-
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి. టీడీపీ నుంచి ఓ ‘బిజినెస్’మ్యాన్, వైఎస్సార్సీపీ తరపున ఓ ఉన్నత విద్యావంతుడు పోటీలో ఉన్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మినహా మరో అర్హత టీడీపీ అభ్యర్థికి లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువు, ఉద్యోగం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పేదరికం విలువ తెలిసినోడు. పైగా తాను పోటీ చేసే సామాజికవర్గం మొత్తం తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థిలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1.15లక్షలు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే ఓటర్లు వీరే. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఓట్లు తమకు రావనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అందుకే తన నామినేషన్ నుంచి ప్రచారం దాకా ఎక్కడా కాషాయ జెండా కనిపించలేదు. కషాయ జెండా, కమలం గుర్తు కనిపిస్తే బీజేపీ ఓట్లు దూరమవుతాయనేది ఈ అభ్యర్థి భావన. అయితే తన తండ్రి ఏకంగా బీజేపీలోనే ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఇదే సమయంలో మైనార్టీ ఓటర్లకు మాత్రం ఈ దఫా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓ స్పష్టత ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అభ్యర్థి తండ్రి రంగంలోకి దిగి ప్రలోభాలకు తెరలేపాడు. ఒకరిది జన బలం.. మరొకరిది ధన బలం వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రజల మద్దతుతో గెలవాలనే భావనలో ప్రచారం చేస్తుంటే, టీడీపీ అభ్యర్థి తండ్రి మాత్రం డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడు. ఓ టీంను నియమించుకుని, వారికి జీతాలు ఇస్తూ 50 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి పారీ్టలతో సంబంధం లేకుండా ఓ జాబితా సిద్ధం చేయించారు. వీరందరికీ ఫోన్లు చేసి స్వయంగా పిలిపించుకుని డబ్బులిస్తూ, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రత్యర్థి పార్టీల నుంచి అనుకూలత లేకపోవడంతో తాను 2014, తన కుమారుడు 2019లో ఓడిపోయామని.. ఈ దఫా తన కుమారుడు ఓడిపోతే రాజకీయల నుంచి పూర్తిగా దూరం కావడంతో పాటు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసుకుంటారని చెబుతున్నారు. ఓడిపోతే హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసేవాడు, గెలిచినా అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఏం పనికొస్తారని ప్రత్యర్థిపారీ్టల నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇలాంటి వారికి మాకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. వైఎస్సార్సీపీ కోసం తిరగకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటే సరిపోతుందని సెలవిస్తున్నారు. ఒకరిద్దరు డివిజన్స్థాయి నేతలు ఆయన ప్రలోభాలకు లొంగడం మినహా తక్కిన వారంతా ధిక్కారస్వరం వినిపించడం గమనార్హం. ఓటుకు రూ.2వేల చొప్పున రూ.50కోట్లు పంచేందుకు సిద్ధం పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఈ లోపు ఓటుకు రూ.2వేల చొప్పున 2.50లక్షల ఓట్లకు రూ.50కోట్లు పంచేందుకు నగదు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇళ్లతో పాటు తన వ్యాపార సముదాయాల్లో నగదు నిల్వలను ఉంచినట్లు సమాచారం. ప్రతీ ఎన్నికల్లో కేవలం 50శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో మైనార్టీ ఓట్లు అధికంగా పోలవుతాయి. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు. ఈ వర్గాలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలమనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దీంతో వీరికి అవసరమైతే మరికొంత ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కూటమి నేతలకు భారీగా ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఖర్చు విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తగువు నియోజకవర్గంలో ఓ సామాజికవర్గం ఓట్లు ఎన్ని, ఏ పారీ్టకి ఎవరు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని లెక్కలు వేశారు. దీంతో మైనారీ్ట, ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఎస్టీ, బీసీలు కూడా వైఎస్సార్సీపీ వైపు అధికంగా ఉన్నట్లు వారి లెక్కలో తేలింది. పోలింగ్కు కూడా వీరే ఎక్కువగా వస్తారు. దీంతో తక్కిన వర్గాల ఓట్లు తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి లెక్కలు వేస్తే తమకు పరాభావం తప్పదని తేలింది. అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదని అభ్యర్థి తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ‘గత రెండు ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఈ దఫా ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మనకు సీటు కూడా ఇవ్వరు. కచ్చితంగా గెలవాలి. డబ్బులు చూడకూడదు’ అని తండ్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు వల్లనే ఇదంతా జరగుతోందని, పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును కూడా నిషూ్టరమాడుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం సి.బెళగల్: టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి తెగబడ్డారు. సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుంది. ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం సాయంకాలం వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నాయకులు మండలంలోని పోలకల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలకల్ ప్రచార కార్యక్రమానికి ఇనగండ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులతోపాటు కార్యకర్తలుగా ఉన్న రాజు, సోముబాబు వెళ్లారు. ప్రచారం అనంతరం తిరిగి గ్రామానికి వస్తున్న సందర్భంలో ఇనగండ్లలో టీడీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి బైక్పై వచ్చిన సోముబాబు, రాజులను గుర్తించిన టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. సోముబాబును బైక్పై నుంచి పక్కకు లాగి కిందకు తోశారు. అదేవిధంగా బైక్పై ఉన్న మరో వైఎస్సార్సీపీ కార్యకర్త రాజు కిందపడటంతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో గుంపులుగా టీడీపీ మూకాలు సోముబాబు, రాజుపై అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లతో త్రీవంగా దాడులు చేసి గాయపరిచారు. గుండాల దాడుల నుంచి తీవ్ర రక్తగాయాలతో తప్పించుకున్న బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారినపోయే తమపై టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఇనగండ్ల, గూడూరు మండలం జూలకల్, ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని బాధితులు పోలీస్లకు ఫిర్యాదు చేశారు. రాజు, సోముబాబుల ఫిర్యాదు మేరకు ఇనగండ్ల గ్రామానికి చెందిన చందన్న, అఖిల్, విజయరాజు, రవి, చిన్న నాగేంద్ర, ఈశ్వర్, ఎన్ రాజు, రఘురాముడు, బడేసావ్, ఎన్ రఘు.. తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. కాగా తీవ్ర గాయాలైన బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించడంతో ప్రాణాపాయం తప్పినట్లు బాధితుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. -
అక్రమాలు వెలికితీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం
● రూ.3 లక్షలు జరిమానా విధింపు కర్నూలు(న్యూటౌన్): ఉపగ్రహ ఛాయాచిత్రం రోడ్ మెటల్ తవ్వకాల్లో అక్రమాలను వెలికితీసింది. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని సర్వే నంబర్ 413/ఎలో రోడ్ మెటల్ తవ్వకాలను శనివారం జిల్లా మైనింగ్ అధికారులు ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా పరిశీలించారు. అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారించి లక్ష్మీసాయినాథ స్టోన్ క్రషర్ ప్రొప్రైటర్ కె.వరలక్ష్మికి రూ.3 లక్షల జరిమానా విధించినట్లు జిల్లా మైనింగ్ డిప్యుటీ డైరెక్టర్ టి.రాజశేఖర్ తెలిపారు. నోటీసులు కూడా జారీ చేశామని పేర్కొన్నారు. తమ తప్పును అంగీకరించి రూ.3 లక్షలు అపరాధ రుసుం చెల్లించారని జిల్లా మైనింగ్ డిప్యుటీ డైరెక్టర్ వెల్లడించారు. -
వినూత్న ప్రచారం
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ బీసీ సెల్ కార్యదర్శులు లక్ష్మీకాంతయ్య, కె.నాగేశ్వరమ్మ, పార్టీ నాయకులు చంద్రకళబాయ్, చంద్రికమ్మ, మల్లేష్, మధు, శేఖర్లతో కలిసి ముఖాలకు మాస్క్లు ధరించి శనివారం రాత్రి వినాయక ఘాట్ వద్ద ఉన్న స్ట్రీట్ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారులను కలసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్, పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్యలను గెలిపించాలని కోరారు. మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ బేతంచెర్ల: చైత్ర మాసం శనివారం సందర్భంగా బేతంచెర్ల ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన లక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.12,19,345 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు, చైర్మన్ రామచంద్రుడు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం సి.బెళగల్: మండలంలోని చింతమానుపల్లె గ్రామానికి చెందిన శ్రీదేవి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన వడ్డెరాజు, శ్రీదేవి దంపతులకు మొదటి సంతానంగా రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పులో భాగంగా శ్రీదేవిని శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఆమెకు సిజేరియన్ చేయగా ముగ్గురు శిశువులకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ముగ్గురిలో ఒకరు బాలుడు కాగా.. ఇద్దరు బాలికలు ఉన్నట్లు తండ్రి వడ్డె రాజు తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య ఆలూరు: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలూరులోని కోయినగర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఈడిగ తిక్కయ్య కుమారుడు ఈడిగ మనోజ్ గౌడు(35) బతుకు దెరువు కోసం ఆలూరుకు ఐదేళ్ల క్రితం భార్య పల్లవితో కలసి వచ్చారు. రూ. 40 లక్షలతో ప్రొక్లెయిన్ కొనుగోలు చేశాడు. కుటుంబ పోషణ కోసం అధిక వడ్డీకి అప్పు చేశాడు. వాటిని తీర్చే దారిలేక శుక్రవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఉదయం నిద్రలేసేసరికి భర్త ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో పల్లవి స్థానికుల సాయంతో కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ గౌడు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి బుసినె విరూపాక్షి, నాయకులు వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ, జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరుశేఖర్, ఎంపీపీ రంగమ్మ పరామర్శించారు. సింగరాజు పల్లెలో.. కొత్తపల్లి: మండలంలోని సింగరాజు పల్లె గ్రామానికి చెందిన రైతు మద్దిరాల లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండేవాడు. రెండేళ్లుగా నష్టాలతో రూ.6 లక్షల వరకు అప్పుఅయ్యింది. ఎలా తీర్చాలో తెలియక గత నెల 27న నందికుంట సమీపంలో పురుగు మందు తాగాడు. బంధువులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు. కోలుకోలేక శనివారం మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. -
విష్ణు అనుచరులు వైఎస్సార్సీపీలో చేరిక
కోడుమూరు: మండలంలోని అనుగొండ గ్రామానికి చెందిన ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి అనుచరులు 100మంది శనివారం కోడుమూరులో కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుగొండ గ్రామానికి చెందిన విష్ణు అనుచరులు రామక్రిష్ణారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, మధుసూధన్రెడ్డిల ఆధ్వర్యంలో బోయ భాస్కర్, నరసింహులు, పరమేష్, రామాంజినేయ, సుధాకర్, మౌలాలి, మహేష్, వెంకటేష్, కంకణ, పాపన్న, బజారి, సాయిపతి, సోమన్న, కురువ నాగేష్, రాఘవేంద్రలు వైఎస్సార్సీపీలో చేరగా, వారికి కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక కోడుమూరుకు చెందిన అద్దుగల కల్యాణ్ రామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీడీపీకి చెందిన 50మంది యువకులు వైఎస్సార్సీపీ చేరగా, వారికి కుడా మాజీ చైర్మన్ అభ్యర్థి కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్రెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్కుమార్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్నాయుడు, స్థానిక నాయకులు సాజిత్ ఆలీ, మల్లారెడ్డి, మగ్బుల్, సాయి, జగదీష్, మాసుమ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement