-
పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతోంది
సంతానలేమి సమస్య కేవలం సీ్త్రలకే కాదు పురుషుల్లోనూ ఉంది. ఈ సమస్యతో బాధపడుతూ మా వద్ద చికిత్సకోసం వచ్చే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. పెళ్లయి ఏడాది దాటినా సంతానం కలగలేదంటే భార్యాభర్తలిద్దరూ వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. పురుషునికి వెరికోసి ఏమైనా ఉంటే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య తీరుతుంది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ నెలలో ఒకటి, రెండుసార్లు కలవడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. జీన్స్ ప్యాంట్ టైట్గా వేసుకోవడం వల్ల వృషణాలు ఒత్తిడికి లోనై శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. – డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి, యురాలజిస్టు, కర్నూలు అండాశయంలో గుడ్ల సంఖ్య తగ్గిపోతోంది గతంలో మా వద్దకు వచ్చే పది జంటల్లో ఒకరికి సంతానలేమి సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఆరు జంటల్లో ఒకరికి ఉంటోంది. కెరీర్పై దృష్టి సారించి వివాహం ఆలస్యంగా చేసుకోవడం, వివాహం చేసుకున్నా సంతానం కలగడాన్ని వాయిదా వేసుకోవ డం వల్ల అండంలో నాణ్యత తగ్గిపోతుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత అండాశయంలో గుడ్ల నాణ్యత, సంఖ్య తగ్గుతుంది. మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం పెరగడం వల్ల అండాల్లో కొవ్వు శాతం ఎక్కువై నాణ్యత దెబ్బతింటోంది. దీనికితోడు హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సరిగ్గా రాకపోవడం వల్ల సంతానలేమి సమస్య వస్తోంది. వివాహమై ఏడాదైనా పిల్లలు కలుగలేదంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ విజయలక్ష్మి దాసరి,గైనకాలజిస్టు, కర్నూలు -
నాణ్యత లేకపోతే విత్తన సంస్థలపై చర్యలు
● వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసిన డీఏవో కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగలో నిర్దేశించిన మేర నాణ్యత ప్రమాణాలు లేకపోతే సంబంధింత విత్తన సంస్థలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) పీఎల్ వరలక్ష్మి హెచ్చరించారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను గురువారం ఆమె తనిఖీ చేశారు. వేరుశనగ విత్తనం కాయల నాణ్యతను, మొలక శాతాన్ని కూడా పరిశీలించారు. వేరుశనగ విత్తనం కాయలను రాయితీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏపీసీడ్స్తో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. ఏపీ సీడ్స్ తెలంగాణలోని మహంకాలేశ్వర అగ్రీటెక్, కర్నూలు జిల్లాలోని శ్రీచక్రసీడ్స్, శ్రీకృష్ణసీడ్స్, శివసాయి సీడ్స్ కంపెనీల్లో వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డిలతో కలసి డీఏవో తనిఖీలు నిర్వహించారు. వేరుశనగలో నాణ్యత 100 శాతం ఉండాలని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ధనలక్ష్మిని ఆదేశించారు. కేటాయించిన మేరకు ఆర్బీకేల వారిగా వేరుశనగను సిద్ధం చేయాలని సూచించారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండి నాణ్యతలోపం లేకుండా అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాకు 13,969 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించగా... ఇప్పటి వరకు 3,500 క్వింటాళ్ల వేరుశనగను ఆర్బీకేలకు తరలించినట్లు తెలిపారు. -
ఎస్ఐ అంటూ వీరంగం
● జిరాక్స్ నిర్వాహకుడిపై దాడి ● పోలీసుల అదుపులో ఇద్దరు బొమ్మలసత్రం: తనకు తాను ఎస్ఐగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిపై దాడి చేసి వీరంగం సృష్టించిన ఘటన గురువారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉదయ్ అనే యువకుడు జిరాక్స్ సెంటర్ను నడుపుతున్నాడు. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి జిరాక్స్ చేయాలని, కాపీకి రూపాయి ఇస్తామన్నారు. అంత తక్కువకు తనకు గిట్టుబాటుకాదని ఉదయ్ వారికి తెలిపాడు. దీంతో వారిలో రామకృష్ణ అనే వ్యక్తి ‘నేను ఎస్ఐని.. నాకే ఎదురు చెప్తావా’ అంటూ దుర్భాషలాడుతూ యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని రామకృష్ణను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. రామకృష్ణ గతంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో సెక్యూరిటీగా పనిచేసేవాడని, అక్కడ విధుల నుంచి తొలగించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తనని తాను ఎస్ఐగా చెప్పుకుంటూ, అనుచరులను ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు ఇద్దరి నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సారా స్థావరాలపై సెబ్ దాడులు
కర్నూలు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సారా రవాణా, తయారీ, విక్రయాలపై సెబ్ ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు గురువారం సెబ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్త్రృత దాడులు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని సారా స్థావరాల్లో దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేసి సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కర్నూలు స్క్వాడ్ ఎస్ఐ వీరస్వామి, కోడుమూరు సెబ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిపిన దాడులలో వెల్దుర్తి మండలం ఎల్బండ తండాకు చెందిన స్వామినాయక్, రామళ్ళకోటకు చెందిన మద్దిలేటి స్వామిని అదుపులోకి తీసుకుని 25 లీటర్ల నాటుసారాతో పాటు టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ను సీజ్ చేశారు. 480 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సెబ్ సిబ్బంది హనుమంతు, శంకర్నాయక్, గోపాల్ నాయక్, వెంకటరాముడు, బషీర్బాషా, కర్నా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. -
వేరుశనగ వైపు రైతన్నల దృష్టి
వేరుశనగ సాగు ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2022–23లో ఎండుమిర్చికి ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల 2023–24లో మిర్చి రికార్డు స్థాయిలో సాగయింది. అయితే ధరలు మిర్చి రైతును నిరాశపరిచాయి. దీంతో మిర్చి రైతులు వేరుశనగపై దృష్టి సారిస్తున్నారు. వేరుశనగ సాధారణ సాగు 58,969 హెక్టార్లు ఉండగా.. 10–20 శాతం వరకు సాగు పెరిగే అవకాశం ఉంది. అయితే సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వేరుశనగ కేవలం 13,929 క్వింటాళ్లు కేటాయించారు. ఇప్పటికే పలువురు ఏడీఏలు అదనంగా వేరుశనగ కావాలంటూ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.వేరుశనగ విత్తనాలు తీసుకుంటున్న రైతు -
దుప్పిపై కుక్కల దాడి
● రక్షించిన అటవీ అధికారులు ఆత్మకూరురూరల్: అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే చుక్కల దుప్పి దారితప్పి జనారణ్యంలోకి వచ్చి ప్రమాదం బారిన పడింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ముష్టపల్లె గ్రామ శివార్లలోని పంట పొలాల్లోకి గురువారం దారి తప్పిన ఒక పొడ దుప్పి వచ్చింది. ఊర కుక్కలు వెంట పడడంతో ఆ దుప్పి ప్రాణ భయంతో గ్రామంలోకి పరుగులు తీసింది. అప్పటికే కుక్కలు దుప్పి వెనుక భాగంలో గాయపరిచాయి. పారిపోతున్న దుప్పి గ్రామంలోని ఒక బాత్ రూంలోకి జొరబడింది. దీన్ని గమనించిన గ్రామస్తులు బాత్ రూం తలుపు వేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు వన్యప్రాణి వైద్యనిపుణులు అయిన జుబేర్ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. బైర్లూటిలోని వన్యప్రాణి డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పరిశీలనలో ఉంచి అడవిలో వదిలేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆళ్లగడ్డ: పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన ప్రేమ్కుమార్ (25) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కారు డ్రైవర్గా ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి పట్టణ శివారులోని ఓ హోటల్లో భోజనం చేసి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాలు సమీపంలో అదుపుతప్పి రోడ్డు డివైర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్కుమార్ను స్థానిక వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
యువకుడిపై పోక్సో కేసు
పత్తికొండ రూరల్ : పత్తికొండలోని ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్న సుధాకర్ అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీమోహన్ గురువారం తెలిపారు. సుధాకర్ కొద్దిరోజులుగా బాలికకు మాయమాటలు చెప్పి ఫొటోలు తీసుకున్నాడు. ఫొటోలను ఫేస్బుక్, వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేసి వేలాది రూపాయల డబ్బులు లాక్కున్నాడు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాలిక తండ్రికి విషయాన్ని తెలిపింది. యువకుడిని మందలించేందుకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులపై సుధాకర్ తండ్రి చిన్ననరసప్ప, తల్లి ఈశ్వరమ్మ, కుటుంబీకులు పెద్దనరసప్పలు దాడికి పాల్పడ్డా రు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వివాహేతర సంబంధం అంటగట్టి... ● పెళ్లి చేసుకోవాలని బెదిరింపు కృష్ణగిరి: తన కుమారుడికి మరో అమ్మాయితో వివాహేతర సంబంధం అంటగట్టి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బెదిరించారంటూ మండల పరిధిలోని తొగర్చేడు గ్రామానికి చెందిన శకుంతలమ్మ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అదే గ్రామానికి చెందిన ఆరుగురిపై, కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. గతేడాది జనవరి 12న రాత్రి తాను తన కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించి తమను దుర్భాషలాడుతూ, తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ లేకపోతే చంపుతామంటూ బెదిరించా రని శకుంతలమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులు 10మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు కర్నూలు (టౌన్): రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరిని గురువారం స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోని వ్యాయామ హాలులో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి వేణుగోపాల్ ఎంపికై న లిఫ్టర్లను ప్రకటించారు. 61 కిలోల క్యాటగిరీలో ఇస్మాయిల్, రవి యువరాజ్, లక్ష్మీనరసింహ, మధుతేజ, 93 కిలోల క్యాటగిరీలో మహేష్రావు, 65 కిలోల క్యాటగిరీలో శంకర్, బాలికల 61 కిలోల విభాగంలో ధీరజ, రాధిక, జూనియర్స్ 54 కిలోల క్యాటగిరిలో వెంకటలక్ష్మి, పుష్ప, సీనియర్స్ 88 కిలోల విభాగంలో నాగమణి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంపికై న వారు ఈనెల 29 నుంచి 31 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
మంత్రాలయం.. భక్తజనసంద్రం
శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల కోలాహలం మంత్రాలయం: ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం భక్తులతో పోటెత్తింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. వేసవి సెలవులు కలిసి రావడం, రాఘవేంద్రుల ప్రత్యే క దినం గురువారం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. తుంగాతీరం, కారిడార్, శ్రీమఠం ప్రాంగణం, ప్రధాన దారులు భక్తులతో కోలాహలంగా మారాయి. రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణభోజన శాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తుల తాకిడితో కిక్కిరిశాయి. వసతి నిలయాలు, ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లు సందడిగా మారాయి. మఠం మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’
దేవనకొండ: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. కరిడికొండ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. రక్తహీనత సమస్యలున్న హై రిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి విజయభాస్కర్, వైద్య సిబ్బంది రంగస్వామి, శ్రీధర్, హనుమంతమ్మ ఉన్నారు. -
ఆ‘శక్తి’ తగ్గిపోయిందా!
● సీ్త్ర పురుషుల్లో సంతానలేమి సమస్యలు ● తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణం ● సీ్త్రలలో ఊబకాయం, పీసీఓడీ సమస్యలు ● సంతానం కోసం వైద్యుల వద్ద క్యూ కర్నూలు(హాస్పిటల్): ఆధునిక అలవాట్లు, తీరిక లేని ఉద్యోగాలు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా సంతానలేమి సమస్యల వారిని తీవ్రంగా వేధిస్తోంది. పెళ్లయి ఎంత కాలమైనా తమకు పిల్లలు కలగడం లేదని వైద్యుల వద్దకు వెళ్లే దంపతుల సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. 50 ఏళ్ల క్రితం యువతలో శుక్రకణాల సంఖ్య పరీక్ష చేస్తే 50 మిలియన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 15 నుంచి 20 మిలియన్లకు పడిపోయాయి. యువతలో శుక్రకణాలు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నాయని వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి రెండు తరాల ముందు వారు ఒక్కొక్కరు ఐదారుగురు పిల్లలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకరు చొప్పున కనేవారు. కానీ ఇప్పుడు వివాహమై నాలుగేళ్లయినా సంతానానికి నోచుకోవడం లేదు. ఈ మేరకు వైద్యుల చుట్టూ తిరగడం, వారిచ్చిన మందులు మింగడంతోనే సరిపోతోంది. మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో వివాహమైన వారిలో 25 నుంచి 30 శాతం మంది దాకా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సంతానలేమి సమస్య ఒకప్పుడు 10 జంటల్లో ఒక జంటకు ఉంటే ఇప్పుడు ఆరు జంటల్లో ఒక జంటకు ఉంటోంది. సంతానలేమి సమస్యలున్న వారు పెరుగుతుండటంతో డిమాండ్కు అనుగుణంగా కర్నూలు నగరంలో ఫెర్టిలిటీ కేంద్రాలు(సంతాన సాఫల్య కేంద్రాలు) సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మారడంతో ఇబ్బందులు మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య పోకడల కారణంగా భారతీయుల్లోనూ సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. ఒకప్పుడు జన్యుపరంగా, వంశపారంపర్యంగా సంతానలేమి సమస్యలుండేవి. అది కూడా వెయ్యిలో ఒకరో ఇద్దరో ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఆరుగురు జంటల్లో ఒక జంటను ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా మారిన జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లు క్రమేపీ మారాయి. సంప్రదాయ ఆహారం స్థానంలో జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ను ఇష్టపడుతున్నారు. అందులో వేసే చైనా సాల్ట్, పలు రకాల నిషేదిత రంగులు, వాడిన నూనెను పలుమార్లు వాడటం, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసుకుని తినడం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ను అధికంగా తీసుకోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోనడం, సరైన నిద్రలేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి తదితర కారణాలు సంతానలేమి సమస్యకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు. యువతులకు అదో పెద్ద సమస్య యువతుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణంగా పీసీవోడీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా గర్భాశయంలో నీటిబుడగలు(పీసీవోడీ) ఏర్పడటం వల్ల సంతానలేమికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొందరు చిన్న వయస్సులోనే రజస్వల అవుతుండగా మరికొందరు పదాహారేళ్లు దాటినా రజస్వల కాని పరిస్థితి నెలకొంది. పీసీవోడీ కారణంగా నెలసరి రావడంలో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నెలనెలా నెలసరి కాకపోవడంతో పాటు నెలసరి వచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతూ యువతులను ఇబ్బంది పెడుతోంది. మరికొందరికి గర్భాశయంలో సమస్యలు, లోపాలు ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా అండం పెరుగుదల, అండం విడుదల సక్రమంగా లేకపోవడం, అది ప్రయాణించే మార్గం మూసుకుపోవడం, గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం, గర్భాశయ ముఖద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. పురుషుల్లోనూ సమస్యలు ఎక్కువే! ఒకప్పుడు సంతానం కలగలేదంటే కేవలం సీ్త్రల వైపు మాత్రమే దృష్టి సారించేవారు. ఎక్కడికి వెళ్లినా ఆమెకే వేధింపులు ఎదురయ్యేవి. మూడు, నాలుగు తరాల క్రితం పిల్లలు కలగడం లేదని ఆత్మహత్య చేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం కారణంగా సీ్త్ర, పురుషులిద్దరికీ పరీక్షలు చేసే వీలు కలిగింది. దీంతో ఎవరిలో లోపం ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఇటీవల కాలంలో పురుషుల్లోనూ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల సంతానలేమి సమస్య ఉత్పన్నమౌతోందని వైద్యులు చెబుతున్నారు. వీర్యకణాలు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్కు దారి తీయడంతో పాటు ఆయువు కూడా తగ్గుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు వీర్యకణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండటం, వీర్యకణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం, హార్మోన్ల శాతంలో అసమతుల్యత, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్కు అలవాటు పడి ఉండటం, జంక్ఫుడ్ ఎక్కువగా తినడం, నిద్రలేకుండా పనిచేయడం, జన్యుపరమైన లోపాలు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల స్థూలకాయం, ల్యాప్టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వల్ల అధిక వేడి ఉత్పన్నమై సంతానలేమి సమస్యకు దారి తీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్య ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోందని వారు చెబుతున్నారు. నివారణకు ఇలా చేయాలి వీలైనంత వరకు సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇంట్లో వండిన సంప్రదాయ పిండి వంటలు, ఆహార పదార్థాలను తినాలి. జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలి. గంటల తరబడి ల్యాప్టాప్ను ఒళ్లో పెట్టుకుని పనిచేయకూడదు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. -
నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: పాలిసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను యస్జిపిఆర్ ప్రభుత్వ పాలీటెక్నిక్(బి.తాండ్రపాడు)కాలేజీలో నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ యం.వి.ఎస్.ఎస్.ఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2వ తేదీ వరకు ఆన్ౖలైన్లో https://appolycet.nic.in అనే వెబ్సైట్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700 ప్రకారం ఫీజు చెల్లించాలని తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉంటుందని, 31 నుంచి జూన్ 5వ తేదీ వరకు కాలేజీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చునని పేర్కొన్నారు. జూన్ 5న ఆప్షన్ మార్చుకునే అవకాశం ఉంటుందని, జూన్7న కాలేజీలను కేటాయిస్తారని తెలిపారు. స్పెషల్ క్యాటగిరీ(ఎన్సీసీ, పీహెచ్, క్యాప్, స్పోర్ట్స్) వారికి షెడ్యూల్ ప్రకారం విజయవాడ బెంజి సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. విద్యార్హత ధ్రువ పత్రాల పరిశీలన ఇలా.. తేదీ ర్యాంకులు 27 1 నుంచి 12 వేలు 28 12,001 నుంచి 27 వేలు 29 27,001 నుంచి 43 వేలు 30 43,001 నుంచి 59 వేలు 31 59,001 నుంచి 75 వేలు జూన్1 75,001 నుంచి 92 వేలు జూన్2 92,001 నుంచి 1,08,000 జూన్3 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు -
ఘనంగా జియారత్ వేడుకలు
కౌతాళం: జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసులో భాగంగా గురువారం జియారత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం దర్గాలో ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు చేశారు. ధర్మకర్త ఇంటి నుంచి వచ్చిన గంధంను స్వామి సమాధికి పూశారు. అనంతరం స్థానికంగా ఉన్న పక్కీర్లతో ప్రత్యేక ఖవ్వాలి పోటీలను నిర్వహించారు. పక్కీర్లు విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం బ్యాండు మేళాలు, డప్పు వాయిద్యాల మధ్య వారిని కట్టా వద్దకు ఊరేగింపు తీసుకుని వెళ్లి వదిలి వచ్చారు. సలాముల ఆలపన చేశారు. వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. -
తమ్ముడిని చంపిన అన్న
● కల్లందొడ్డి విషయంలో ఘర్షణ కోడుమూరు రూరల్: ఆస్తి విషయంలో వివాదం చెలరేగి సొంత తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఈ ఘటన కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అన్నదమ్ములైన బోయ భాస్కర్, బోయ వెంకట్రాముడు(30) గతంలోనే ఆస్తులను పంపకాలు చేసుకుని అనుభవిస్తున్నారు. అయితే కల్లందొడ్డి పంపకం విషయంలో బుధవారం రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అన్న భాస్కర్ తమ్ముడు వెంకట్రాముడును ఎద్దుల బండికుండే ఇనుప మేడితోక తీసుకుని తలపై బలంగా కొట్టట్టాడు. తీవ్ర గాయాలతో వెంకట్రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకట్రాముడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శోభతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బోయ భాస్కర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలనరసింహులు తెలిపారు. -
26 లోపు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): కౌంటింగ్కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను 26వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె ఆర్వోలు, ఏఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, కౌంటింగ్ నోడల్ ఆఫీసర్లు, స్పెషలాఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాయలసీమ యూనివర్సిటీలో చేపట్టే కౌంటింగ్ హాళ్లలో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లతోపాటు ఆర్ఓ టేబుల్, అబ్జర్వర్ టేబుల్, టేబులేషన్ టేబుళ్లు, చైర్లు, కార్పెట్లు, ఫ్లెక్సీలు, టేబుళ్లపై సైన్ బోర్డులు, అభ్యర్థుల సీటింగ్, వీవీప్యాట్ల కౌంటింగ్ బూత్లు, ఇతర అన్ని రకాల పనులను 26లోపు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ హాళ్లలో పనిచేసే సిబ్బంది నియామకాలు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్వోలకు సూచించారు. కౌంటింగ్ హాళ్లలో ఆర్వో, అబ్జర్వర్, ఏఆర్వో, కౌంటింగ్ స్పెషలాఫీసర్లు మాత్రమే మొబైల్ ఫోన్ల వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. మిగిలిన వారందరూ పార్కింగ్ సమీపంలోనే ఏర్పాటు చేసే మొబైల్ డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల నుంచి త్వరగా ఏజెంట్లను నియమించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లూజ్ బాటిళ్లలో కిరోసిన్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా అమ్మకాలు జరిగితే సంబంధిత బంకులను సీజ్ చేయాలని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ రోజూ బాణాసంచా పేల్చడంపై కూడా నిషేధం ఉందన్నారు. డ్రోన్స్ ఫ్లైయింగ్కు కూడా అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించారు. నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కౌంటింగ్ విధుల కోసం 1,200 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. వీరికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం జీఆర్సీ కన్వెన్షన్ హాలులో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్గా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. శిక్షణలో భాగంగా కౌంటింగ్ హాలులో ఓట్లను ఎలా లెక్కిస్తారో అదే విధంగా మోడల్ ఈవీఎంలను తెచ్చి కౌంటింగ్ చేయిస్తారు. ఆ సమయంలో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 60 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 10 మందికి చొప్పున ఉదయం 600 మందికి, సాయంత్రం 600 మందికి శిక్షణ ఇస్తారు. మే 31వ తేదీన రెండో విడత శిక్షణ నిర్వహించనున్నారు. జీఆర్సీ కన్వెన్షన్ హాలులో శిక్షణ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ జి.సృజన గురువారం పరిశీలించారు. ఆమె వెంట పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఆర్వోలు నారపురెడ్డి మౌర్య, భార్గవ్తేజ, ఎం.శేషిరెడ్డి ఉన్నారు.నేటిలోగా మీడియా సెంటర్ల ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): కౌంటింగ్కు సంబంధించి శుక్రవారం సాయంత్రంలోపు మీడియా, కమ్యూనికేషన్ సెంటర్లు, మోడల్ వీవీప్యాట్ కౌంటింగ్ బూతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఆర్యూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ జి.కృష్ణకాంత్, పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ్తేజలతో కలసి పరిశీలించి సంతకం పెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... లైఫ్ సైన్సెస్ బ్లాక్లోని మూడో అంతస్తులో కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ కౌంటింగ్ హాలులో మోడల్ వీవీ ప్యాట్ కౌంటింగ్ బూత్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బూత్లో సీసీ కెమెరాలను అమర్చి లైవ్ఫీడింగ్ కమ్యూనికేషన్ సెంటర్లో వచ్చేలా చూడాలన్నారు. అబ్జర్వర్లకు ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ బ్లాల్లో ఒక్కో గదిని కేటాయించి వారికి అందుబాటులో ఇంటర్నెట్, ఫ్యాక్స్, ప్రింటర్ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్వో కె.మధుసూదన్రావు, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, కూడా వైస్ చైర్మన్, వెబ్ కాస్టింగ్ నోడల్ అధికారి ప్రతాప్రెడ్డి, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్ ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన -
ముందస్తు వ్యవసాయానికి రైతులు సన్నద్ధం
● 4.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ● సాగుకు అండగా నిలుస్తున్న ఆర్బీకేలు ● ఇప్పటికే సబ్సిడీ వేరుశనగ పంపిణీకి శ్రీకారం ● పెరగనున్న వేరుశనగ, పత్తి సాగు ● ఉదారంగా పంట రుణాలిస్తున్న బ్యాంకులువిత్తనం వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతుకర్నూలు(అగ్రికల్చర్): 2023–24లో వ్యవసాయం నిరాశపరిచినప్పటికి 2024–25 కలసి వస్తుందనే భరోసా రైతుల్లో కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో విస్తరించే అవకాశం ఉండటంతో వ్యవసాయం ఊపందుకుంది. ముందస్తు వర్షాల నేపథ్యంలో రైతులు విత్తన పనులను సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల వారీగా వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద కస్టమ్ హయరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. జిల్లాలో 466 రైతుభరోసా కేంద్రాలు ఉండగా.. 100 శాతం ఆర్బీకేల్లో సీహెచ్సీలు ఏర్పాటయ్యాయి. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో రైతులు యంత్రాలు, యంత్ర పరికరాలతో ఖరీఫ్ సీజన్కు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు వ్యవసాయ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే భూసార పరీక్షలకు సంబందించి మట్టి నమూనాల సేకరణ చురుగ్గా జరుగుతోంది. చురుగ్గా వేరుశనగ పంపిణీ ఖరీఫ్లో వర్షాధారం కింద ప్రధానంగా వేరుశనగ సాగు చేస్తారు. ఈ సారి జిల్లాకు కే–6 రకంతో పాటు టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి వేరుశనగ రకాలు 13,929 క్వింటాళ్లు కేటాయించింది. 40 శాతం సబ్సిడీపై రైతులకు వేరుశనగ పంపిణీ చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నాటికి 6,244 మంది రైతులు 5,443 క్వింటాళ్ల వేరుశనగ కోసం ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికే దేవనకొండ, ఆదోని, ఆస్పరి, గోనెగండ్ల, పెద్దకడుబూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో వేరుశనగ పంపిణీ మొదలు కావడం విశేషం. 335 క్వింటాళ్ల పంపిణీ పూర్తయింది. నాణ్యమైన వేరుశనగను అందించేందుకు ఇటు వ్యవసాయ శాఖ, అటు ఏపీ సీడ్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీ సీడ్స్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3వేల క్వింటాళ్లకు పైగా వేరుశనగను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచింది. పెట్టుబడి సమస్యలను దూరం చేసిన ఇన్పుట్ సబ్సిడీ గత ఏడాది వరకు క్రమం తప్పకుండా వైఎసార్ రైతుభరోసా కింద ఖరీఫ్ ముంగిట వైఎస్ఆర్సీపీ ప్ర భుత్వం పెట్టుబడిసాయం అందించింది. 2024 ఎన్ని కల సంవత్సరం కావడంతో ఇప్పటికిప్పుడు పెట్టుబడిసాయం అందించే అవకాశం లేదు. అయితే 2023 ఖరీఫ్లో ఏర్పడిన కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఖరీఫ్ ముంగిట విడుదల చేయడం రైతులకు ఊరటనిస్తోంది. జిల్లాలో 3,48,136 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.433.30 కోట్లు విడుదలైంది. ఒక్కో రైతుకు కనిష్టంగా రూ.15 వేలు, గరిష్టంగా రూ.34 వేల ప్రకారం పెట్టుబడి రాయితీ లభించింది. -
‘విభిన్న’ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం
కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్: 8639152178, కార్యాలయ ఫోన్: 08518–277864 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆయుర్వేద ఆసుపత్రులకు మందులు కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ఆయుర్వేద ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మందులను సరఫరా చేస్తోంది. ప్రతి డిస్పెన్సరీకి అక్కడి డిమాండ్, వారు పెట్టిన ఇండెంట్కు మించి అందజేస్తోంది. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుర్వేద డిస్పెన్సరికే రూ.36లక్షల విలువైన మందులను సరఫరా చేశారు. వచ్చిన మందులను స్టోర్ చేసుకునేందుకు స్థలం చాలక వైద్యులు, సిబ్బంది పక్కనే గుట్టలుగా పేర్చాల్సి వచ్చింది. మొత్తం 120 రకాల మందులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. డ్రగ్ కంట్రోల్ ఏడీ రమాదేవి సస్పెన్షన్ కర్నూలు(హాస్పిటల్): ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి సస్పెండ్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులకు ఆమె గైర్హాజరు కావడంతో చర్యలు తీసుకోవాలని ఆ శాఖ డీజీ రఘురామిరెడ్డికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సిఫారసు చేశారు. జిల్లా అధికారిగా ఉండి ఎన్నికల విధులకు గైర్హాజరు కావడం సరికాదంటూ ఏడీ రమాదేవిని డీజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీలో పోస్టల్ బ్యాలెట్లు భద్రం కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు జిల్లా ట్రెజరీలో భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఉంచిన ప్రదేశాల్లో సీసీ కెమెరాలతో పాటు డబుల్ లాక్ సిస్టమ్ కూడా ఉందన్నారు. 24 గంటలు ఆర్మ్డ్ గార్డు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటైందన్నారు. ఎవరైనా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు భద్రత అంశాన్ని పరిశీలించుకోవాలనుకుంటే జిల్లా ట్రెజరీని సందర్శించి సీసీ కెమెరాల ఫీడ్ చూసుకోవచ్చని పేర్కొన్నారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తులు కర్నూలు(అగ్రికల్చర్): వెంకటగిరిలోని ఎస్పీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత, జౌలిశాఖ ఏడీ హరికృష్ణ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తామన్నారు. ఇతర వివరాలకు www.iihtvgr.com వెబ్సైట్ను చూ డవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 08625– 295003, 9399936872, 9866169908 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అతిథి గృహంలో గదుల ఆధునికీకరణ కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఐదు గదులను ఆధునికీకరించారు. వీ టిని గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించారు. ఆర్అండ్బీ శాఖ తరఫున నాలుగు, మునిసిపల్ కార్పొరేషన్ తరుపున ఒక్క గదిని ఆధునీకరించారు. ప్రభుత్వం తరఫున వచ్చే అతిథులకు ఈ గదులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జేసీ నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ భార్గవ్తేజ, డీఆర్వో కె.మధుసూదన్రావు పాల్గొన్నారు. -
పెరగనున్న పత్తి సాగు
ఈ ఏడాది మిరప సాగు తగ్గుతుండగా.. వేరుశనగతో పాటు పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది. ముందస్తు వర్షాలు పడుతుండటంతో రైతులు బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యాపారులు అధిక ధరలకు విక్రయించకుండా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఖరీఫ్లో పత్తి 2.50 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దాదాపు 15 లక్షల ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు అవసరమయ్యే అవకాశం ఉంది. చురుగ్గా పంట రుణాలు ● ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటికే పంట రుణాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ● ఏప్రిల్ 1 నుంచి పలు బ్యాంకులు పంట రుణాల పంపిణీ చేపట్టడం విశేషం. ● 2023–24 ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.2926.01 కోట్లు ఉండగా.. బ్యాంకులు 2,31,731 మంది రైతులకు రూ.3312.89 కోట్లు పంపిణీ చేశాయి. ● ఈ సారి ఎన్నికల కోడ్ వల్ల 2024–25 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. జూన్లో ఖరారు కానుంది. ● ముందస్తుగా వర్షాలు పడుతుండటంతో బ్యాంకులు పంట రుణాల పంపిణీని ముమ్మరం చేశాయి. ● ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్ల వరకు పంట రుణాలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్కుమార్లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
సంక్షేమంలో పదోన్నతులు
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారులుగా కొనసాగుతున్న వారికి సీనియారిటీ ప్రకారం సహాయ సంక్షేమాధికారులుగా పదోన్నతి కల్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి గ్రేడ్–1 హెచ్డబ్ల్యూల సర్వీసు వివరాలను పంపాలని ఆ శాఖ డైరెక్టర్ విజయక్రిష్ణన్ మెమో(ఆర్సీ ఏ4/2523/2024) జారీ చేశారు. పదోన్నతులకు సంబంధించి త్వరలో డీపీసీ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఏఎస్డబ్ల్యూఓ పోస్టుకు అర్హులైన గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారుల వివరాలను ఈ నెల 25లోగా పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 మంది గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారులు ఉన్నారు. వీరిలో ఎస్.వెంకటరాముడు(నెం.1 పత్తికొండ), ఎం.అంబటిరెడ్డి(నంద్యాల), డి.అబ్దుల్జలీల్(బనగానపల్లె), కేసీ రాముడు(దొర్నిపాడు), ఆర్.నాగేశ్వరరెడ్డి(ఎరుకలచెరువు), బి.బెన్నమ్మ(కర్నూలు), బి.అంకన్న(వెంకటాపురం), ఈ.వెంకటేశ్వర్లు(కంభాలపాడు), బి.రజనమ్మ(కర్నూలు), ఎ.ప్రమీలారాణి(ఓర్వకల్), ఎస్.నాగరాజు(పత్తికొండ) ఉన్నారు. వీరందరి ఏసీఆర్లు పంపే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, నిర్ణీత సమయంలోగా డీపీసీ జరిగితే రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఉన్న ఖాళీ పోస్టులు కొందరితోనైనా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే.రంగలక్ష్మిదేవి మాట్లాడుతూ డైరెక్టరేట్ కోరిన విధంగా గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారుల వివరాలను పంపుతున్నామన్నారు. -
సబ్సిడీ వేరుశనగకు చురుగ్గా పేర్ల నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు ఆర్బీకేల్లో పేర్ల నమోదు చురుగ్గా జరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 4వేల క్వింటాళ్లకు రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఏపీ సీడ్స్ 3వేల క్వింటాళ్ల వేరుశనగను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. ముందస్తు వర్షాలు పడుతుండటంతో వేరుశనగకు డిమాండ్ పెరిగింది. ఆదోని ప్రాంతంలో నాన్ సబ్సిడీ చెల్లించిన రైతులకు వేరుశనగ ప్యాకెట్లను పంపిణీ చేయడం కూడా మొదలు పెట్టడం విశేషం. -
ప్రశాంత కౌంటింగ్కు పక్కా ఏర్పాట్లు
కర్నూలు: సార్వత్రిక ఎన్నిక కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు గడువు దగ్గర పడుతోంది. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పోలింగ్ ఘట్టంలో చెదురుమొదురుగా చోటు చేసుకున్న ఘటనలు తిరిగి ఓట్ల లెక్కింపు సమయంలో పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయ్యింది. కర్నూలు శివారులోని నంద్యాల రోడ్డులో ఉన్న రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాకుల్లో ఈవీఎంలు ఉంచిన 16 స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతతో పాటు అక్కడ నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా చూసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని... పోలింగ్ అనంతరం వివిధ నియోజకవర్గాల్లో జరిగిన చెదురుమదురు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఒక పార్లమెంటు, ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల వారీగా హింసకు తావు ఉన్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ఒకటి రెండు రోజుల ముందు, ఆ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉండే ప్రాంతాలు, గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రానున్న దృష్ట్యా సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పికెట్, పోలిస్ పెట్రోలింగ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2021 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇతర రికార్డులో నిందితులను గుర్తించి వారి ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజు జిల్లాలో ఎక్కడ కూడా ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలింగ్ రోజు నుంచి జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు రోజు గొడవలు జరిగే ఆస్కారమున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రతకు ప్రణాళిక ఊరేగింపు, విజయోత్సవాల ర్యాలీలపై నిషేధం కొనసాగనున్న 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం -
రూ.21లక్షల విలువ చేసే 130 సెల్ఫోన్లు స్వాధీనం..!
డోన్ టౌన్: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్కుమార్, అస్రత్బాషా, పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్ఐ విజయ్కుమార్లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్లో దొంగలించుకొచ్చిన 130 సెల్ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్ మరియు ఎరుకలి పవన్లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్కు తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా నిజాముద్ధీన్ అలియాస్ ఖైజర్కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై సెబ్ కొరడా
● 13 ట్రాక్టర్లు, 56 మెట్రిక్ టన్నుల ఇసుక సీజ్ కర్నూలు: ఇసుక అక్రమ రవాణాపై సెబ్ అధికారులు కొరడా ఝళిపించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై నిఘా వేసి మొత్తం 13 ట్రాక్టర్లతో పాటు 56 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేశారు. సెబ్, డీటీఎఫ్, ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది బృందాలుగా ఏర్పడి కర్నూలు సెబ్ స్టేషన్ పరిధిలో 9 ట్రాక్టర్లతో పాటు 36 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసి రూ.90 వేల అపరాధ రుసుం విధించారు. నిడ్జూరు గ్రామానికి చెందిన షేక్ సుభాస్ బాషా, మునగాలపాడుకు చెందిన వడ్డె వెంకటేష్, కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన బోయ గడ్డం నాయుడు, కర్నూలుకు చెందిన శ్రీకృష్ణ, కురువ భీమలింగడు, ఎం.నాగన్న, నరేష్, బోయ నడిపి రంగస్వామిలకు చెందిన ట్రాక్టర్లతో పాటు మునగాలపాడు, జొహరాపురం ప్రాంతాల్లో అనుమతి లేకుండా హంద్రీ, తుంగభద్ర నదుల నుంచి ఇసుకను తరలించి ఒక్కో ట్రాక్టర్ రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు కర్నూలు సెబ్ సీఐ రాజేంద్రప్రసాద్, డీటీఎఫ్ సీఐ నరసనాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే ఆదోనిలో రెండు ట్రాక్టర్లతో పాటు 10 మెట్రిక్ టన్నుల ఇసుక, పత్తికొండలో రెండు ట్రాక్టర్లతో పాటు 10 మెట్రిక్ ట న్నుల ఇసుక సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్.రవికుమార్ తెలిపారు. ఇసుక అ క్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే 8008828467, 9000067587, 8328052562 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
57 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్వీఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. బుధవారం స్థానిక ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు వచ్చే నెల 1వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగం నుంచి 15,076 మంది, వొకేషనల్ విభాగం నుంచి 905 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు జనరల్ విభాగం నుంచి 6194 మంది, వొకేషనల్ విభాగం నుంచి 768 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లో విద్యార్థులు ప్రశాంతగా పరీక్షలు రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 10 కేంద్రాలకు రవాణా సదుపాయం కల్పించాలని ఇప్పటీకే ఏపీ ప్రజా రవాణా వ్యవస్థ అధికారులను కోరామన్నారు. ప్రతి కేంద్రం దగ్గర 144 సెక్షన్లో అమలులో ఉంటుందన్నారు. కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ మాత్రమే తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. విలేకరుల సమావేశంలో డీఈసీ మెంబర్లు పరమేశ్వరరెడ్డి, లాలెప్ప, ప్రభుచరణ్ పాల్గొన్నారు. జూన్ 2 నుంచి ఆన్లైన్లో మూల్యాంకనం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన అనంతరం జూన్ 2వ తేదీ నుంచి ఆన్లైన్ మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యాపకులకు బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం ఎగ్జామినేషన్ కంట్రోలర్ సుబ్బారావు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. ప్రతి అధ్యాపకుడికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ బోర్డు నుంచే కేటాయిస్తారన్నారు. పరీక్షలు ముగిసిన తరువాత స్పాట్ కేంద్రం దగ్గర సమాధాన పత్రాలు స్కాన్ చేసి ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల యూజర్ ఐడీకి ఆప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అధ్యాపకులు ఇంటి దగ్గర కానీ, వారు పని చేసే కాలేజీల్లో ఎక్కడైనా మూల్యాంకం చేయవచ్చునని, అయితే వెబ్ కెమెరాలు ఉండాలన్నారు. ప్రతి రోజు ఉదయం 8 ల నుంచి రాత్రి 7 గంటల వరకు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు. మూ ల్యాంకనానికి ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన సమాధాన పత్రాలు స్కానింగ్కి జిల్లాకు రానున్నాయి. అనంతరం ఆర్ఐఓ గురవయ్య శెట్టి మూల్యాంకనం చేసే విధానంపై అధ్యాపకులను పలు సూచనలు చేశారు. కేంద్రాల్లో గదిగదికి సీసీ కెమెరాల ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (24-05-2024)
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్పై స్టార్ జోడీ..!
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ'
ఎప్పటిలాగే ఇంకో రెండ్రోజులు ఇలాగే నిగ్రహంగా ఉంటే సరిపోతుంది సార్!
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement