డిచ్పల్లి: మండలంలోని సాంపల్లి గ్రామంలో చౌడమ్మదేవి ఆలయ మొదటి వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చౌడమ్మదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్లోని జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ఆలయం 7వ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బదావత్ మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. బీబీపూర్ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఎ మ్మెల్యే తెలిపారు. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, టీపీసీసీ డెలిగేట్ చంద్రశేఖర్ గౌడ్, ఆలయ కమిటీ కోశాధికారి లవుడ్య సంజీవ్, సభ్యు లు జరుపుల రవి, బదావత్ బలరాం, రాంసింగ్, ర వీందర్, నూర్సింగ్, సర్కల్, తారాసింగ్, పండరి, సర్ధార్, బిక్యా, లింబ్య తదితరులు పాల్గొన్నారు.