-
టీడీపీ కుట్ర రాజకీయం
ములకలచెరువు: ఓటు బ్యాంకు రాజకీయాలు టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలి, ప్రజల్లో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను ఏదో విధంగా అడ్డుకోవాలి, గొడవలకు ప్రేరేపించి ప్రచారాన్ని అడ్డుకుంటే వైఎస్సార్సీపీ నాయకులు సహనం కోల్పోయి గొడవలకు దిగుతారు, తద్వారా తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. వైఎస్సార్సీపీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇది తెర వెనుక పచ్చ నాయకులు చేస్తున్న కుట్రలు. ఇందుకు అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాదరణను చూసి జీర్ణించుకోలేక అక్కడక్కడ టీడీపీ సానుభూతి పరులు కుట్రలు పన్నుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్తి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకగా మారింది. ఎలాగైనా ప్రజల్లో చెడ్డుపేరు తెచ్చేందుకు టీడీపీ సానుభూతి పరులు డ్రామాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగానే ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగోళ్లపల్లెలో ఆదివారం తెరలేపారు. ఈ పల్లెలో సుమారుగా 30 కుటుంబాలు ఉంటాయి. గతంలో 70 శాతం టీడీపీకి చెందినవారే. 20 ఏళ్లుగా ఈ ఊరికి తారు రోడ్డులేదు, సీసీ రోడ్లు, తాగునీటి బోరుసైతం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కుటాగోళ్లపల్లెకు వెళ్లిన ఎమ్మెల్యేకు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీచేసి పనులు పూర్తి చేయించారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యలు పరిష్కరించడంతో అక్కడి ప్రజలు వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారారు. దీంతో ఓర్వలేక కొందరు టీడీపీ వారు అప్పుడప్పుడు గ్రామంలో గొడవలు లేపేవారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో వేపూరికోటలో ప్రచారం ముగించుకొని కుటాగోళ్లపల్లెలోకి వెళ్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి భార్య కవితమ్మ ప్రచారం మొదలు పెట్టారు. కళ్యాణి అనే మహిళకు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంతలోనే కళ్యాణి అనే మహిళ మా ఊరిలో తాగునీరు రాలేదు, వీధి లైట్లు లేవని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తర్వాత పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్కనే ఉన్న గ్రామ సర్పంచ్ సునీతమ్మ సైతం ఆదేమాట చెప్పారు. ముందుగానే పథకం రచించిన టీడీపీ సానుభూతిపరులు కళ్యాణి ఆమే భర్త మల్లికార్జును అడ్డుపెట్టుకొని పలువురు గొడవకు దిగారు. పరిష్కరించకపోతే మీరు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారు అంటూ అత్యుత్సాహం ప్రదర్శిచారు. గ్రామస్తులు అదుపు చేయడానికి వారించినా లెక్క చేయకుండా వైఎస్సార్సీపీ వారిపైకి దూసుకొచ్చారు. గంట పాటు వారు కేకలు వేస్తూ ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. సమాచారం అందుకున్న ఎస్ఐ తిప్పేస్వామి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని నిలవరించే పనిలో నిమగ్నమయ్యారు. అయినా పోలీసుల మాటలు సైతం పట్టించుకోకుండా ఘర్షణను తలపించేలా చేశారు. ఈ ఘర్షణ వాతావరణంలో తోపులాటలో కళ్యాణి(28) కిందపడిపోయింది. ఇంక చేసేదిలేక కల్యాణిపై దాడి చేశారంటూ 108ను పిలిపించి మదనపల్లె జిల్లా హాస్పిటల్కు తరలించి డ్రామాకు తెర లేపా రు. అక్కడి వైద్యులు చికిత్స చేసి సురక్షితంగా ఉందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి భార్యపై అనవసరంగా గొడవకు దిగిన మహిళ వైఎస్సార్సీపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్లాన్ కుటుంబ సభ్యుల తోపులాటలో కిందపడిన మహిళ పోలీసుల రంగప్రవేశంతో ఆసుపత్రికి తరలించి దాడి చేశారని డ్రామాకు తెరలేపిన టీడీపీ నాయకులు -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం న్యాయపోరాటం
రాజంపేట రూరల్ : అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు పోరాటాలు కొనసాగిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసులు తెలియజేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం సుబ్బరాజు అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ పేరిట వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, బాధితులకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయా లని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లం కొండ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏఐటీయూసీ రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి ఎంఎస్ రాయుడు, ఎఐటీయూసి పట్టణ కార్యదర్శి ఈ సికిందర్, కరణం మల్లికార్జున, పెంచలయ్య, మల్లిక, నదియా, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్, ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్ తెలిపారు. ఆదివారం రాయచోటి డైట్ కళాశాల, పీలేరు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటింగ్ సరళిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పీలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం చేసిన ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి వివరించారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది, అత్యవసర సేవలు అందించేవారు ఈనెల 6వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ● జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,388 మంది పోస్టల్ బ్యాలెట్కు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 10,230 మంది ఓటును వినియోగించుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 71.10 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్లో 3188 మందికి గాను 1445 మంది మాత్రమే ఓటు వేయడంతో 45.33 శాతంగా నమోదైంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రాయచోటిలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొంత మంది ఓట్లు కనిపించలేదని కలవర పడినా తర్వాత ప్రశాంతంగా పోలింగ్ నడిచింది. నియోజకవర్గం మొత్తం ఓటు పోలింగ్ ఓటర్లు వేసినవారు శాతం 14389 మందికి 10230 మంది ఓటుహక్కు వినియోగం జిల్లాలో 71.10 శాతం పోలింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రాజంపేట 547 1386 89.59 రైల్వేకోడూరు 1114 899 80.70 రాయచోటి 2250 1894 84.18 తంబళ్లపల్లె 1504 998 66.36 పీలేరు 2434 1702 69.93 మదనపల్లి 2352 1906 81.04 -
నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
రాయచోటి: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈనెల 5, 6 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ కోరారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లకు మే 5న, పోలీసు శాఖ అలాగే 33 అత్యవసర సేవల ఉద్యోగులకు మే 6న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా 5వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారు 6వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి రామాపురం: జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని నల్లగుట్టపల్లెలో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మండలంలోని మేరదపల్లె చెక్పోస్టును తనిఖీ చేసి అక్కడి రిజిస్టర్ను పరిశీలించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగస్వామి, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
●వలస నేతలను నమ్మొద్దు
ఓబులవారిపల్లె: చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం హైదరాబాదు నుంచి వలస వచ్చారు.. ఎన్నికలు అయిపోగానే మళ్లీ సొంత గూటికి వెళ్లిపోతారు.. అందుకే అలాంటి వారిని నమ్మొద్దు. స్థానికంగా ఉంటూ ప్రజలకు అండగా ఉండేవారికి ఓటు వేయండి.. అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఓబులవారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫామ్ హౌసుల్లో దాక్కున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నీరు చెట్టు పేరుతో టీడీపీ నాయకులకు దోచిపెట్టరన్నారు. అనంతరం సీనియర్ నాయకుడు ఓజీ శ్రీనివాసులు రెడ్డి స్వగృహంలో అల్పాహారానికి హాజరయ్యారు. . ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డైరెక్టర్ వత్తలూరు సాయికిషోర్రెడ్డి, సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు టి. కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు సుబ్రమణ్యంరెడ్డి, శ్రీధర్రెడ్డి, సినీ ఫొటోగ్రఫీ డిస్ట్రిబ్యూటర్ ఓజీ రఘురామిరెడ్డి, వైస్ ఎంపీపీ కొమ్మూరు నరసింహారెడ్డి,చిత్తూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ త ల్లెం భరత్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
పంజాబ్కు బ్రేకులు వేసిన సీఎస్కే
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement