-
కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. -
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
T Congressకి కొత్త తలనొప్పి తప్పదా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్కు కొత్త బాస్ ఎవరు కానున్నారు?.. సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోంది?.. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి స్థానంలో.. పార్టీకి కొత్త చీఫ్గా ఎవరు రాబోతున్నారు?. అసలు ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి అగ్ర వర్ణాలకు ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యమిస్తారా? లేక ఎస్సీ వర్గంలో సీనియర్ నేతకు ఛాన్స్ ఇస్తారా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించినవారు ఎవరు?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి...పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన హైకమాండ్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ వస్తారని తెలిపింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి గనుక.. ఫలితాలు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త నేత వస్తారంటున్నారు. రేవంత్రెడ్డి కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇక హైకమాండ్ కూడా గాంధీభవన్కు కొత్త బాస్గా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలనుంచి ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని గాంధీభవన్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
అది నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్
సాక్షి, తెలంగాణభవన్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.కాగా, కేటీఆర్ శనివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది?. ఎప్పుడు పరీక్షలు పెట్టారు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చాక 32వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి పెడితే ఆయన నియామక పత్రాలు ఇచ్చారు. ఇది రేవంత్ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు నియామక పత్రాలు ఇవ్వలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. నాలుగైదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్తో రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణకు తప్ప, వేరే రాష్ట్రానికి ఉందా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే. మేము గత పదేళ్ళలో రెండు లక్షల 32 వేల 308 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ది విషయంలో దేశంలో తెలంగాణ కంటే ముందు మరే రాష్ట్రం ఉందో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి?. ఇది నిరూపిస్తే నేను రేపు(ఆదివారం) ఈ సమయానికి రాజీనామాచ చేస్తా. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నా సవాల్కు సిద్ధమేనా?. ఒక మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంట్ పోతుంది అని ఎలా అంటాడు. ఆయన మంత్రా? జోకరా?. కేఏ పాల్ జోకర్ కాదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే జోకర్. ఆసుపత్రిలో కరెంట్ పోతే జనరేటర్ లేదా?. ఇదేం ప్రభుత్వం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు -
మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో తక్కువ సమయంలో రెట్టింపు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్కు ఓటు వేశారని అన్నారు. మేధావులందరూ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.కాగా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ నల్గొండలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదు.బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది. అదే పంథాను కాంగ్రెస్ అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనలేదు. బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. అవినీతి అక్రమాలకు సివిల్ సప్లై శాఖ అడ్డాగా మారింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద అవినీతి సివిల్ సప్లై శాఖలో జరిగింది. ఆ శాఖ నష్టాల్లో ఉండటానికి కారణం ఏంటి?. మధ్యవర్తిగా ఉన్న సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు దండుకుని ఢిల్లీకి పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన కత్తి తీయడం లేదు. ఏ రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా ముట్టిందో బయట పెట్టాలి. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి.కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు మోసం చేశారు. విద్యా, వ్యవసాయం, అన్ని రంగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేసింది. మైనార్టీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. రాములోరి అక్షింతలు, ప్రసాదాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హేళన చేస్తోంది. ఓ వర్గానికి కొమ్ముగాస్తే బీజేపీ అడ్డుకుంటుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కిషన్ లీలలెన్నో..!
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్ కూకట్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కారి్మకులతో కిషన్ రాసలీలలు బయటపడడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్తో పాటు రాసలీలల వీడియోను వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్ని సైతం సస్పెండ్ చేయాలని కూకట్పల్లి జడ్సీ అభిలాష అభినవ్కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్ఫోన్లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కారి్మకుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్నగర్ యూనిట్లో వెలుగులోకి వచి్చనా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎదుట వివరణ.. 👉 గ్రేటర్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కిషన్ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్ మిషన్ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కారి్మకులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు. 👉 తన రాసలీలల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్.. అది వైరల్ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్.. ఈ నెల 17న ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. వీడియోల లీక్పై ఆరా.. గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాళ్లు మొక్కి.. కవర్ చేసి.. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచి్చంది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కారి్మకునికి ఫోన్ ఇవ్వడం.. ప్రణయ్ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. -
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
బంజారాహిల్స్: ఆర్భాటంగా... తళుకు బెళుకుల ఇంటీరియర్తో ఆకట్టుకునే ఫర్నీచర్తో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లలో నాణ్యతా లోపాలు, అపరిశుభ్రత, గడువుతీరిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తుండటంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి ఫుడ్ సేప్టీ టాస్్కఫోర్స్ టీమ్ సభ్యులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్పేట, పంజగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో ముఖ్యంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించడంతో అధికారులు పేర్కొంటున్నారు. 👉 జూబ్లీహిల్స్లోని 16 పబ్లలో అధికారులు తనిఖీలు చేయగా దాదాపు అన్నింట్లోనూ నిల్వ చేసిన ఆహార పదార్థాలు గడువుతీరిన తరువాత కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు నిర్థారించారు. 👉ఇక హోటళ్లలోని కిచెన్లలో అపరిశుభ్రత, దుర్గంధం, దుర్వాసనలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు స్వైరవిహారం చేయడమే కాకుండా వంటలకు వినియోగిస్తున్న సామగ్రిపై వాలుతున్నట్లు కూడా గుర్తించారు. 👉 వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్లో ఒకే రాక్లో పెడుతుండడాన్ని కూడా అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో కొన్ని ఆహార పదార్థాలు బూజు పట్టి కనిపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లన్నీ బూజు పట్టిన కూరగాయలతో కనిపించాయి. 👉 చాలా ఫిర్యాదుల అనంతరం ఇటీవల కాలంలో ఫుడ్సేప్టీ అధికారులు ఆయా హోటళ్లపై తనిఖీలు చేస్తూ నాణ్యతపై ఆరా తీస్తుండగా చాలా హోటళ్లలో ఆహార పదార్థాలపై క్రిమికీటకాలు వాలుతున్నట్లుగా నిర్థారణ అయ్యింది. చెత్తా చెదారం, వ్యర్థాలు వేసే డస్బిన్లపై మూతలు కూడా ఏర్పాటుచేయడం లేదని, దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. 👉 ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న చైన్ హోటళ్లు ఉన్నాయని, అలాగే అంతర్జాతీయ స్థాయి చైన్ హోటళ్లు కూడా ఈ దుర్గంధం లోపించిన జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 👉 జీహెచ్ఎంసీ గత పదేళ్లుగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోగా హోటళ్ల యాజమాన్యాలు ఇచ్చింది పుచ్చుకుంటూ అందినకాడికి దండుకుని అటువైపు తొంగి చూడలేదు. 👉 జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17, జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్పేట, లక్డీకాపూల్ ప్రాంతాల్లో సుమారు 35కి పైగా పబ్లు, 98 రెస్టారెంట్లు, 179 హోటళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలోని ఫుడ్ సూపర్వైజర్లు ఏనాడూ తనిఖీలు చేయకపోగా పరిశుభ్రతను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా ఫుడ్సేప్టీ కమిషనర్ను ఏర్పాటుచేసి టాస్్కఫోర్స్ బృందాన్ని నియమించడంతో ఈ హోటళ్లు, పబ్లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 👉 కేఎఫ్సీ లాంటి ఇంటర్నేషనల్ చైన్ హోటళ్లలో కూడా ఈ అధికారులు దాడులు చేసి ఆహార పదార్థాల నాణ్యతపై నోటీసులు జారీ చేశారు.ఉల్లంఘించిన హోటళ్ల జాబితా..క్రీమ్ స్టోన్, నేచురల్స్ ఐస్క్రీమ్, కరాచి బేకరీ, కేఎఫ్సీ, రోస్ట్రీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్ పబ్, ఎయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, కిజిలింగ్ జో, ఖాన్సాబ్, హోటల్ సుఖ్సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, సోమాజిగూడ కృతుంగ రెస్టారెంట్, సోమాజిగూడ రెస్ట్ ఓ బార్. -
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. -
నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
నాగోలు: జనావాసాల మధ్య..ఉదయం 6 గంటలకే మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్చల్ చేశారు. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్ రోడ్డుకు కారులో వచ్చారు.కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్చల్ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్ వాక్కు వచ్చిన వాకర్స్ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో యువతీయువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నారు.వాకర్స్లో ఒకరు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా యువతి అతని వద్ద నుండి ఫోను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను కొందరు వాకర్స్ వీడియోలు తీయగా వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. . కాగా వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని తెలిసింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి హైదరాబాద్ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిమ్స్ ఆసుపత్రులపై కాంగ్రెస్ది రాజకీయం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2024 ఈనెల 26న (ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ మద్రాస్ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ పరీక్ష మ.2.30 గంటల నుంచి 5.30 వరకు జరగనుంది. గతంలో నిర్వహించిన అడ్వాన్స్డ్ పరీక్షలకు భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్టర్ కావడం విశేషం. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ కాగా ఈసారి దీనికి మించి హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా.. ఈ పరీక్షలకు అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపుగా 46వేల మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచి్చనట్లు సమాచారం. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక నుంచి కూడా ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ పరీక్షలు ముగియడం, జేఈఈ మెయిన్స్కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్డ్కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంతకుముందు.. జేఈఈ మెయిన్ను రెండు సెషన్లలోనూ కలిపి 14.10 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తున్నారు. ఇలా ఈసారి 2,50,284 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా 1.91 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇలా..అన్రిజర్వ్డ్ (ఆల్) : 97,351 అన్రిజర్వ్డ్ (పీడబ్ల్యూడీ) : 3,973 ఈడబ్ల్యూఎస్ : 25,029 ఓబీసీ : 67,570 ఎస్సీ : 37,581 ఎస్టీ : 18,780జూన్ 9న ఫలితాలు.. 10 నుంచి జోసా కౌన్సెలింగ్.. మే 31న వెబ్సైట్లో అభ్యర్థుల ప్రతిస్పందనల కాపీలు అందుబాటులో ఉంచనుంది. జూన్ 2న తాత్కాలిక జావాబుల కీ, జూన్ 3 వరకు అభిప్రాయాల స్వీకరణ, జూన్ 9న తుది జవాబుల కీ, అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించనుంది. జూన్ 10 నుంచి జోసా తాత్కాలిక సీట్ల కేటాయింపు చేపడుతుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీచేస్తోంది.బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతో పాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉంది. అలాగే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను ఐఐటీ మద్రాస్ సంస్థ అడ్మిట్ కార్డుల్లో వివరంగా పొందుపరిచింది. అవి.. ⇒ అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిరీ్ణత సమయానికి ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశానికి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ⇒అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను తీసుకురావాలి. దానితో పాటు అధికారిక ఫొటో ఐడీ కార్డునూ తెచ్చుకోవాలి. అడ్మిట్కార్డు జిరాక్స్ కాపీని ఇని్వజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి. ⇒ అభ్యర్థులు అడ్మిట్కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలిని శుభ్రం చేసుకోవాలి. ⇒ అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్కోడ్ను కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. అలాగే, పెద్ద బటన్లతోని వస్త్రాలను, ఫుల్స్లీవ్ వ్రస్తాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ⇒బాల్పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. ⇒పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలను అనుమతించరు. ⇒అభ్యర్థులు ట్రాన్స్పరెంట్ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి. ⇒అడ్మిట్కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లోని రాజీవ్గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్ఈఏపీ సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.సెట్లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్ను విడుదల చేశారు. 12 నుంచి స్లైడింగ్... ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్లో కేటాయించిన బ్రాంచ్కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి. జూన్ 8 నుంచి ఈ–సెట్ కౌన్సెలింగ్ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.కౌన్సెలింగ్ తేదీలు ఇలా... -
మేడిగడ్డ కింద అగాధం!
సాక్షి, హైదరాబాద్/ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ దిగువన అగాధం బయటపడింది. కుంగిపోయిన ఏడో బ్లాకులోని 20వ పియర్ ముందు భాగంలో గురువారం పెద్ద గొయ్యి ఏర్పడింది. అది బొరియలా బ్యారేజీ కింది వరకు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ గొయ్యి నుంచి నీటి ఊట ఏర్పడి దిగువకు ప్రవహిస్తోంది. గతంలో వరదల సందర్భంగా బ్యారేజీ పునాదుల కింది నుంచి ఇసుక కొట్టుకుపోయి.. ఒక చివరి నుంచి మరో చివరి వరకు సొరంగంలా అగా ధం ఏర్పడి ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు.దానికి సంబంధించి గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆరీ్ట) పరీక్షలు చేశారు. వాటి ఆధారంగా బ్యారేజీ కింద 12 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో అగాధం ఉండి ఉంటుందనే భావనకు వచ్చారు. ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి దానికి సంబంధించినదేనని చెప్తున్నారు. అగాధంతోనే బ్యారేజీ కుంగిపోయి.. గతేడాది అక్టోబర్ 21న భారీ శబ్ధంతో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు కుంగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమి టీని ఏర్పాటు చేసింది. బ్యారేజీని పరిశీలించిన కమిటీ.. 2019 వరదల సమయంలోనే బ్యారేజీలో సమస్యలు తలెత్తాయని.. మరమ్మతులు నిర్వహించకపోవడంతో పరిస్థితి దిగజారిందని తమ మధ్యంతర నివేదికలో పేర్కొంది. 2019 జూన్లోనే సమస్య ఏర్పడినా, బ్యారేజీలో పూర్తి నీటి నిల్వను కొనసాగించారని.. ఈ క్రమంలో బ్యారేజీపై ఒత్తిడి పెరిగి పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయిందని తెలిపింది.బ్యారేజీకి సంబంధించి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలని సూచించింది. పలు రకాల పరీక్షలు చేసిన నిపుణులు.. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోయి భారీ అగాధం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. తాజాగా బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం దీన్ని ధ్రువపరుస్తోందని అంటున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తే.. ఈ అగాధం ఏమేర ఉందనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొరాయించిన గేట్లు ఎత్తే క్రమంలో.. గత ఏడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే బ్యారేజీలోని 85 గేట్లకుగాను 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. కుంగిన బ్లాకులోని 15వ నంబర్ నుంచి 22వ నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. వాటిని అలాగే వదిలేశారు. వానాకాలం వస్తుండటంతో నీటి ప్రవాహం మొత్తంగా కిందికి వెళ్లేలా.. అన్ని గేట్లను ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవలి నివేదికలో పేర్కొంది. కుంగిన, పగుళ్లు ఏర్పడిన పియర్ల మధ్య ఉన్న గేట్లను కూడా జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. దీంతో ఈ నెల 15న 15వ గేటును ఎత్తారు. గురువారం 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయతి్నంచగా.. బ్యారే జీ కింది నుంచి భారీ శబ్ధా్దలు, ప్రకంపనలు వచ్చా యి. దాంతో గేట్లు ఎత్తే ప్రయత్నాలను నిలిపేశారు. వేగంగా అత్యవసర మరమ్మతులు నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు బ్యారేజీ వద్ద అత్యవసర మరమ్మతులు కొనసాగుతున్నాయి. బ్యారేజీ ఎగువన గేట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లను క్రేన్ సాయంతో సరిదిద్దుతున్నారు. అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నారు. షీట్ఫైల్స్ కూడా బ్యారేజీ వద్దకు చేరుకున్నాయని, వాటిని అమర్చే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడటం, మరమ్మతుల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. పునాదులకు బోర్ డ్రిల్లింగ్.. మేడిగడ్డ బ్యారేజీ కింద అగాధం ఉన్నట్టు తేలడంతో.. బ్యారేజీ ర్యాఫ్ట్ (పునాది)కు బోర్ హోల్ డ్రిల్లింగ్ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఆ రంధ్రం ద్వారా గ్రౌటింగ్ (సిమెంట్, ఇసుక మిశ్రమం నింపడం) చేయనున్నారు. కుంగిన 7వ బ్లాక్లోని 21వ పియర్ ముందు కూడా డ్రిల్లింగ్ ప్రారంభించారు. దానిద్వారా జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను కొనసాగించనున్నారుఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల అమలుపై నేడు భేటీ కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సుల అమలుకు చర్యలు మొదలయ్యాయి. దీనిపై ఈఎన్సీ (జనరల్) చైర్మన్గా నలుగురు అధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం శనివారం జలసౌధలో జరగనుంది. బ్యారేజీల రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక చర్యలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. -
మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా చల్లబడ్డ వాతావరణం కాస్తా మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంపై సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డాడు. తెలంగాణను నిప్పుల కుంపటిలా మార్చాడు. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.అలాగే మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 44.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 44.4, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 26న బంగ్లాదేశ్లో తీరం దాటనున్న తుపాను పశి్చమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్లోని ఖేర్పురకు దక్షిణ నైరుతి దిశలో 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశలోనే కదులుతూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది.క్రమంగా ఉత్తర దిక్కులో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26న అర్ధరాత్రికల్లా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలోని సాగర్ ఐలాండ్ ఖేర్పుర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ ప్రాంతంపై అతితక్కువగా ఉంటుందని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరమధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లలో) కేంద్రం గరిష్టం ఆదిలాబాద్ 42.8 మహబూబ్నగర్ 41.5 రామగుండం 41.4 నల్లగొండ 40.5 మెదక్ 40.2 హైదరాబాద్ 39.7 ఖమ్మం 39.4 నిజామాబాద్ 39.3 భద్రాచలం 37.0 హనుమకొండ 36.8 -
ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా 13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు. త్వరలో రైతు సంఘాలతో సమావేశం త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు. -
మండుతున్న కూరగాయల ధరలు..
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్.. ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. సాగు నీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.40 వరకు లభించేవి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో రూ.60–80 పలుకుతున్నాయి.గ్రేటర్కు కష్టాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడా దికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నులు వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా చార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిపి మోపెడు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమోటా కిలో రూ.15 ఉంటే ప్రస్తుతం రూ.40కి చేరింది. గతంలో పచి్చమిర్చి కిలో రూ.60 ఉండగా ఇప్పుడు రూ.120కి పెరిగింది.పావు కిలో రూ. 20కి అమ్ముతున్నారు..వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావుకిలో రూ.15 నుంచి రూ.20 చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా రూ.15 ఉండేది ప్రస్తుతం కిలో రూ.40కి అమ్ముతున్నారు. పచి్చమిర్చి పావు కిలో రూ.20కి దొరికేది. ప్రస్తుతం రూ.40కి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. – అనిత, ఎల్.బి.నగర్.ధర ఉన్నా ఫలితం లేదు.. ఎకరన్నరలో కూరగాయలు సాగు చేస్తున్నా. వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నపుడు ధర ఉండదు. – రైతు, చించల్పేట్, నవాబుపేట్ మండలంరొటేషన్ అయితే చాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలు తెస్తున్నాం. రవాణా చార్జీలు, హమాలీ, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి తక్కువ లాభంతో అ మ్ముతున్నాం. ఒక్కోసారి వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పెట్టిన పెట్టుబడి డబ్బులు రొటేషన్ అయితే చాలు అనిపించిన రోజులు ఉంటాయి. మా దగ్గర కిలో రూ.20కి కొనుగోలు చేసి వారపు సంతలో కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు. – జంగారెడ్డి, హోల్సేల్ వ్యాపారి, దిల్సుఖ్నగర్ప్రస్తుతం కూరగాయల ధరలు ఇలా.. కిలో ధర (రూ.లో) టమాటా 40 ఉల్లి 38 మునగకాడలు 40 క్యారెట్ 50 వంగ 45 బెండ 52 పచి్చమిర్చి 120 -
Bhadrachalam Nursing Student: ‘కారుణ్య’ మిస్టరీ..?
భద్రాచలంఅర్బన్: నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టగా, పరిస్థితి ఉద్రిక్తగా మారింది. పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వివరాలు ఇలా.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న పడిగిపల్లి కారుణ్య (18) గురువారం అనుమానాస్పదస్థితిలో కళాశాల భవనంపై నుంచి కింది పడింది. తీవ్ర గాయాలుకాగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. ఆందోళనకు పలు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.కళాశాల బాధ్యులపై దాడిఆందోళన సమయంలోనే కళాశాల కార్యదర్శి ఎస్ఎల్ కాంతారావు అక్కడికి రాగా, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి దాడి చేశారు. దీంతో పోలీసులు కాంతారావును కళాశాలలోని ప్రిన్సిపాల్ గదికి తరలించారు. ఈ క్రమంలో ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. యాజమాన్యం అకారణంగా విద్యార్థిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు కళాశాల వద్దకు రావాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని మృతురాలి తల్లి సునీత డిమాండ్ చేశారు. తన కూతురి చావుని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె స్నేహితురాలిని తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు, దళిత సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదంఆందోళన జరుగుతుండగానే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెబుతుండగా, దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కళాశాల యాజమాన్యంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా మధ్యవర్తుల సమక్షంలో కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షలు ఇచ్చేలా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి గురుమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.మృతిపై పలు అనుమానాలువిద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఫిట్స్తో చనిపోయిందని, హాస్టల్ మొదటి అంతస్తు పైనుంచి పడి తీవ్ర గాయాలతో మృతిచెందిందని, గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడనే వాదనలు వినిపించాయి. ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం మరో వాదన వెలుగుచూసింది. నర్సింగ్ కళాశాల నిర్వాహకుడి కుమారుడు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తనమాట వినకపోవడంతో దాడికి పాల్పడ్డాడని, దీంతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, కారుణ్య మృతికి అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. -
ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతిచి్చన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డీజీపీ రవి గుప్తాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా, సీనియర్ ఐఏఎస్ అధికారులు బి.వెంకటేశం, జితేందర్, క్రిస్టినా జోంగ్తు, వాటర్బోర్డు ఎండీ సుదర్శన్రెడ్డి, టీజీపీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.శాంతికుమారి మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రా ఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్మ్యాప్ను సిద్ధం చేసి పార్కింగ్ స్థలాలను కేటాయించాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజలకు ఎండ తగలకుండా బారికేడింగ్తో పాటు నీడ కోసం షామియానాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో పారిశు ద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను, నిరంతరాయంగా విద్యు త్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. సీఎం రేవంత్గన్పార్క్ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పంచి పరేడ్గ్రౌండ్కు చేరుకుంటారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య
కోటపల్లి: మండలంలోని సర్వాయిపేట గ్రా మానికి చెందిన ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన ఘటన మండలంలో సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేటకు చెందిన కోట రాజేశ్ (40), నాయిని చీకటి (28) కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. వెలమపల్లి జాతీయ రహదారి పక్కన గల ఇటుకల కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలో వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటుకల కంపెనీలో పనిచేసే మిగతా కూలీలు సామగ్రి భద్రపరిచేందుకు వెళ్లి గుర్తించారు. స్థానికులకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబీకులు ఇరువురి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కారణలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (24-05-2024)
-
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్తతో కత్తితో హత్య చేశాడు. మే 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు.. సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర భరద్వాజ్, అతని భార్య సాఫ్ట్వేర్ ఇంజరీర్గా పనిచేస్తున్న మధులతతో కలిసి జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు. భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేయడానికి ప్రయత్నంచగా విఫలమయ్యాడుదీంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవేవి ఫలించకపోవడంతో చివరికి తాను కత్తితో కోసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధులత తండ్రి రంగనాయకులు పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement