-
మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది
● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి వేములవాడ: మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ వేములవాడకు వస్తున్న సందర్భంగా బాలాజీనగర్లోని స భాస్థలి వద్ద ఆదివారం భూమిపూజ చేశారు. ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ వేములవా డ కు చేరుకుంటున్న ప్రధాని మోదీ రాజన్నను దర్శించుకుంటారని తెలిపారు. ప్రధాని బహిరంగ జనసభను విజయవంతం చేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రశేఖర తివారి, మనోహర్రెడ్డి, ప్రతాప రామకృష్ణ, వికాస్రావు, రాణీరుద్రమ, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారం కరువు.. బీమాకు దూరం
● పంటల బీమాలో నిబంధనల సడలింపు ● రైతు యూనిట్గా పరిహారం చెల్లింపులు ● వానాకాలం సీజన్లో అమలు ● జిల్లాలోని 1.23 లక్షల మంది రైతులకు ప్రయోజనం చందుర్తి(వేములవాడ): ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు పండిస్తే.. అకాల వర్షాలు.. అడవి జంతువుల దాడితో నిండా మునుగుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల గురించి తెలియక పరిహారం పొందలేకపోతున్నారు. గతంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు మండలాన్ని యూనిట్గా తీసుకోగా.. స్వల్ప మార్పులతో రైతుయూనిట్గా పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు. అయితే దీనిపై అధికారులు ప్రచారం చేయకపోవడంతో అవగాహన లేక రైతులు బీమా ప్రీమియం చెల్లించడం లేదు. ఫలితంగా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందక నష్టపోతున్నారు. 2.42లక్షల ఎకరాల్లో సాగు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా.. 1.83లక్షల ఎకరాల్లో వరి, 55వేల ఎకరాల్లో పత్తి, మిగతా 5వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారుల నివేదికలు చెబుతున్నాయి. పంటల బీమాతో జిల్లాలోని 1.23లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. బ్యాంకు నుంచి రుణం పొందే రైతులు పంటల బీమా ప్రీమియం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పొందని రైతులు నేరుగా బీమా ప్రీమియాన్ని మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించే అవకాశం ఉంది. బీమాలో రెండు రకాలు జిల్లాలో రెండు రకాల బీమా పథకాలు అమలు చేస్తున్నారు. వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం. వానాకాలం సీజన్లో పంటల బీమా పథకం కింద జిల్లాలో వరి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలు వస్తాయి. నష్టపోయిన రైతులకు ప్రయోజనం రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించడానికి అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకానికి కేంద్రం పలు రకాల సవరణలు చేపట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకే పరిహారం అందేది. అధిక వర్షాలతో పంటలు కొట్టుకుపోయిన, దెబ్బ తిన్న ప్రభుత్వం పరిహారం మంజూరుచేసేది. అడ వి జంతువులు, కోతులు పంటలను ధ్వంసం చేస్తే పరిహారం అందేది కాదు. అదే విధంగా మెరుపుల ప్రభావంతో పడే పిడుగు కారణంగా నష్టపోయే పంటలకూ పరిహారం మంజూరవలేదు. పంటలు అడవి జంతువులతో దెబ్బతిన్న, ఉరుములతో ధ్వంసమైనా.. ఖరీఫ్ నుంచి రైతులకు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవగాహన కల్పించాలి కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్బీమా పథకం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. పంటల బీమాపై అవగాహన లేకనే ప్రీమియం చెల్లించేందుకు ముందుకురావడం లేదు. గ్రామసభలు పెట్టి ఏ పంటకు ఎంత ప్రీమియం చెల్లించాలో రైతులకు వివరించాలి. పంట నష్టం జరిగితే కలిగే ప్రయోజనాల గురించి వివరించాలి. అప్పుడే చాలా మంది రైతులు పంటల బీమా చేసుకునేందుకు ముందుకొస్తారు. – తాడిశెట్టి తిరుపతిరెడ్డి, బండపల్లి రైతు -
యారన్ సబ్సిడీ సాధిద్దాం
సిరిసిల్లటౌన్: నేతన్నలకు రావాల్సిన యారన్ సబ్సిడీని సాధిద్దామని పవర్లూమ్స్ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ పేర్కొన్నా రు. సిరిసిల్లలో నేతకార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 8న సిరిసిల్లలో పవర్లూమ్స్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన యా రన్ సబ్సిడీ సాధన సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్లుగా సిరిసిల్ల నేతకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీకి ఓట్లు వేయాలని అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ను గెలిపించుకుందామన్నారు. ఈనెల 8న జరిగే సమావేశానికి సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, అనుబంధ రంగాల కార్మికులు హాజరుకావాలని కో రారు. కోడం రమణ, గుండు రమేశ్, సబ్బని చంద్రకాంత్, కంది మల్లేశం, బెజుగం సురేశ్, సదానందం, దశరథం, దామోదర్, గణేశ్, విజయ్, ప్రసాద్, తిరుపతి, పోచమల్లు పాల్గొన్నారు. కేటీఆర్ ఓటు రాజకీయం చేస్తున్నారు ● బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి హితవు పలికారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా కేటీఆర్కు స్థానికుల నుంచి వచ్చిన వినతులకు స్పందించి పరిష్కరించాలని కోరారు. మైనార్టీల ఓట్లు దండుకోవడానికి హిందుత్వ వాదుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడొద్దన్నారు. పట్టణంలోని ఆలయ భూముల కబ్జాకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దుమాల శ్రీకాంత్, పట్నాల శేఖర్, పల్లికొండ నర్సయ్య, సొక్కి శ్రీనివాస్, ల్యాగల భాగయ్య, మహేశ్, రాజు, అభినయ్, మహేందర్, అజయ్, రాము, మధు, దేవయ్య పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాను ఉంచుతారా.. లేదా ? ● జిల్లా పరిరక్షణ సమితి నేత రామ్మోహన్ సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లాను ఉంచుతారా.. లేదా? అనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేయాలని జిల్లా పరిరక్షణ సమితి నేత బొల్లి రామ్మోహన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం పరిపాలన సౌ లభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిందని, ఈక్రమంలోనే సిరిసిల్లకు కలెక్టరేట్, వైద్యకళాశాల వచ్చాయన్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్ప ష్టత ఇవ్వాలని కోరారు. జిల్లాను తొలగిస్తే ప్ర జాపోరాటాలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆవునూరి రమాకాంత్రావు, ఎండీ సత్తార్, గడ్డం లత, దార్ల సందీప్, బుస్సా వేణు, సోమిశెట్టి దశరథం, మల్లేశం పాల్గొన్నారు. దళితులను మోసం చేసిన బీఆర్ఎస్సిరిసిల్లటౌన్: తెలంగాణ ఏర్పాటు తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న కేసీఆర్ మాట నిలుపుకోకుండా పదేళ్లపాటు దళితులను మోసం చేశారని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ నల్లాన కనకరాజు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ మాలసంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు మేడి అంజయ్య, రొడ్డ రాంచంద్రం, దుంపల జీవన్కుమార్, నాలుక సత్యం పాల్గొన్నారు. -
బీజేపీని పక్కన పెట్టండి
● కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: రాష్ట్రంలో బీఆర్ఎస్ను పక్కన పెట్టినట్లుగా కేంద్రంలో బీజేపీని పక్కకు పెట్టి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నా రు. మేరు సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపి, ఆది శ్రీనివాస్ను సత్కరించారు. మున్సిపల్ వైస్చైర్మన్ బింగి మహేశ్, మేరు జేఏసీ చైర్మన్ మునిగల రాము, సంఘం జిల్లా అధ్యక్షుడు ఓదెల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మంతెన దుర్గేశ్, మహేశ్, అనిల్, శంకర్, సాయికృష్ణ పాల్గొన్నారు. హరీశ్రావు నోరు అదుపులో పెట్టుకో.. చందుర్తి(వేములవాడ): అబద్దాల హరీశ్రావు నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మండలంలోని కట్టలింగంపేట, లింగంపేట, మల్యాల గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మీ నాయకుని మాదిరిగా గెలిచి విదేశాలకు పారిపోకుండా.. ఇక్కడే ప్రజల్లో ఉంటున్నానని స్పష్టం చేశారు. గతంలో మంత్రి హోదాలో వచ్చి నువ్వు ప్రారంభించిన కలికోట సూరమ్మ చె రువు ప్రాజెక్టు ఎటు పోయిందని ప్రశ్నించారు. కుడి, ఎడమ కాల్వలకు శంకుస్థాపన చేసి తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. నాయకులు నాగం కుమార్, చింతపంటి రామస్వామి, సంటి ప్రసాద్, గండ్ర లక్ష్మణ్రావు, సత్తయ్య, చంద్రం, బొజ్జ మల్లేశం, ముస్కు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సెస్’లో ఆన్లైన్ చెల్లింపుల పునరుద్ధరణ
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించే విధానాన్ని పునరుద్ధరించారు. విద్యుత్ వినియోగదారులు గతంలో పేటీఎం ద్వారా బిల్లులు చెల్లించేవారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పేటీఎం వ్యాలెట్ను రద్దు చేయడంతో ఆన్లైన్ చెల్లింపులు రెండు నెలలుగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. పలువురు ఎన్పీడీసీఎల్కు ఆన్లైన్లో బిల్లులు చెల్లించినా ‘సెస్’ కు జమకాలేదు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘సెస్’ బిల్లు.. బేబుకు చిల్లు’శీర్షికన ‘సాక్షి’లో ఏప్రిల్ 21న కథనం ప్రచురి తమైంది. దీనిపై స్పందించిన ‘సెస్’ పాలకవర్గం, అధికారులు పేటీఎం స్థానంలో కొత్త యూపీఐని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ‘సెస్’ పరిధి లోని వినియోగదారులు నేరుగా విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. వినియోగదారులు www.tgcessltd. com ఓపెన్ చేసి కరెంట్ బిల్లుపై ఉన్న యూఎస్సీ నంబరును ఎంటర్ చేసి బిల్లులు చెల్లించే అవకాశం లభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 1.35 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించే అవకాశం కలిగింది. బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement