-
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు. -
పురం.. ఎవరి పరమో..!
పెద్దాపురం సామర్లకోట: మెట్ట ప్రాంత ముఖద్వారంగా పెద్దాపురం నియోజకవర్గం ఉంది. దీంతో మెట్ట ప్రాంత నేతలే ఇక్కడ ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అనపర్తి, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల మధ్య 291.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గం మొదట్లో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. ఇవీ ప్రత్యేకలు ● నియోజకవర్గంలోని సామర్లకోట జిల్లాలో పెద్ద రైల్వే జంక్షన్. ఇక్కడి నుంచే కాకినాడ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దాపురం, కిర్లంపూడి, ప్రత్తిపా డు, జగ్గంపేట, ఏలేశ్వరం తదితర ప్రాంతాల వారు సామర్లకోట నుంచే రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ ఎదురెదురుగా ఉన్నాయి. ● సగ్గు బియ్యం పరిశ్రమలు సామర్లకోట మండలంలో ఉన్నాయి. ఇక్కడ తయారైన సగ్గుబియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఏడీబీ రోడ్డులో రాక్, అపర్ణ సిరామిక్స్, రిలయన్స్, జీవీకే పవర్ ప్లాంట్లతో పాటు అనేక ఇతర పరిశ్రమలు ఉన్నాయి. శిక్షణలకు కేంద్రం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులతో పాటు వివి ధ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు సామర్లకో ట శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తుంటారు. గిరిజన యు వతకు శిక్షణ ఇవ్వడానికి గిరిజన శిక్షణ సంస్థ ఇక్కడే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, సర్వే సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి విస్తరణ, శిక్షణ కేంద్రంలోనే రెవెన్యూ అకాడమీ ఉంది. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు ప్రతి నెలా సర్వసభ్య సమావేశం నిర్వహించే టీటీడీ సామర్లకోటలోనే ఉంది. ఈ శిక్షణ కేంద్రంలో గ్రామీణ యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో ఇంగ్లిషు స్పీకింగ్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రైవేటు న్యాక్ సంస్థలో గృహ నిర్మాణానికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తారు. వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వడానికి సామర్లకోటలోనే వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ వరి విత్తనాలు పండిస్తారు. సుమారు 30 ఏళ్ల క్రితం బాగా గిరాకీ ఉన్న ఎస్ఎల్ఓ అక్కుళ్లు రకం ధాన్యాన్ని ఇక్కడ పండించారు. పెద్దాపురం పాండవుల మెట్టపై నవోదయ విద్యాలయం ఉంది. పుణ్యక్షేత్రాలకు నెలవు ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఈ నియోజకవర్గం నెలవు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలో ఉంది. సామర్లకోట – పెద్దాపురం పట్టణాల కూడలిలో 65 అడుగుల ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం ఉంది. పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ, చదలాడ తిరుపతి శృంగారవల్లభ స్వామి ఆలయాలు ఈ నియోజకవర్గంలోనే కొలువుదీరాయి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో పెద్దాపురం పాండవుల మెట్టపై నివసించినట్టు చెబుతారు. అనేక మంది యాత్రికులు పాండవుల మెట్టను తిలకిస్తారు. ఇక్కడి సూర్యనారాయణస్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.ఎక్కువసార్లు స్థానికేతరులకే పట్టం తోట రామస్వామి కిర్లంపూడి పంతం పద్మనాభం గెద్దనాపల్లి బొడ్డు భాస్కర రామారావు పెద్దాడ తోట గోపాలకృష్ణ కిర్లంపూడి పంతం గాంధీమోహన్ గెద్దనాపల్లి నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం స్థానికులు.. దుర్వాసుల వెంకటసుబ్బారావు పెద్దాపురం వుండవిల్లి నారాయణమూర్తి సామర్లకోట కొండపల్లి కృష్ణమూర్తి వేట్లపాలెం బలుసు రామారావు సామర్లకోట మెట్ట ప్రాంత ముఖద్వారం పెద్దాపురం సగ్గు బియ్యం పరిశ్రమలకు నెలవు ఏడీబీ రోడ్డు వెంబడి ఇతర పరిశ్రమలు -
ఓటర్లకూ స్లిప్పులు
● జిల్లాలో ముమ్మరంగా పంపిణీ ● సమగ్ర సమాచారంతో అందజేత ● 8 వరకూ కొనసాగనున్న కార్యక్రమం కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల హడావుడి దాదాపు తుది అంకానికి చేరుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఒకవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ నిర్వహణపై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. పోలింగ్కు ఇక తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలను స్త్రాంగ్ రూములకు తరలించడం వంటి ముఖ్యమైన అన్ని పనులూ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసింది. కొత్త ఓటర్ల నమోదు అనంతరం తుది జాబితా కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు సమగ్ర సమాచారంతో ఓటర్ స్లిప్పుల (పోల్ చిట్టీ) పంపిణీ కార్యక్రమం చురుకుగా నిర్వహిస్తున్నారు. సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఈ స్లిప్పులను ముమ్మరంగా పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ వరకూ ఓటర్ స్లిప్పుల పంపిణీ కొనసాగించనున్నారు. ఏ రోజు ఎన్ని పంపిణీ చేస్తున్నారో ఉన్నతాధికారులకు సాయంత్రం నివేదిక అందిస్తున్నారు. ఓటర్ గైడ్.. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు గైడ్ పుస్తకం అందిస్తున్నారు. నాలుగు పేజీల ఈ పుస్తకంలో కొత్త ఓటరుగా ఆన్లైన్, ఆఫ్లైన్లో నమోదు ప్రక్రియ, ఎప్పుడు నమోదు చేసుకోవాలో వివరించారు. ఓటు వేసేందుకు ఎటువంటి గుర్తింపు కార్డు తీసుకురావాలి, ఏవి తీసుకుని వెళ్లకూడదో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన వివిధ యాప్లు, పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఓటు వేసే విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు. తప్పకుండా ఓటు వేస్తానంటూ ఓటరు ప్రతిజ్ఞను కూడా ఓటరు గైడ్ పుస్తకంలో పొందుపరిచారు. ఓటర్లకు చేరుతున్న స్లిప్పులు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఓటర్లకు గుర్తింపుతో పాటు సులభతరంగా ఉండేలా స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని సహాయ రిటర్నింగ్ అధికారులు పోల్ చిట్టీలను పంపిణీ చేసే బీఎల్ఓలకు ముందుగా శిక్షణ ఇచ్చారు. వీటి పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు. బీఎల్ఓలు గ్రామాల్లో నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు వీటిని అందించాలి. ఇంటికి తాళం వేసి ఉంటే ప్రస్తుతం ఇచ్చిన గడువులోగా వారిని కలవాలి. అప్పటికీ రాని వారి వివరాలు, ఫొటో స్లిప్పులను తిరిగి ఎన్నికల అధికారులకే అప్పగించాల్సి ఉంటుంది. పంపిణీలో అర్హులైన వారికి స్లిప్పులు రాకపోతే ఆ వివరాలు ఇవ్వాలి. మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో స్లిప్పుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో 30 శాతం వరకూ పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని కాకినాడ లోక్సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,29,471 మంది పురుషులు 8,04,465 మంది, ఇతరులు 186 మంది ఉన్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్లో 2,69,330 మంది, అత్యల్పంగా పెద్దాపురంలో 2,15,095 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాకినాడ సిటీ 2,41,620 మంది ఓటర్లతో రెండో స్థానం, పిఠాపురం 2,36,409 మంది ఓటర్లతో మూడో స్థానం, జగ్గంపేట 2,29,863 మందితో నాలుగో స్థానం, తుని 2,24,538 మందితో ఐదో స్థానంలో ఉన్నాయి. పోల్ చిట్టీలో.. పోల్ చిట్టీలో అసెంబ్లీ నియోజకవర్గం, సంఖ్య, ఓటర్ పేరు, లింగం, ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, తండ్రి పేరు, పోలింగ్ కేంద్రం ఉన్న ప్రదేశం, పోలింగ్ కేంద్రం సంఖ్య, పోలింగ్ కేంద్రం భవనం వివరాలు, ఎన్నికల సంఘం వెబ్సైట్, టోల్ఫ్రీ నంబర్ 1950, క్యూఆర్ కోడ్, రూట్ మ్యాప్ తదితర వివరాలు ముద్రించారు. అలాగే, సంబంధిత బీఎల్ఓ పేరు, మొబైల్ నంబర్, ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సదుపాయాలు, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలను ఈ చిట్టీలో పొందుపరిచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement