-
గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు
సీతంపేట: టీడీపీ ప్రభుత్వం హయంలో ఆగిపోయిన గిరిజనమ్యూజియం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ మేరకు సీతంపేటలోని పాత పీఎంఆర్సీలో మ్యూజియం పనులు జరుగుతున్నాయి. రూ.కోటి అంచనా వ్యయంతో గిరిజన మ్యూజియం నిర్మించడానికి నిధులు కేటాయించారు. 2017లో ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరిగినా సక్రమంగా నిధులు కేటాయించకపోవడం, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్ల క్రితం ఈ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులను చిత్రాల రూపంలో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీల సంస్క్రతి, సంప్రదాయాలు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పచ్చిమబెంగాల్, మహరాష్ట్ర, బీహార్లలో ఉన్న ఆదివాసీలు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానం కంటికి కనిపించేలా బొమ్మల రూపంలో చూపించాలని నిర్ణయించారు. గిరిజనులు ఇంట్లో వాడే వస్తువులు, కట్టుబాట్లు, వేటాడే వస్తువులు, పూర్వం నుంచి ఇప్పటివరకు దశలవారీగా మారిన మార్పులను చిత్ర రూపంలో ప్రదర్శించేందుకు బొమ్మలను సేకరించారు. ప్రస్తుతానికి రెండు బ్లాకుల్లో పనులు జరిగాయి. మ్యూజియం బయట కొత్తగా కొన్ని దుకాణ సము దాయాలను ఏర్పాటు చేశారు. గిరిజన మ్యూజి యం పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినట్లవుతుంది. ఫ ప్రాచీన మానవుల నుంచి నేటివరకు.. బొమ్మల రూపంలో చిత్రీకరణ ఫ గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా రూపకల్పన -
మరో 7 రోజులు
పార్వతీపురంటౌన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు సాగుతోంది. కదనరంగంలో తలపడే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థులెవరో స్పష్టమైంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలమునకలవుతున్నారు. ప్రచారానికి మరో 5 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారం హోరెత్తిస్తు న్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొంది ఉంటేనే ఓట్లేయాలని ఓటర్లను కోరుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు మాత్రం విభేదాలతో సతమతమవుతూ, ప్రచారంలో వెనుకబడుతున్నారు. ఫలితంగా డబ్బు ప్రలోభాలపై ఆధారపడుతున్నారు. ● ముమ్మరంగా ప్రచారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. దానికి రెండు రోజుల ముందే ప్రచారం గడువు ముగుస్తుంది. దీంతో ప్రచార పర్వానికి ఇక 5 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థులతో పాటు వారి బంధువులు సైతం రంగంలోకి దిగారు. దూర ప్రాంతాల్లో ఉండి చదువుతున్న, వివాహమై దూర ప్రాంతాల్లో నివసిస్తున్న, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాల్లో ఉన్న వారిని సైతం నియోజక వర్గానికి రప్పించారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కొక్కరు పంచుకుని మరీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. అక్కా, అమ్మా.. అవ్వా.. తాతా.. అంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ● దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధికార వైఎస్సార్సీపీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై ముందుగానే స్పష్టత వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అ భ్యర్థులు చాలా రోజుల నుంచే ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళ్లిన వారు..తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలు పొందిన లబ్ధిని ఇంటింటా వివరిస్తూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. . ● సంక్షేమ పథకాలతో మరింత జోష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడి్డ్ ఐదేళ్ల పదవీకాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందజేసి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ఓటు అభ్యర్థిస్తున్నారు. కూటమి నేతలు మాత్రం ఓటు అభ్యర్థించేందుకు వైఎస్సార్సీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ● ఒక్క ఈవీఎంతోనే.. సార్వత్రిక సమరంలో పోటీ చేసే రేసుగుర్రాలపై స్పష్టత వచ్చింది. అరకు లోక్సభకు 13 మంది, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్కో ఈవీఎం బ్యాలెట్లో అత్యధికంగా 13 మంది అభ్యర్థులకు చోటు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 మంది మాత్రమే తలపడుతున్నారు. ఫలితంగా ప్రతి బూత్లో పోలింగ్ ఒక్క ఈవీఎంతోనే నిర్వహించనున్నారు. పోలింగ్కు దగ్గరపడుతున్న సమయం అరకు పార్లమెంట్ బరిలో 13 మంది నాలుగు అసెంబ్లీ స్థానాలకు 29 మంది పోటీ ప్రచారంపై అభ్యర్థుల దృష్టికూటమిలో సమన్వయం లేక టీడీపీ సతమతం విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారులో గందరగోళానికి తెరతీశారు. నామినేషన్ల ఘట్టం మొదలయ్యేంత వరకూ అభ్యర్థిత్వాలపై నాన్చుడు ధోరణి అవలంబించారు. ఈ గందరగోళానికి తోడు.. క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల్లో సమన్వయం లేకపోవడం, పరస్పర విభేదాలు నెలకొనడంతో ఆ పార్టీల అభ్యర్థుల ప్రచారంలో తొలి నుంచీ నిస్తేజం అలుముకుంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన వాటిల్లో నేతల మధ్య కుమ్ములాటలకే సమయం సరిపోయింది. ఈ పరిణామం ప్రచారంపై చూపింది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటించిన నితిన్ గడ్కరీ, పాలకొండ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. డబ్బులు ఇచ్చి జనాలను సభలకు తీసుకుని వచ్చినా.. వారు ప్రసంగిస్తుండగానే ప్రజలు వెళ్లిపోవడం ఆయా పార్టీల నేతల దుస్థితిని చెప్పకనే చెప్పింది. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్షాలకు ప్రతికూల పరిస్థితి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు వెదజల్లడం మినహా మరో మార్గం లేదని ఆయా పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఈసారి కుడా క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. -
తొలి ఓటు పడిందోచ్..!
పార్వతీపురంటౌన్: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటు కలిగి ఉండి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వారి సొంత నియోజక వర్గ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఫెసిలిటేషన్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కునేందుకు శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లావ్యాప్తంగా 6810 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 3280 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో 1291 మందికి 546 మంది, పార్వతీపురంలో 1751మందికి గాను 1098 మంది, కురుపాంలో 2241 మందికి 910 మంది, పాలకొండలో 1527 మందికి 726 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓటింగ్ కంపాట్మెంట్లు, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఏర్పాటు చేసిన విధానాన్ని అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. పోలైన ఓట్లు ఇన్వాలిడ్ కాకుండా ఉద్యోగులకు నిబంధనలు తెలియజేయాలని సూచించారు. సదుపాయాల కల్పన ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో సైన్ బోర్డులు, హెల్ప్డెస్క్లు, ఏసీ, కూలర్లతో వెయిటింగ్ హాల్స్, కుర్చీ లు, తాగునీరు, మజ్జిగ, వైద్య శిబిరాలు, షామియానాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలె ట్ వేయడంలో కొద్దిపాటి అవగాహన లోపం వల్ల గత ఎన్నికల్లో అనేక చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్ వాలిడ్ అయినట్లు గుర్తించి అటువంటి సంఘట నలు జరగకుండా జిల్లా ఎన్నికల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఓటరుకు అందించే బ్యాలెట్, ఫారాలు,కవర్లు ఏవిధంగా ఉపయోగించాలో స్పష్టమైన అవగాహన కల్పించారు. ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఫెసిలిటేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్ఓలు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్జిల్లావ్యాప్తంగా పరిశీలన ఇలా.. జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ఎస్ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవ నాయుడు, కంట్రోల్రూమ్ ఇన్చార్జ్, ఎస్డీసీ ఆర్.వి. సూర్యనారాయణ, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పర్యవేక్షించారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధి కారి, పాలకొండ శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి శుభం బన్సల్, పార్వతీపు రం ఐటీడీఏ ప్రాజె క్టు అధికారి, సా లూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి.విష్ణుచరణ్, పార్వతీపురం ఆర్డీఓ, పార్వతీపురం నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కె.హేమలత, పాలకొండ ఆర్డీఓ, కురుపాం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వి.వెంకటరమణ ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటెషన్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్ పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, కురుపాం మోడల్ రెసిడెన్ష్యిల్ స్కూల్, పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులపై ప్రిసైడింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు ఎండ వేడిమితో డీ హైడ్రేషన్కు గురికాకుండా కేటాయించిన వెయిటింగ్ హాల్లో కూర్చోపెట్టి ఒకరి తరువాత ఒకరు ఓటుహక్కు విని యోగించుకునేలా చూడాలని పీఓలను ఆదేశించా రు. వెయిటింగ్హాల్లో ఎయిర్కూలర్లు, ఫ్యాన్ గా లి, వెలుతురు తాగునీటి సదుపాయాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్ల పంపిణీ, పేర్లు నమోదు, బ్యాలెట్ బాక్స్లో ఓట్లు సక్రమంగా వేస్తున్నది, లేనిది పరిశీ లించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో అందుబా టులో ఉంచిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. -
ప్రజల ఆశీర్వాదం కోసం
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొండంత ఎండ అవస్థలు పెడుతున్నా.. చెమటలు చిందిస్తూ ప్రజల ఆశీర్వాదం కోసం గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా ఓటర్ల దగ్గరకు వెళ్లి ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ భామిని: వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతికి గిరిజనుల సంప్రదాయ నత్యాలతో స్వాగతం పలుకుతున్న పోలవరం గ్రామస్తులు -
రూటే సెపరేటు
ఆయన స్థానికుడు కాదు. ఓ ఎన్ఆర్ఐ(నాన్ రెసిడెంట్ ఇండియన్). కానీ ఇక్కడే నివాసమంటూ జనాలకు నమ్మబలుకుతున్నాడు. విదేశాల్లో ఉద్యోగమని..ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చానని ఊదర గొడుతున్నాడు. నియోజకవర్గ రాజకీయాల్లోకి వస్తూనే టీడీపీలో ముసలం సృష్టించాడు. అప్పటివరకు నియోజకవర్గ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఓ మాజీ ఎమ్మెల్సీని, మరో మాజీ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చేశాడు. ఒంటెత్తు పోకడలకు తెరతీసి ఎవరైనా తన వద్దకే రావాలి గానీ..తాను ఎవరి వద్దకూ వెళ్లనంటూ పార్టీలో విభేదాలకు ఆజ్యం పోశాడు. ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరికి వెళ్లినా..‘చినబాబు’ మద్దతుతో ఆయన మాటకు ఎదురే లేకపోయింది. దీంతో పార్టీ సీనియర్ నాయకులంతా ఇప్పుడు అంటీముట్టనట్లు ఉంటున్నారు. ● అందరి వాడు కాదు ● నిన్నమొన్నటి వరకూ స్థానికంగా ఓటుహక్కూ లేదు ● ఒంటెత్తు పోకడతో దూరమైన టీడీపీ సీనియర్లు ● పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎన్ఆర్ఐ’కు ఎదురుగాలిసాక్షి, పార్వతీపురం మన్యం: నిజానికి పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే అన్నీ ఆర్థిక నేరారోపణలు, మోసాలు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వాటినే తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి అర్హతలుగా నిర్ణయించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని అబద్ధాలా అంటూ! నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. రేప్పొద్దున ఇటువంటి వ్యక్తికి ఓటేస్తే..ఇంకెన్ని మోసాలు చేస్తాడోనని చర్చించుకుంటున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ ఎన్నికల బరిలో గెలిచేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యక్తికి రాజకీయంగా గానీ, ప్రజాసేవపరంగా గానీ గతంలో ఎటువంటి అనుభవమూ లేదు. పుట్టింది, పెరిగింది, నివాసం ఇక్కడ కానేకాదు. ఎప్పుడో తాతల కాలంలో ఉండేవార మని ఓ ఊరు పేరు చెప్పి, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పోనీ, ఆ ఊరిలోనైనా ఓటుహక్కు ఉందా? అంటే అదీ లేదు. మరో ఊరిలో ఆరునెలల క్రితం ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అన్న హామీ లభించిన తర్వాతే..ఈ ప్రక్రియలన్నీ ప్రారంభించారు. పార్టీ క్యాడర్లోనూ అసంతృప్తి ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారని..ఆయన ఒంటెత్తు పోకడలతో నలిగిపోతున్నామంటూ టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. దీనికితోడు ప్రచార సమయంలో ఆయన వెంట వెళ్లే క్యాడర్కు అయ్యే ఖర్చును సైతం సదరు ‘ఎన్ఆర్ఐ’ పెట్టుకోవడం లేదని, స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మీదే నెట్టేస్తున్నాడని వినికిడి. దీంతో చోటామోటా నాయకులకు చేతిచమురు వదిలిపోతోంది. మరోవైపు ప్రజలు కూడా ఎక్కడో వ్యక్తిని ఇక్కడెందుకు ప్రోత్సహించాలన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. స్థానికేతరుడికి ఓటు వేయడం కన్నా.. స్థానికంగా ఉంటూ నిత్యం మన సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను మరోసారి గెలిపించుకుందామని ఓ నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. అటు పార్టీ క్యాడర్కు దూరమై, ఇటు ప్రజలకూ దగ్గర కాలేక.. సదరు ‘ఎన్ఆర్ఐ’ ఓటమికి మానసికంగా ముందుగానే సిద్ధపడిపోయినట్లు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆర్థిక నేరారోపణల్లో దిట్ట సదరు అభ్యర్థిపై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలూ ఉన్నాయి. కులం ముసుగులో తమను మోసం చేశారని..అక్కడ సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం సదరు వ్యక్తి ఆరాటపడుతున్నారని ఇన్ఫాం ఇంటర్నేషనల్ అనే సంస్థ గతంలో తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది. కులం అభ్యున్నతి కోసం 2014లో ఐఎఫ్ఎం అనే సంస్థ ఏర్పాటైందని చెప్పిన అక్కడి ప్రతినిధులు..2018లో తమ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి ఆ వ్యక్తి తమతో కలిశాడని పేర్కొ న్నారు. సంస్థలో ఉన్న కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ మేధావులను పక్కదారి పట్టించి..ఇదే సంస్థ పేరు మీద విశాఖ గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంకు ఖాతా తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్నారు. అదేవిధంగా ఓ టీవీ చానల్లో డైరెక్టర్గా చేరి, రూ.4 కోట్లు వసూలు చేసి సంస్థకు ఇవ్వలేదని నాడు గుర్తు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఆ టీవీ చానల్ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారని అప్పట్లో పార్వతీపురంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ సంస్థ సభ్యులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement