భూపాలపల్లి రూరల్/టేకుమట్ల/మొగుళ్లపల్లి: మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని.. మూడోసారి మోదీనే ప్రధాని కావాలంటే ప్రజలు నిండుమనసుతో తనను ఆశీర్వదించాలని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ కోరారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి రమేశ్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వేలైన్ ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు. మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోవడం ఖాయమన్నారు. మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ప్రతీ కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం వరంగల్పై ప్రేమతో మోదీ ములుగులో గిరిజన యూనివర్శిటీ, భూపాలపల్లి డిగ్రీ కళాశాల ఏర్పాటు, జాతీయ రహదారులు, గ్రామాల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అంబాల చంద్రమౌళి, బీజేపీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, కన్నం యుగేందర్, బట్టు రవి, దొంగల రాజేందర్, మందల రఘునాథరెడ్డి, మారెల్ల సేనాపతి, రాంరెడ్డి, సర్కిల్ సుధాకర్, రాంరెడ్డి, కంబాల రాజయ్య, ఊనగొండ రామకృష్ణ, ఆయా మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్