ఖలీల్వాడి: ఎడపల్లి మండలం జానకంపేట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి, కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, జయవర్ధన్ గౌడ్, బాలరాజ్గౌడ్, మారుతి గౌడ్, వడ్డెర సంఘం నాయకులు గుంజ పోశెట్టి, జాన్, నర్సయ్య, శ్రీనివాస్, బొంత పోశెట్టి, గౌడ సంఘం నాయకులు, కృష్ణ గౌడ్, సుమన్ గౌడ్, రామా గౌడ్, సాయిబాబా గౌడ్, మధుసూదన్ గౌడ్, యాదేశ్ గౌడ్, చేపూరి గంగా కిషోర్, తాహెర్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలం కాలూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే అమలవుతుందన్నారు. నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.
24 క్యారెట్స్ 70,600
22 క్యారెట్స్ 65,120
వెండి (కిలో) 84,000
– నిజామాబాద్ బిజినెస్
చికెన్ ధరలు
(కిలోకు)
స్కిన్లెస్ 240
డ్రెస్స్డ్ 200
లైవ్ 180
మటన్ 800
బంగారం ధరలు (10గ్రాములు)
మాంసం ధరలు