ఈనెల 7,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఉద్యోగులు ప్రత్యేక సెలవును సద్వినియోగం చేసుకుని పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలన్నారు. అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆర్వోలంతా సహకరించాలని కోరారు. ఈసీఐ మార్గదర్శకాలను అనుసరించడంలో తేడాలు వస్తే సంబంధిత ఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం ఏలూరు(మెట్రో)/ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ అన్నారు. ఆదివారం స్థానిక సీఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణా కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్ మాట్లాడుతూ నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ తప్పిదాలు, ఉల్లంఘనలు సంభవిస్తే వెంటనే ఎన్నికల పరిశీలకులు దృష్టికి తేవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో, పీఓ, ఏపీఓలు నిర్వహిస్తున్న విధులను, ఓటింగ్ తీరును నిశితంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. విధి నిర్వహణలో అనుమానాలు ఉంటే సెల్ 9154690377 నంబర్కు తెలియజేయాలన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement