-
రెండు దుకాణాల్లో చోరీ
పోరుమామిళ్ల : పట్టణంలోని ప్రధాన రహదారిలోని రెండు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి దొరికింది దోచుకెళ్లారు. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ప్రభుత్వ కళాశాలకు ఎదురుగా ఉన్న ‘ఓంకార్ ఎలక్ట్రానిక్స్’ షాపు షట్టర్ పైకి లేపి.. లోపలున్న దాదాపు రూ.90 వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు యజమాని ఆర్.వెంకటసుబ్బయ్య తెలిపారు. రెండో అంతస్తులోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తీగలు కోసి తీసుకెళ్లారు. సంఘటన జరిగిన తీరు గమనిస్తే దొంగలు రెక్కీ నిర్వహించి ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుకాణంలో టీవీలు, ఇతర విలువైన వస్తువులు పోలేదని, డబ్బు కోసమే చోరీ చేశారని బాధితుడు వెంకటసుబ్బయ్య వివరించారు. రహదారిపై సీసీ కెమేరాలను పరిశీలిస్తే ముగ్గులు వ్యక్తులు వచ్చినట్లు రికార్డయిందని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ‘ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్’ షట్టర్ను పైకి లేపి పెట్టెలోని రూ.7 వేల నగదు తీసుకున్నారు. దీంతోపాటు రెండు స్ప్రే బాటిల్లు, పిస్తా పాకెట్ తీసుకెళ్లారని, ఇతర వస్తువులు, సామగ్రి ఏవీ పోలేదని యజమాని దాదాపీర్ తెలిపారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ కట్ చేసి తీసుకెళ్లారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
కడప అర్బన్ : మోటార్ సైకిల్ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడడంతో శేషం ఈశ్వర ప్రసాద్(12) మృతి చెందాడు. కడప నగర శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని ఆర్పీఎస్ నగర్లో నివాసముంటున్న శేషం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రసాద్, సోదరుడితో కలిసి మోటార్ సైకిల్పై ఈ నెల 17న ఎర్రముక్కపల్లికి వచ్చారు. తిరిగి అదే వాహనంలో తిరిగి వస్తుండగా, పీఎఫ్ కార్యాలయం వద్ద మరో మోటార్ సైకిల్ను తప్పించబోయి వారి వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలుడు, అతని తండ్రిని కడప రిమ్స్కు 108లో తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈశ్వరప్రసాద్ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్టౌన్ ఎస్ఐ రంగస్వామి తెలిపారు. -
హెచ్ఐవీ బాధితులకు అండ.!
మదనపల్లె సిటీ: హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వ్యాధి నివారణకు చర్యలు చేపడుతోంది. వ్యాధిగ్రస్తులకు ఐసీటీసీ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనోధైర్యం కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ సంస్మరణ దినం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది హెచ్ఐవీ/ఎయిడ్స్తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ, సంఘీభావం తెలియజేద్దాం.. వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దాం.. అనే నినాదం ఇచ్చారు. వ్యాధితో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తారు. ● హెచ్ఐవీ/ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి ఏఆర్టీ (యాంటీ రిట్రోవైరల్) కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఆత్మసైర్థ్యాన్ని నింపేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను అందిస్తున్నారు. జిల్లాలో మదనపల్లెలో ఏఆర్టీ కేంద్రం ఉంది. దీంతో పాటు రాయచోటి, పీలేరు ఏఆర్టీ ప్లస్, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, వాల్మీకిపురం, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరులలోని ప్రభుత్వ సీహెచ్సీలలో లింక్ ఏఆర్టీ కేంద్రాలున్నాయి. ఆయా ఐసీటీసీ కేంద్రాల్లో నిర్వహించే రక్తపరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తేలితే వారికి కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. వారందరిని ఏఆర్టీ కేంద్రాల్లో నమోదు చేసి మందులు అందజేస్తారు. నేషనల్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఐవీ వచ్చాక బాధపడేకన్నా దాని బారిన పడకుండా చూసుకోవాలని పలు కార్యక్రమాలతో చైతన్యం పెంచుతున్నారు. గతంతో పోలిస్తే బాధితులకు మందులు సకాలంలో అందిస్తుండటంతో ఆరోగ్యం మెరుగవుతోంది. ఏటా పరీక్షల సంఖ్యను పెంచుతూ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నారు. హెచ్ఐవీ పాజిటివ్ గల గర్భిణికి ముందుగా పీపీటీసీటీ చికిత్స అందిస్తూ పుట్టబోయే బిడ్డను ఎయిడ్స్ నుంచి కాపాడే ప్రయత్నాలు జిల్లాలో జరుగుతున్నాయి. పోషకాహారం: బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటోంది. వారికి పింఛన్తో పాటు పలు సంస్థల సహకారంతో పోషకాహారం అందిస్తున్నారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఐసీటీసీ కేంద్రాలు మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట,తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు ఏఆర్టీ కేంద్రం: మదనపల్లె కౌన్సెలింగ్తో మనోధైర్యం ఉచితంగా మందులు పంపిణీ అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. బాధితులకు అండగా నిలుస్తున్నాం. వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. ఆదివారం సాయంత్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవ్వొత్తులు వెలిగించి మరణించిన వారి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తాం. –డాక్టర్ శైలజ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, రాయచోటి -
వంద శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలి
రాయచోటి అర్బన్: వంద శాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్యమిషన్ పర్యవేక్షణ అధికారి(డీపీఎంఓ) డాక్టర్ రియాజ్బేగ్ అన్నారు. శనివారం పట్టణంలోకి కొత్తపల్లె పీహెచ్సీ పరిధిలోని రెడ్డీస్ కాలనీ సచివాలయంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని ఆయన డీఎన్ఎంఓ విష్ణువర్దన్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారుల జాబితా ప్రకారం వారికి ముందస్తుగా సమాచారం అందించి వారు కచ్చితంగా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. శిశువుల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గురించి తల్లులను అడిగి తెలుసుకోవాలన్నారు. అవసరమైతే వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. మరీ అవసరమనుకుంటే ఏరియా ఆసుపత్రిలోని చిన్నపిల్లల నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం అందించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. 20 నుంచి జేవీవీ వేసవి శిక్షణా శిబిరం కడప కల్చరల్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రత్యేకంగా ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏడీ దేవదత్తం తెలిపారు. శనివారం రామకృష్ణనగర్లోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శిబిరం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో సంస్థ ఆధ్వర్యంలో విజ్ఞాన దాయకమైన శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. -
అగ్రిమెంట్ లీజ్ విషయంపై గొడవ
ఓబులవారిపల్లె : మంగంపేట స్నేహ మినరల్స్ కంకర క్రషర్ మిల్లు లీజు అగ్రిమెంట్ వివాదంలో జరిగిన గొడవపై నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహ మినరల్స్ క్రషర్కు సంబంధించి తిరుపతికి చెందిన బాబ్జీ గునిపాటి రాయుడు వద్ద మూడు సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకున్నాడు. ఇరువురి లావాదేవీలపై వ్యత్యాసం రావడంతో కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. శనివారం గునిపాటి రాయుడు తన వర్గీయులతో కలిసి క్రషర్ను అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గునిపాటి రాయుడు, ఆయన డ్రైవర్ సుదర్శన్, లీజు దారుడు బాబ్జీ, ఆయన డ్రైవర్ భానుప్రకాష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పీ సీరియస్కడప అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున రాత్రి 8 గంటల సమయంలో కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్లో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కఠిన చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్ల వర్షం కురిపించుకున్నా.. చర్యలు తీసుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నారని.. కడప వన్టౌన్ సీఐ సి భాస్కర్రెడ్డి, ఎస్ఐలు తిరుపాల్నాయక్, ఎర్రన్న, మహమ్మద్రఫీ, ఆలీఖాన్, రంగస్వామిలకు ఛార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. కడప వపోలీసు అధికారులతో శనివారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
No Headline
మదనపల్లె సిటీ: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి ఐటీఐలు. కావాల్సినంత భరోసానిస్తూ బంగారు భవితకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెలకువలపై పట్టు సాధిస్తుండటంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్పల్పకాలిక వ్యవధిలోనే జీవితాల్లో స్థిరపడుతూ కుటుంబాలకు దన్నుగా నిలుస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు: జిల్లాలో పలు ఐటీఐలు సంప్రదాయ కోర్సులతో పాటు ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. జిల్లా ప్రభుత్వ ఐటీఐలో టర్న ర్, మెషనిస్టు, ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సు లు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలైన బీహెచ్ఈఎల్, అమరరాజా, బీఈఎల్, ఐఓసీఎల్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటీస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్కటి మార్గంగా ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో దోహదం చేస్తుంది. కోర్సుల వివరాలు ఇలా.. ప్రభుత్వ,ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండు సంవత్సరాలకు సంబంధించిన పలు కోర్సులు ఉన్నాయి. ఇందులో రెండు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాప్ట్మెన్ సివిల్, టర్నర్, మిషనిస్టు కోర్సులు ఉన్నాయి. ఏడాదికి సంబంధించి కంప్యూటర్ కోర్సు(కోప), డీజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ కోర్సులు ఉన్నాయి. ఉన్నత చదువులకు అవకాశం ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటిక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటర్ ఎంట్రీని పొంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. -
ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట బందోబస్తు
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 1 నుంచి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఉండదు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణల్లో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘర్షణలకు బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అవసరమైతే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. 144 సెక్షన్ అమలు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను మూడంచెల భద్రత మధ్య భద్రపరిచారు. ప్రత్యేక బలగాలతో 24 గంటలపాటు నిఘా కొనసాగుతోంది. జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ శాంతియుతంగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల రేడియస్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారు. -
No Headline
పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు వచ్చి చేరుతోంది. ఆనకట్ట నుంచి కుందూనదిలో 862 క్యూసెక్కులు పోతున్నట్లు కేసీ కెనాల్ అధికారులు తెలిపారు. 20 రోజుల కిందట అవుకు రిజర్వాయర్ నుంచి పాలేరు వాగు ద్వారా రాజోలి ఆనకట్ట నుంచి కుందూనదికి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి కుందూ నదిలో నీరు అరకొరగా ప్రవహిస్తోంది. ఆ నీటితో పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటి అవసరాలు తీరాయని రైతులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం నీటితో శనివారం రాజోలి ఆనకట్ట నుంచి కుందూ నదిలోకి నీరు పోవడంతో జలకళ సంతరించుకుంది. –రాజుపాళెం -
భక్తి శ్రద్ధలతో సీతమ్మ జయంతి పూజలు
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలో కొలువైన కోదండ రామాలయంలో శుక్రవారం సీతాదేవి జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రంగమండపంలో భక్తి శ్రద్ధలతో అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్ వారు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, వేద పారాయణం పూజలు చేశారు. మల్లెలతో అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, వీజీవో బాల్రెడ్డి, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, నవీన్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక మదనపల్లె : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం మదనపల్లెకు రానున్నారు. రూరల్ మండలం పోతబోలు పంచాయతీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొంటారని తెలిసింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం బెంగళూరు నుంచి మదనపల్లెకు చేరుకుని, నేరుగా శిక్షణా శిబిరం వద్దకు వెళతారని, అక్కడే నాలుగురోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి కావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతా ఏర్పాట్లలో స్థానిక పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయన విడిదిచేసే పాఠశాల ప్రాంగణం, చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. డీఎస్పీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యటనపై మీడియాకు సమాచారం లేదు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
చిన్నమండెం : మండలంలోని కేశాపురం జామాయిలచెట్ల వద్ద అనుమానాస్పదంగా గణేష్(హిజ్రా) మృతి చెందినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. రాయచోటి–మదనపల్లె జాతీయ రహదారిలో కేశాపురం గ్రామ పంచాయతీ ఆంజనేయస్వామి గుడి వెనుక గల జామాయిల్ చెట్ల వద్ద గణేష్(హిజ్రా) మృతదేహం గుర్తించిన స్థానికులు అటవీ, పోలీసు అధికారులకు సమాచారం అందించారన్నారు. గుర్రంకొండ మండలం నడిమి కండ్రికకు చెందిన గణేష్(హిజ్రా)గా గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారన్నారు. ఈ మేరకు మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పరిశీలించారు. స్థానిక శ్రీసాయి ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించడంతోపాటు అక్కడ ఏర్పాటైన భద్రతా వ్యవహారాలపై ఆరా తీశారు. రాజంపేట పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ను జాగ్రత్తగా భద్రపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అక్కడ రిజిష్టర్లో కలెక్టర్, ఎస్పీలు సంతకాలు చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లో భద్రతా, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాయి ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, మొబైల్ టీమ్, సీఆర్పీఎస్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజలు ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా తమ వంతు సహకారం అందించాలని ఎస్పీ కోరారు. మూడంచెల భద్రత... కేంద్ర బలగాల పహారాపై ఆరా -
శరణమయ్యా.. బ్రహ్మయ్యా
బ్రహ్మంగారిమఠం : ‘మీ దరికి చేరామయ్యా.. మమ్మల్ని దీవించయ్యా..’ ‘శరణమయ్యా.. బ్రహ్మయ్యా’..అంటూ జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సమాధిని దర్శించుకుని భక్తజనం తరించారు. ఇంటింటా పండగను ఆనందంగా జరుపుకొన్నారు. క్రీ.శ.1693కు సరియగు శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట పొందిన వీరబ్రహ్మేంద్రస్వామిని ఏటా కొలుస్తూ భక్తులు పర్వదినంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా సజీవ సమాధి నిష్ట వహించిన ప్రాంతం బ్రహ్మంగారిమఠంలో ఆరాధన గురుపూజోత్సవాలు నాలుగు రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా జనం తరలిరావడంతో ఆవరణంతా కిటకిటలాడింది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు ‘జై వీరబ్రహ్మ.. జై గోవిందమాంబ’ నామస్మరణ చేశారు. కమనీయం.. దీక్షాబంధనాలంకారోత్సవం తెల్లవారుజామున గర్భాలయంలో మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనా మూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక వ్రస్తాలంకరణ చేసి స్వామి గుణగణాలను కీర్తిస్తూ సహస్ర నామార్చన చేశారు. స్వామి యోగ నిద్రలో ఉన్న అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం దీక్షబంధనాలంకారోత్సవాన్ని (స్వామి సజీవ సమాధి నిష్ట వహించిన సందర్భాన్ని దీక్షలో దర్శించే అలంకరణ) కనుల పండువగా నిర్వహించారు. వాసుదేవపురానికి చెందిన ఇరగంరెడ్డి మూలింటి నాగిరెడ్డి, వెంకటమ్మ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం వేదపారాయణం చేసి కాలజ్ఞానంలోని కొన్ని తత్వాలను ఆస్థాన పండితులు పెదపాటి నాగేశ్వరరావు వివరించారు. వైభవం.. నందివాహనోత్సవం రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నందివాహన గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి స్వామి నివశించిన ఇంటి వరకు చేర్చి.. అనంతరం కందిమల్లయ్యపల్లె పుర వీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. ఉత్సవానికి కమలాపురం నియోజకవర్గం పెద్దపుత్తకు చెందిన తాడిగొట్ల వీరారెడ్డి, నారాయణరెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలు అన్నదానాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ విరివిగా చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంగీత కళాశాల విద్యార్థులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. వీరబ్రహ్మేంద్రస్వామిని స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు ఎస్.అశోక్రెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డితోపాటు నాయకులు దర్శించుకున్నారు పూర్వపు మఠాధిపతులు వీరభోగవసంత వెంకటేశ్వర స్వామి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రయ్యస్వామి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, గోవిందస్వా మి, వరదరాజస్వామి తదితరులు పాల్గొన్నా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం ఫిట్ పర్సన్ శంకర్బాలాజి,వే ునేజర్ ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది, స్వామి శిష్యులు ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నేడు బ్రహ్మ రథోత్సవం వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజో త్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం సాయంత్రం బ్రహ్మ రథోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. వైభవంగా ఆరాధనోత్సవాలు పోటెత్తిన భక్తజనం మార్మోగిన ‘బ్రహ్మ’నామస్మరణ -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
రామసముద్రం : తాగుడుకు బానిసైన భర్తను.. భార్య మందలించడంతో విషపూరిత ద్రవం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక వివరాల మేరకు.. రామసముద్రం మండలం ఎం.గొల్లపల్లికి చెందిన మధు(26) రామసముద్రంలో బంగారు నగలకు మెరుగులు దిద్దే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం తాగే అలవాటు పడిన మధు ఈ నెల 14వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగుడు మానని భర్తను.. భార్య మందలించింది. మనస్తాపం చెందిన మధు 15వ తేదీన ఇంటి నుంచి బయటికి వచ్చి తిరిగి వెళ్లలేదు. దీంతో భర్త భార్య శ్వేత తన భర్త కనిపించడం లేదని ఈ నెల 16వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామసముద్రం దారిలో మధు మృతదేహం పోలీసులు గుర్తించారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగునీటి కోసం ఘర్షణ చిన్నమండెం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మల్లూరు క్రాస్ వద్ద శివారెడ్డి, చిన్నప్పలు తాగునీటి ట్యాంక్ వద్ద ఘర్షణ పడినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. ఆయన కథనం మేరకు ..శుక్రవారం ఉదయం శివారెడ్డి, చిన్నప్పలు తాగునీటి ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్ వద్ద గేట్ వాల్వ్ ఆపేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పొట్టకూటికోసం వెళ్తూ.. ఒకరు మృతి రామాపురం : పొట్టకూటి కోసం వెళ్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలంలోని కర్ణపువాండ్లపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. కర్ణపువాండ్లపల్లెకు చెందిన కడప బాషా(56) ప్రతి రోజూ చింత చిగురు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున బైక్పై చింత చిగురు తీసుకుని కడప మార్కెట్కు వెళ్లి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో మూలవంక పెట్రోల్ బంక్ వద్ద బైక్ నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి. కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసకున్న లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. అతడి భార్య కువైట్కు బ్రతుకుతెరువు కోసం వెళ్లిందని, భర్త మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కూలీ..సుండుపల్లె(రాజంపేట) : మండలంలోని రాయవరం దిగువ జంగంపల్లెకు చెందిన ఉపాధి కూలీ సంబెట అమరావతమ్మ( 60) శుక్రవారం ఎండను తాళలేక మృతి చెందారు. ఉపాధి పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా భానుడు ప్రతాపానికి తట్టుకోలేక కుప్పకూలిపోయింది. స్ధానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఉపాధి హామీ పథకం ఏపీవో మాలిక్బాష ధృవీకరించారు. -
పనుల్లో అలసత్వం కుదరదు!
బి.కొత్తకోట: పుంగనూరు ఉపకాలువ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలసత్వంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్వరమే పనులు చేపట్టాలని, సంబంధిత పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించాలని కోరుతూ హంద్రీనీవా ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్.రాజగోపాల్ కాంట్రాక్టు సంస్థకు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం శుక్రవారం తెలిసింది. అన్న మయ్య, చిత్తూరుజిల్లాలో సాగే ఏవీఆర్ హం–ద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వనించింది. అన్నమయ్యజిల్లా పి.టి.యంమండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువపై కిలోమీటర్ 79.600 నుంచి చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటర్ 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వనించింది. రెండు కంపె నీలు పోటిపడగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభు త్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువతో రూ.1,217,49,40,146.53తో టెండర్ దక్కించుకోగా ఒప్పందం జరిగింది. దీంతో కాంట్రాక్టు సంస్థ మదనపల్లె పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే సమ్మర్స్టోరేజీ ట్యాంకులైన చిప్పిలి, గుంటివారిపల్లె పనులు చేపట్టింది. ఇందులో చిప్పిలికి సంబందించి రూ.10 కోట్ల విలువైన ప్రొటెక్షన్ బండ్, మొరవ తదితర పను లు చేసింది. గుంటివారిపల్లెకు సంబంధించి మొరవ పనులు చేయాల్సి ఉంది. అయితే పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులకు సంబంధించి పనులు మొదలవలేదు. దీంతో తక్షణమే పనులు చేపట్టాలని కోరుతూ ఎస్ఈ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒప్పందం మేరకు పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు. పనులకు సంబంధించి ఇన్వేస్టిగేషన్, భూ సేకరణ, డిజైన్స్, డ్రాయింగ్లను సమర్పించాలని కోరారు. కృష్ణా జలాలను గండికోట రిజర్వాయర్ నుంచి తరలించాలంటే ఈ కాలువ వెడల్పు పనులు పూర్తి కావాల్సి వుంది. దీనిపై ఎస్ఈ రాజగోపాల్ మాట్లాడుతూ నోటీసులు జారీ చేసి పనులు చేపట్టాలని కోరినట్టు చెప్పారు. పీబీసీ వైడనింగ్ కాంట్రాక్టర్కు నోటీసు -
ఉపశమనం!
సాక్షి రాయచోటి: వేసవి తాపంతో రగిలిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం కనిపించింది. ఫిబ్రవరి నుంచి సూర్యభగవానుడు ప్రచండ నిప్పుల ధాటికి విలవిల్లాడిపోయారు. ఈసారి 43–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయ నాయకులు దాదాపు రెండు నెలలుగా మండుతున్న ఎండల్లోనూ ప్రచారాన్ని కొనసాగించారు. ఎండ దెబ్బతో బయటికి వెళ్లే పరిస్థితి లేకపోయినా తప్పని పరిస్థితులతో ప్రజల్లో తిరుగుతూ కనిపించారు. ఇంతటి ఉక్కపోత పరిస్థితుల నుంచి వాతావరణం మారడంతో చల్లదనం నింపుతూ వర్షం పలకరింపుతో ప్రజ లు కాస్తంత సేద తీరుతున్నారు.అన్నమయ్య జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పోలింగ్కు రెండు రోజుల ముందునుంచి జిల్లాలో ఎక్కడో ఒకచోట గాలులతోపాటు వర్షం కరుస్తోంది. దానికితోడు నెలాఖరుకు రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో జనాలకు ఉపశమనం కలిగించే అంశమని చెప్పవచ్చు. పోలింగ్తో తగ్గిన రాజకీయ వేడి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ఎర్రటి ఎండలో పోరాడిన రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు పోలింగ్తో రాజకీయ వేడి చల్లారింది. మరోవైపు ఇదే పోలింగ్ సమయానికి సూర్యభగవానుడు శాంతించాడు. దీంతో అటు రాజకీయ వేడి...ఇటు భానుడి భగభగలు రెండూ ఒకే సమయానికి తగ్గిపోవడం విశేషం. పైగా అదే సమయంలోనూ వర్షాలు కూడా మొదలై చల్లని వాతావరణం కనిపిస్తుండడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగైదు రోజులపాటు వర్షాలు జిల్లాలో నాలుగైదు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై శుక్రవారం సాయంత్రం నుంచి జల్లులు పడుతున్నాయి. ఇవి క్రమక్రమంగా భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల జిల్లాలో 44 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు ఎండలు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక -
బాలుడి ఆచూకీ లభ్యం
బి.కొత్తకోట : స్థానిక పంజూరమ్మ గుడి వీధికి చెందిన వర్దన్ (12) అచూకీ లభ్యమైంది. మతి స్థిమితం లేని వర్దన్ తప్పిపోవడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో గురువారం రాత్రి బి.కొత్తకోటలో బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య మదనపల్లె : అనారోగ్యంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. అనపగుట్టకు చెందిన లక్ష్మీనారాయణ, రమాదేవిల కుమారుడు టి.నరేష్(32)..పీటీఎం మండలం అంకిరెడ్డిపల్లెలో ఉన్న స్పిరిట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంట్లో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం మదనపల్లె మండలం కొండామర్రిపల్లె సమీపంలోని గాయత్రి స్టోన్ క్రషర్స్ సమీపంలో గడ్డి మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద అపస్మారకస్థితికి చేరుకోగా, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడ్ని తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు నరేష్ మృతిచెందాడు. మృతదేహానికి తిరుపతి రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేఖర్ తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి వీరబల్లె(రాయచోటి టౌన్) : వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, బాధితుడి కథనం మేరకు..వీరబల్లె మండలం వంగిమళ్ల గ్రామం పెద్దూరుకు చెందిన షేక్ అల్తాఫ్ శుక్రవారం తెల్లవారు జామున (సుమారు 5 గంటల సమయంలో) ఇంటికి సమీపంలోని పొలం గట్ల వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. అతడి కోసం మాటువేసిన దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారు. అదే సమయానికి అటు నుంచి ఆటో రావడంతో భయంతో పరారయ్యారు. అల్తాఫ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కుమార్తె వెళ్లి చూడగా, రక్తగాయాలతో పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు రూరల్ సీఐ తులసీరాం కేసు నమోదు చేశారు. -
19న ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే
రాయచోటి: ఎయిడ్స్ వ్యాధితో జీవితాలను కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈనెల 19న అంతర్జాతీయ ఎయిడ్స్, క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 1న అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకోవడంతోపాటు మే నెల మూడో ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19న రాయచోటిలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డైట్ కళాశాల వరకు ప్రేమ, సంఘీభావంతో మనందరం గుర్తించుకుందాం, మనందరం నయం చేసుకుందాం అనే థీమ్తో ఈ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు. -
విత్తన శుద్ధితో వేరుశనగ సంరక్షణ
ఖరీఫ్ ముంచుకొస్తోంది. చిరు జల్లులు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. నేల కాస్త పదునైతే దుక్కులు చేసి... విత్తనం వేసేందుకు రైతన్న సిద్ధమవుతాడు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వేరుశనగ పంట సాగు చేసే రైతులు కొన్ని మెలకువలు పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే నష్టపోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా పడమటి మండలాల్లో ముఖ్యమైన పంట వేరుశనగ . 50 శాతం మంది రైతులకు వేరుశనగ పంటే ఆధారం. ఖరీఫ్ సీజన్లో ఈ పంట సాగు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వేరుశనగ పంట సాగుకు ముందు పొలాల్లో లోతైన దుక్కులు చేయాలని, సాగుకు నెల రోజుల ముందే పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అనంతరం విత్తన కాయల పరీక్ష తప్పనిసరి. చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడంతో తగినంత పంట దిగుబడి సాధించలేక నష్టాలపాలవుతున్నారు. లోతైన దుక్కులు మేలో తొలకరి వర్షాలకు దుక్కులు చేసే ముందు ఎరువులను పొలాలపై చల్లుతారు. ఆ తరువాత లోతైన దుక్కులు చేపడతారు. తద్వారా పొలంపైనున్న ఎరువులు భూమిలోపల చేసి పంటసాగు ప్రారంభానికి ముందే సారవంతమైన ఎరువుగా మారుతుంది. పంట సాగు చేసే సమయం కంటే ముందు కనీసం రెండు మార్లు పొలాల్లో లోతైన దుక్కులు రైతులు చేస్తుంటారు. తద్వారా పంట సాగు చేసే పొలం ఎంతో సారవంతమవుతుందని రైతుల నమ్మకం. విత్తన నాణ్యత వేరుశనగ సాగు చేసే ముందు విత్తనకాయల నాణ్యతను పరీక్షిస్తే మొలకెత్తే శాతం తెలిసిపోతుంది. ఒక ట్రేలో మట్టి, ఇసుక, ఎరువులతో నింపి వంద విత్తన గింజల్ని నాటాల్సి ఉంటుంది. 12 రోజుల అనంతరం మొలకెత్తే శాతాన్ని బట్టి నాణ్యత తెలుస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 నుంచి 90 శాతం వరకు మొలకెత్తితే నాణ్యమైనదిగా నిర్ధారించవచ్చు. భూసార పరీక్ష పొలాల్లో రెండేళ్ల కోమారు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట సాగు చేసిన ప్రతిసారీ భూమిలో నత్రజని, భాస్వరం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పరీక్షల ద్వారా వాటి శాతం ఎంతమేర తగ్గిందో తెలుసుకోవచ్చు. సాగుకు ముందు పొలంలో తగినంత మేర వాటిని అందించగలిగితే పంట దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయాధికారులే మట్టిని సేకరిస్తారు. సూక్ష్మపోషకాలు సూక్ష్మ పోషకాల సమతుల్యత సరిచూసుకుని మందులు వినియోగించాల్సి ఉంటుంది. వేరుశనగ పంట సాగులో బోరాన్, సల్ఫర్ వినియోగిస్తే కాయలు నాణ్యతగా వస్తాయి. జింక్ వినియోగిస్తే వేరుశెనగ మొక్కల్లో కాండం, మొక్క ఎదుగుదల ఎక్కువగా, ధృడంగా ఉంటాయి. కాయల్లో గింజ ఏర్పడే శాతం పెరుగుతుంది. దుక్కులు చేసే సమయంలో 200 కిలోల జిప్సమ్ చల్లితే నూనె శాతం పెరుగుతుంది. విత్తనశుద్ధి తప్పనిసరి వేరుశెనగ విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. డీఎమ్–45 రకం మందును ఎకరాకు సరిపడే విత్తన గింజల్లో 180 గ్రాములు కలిపి పొలంలో విత్తాలి. తద్వారా గింజల్ని ఆవహించే తినేసే వేరుతొలుచు పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. అంతేగాక విత్తనాలు మెలకెత్తే వరకు వాటికి సంరక్షణగా ఉంటాయి. అంతేగాక విత్తనాలు మెలకెత్తే వరకూ వాటిని సంరక్షిస్తాయి. కలుపుమొక్కల నివారణ వేరుశెనగ పంట సాగులో కలుపు మొక్కల నివారణా మందులు తప్పనిసరిగా వాడాలి. విత్తనాలు వేసిన రోజు సాయంకాలం, మరుసటి రోజున గానీ మందులు పొలంలో పిచికారీ చేయాలి. ఎకరం పొలానికి ఒకటిన్నర లీటరు పెండా మిథాలిన్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట పొలంపై పిచికారీ చేయాలి. విత్తనాలు వేసినప్పటి నుంచి రెండు నెలల పాటు కలుపు మొక్కలు పెరగకుండా చూడవచ్చు. అంతర పంటలు వేరుశనగ పంట సాగులో అంతర్ పంటలు సాగు చేయడంతో పంటకు ఎంతో రక్షణగా ఉంటుంది. పొలంలో విత్తన గింజలు వేసే ఆరుసాళ్ల( వరుసలు)కు ఒకసాలు కందులు, అలసందలు వంటి విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పొలం చుట్టూ రెండు నుంచి నాలుగు వరసలు జొన్నలు వేయాలి. వీటితో పక్క పొలాల నుంచి వైరస్, ఇతర క్రిమి కీటకాలు, ఎర్రగొంగళి పురుగులు ఆహించకుండా చేయవచ్చు. భూసార పరీక్షలు తప్పనిసరి లోతైన దుక్కులతో అధిక దిగుబడి విత్తన పరీక్షలతో ప్రయోజనం వేరుశెనగ విత్తన పరీక్షలు చేయించుకుంటే ప్రయోజనం ఉంటుంది. విత్తనాలు మొలకెత్తే పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తే ముందుగా నాణ్యత తెలుస్తుంది. మొలకెత్తే శాతం ఎక్కువగా ఉన్న విత్తన కాయలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏటా ప్రభుత్వం అన్ని ఆర్బీకేలకు నాణ్యమైన రాయితీ వేరుశెనగ విత్తన కాయల్ని సరఫరా చేస్తుంది. పంట సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. – రమణ, రైతు, గెరికుంటపల్లె సరైన యాజమాన్యంతో అఽధిక దిగుబడులు వేరుశెనగ పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు, మెలకువలు పాటించి సరైన యాజమాన్యం పాటిస్తే అఽధిక దిగుబడులు సాధించవచ్చు. పొలంలో సేకరించిన మట్టి నమూనాల ఆధారంగా భూసార పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి అధికారులిచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఎంత మేరకు ఎరువులు, పురుగు నివారణ మందులు వావాలో తెలుసుకోవాలి. – ఓబుల్రెడ్డి, రైతు, మొరంమీదపల్లె -
టీబీ టీకా కేంద్రాల తనిఖీ
రాయచోటి అర్బన్: జిల్లాలో నిర్వహిస్తున్న వయోజన టీబీ టీకాల కేంద్రాలను గురువారం అన్నమయ్యజిల్లా జాతీయ ఆరోగ్యమిషన్ పర్య వేక్షణాధికారి (డీపీఎంఓ ) డాక్టర్ రియాజ్బేగ్, డీఎన్ఎంఓ విష్ణువర్దన్రెడ్డి పరిశీలించారు. రాయచోటి పట్టణ పరిధిలోని కొత్తపల్లె అర్బన్ ఆరోగ్యకేంద్రం, లక్కిరెడ్డిపల్లె మండలం దేవళంపల్లె పీహెచ్సి పరిధిలోని కుర్నూతల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో నిర్వహిస్తున్న వయోజన టీకా కేంద్రాలను డీపీఎంఓ పరిశీలించారు. చెక్లిస్ట్ ప్రకారం, టీకా కేంద్రంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నారా.. లేదా.. అని తనిఖీచేశారు.వ్యాక్సిన్ వల్ల ఏ జబ్బును నివారించవచ్చు.. ఫాలోఅప్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఒక వేళ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఎవరిని ఎప్పుడు సంప్రదించాలి అనే అంశాలపై టీకా వేసుకునే వారికి తప్పక అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గురువారం బీసీజీ టీకా దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్, దేవళంపల్లె పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ రాయచోటి: జిల్లాలోని రైతులకు సబ్సిడీ వేరుశనగ కాయలు, పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ గురువారం రాయచోటిలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు 40శాతం సబ్సిడీపై వేరుశనగ, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.జనుము 2578 క్వింటాళ్లు, జీలుగ 2492 క్వింటాళ్లు, పిల్లిపెసర 76 క్వింటాళ్లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. వేరుశనగ కె–6 రకం 35323 క్వింటాళ్లు, నారాయణి రకం 18046 క్వింటాళ్లు, టీసీఎస్ 900 క్వింటాళ్లు, కదిరి లేపాక్షి 1114 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయన్నారు. రైతులందరూ తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి కావాల్సిన విత్తనాలు ఎంపిక చేసుకుని తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి వారి పేర్లు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీ నిలిపివేత కడప వైఎస్ఆర్ సర్కిల్: డ్రైవింగ్ లైసెన్స్ సేవలను ఈనెల 18 వరకు నిలిపివేస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ మీరా ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణాశాఖ పోర్టల్లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, డేటా బేస్లో తలెత్తిన సమస్యలతో డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపి వేస్తున్నామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సేవలు 18వ తేది ఉదయం 10 గంటల నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గుర్తించుకోవాలని సూచించారు. 21 నుంచి కడప రాయుడి తెప్పోత్సవం కడప కల్చరల్: కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో ఏటా మే నెలలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8.00 గంటల వరకు ఆలయం వద్దగల శ్రీవారి పుష్కరిణిలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 21న తెప్పపై శ్రీకృష్ణుడు, గోదాదేవీలను కొలువుదీర్చి మూడు ప్రదక్షిణలు చేయిస్తామన్నారు. 22న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిలకు ఐదు ప్రదక్షిణలు చేయిస్తామని, చివరిరోజు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామికి పుష్కరిణిలో తెప్పపై ఏడు ప్రదక్షిణలు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. -
మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంటిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
రాయచోటి టౌన్ : రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రాయచోటి – గాలివీడు రోడ్డులో ఉన్న వండాడి వెంకటేశ్వర్లు బంగ్లాలోకి రాయచోటి ప్రాంతానికి చెందిన పదిలం ప్రసాద్, మండ్ల సతీష్, శివశంకర్, పదిలం నికేష్, పాలగిరి మౌలా, యాదగిరి బాలాజీలు ఇంటి ప్రహరీకి ఉన్న సోలార్ వైర్లు కట్ చేసి ఇంటిలోకి చొరబడ్డారు. ఇంటి లోపల పార్కింగ్ చేసిన జీపు అద్దాలు పగులకొట్టారు. అలాగే ఫర్నీచర్, కుర్చీలు, లైట్లు, అద్దాలు ధ్వంసం చేశారు. ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ తరపున జనరల్ ఏజెంట్గా వ్యవహరించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొందని తెలిపారు. దీన్ని మనసులో ఉంచుకుని పోలింగ్ ముగిసిన తరువాత 15వ తేదీ రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు వివరించారు. 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసినందుకు అర్బన్ ఎస్ఐ భక్తవత్సలంను అభినందించారు. -
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య
మదనపల్లె సిటీ: జిల్లాలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు మొదటి విడత చిన్నారుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1) (సి) ప్రకారం ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలి. 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిని అనుసరించి 1132 మంది దరఖాస్తు చేసుకోగా 600 మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మొదటి విడత జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతతలో.. జిల్లా వ్యాప్తంగా 600 మంది చిన్నారులకు ఒకటవ తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ తొలి జాబితాను సమగ్రశిక్ష అధికారులు విడుదల చేశారు. మొదటి విడత జాబితా విడుదలతో ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. ’జిల్లా వ్యాప్తంగా... జిల్లాలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్ఈ వెబ్ పోర్టల్లో నమోదు చేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా వీటి జాబితాను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు గతంలోనే పంపించి, సీఎస్ఈ వెబ్పోర్టర్లో నమోదయ్యేలా చర్యలు చేపట్టింది. ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమలవుతున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్ అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 శాతం సీట్లను ఒకటో తరగతి విద్యార్థులకు కేటాయించాలి. ప్రస్తుతం విడుదల చేసిన మొ దటి విడత అడ్మిషన్లలో భాగంగా 600 విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వీరందరూ ఈనెల 20వతేదీ లోపు ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ఫోన్లకు విద్యాశాఖ అధికారులు సమాచారం పంపించారు. మండలం కేటాయించిన సీట్లు మదనపల్లె 125 రాయచోటి 100 పీలేరు 58 రాజంపేట 48 బి.కొత్తకోట 39 ఓబులవారిపల్లె 23 గాలివీడు 22 ములకలచెరువు 24 కోడూరు 31 పెనగలూరు 17 టి.సుండుపల్లి 16 చిట్వేలి 23 గుర్రంకొండ 11 నందలూరు 11 పుల్లంపేట 9 కె.వి.పల్లి 8 కురబలకోట 9 లక్కిరెడ్డిపల్లె 5 తంబళ్లపల్లె 3 వాల్మీకిపురం 4 పి.టి.సముద్రం 2 రామాపురం 2 కలకడ 1 నిమ్మనపల్లె 2 రామసముద్రం 1 కలికిరి 6 విద్యాహక్కు చట్టంలోభాగంగా అమలు జిల్లా వ్యాప్తంగా 600 మందిపేద విద్యార్థులకు లబ్ధి జాబితా విడుదల విద్యాహక్కు చట్టం ప్రకారం మొదటి విడత జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాం. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఈ చట్టంపై అవగాహన ఉంది. –శివప్రకాష్రెడ్డి, డీఈవో -
దేవా.. దీవించవా..
బ్రహ్మంగారిమఠం: ‘దేవా.. దీవించవా’.. ‘మీ దరికి చేరామయ్యా.. మమ్మల్ని కాపాడవయ్యా..’ అంటూ భక్తులు వేడుకున్నారు.వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన గురువారం తెల్లవారుజామున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిేషేకం చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పీఠంపై అధిష్టింపజేసి, విశేష పూజలు చేశారు. పెద్దమఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. మధ్యాహ్నం మహా నైవేద్య పూజ కార్యక్రమాన్ని పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. వైభవంగా నరనంది ఉత్సవం Æ>{† ¯]lÆý‡-¯]l…¨ E™èlÞÐ]l… E™éÞçßæ ¿ýæÇ-™èl…V> fÇ-W…-¨. Ð]l*™é VøÑ…-§ýl-Ð]l*…º çÜÐól$™èl ÒÆý‡-{º-õßæÃ…-{§ýl-ÝëÓÑ$ E™èlÞÐ]l-Ð]lÊ-Æý‡$¢ÌS¯]l$ ÑÔóæ-çÙ…V> AÌS…-MýS-Ç…_ ¯]lÆý‡-¯]l…¨ Ðéçßæ-¯]l…Oò³ BÖ-¯]l$ÌS¯]l$ ^ólÔ>Æý‡$. ò³§ýlª-Ð]l$uý‡… ¯]l$…_ fVýS¯éÙèl } DÔèæÓ-È-§ólÑ-Ð]l$uý‡… Ð]lÆý‡MýS$ FÆó‡-W…ç³# ^ólç³sêtÆý‡$. AMýSPyýl _¯]l²Ð]l$uý‡… Ð]l$u>-«¨ç³† ÒÆý‡-Õ-Ð]l-MýS$-Ð]l*-Æý‡-ÝëÓÑ$ ç³Nf M>Æý‡Å-{MýS-Ð]l*Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… FÆó‡-W…ç³# †ÇW ò³§ýlª-Ð]l$uý‡… ^ólÆý‡$-MýS$…¨. E™èlÞ-ÐéÌZÏ ç³NÆý‡Óç³# Ð]l$u>-«¨ç³† ÒÆý‡-¿-Z-VýS-Ð]lçÜ…™èl Ððl…MýSsôæ-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ MýS$Ð]l*Æý‡$Ë$ ÒÆý‡-¿ýæ-{§ýl-Ķæ$Å-ÝëÓÑ$, VøÑ…-§ýl-ÝëÓÑ$, ÒÆý‡…-»-ొ-rÏĶæ$Å-ÝëÓÑ$, §ýl™é¢-{™ól-Ķæ$-ÝëÓÑ$, Ð]lÆý‡§ýl-Æ>f-ÝëÓÑ$ ´ëÌŸY-¯é²Æý‡$. ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు -
మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంటిపై దాడి హేయమైన చర్య
రాయచోటి : రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్, బీసీ నాయకుడు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేయడం హేయమైన చర్యగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. ఎన్నికల తరువాత కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడడం మంచి పరిణామం కాదన్నారు. ఈ మేరకు గురువారం శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాయచోటి ప్రాంతంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడకొట్టే విధంగా పాత రోజులకు తీసుకెళ్లేలా కొన్ని అల్లరి గ్యాంగులు తయారవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పట్టణంలో మైనార్టీలకు చెందిన మొనార్క్ ఫర్నిచర్ షాప్ను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తమలో కూడా ఓర్పు, సహనం సన్నగిల్లి గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి -
వేసవి తాపం తీర్చే తాటిముంజలు
గుర్రంకొండ : తాటిముంజలు వేసవి సీజన్లో మాత్రమే లభించే మధుర ఫలాలు. కొందరు రైతులు గత కొన్ని రోజులుగా తాటి ముంజలను గుర్రంకొండకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పలువురు తాటిచెట్ల నుంచి దించిన గెలలను అలాగే తీసుకొచ్చి తాజాగా అప్పటికప్పుడు మన ముందరే కాయలు కొట్టి ముంజలు తీసి ఇస్తున్నారు. ఈ సీజన్లో అన్ని పండ్లకంటే తాటిముంజలకు భలే డిమాండ్ ఉంటుంది. ఒక డజను తాటి ముంజలు రూ. 120 వరకు విక్రయిస్తున్నారు. అంటే ఒక తాటిముంజ రూ. 10 వరకు ధర పలుకుతోంది. ప్రతి వంద గ్రాముల తాటి ముంజల్లో 43 కేలరీల శక్తి, 87.6 గ్రాముల నీటితో పాటు విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం, పాస్పరస్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని, వేసవి తాపాన్ని తీర్చడంలో బాగా పని చేస్తాయి. మనిషికి ఈ వేసవిలో కొబ్బరినీటితో పాటు తాటిముంజలు అదే స్థాయిలో సేద తీరుస్తుండడం విశేషం. దీంతో ప్రస్తుత వేసవి కాలంలో తాటిముంజలకు భలే డిమాండ్ ఏర్పడింది. -
సుజలాం.. సుఫలాం !
నీటి కోసం యుద్ధాలు జరిగాయనేది చరిత్ర చెబుతున్న సత్యం.. అదే నీటిధారలతోనే ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఉన్నాయి. కేవలం నీటి వనరులను బట్టి రాజులు రాజ్యాలు పాలించిన చరిత్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నీటితో ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది..దానితోనే గుర్తింపు వచ్చిందింటే.. అందుకు నిదర్శనం నందలూరు.. సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. నందలూరు నీళ్లు అనగానే తాగాలనిపిస్తుంది నందలూరు నీళ్లు అంటేనే ఓ క్రేజ్ ఉంది. ఈ నీళ్లకు ఉన్న ప్రాధాన్యత ఏ ప్రాంతానికి చెందిన నీటికి లేదు. బ్రిటీషు రైల్వే పాలకులు నందలూరు నీటి నాణ్యతను గుర్తించారు. అందుకే నందలూరు స్థావరంగా చేసుకుని రైలుమార్గాన్ని విస్తృత పరిచారు. సీమకే తలమానికంగా నిలిచిన ఆల్విన్ ఫ్యాక్టరీ నీటి వనరుల వల్లే ఆవిర్భవించింది. నందలూరు నీళ్లు అంటే ఎవరైనా తాగాలనుకుంటారు. ఆరోగ్యకరమైన ప్రకృతి ప్యూరిఫైడ్వాటర్. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, నందలూరు చెయ్యేరు నీళ్లలోనే మేధావితనం ఉంది నందలూరు నీళ్లలోనే మేధావితనం ఉంది. ఇందుకు నిదర్శనం నందలూరు చెయ్యేరు నీటి దాహార్తి తీర్చుకొన్న వారిలో ఈ ప్రాంతానికి చెందిన వారు ఐఏఎస్లు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలుగా ప్రసిద్ధి చెందారు. కేవలం నందలూరు నీటి వనరులతో గుర్తింపు వచ్చింది. విక్రయాలు సాగిస్తున్న మినరల్ వాటర్ బాటిళ్ల కన్నా నందలూరు యేటి నీళ్లే నాణ్యత కలిగి ఉన్నాయి. నందలూరు వాసులకు ప్రకృతి ప్రసాదం నీరే. నందలూరు అంటే గుర్తొచ్చేది నీళ్లే. – అరిగెమణి, వైఎస్సార్సీపీ కాపునేత, నందలూరు ● చెయ్యేటి నీళ్లతో నందలూరుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ● ఈ ప్రాంతంలోని నీటిపైనే అందరి దృష్టి ● నందలూరు నీళ్ల నాణ్యతపై మినరల్ వాటర్ కంపెనీల విస్మయం రాజంపేట : మట్లిరాజులు, చోళరాజులు నందలూరు మండలం చెయ్యేరు నదీపరీహాక ప్రాంతమైన పొత్తపిని రాజధానిగా చేసుకొని పాలించిన చరిత్ర నుంచి నేటి వరకు నందలూరు నీటికి ఉన్న పేరు మరెక్కడాలేదనేది నిత్యసత్యం. కేవలం నందలూరు నీళ్లతోనే తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఒక్కసారి నందలూరులో నివాసం చేసుకుంటే ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టకపోవడానికి ప్రధాన కారణం. నందలూరు నీటిలో పొటాషియం, కాల్షియంతోపాటు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. టీడీఎస్ 188 పాయింట్లు చూపిస్తోంది. అదే కంపెనీ వాటర్బాటిల్లో 25 నుంచి 35 పాయింట్లు చూపిస్తోంది. ఏళ్ల తరబడి భూగర్భ జలాలు నందలూరు మండలం పాటూరు నుంచి పొత్తపి వరకు చెయ్యేరు నది వెంబడి ఉంటుంది. ఏడాదిలో ఒక సారి నీటి ప్రవాహం కొనసాగితే యేళ్ల తరబడి భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి. అన్నమయ్య డ్యాం తెగిన క్రమంలో యేడాదిపాటు నీటి ప్రవాహం కొనసాగింది. అలాగే ఈ మధ్యలో అడపాదడపా వర్షాలతో నీటి ప్రవాహం కొనసాగింది. ఇదే విధంగా కొన్ని శతాబ్దాల నుంచి చెయ్యేటి నీళ్లు ఈ ప్రాంతానికి వరంగా మారుతూ వచ్చాయి. నందలూరు మేధావులకు నిలయంగా మారడానికి కూడా ఈ నీళ్లే అనే అభిప్రాయం ఉంది. చెయ్యేటి వారన ఊట కాలువలు..చెయ్యేటి వారంబడి ఎక్కడాలేని విధంగా ఊటకాల్వలు(స్ప్రింగ్చానల్స్)లో సాగు చేసే విధానం చోళ, మట్లిరాజుల కాలం నుంచి ఉంది. ఇప్పటికీ ఈ ఊటకాల్వలు మండలంలో విస్తారంగా ఉన్నాయి. నీటితోనే రైల్వేపుట్టుక నందలూరు నీటితోనే రైల్వేపుట్టుక ఆరంభమైంది. 1864లో బ్రిటీషర్లు నందలూరులో నీటి లభ్యతను ఆధారం చేసుకొని స్టీమ్ ఇంజన్ లోకోషెడ్ నిర్మితం చేశారు. ఈ నీటి ఆవిరి వల్ల పింగాణి తుప్పు పట్టకుండా ఉంటుందని అప్పట్లోనే బ్రిటీషు రైల్వే పాలకులు నీటి నాణ్యతపై పరిశోధనలు చేశారు. రైల్వే అధికారులు నీటి కోసం యేటి ఒడ్డున బావిని తవ్వించారు. ౖపైపెకి నీటి ధారలు ఎగిసిపడటంతో సీసం పోసి రైల్వే అధికారులు నియంత్రించిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. నీటి వనరులతోనే ఆల్విన్ ఆవిర్భావం..నీటి వనరులు పుష్కలంగా ఉన్న తరుణంలో 1982లో నందలూరు కేంద్రంగా చేసుకొని ఆల్విన్ రిఫ్రిజిరేటర్ల కర్మాగారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో రాయలసీమకే తలమానికంగా నిలిచింది. వేలాది మంది కార్మికులు ఇతర జిల్లాలతోపాటు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు ఆల్విన్లో పనిచేశారు. వారిలో చాలామంది నందలూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కారణం నీరే. కడపకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాస్టీమ్ ఇంజన్ లోకోషెడ్ కొనసాగిన హయాంలో కడపకు నందలూరు నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అయ్యేవి. 1977లో దక్షిణమధ్యరైల్వే సదరన్ రైల్వే నుంచి విడిపోయినప్పటికి ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారంటే నీళ్లే కారణంగా చెపుతున్నారు. జోరుగా నీటి వ్యాపారాలు..నందలూరులో నీటి వ్యాపారాలు మూడుపువ్వులు ఆ రుకాయలుగా సాగుతున్నాయి. వాటర్ప్లాంట్స్ ఏర్పా టు చేసుకున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో ఈ వ్యా పారం సాగుతోంది. ఇప్పటికే ప్యూరిఫైడ్ వాటర్ ప్రకృతిపరంగా లభ్యమవుతున్న క్రమంలో ఇక్కడి ప్రాంతీయులు యేటినీటికే ప్రాధాన్యత ఇస్తారు. అలాగే నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో కేవలం చైన్నైకు వెళ్లే కరివేపాకును తడిపే నీటి కేంద్రాలు ఏర్పాటయ్యా యి. ఈ విధంగా నీటి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నీళ్లలో ఖనిజ లవణాలు పుష్కలం నందలూరు నీళ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. నందలూరు నీటి గురించి తెలిసిన వారు ఎవ్వరూ మినరల్ వాటర్ బాటిళ్లు, క్యాన్లు తీసుకోరు. ఆ నీటికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి ప్యూరిఫైడ్ వాటర్గా గుర్తింపు ఉంది. నందలూరుకు వచ్చేవారు యేటి ద్వారా వచ్చే నీటిని తీసుకుంటున్నారు. అంటే నందలూరు నీళ్లకు ఉన్న ప్రాధాన్యత ఏ పాటిదో తెలుస్తోంది. – పిల్లి వేణుగోపాల్, పీఈటీ, ఆల్విన్స్కూల్, నందలూరు నందలూరు నీళ్లతో రైలింజన్లు నడిచేవి బ్రిటీషు కాలం నుంచి అరక్కోణం–నందలూరు మధ్య స్టీమ్ లోకో రైలింజన్లతో రైళ్లు నడిచేవి. నీటి నాణ్యత కారణంగా తెల్లదొరల కాలంలో నందలూరులో లోకోషెడ్ నిర్మితం చేశారు. నందలూరు నీళ్లు అంటే రైల్వేలో ప్రత్యేక గుర్తింపు. విఽధి నిర్వహణ నిమిత్తం వచ్చిన అనేక మంది కార్మికులు ఇక్కడే స్థిరపడ్డారంటే అందుకు నీరే కారణం. ఇప్పటికై నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి నీటి నాణ్యత, లభ్యతను గుర్తించి, నందలూరును అభివృద్ధి చేసే దిశగా యోచించాలి – నాయనపల్లె విజయ్కుమార్, రిటైర్డ్ రైలింజన్ డ్రైవర్, నందలూరు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement