-
పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం
బెల్లంపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆది వారం బెల్లంపల్లి, చె న్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంటా చౌరస్తా వద్ద పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ద్రాక్ష పండ్లను తూకం వేసి అమ్ముతూ ప్రచారం నిర్వహించారు. తోపుడు బండ్ల వద్దకు వెళ్లి పండ్లను విక్రయిస్తూ ప్రచారం చేశారు. నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, 6వ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఓక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
గుడుంబా స్థావరంపై దాడులు
బెల్లంపల్లి: మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం నా టుసారా స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నాటుసారా బట్టీని ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారా స్వా ధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి వినియోగించే 20 కిలోల బెల్లం, 15 కిలోల డీఏపీ, 1200 లీటర్ల బెల్లం పానకం స్వాధీ నం చేసుకున్నారు. పాత బెల్లంపల్లికి చెందిన మనపల్లి మల్లేశ్, మనపల్లి లింగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తాళ్లగురిజాల పోలీసులకు అప్పగించారు. దాడుల్లో రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు. -
మనస్తాపంతో ఒకరి బలవన్మరణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మనస్తాపంతో ఒకరు బలవన్మరణం పొందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు లక్సెట్టిపేట మండలం బలరావుపేటకు చెందిన బొప్పు చరణ్కుమార్ (31)కు అదే గ్రామానికి చెందిన భవానితో 2020లో వివాహమైంది. దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల మృతుని భార్య మరొకరితో చనువుగా ఉంటుందని తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయమై ఇటీవల భార్య, మామ వద్ద చర్చకు రావడంతో ఇద్దరూ కలిసి చరణ్కుమార్ను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టీకానపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటింటికీ పోల్ చీటీలు
● ఓటర్లకు అందజేస్తున్న బీఎల్వోలు ● పోలింగ్ స్లిప్పులపై పూర్తి సమాచారం ● జిల్లాలో 4,56,309 మంది ఓటర్లుఆసిఫాబాద్: జిల్లాలో లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కలెక్టర్ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశా రు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కు ఈవీఎంలు, వీవీ ప్యాట్లతోపాటు అవసరమైన ఇ తర సామగ్రి సమకూర్చేందకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు కసర త్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు పోలింగ్ చీటీలు పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో బూత్స్థాయిలో పోల్ చీటీల పంపిణీ కొనసాగుతోంది. బీఎల్వోలు గడపగడపకూ వెళ్లి ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందజేస్తున్నారు. ఓటర్ స్లిప్పుపై పూర్తి వివరాలు ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని అన్ని బూత్ల్లో పోలింగ్ చీటీల పంపిణీ చేస్తూ లోక్సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నారు. ఓటర్లకు పూర్తి సమాచారం తెలిసేలా పోలింగ్ చీటీలపై నియోజకవర్గం, ఓటరు పేరు, పోలింగ్ స్టేషన్ నంబర్తోపాటు పూర్తి వివరాలు పొందుపరిచారు. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎన్నికల సంఘం చీటీలను తయారు చేసింది. జిల్లాలో 4,56,309 మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2,27,208, సిర్పూర్ నియోజకవర్గంలో 2,29,101 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 676 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సిర్పూర్లో 320, ఆసిఫాబాద్లో 356 కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లలో విద్యుత్, తాగునీరు, దివ్యాంగులకు ర్యాంపులతో పాటు అన్ని రకాల వసతుల కల్పిస్తున్నారు. 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు హోంఓటింగ్కు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. జిల్లాలో హోం ఓటింగ్ కోసం 157 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఆసిఫాబాద్లో 29 మంది, సిర్పూర్లో 128 మంది ఇంటి నుంచి ఓటు వేయనున్నారు. -
విద్యుత్ షాక్తో బాలుడు మృతి
సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లిలో శనివారం సాయంత్రం విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందాడు. ఎస్సై డీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం వేంపల్లి గ్రామానికి చెందిన ఆడె శంకరాబాయి కుమారుడు డేవిడ్ (18 నెలలు) ఇంటివద్ద ఆడుకుంటూ పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వెళ్లడంతో విద్యుత్ వైర్లను తాకి అక్కడే పడిపోయాడు. గమనించిన తల్లి కుమారుడిని పట్టుకోవడంతో ఆమెకు సైతం విద్యుత్షాక్ తగిలి స్పృహ కోల్పోయింది. గమనించిన గ్రామస్తులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చిన్నారిని కాగజ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆడె శంకరాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రశాంతంగా ‘నీట్’
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement