పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో గత 59 నెలల్లో రూ.200 కోట్లకు పైగా నిధులతో మౌలిక వసతులు కల్పించినట్టు వైఎస్సార్సీపీ ఉండి అసెంబ్లీ అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. మండలంలోని గొల్లలకోడేరు సంజన అపార్ట్మెంట్స్ ప్రాంతంలో ఆదివారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మా ట్లాడుతూ ప్రతి ఇంటికీ నవరత్నాల పేరుతో పేదలకు మేలు చేశారన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరి గిందన్నారు. అపార్టుమెంట్ వాసులకు మంచినీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ చేకూరి నరేంద్ర రాజు, గాదె రాజు వీరభద్రరాజు, అప్పలరాజు, జీవీఎల్ నర్సింహరావు, నేతల సాల్మన్, అవుడు శ్రీనివాస్, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.