-
‘ట్రినిటి’ అద్భుత ఫలితాలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఈఏపీసెట్ 2024 ఫలితాల్లో ట్రినిటి జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాలల ఫౌండర్ చైర్మన్, పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన జె.హనికర్ అత్యుత్తమంగా 44వ ర్యాంక్ సాధించి సత్తా చాటినట్లు పేర్కొన్నారు. పి.ప్రణయ్ 773, వై.ఆశ్లేష 1254, వి.శ్రీతేజ 1255, వై.అశ్విత 1551, సీహెచ్ విఘ్నేశ్ 1624, అయేషా 1627, ఫిల్జా అతీక్ 1748, ఎస్.శ్రీలక్ష్మీ 2159, ఎం.హర్షవర్ధన్ 2280, ఎన్.గంగశ్రీ 2372, పి.శ్రీదీప 2682, సీహెచ్ రంజిత 2815, మదిహా ఫాతిమా 2913, ఎం.ఆశీష్ 2954, కె.రాణి 2998 ర్యాంకులను కై వసం చేసుకున్నట్లు తెలిపారు. 10వేల లోపు ర్యాంకులను చాలామంది విద్యార్థులు కై వసం చేసుకున్నారన్నారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. విద్యార్థులను కళాశాలల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డితోపాటు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు. -
‘ఎస్ఆర్’ విజయకేతనం
తిమ్మాపూర్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కరీంనగర్ ఎస్సార్ కళాశాల జోనల్ ఇన్చార్జి నేదూరి తిరుపతి తెలిపారు. తమ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివిన తుమ్మ తేజస్వి 161 ర్యాంకు, ముంకల గణేశ్ 199, కటంకూరి శ్రీనివాసరెడ్డి 291, రావుల దీపాన్షురెడ్డి 412, గడ్డం రాజీవ్ 552, సాయిచంద్ర 565తోపాటు మరో 12 మంది వెయ్యి లోపు ర్యాంకులు, మరో 20 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. అగ్రికల్చర్లో మధులికరెడ్డి, లక్ష్మీప్రసన్న, అశ్విత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించారని తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ మధూకర్రెడ్డి, సంతోష్రెడ్డి, జోనల్ ఇన్చార్జి తిరుపతి, అకాడమిక్ డీన్ రవీందర్రెడ్డి, ప్రిన్సిపాళ్లు నాగార్జునరెడ్డి, ప్రవీణ్రెడ్డి, మారుతి, శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
● అడ్డుకోవడంతో తప్పిన ప్రాణాపాయం ● చందుర్తి పోలీస్ స్టేషన్లో ఘటన ● పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణ ● చందుర్తి సీఐ హామీతో వెనుదిరిగిన బాధితుడి కుటుంబం చందుర్తి(వేములవాడ): పోలీసులు ఆరు నెలలుగా వేధిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్లో ఎన్గల్ గ్రామానికి చెందిన మ్యాకల జలంధర్ శనివారం పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఒకరు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు జలంధర్ వివరాల ప్రకారం.. ఎన్గల్కు చెందిన మ్యాకల జలంధర్కు అదే గ్రామానికి చెందిన గుంటి మల్లేశంల మధ్య ఇళ్ల స్థలాల సరిహద్దు వివాదం 8 నెలలుగా కొనసాగుతోంది. అప్పుడే పోలీసులను ఆశ్రయించగా.. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సూచించారు. పంచాయితీ పెద్దల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గుంటి మల్లేశం నవంబర్లో పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించనా వినిపించుకోలేదు. పంచాయితీ పెద్దల తీర్మానానికి కట్టుబడి ఉంటానని మ్యాకల జలంధర్ పోలీసులకు చెప్పగా.. పంచాయితీ చెప్పిన పెద్ద మనుషులపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ ఏడాది జనవరి 10న జిల్లా ఎస్పీ అఖిల్మహాజన్కు ఠాణాదివస్లో ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు వివాదం సద్దుమణిగింది. తిరిగి నెల రోజులుగా తనను పోలీస్ స్టేషన్కు పిలిపిస్తూ కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఏప్రిల్ 8న మళ్లీ జిల్లా ఎస్పీని కలిసిన జలంధర్ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఎస్పీ ఆదేశాలతో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు గ్రామంలో విచారణ చేపట్టి, ఎవరి హద్దుల్లో వారు ఉండాలని ఆదేశించారు. అయితే ఇటీవల జలంధర్ను ఎస్సై ఠాణాకు పిలిపించి సాయంత్రం వరకు ఉంచుకొని వదిలేశాడని, అదేరోజు గుంటి మల్లేశం ఆ స్థలంలో రాళ్లతో హద్దు వేశాడన్నారు. దీనిపై ఏప్రిల్ 25న తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ స్థలం విషయంలో ఎస్సై వేధిస్తున్నాడని జలంధర్ ఆరోపించారు. మల్లేశం ఫిర్యాదు చేయడంతో ఠాణాకు పిలిపిస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని, తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తమను పోలీస్ స్టేషన్కు పిలుపించుకోగా.. మల్లేశం నిర్మాణ పనులు చేయించేందుకు ఇసుక పోయించాడని తెలిపారు. తాము ఇంటికి వెళ్లగానే ఇసుక కనిపించడంతో తల్లి ఎల్లవ్వ, చెల్లె పావనితో కలిసి పురుగుల మందు డబ్బాతో ఠాణాకు వచ్చినట్లు వివరించాడు. కోనరావుపేట ఎస్సైకి విచారణ బాధ్యతలు చందుర్తి ఎస్సై శ్రీకాంత్పై తమకు నమ్మకం లేదని, గ్రామానికి వచ్చినప్పుడల్లా మల్లేశంను వెంటేసుకొని తిరుగుతున్నాడని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఎదుట బాధితుడు జలంధర్ ఆరోపించాడు. దీంతో విచారణ బాధ్యతలను కోనరావుపేట ఎస్సై ఆంజనేయులుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లారు. -
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ(ఈఏపీసెట్)–2024 ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి అద్భుత ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను బొకేలతో ఆయన సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్ మాట్లాడుతూ.. అల్ఫోర్స్కు చెందిన విద్యార్థులు వి.హాసిని 114వ ర్యాంకు, ఎన్.హేమంత్ 157, జి.శ్రీహాస్ 166, కె.సుప్రియ 296, ఎన్.జ్ఞానద 480, వి.శ్రీముఖి 568, ఎం.వర్షీత్ 575, జి.సాయిమంజునాథ్రెడ్డి 610, పి.జ్యోతిర్మయిరెడ్డి 863, శ్రీవెన్నెల 876, తేజస్విని 942, ఎ.శివవరుణ్ 973, సీహెచ్ అనూహ్య 950, పి.శ్రీనాథ్ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించారన్నారు. 16 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు, 39 మంది 2వేల లోపు ర్యాంకులు, 63 మంది 3వేల లోపు ర్యాంకులు, 116 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తిప్రతిష్టలను దశదిశలా చాటడం గర్వంగా ఉందన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రకటించబడిన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం సాధించిందని, 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని చెప్పారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి ఫలితంగా అల్ఫోర్స్ ఘనవిజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్, నీట్ ఫలితాల్లో మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
ఎన్నో చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు.. ● భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తున్న వైనం ● చూసొద్దాం.. రండి కొండల మధ్య రాముని గుండాలు రామగుండం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ముచ్చగొలిపే చారిత్రక ప్రాంతం రాముని గుండాలు. కొండపైకి ఎక్కి చూస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే గోదావరినది, బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రం కనువిందు చేస్తాయి. కరీంనగర్: ఒకప్పుడు కల్లోల ప్రాంతాలతో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేడు పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే పేరెన్నిక గన్న సిల్వర్ ఫిలిగ్రీతోపాటు నాణ్యమైన నల్ల బంగారు గనులకు ప్రసిద్ధి పొందింది. ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాలు, ఆధ్యాత్మికతను పరిమళింపజేసే ఆలయాలు ఆకర్షిస్తున్నాయి. దర్శించుకోవాలంటూ పర్యాటకులు, భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నాలుగు నూర్ల దేవాలయాలు.. నగునూరు కరీంనగర్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరులో పూర్వం చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులు 4 గుట్టలను కలుపుతూ కోటను నిర్మించి, పరిపాలన సాగించారు. బౌద్ధుల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. గంగాధరుడు నిర్మించిన త్రికూటాలయం నాటి శిల్పకళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు 400 దేవాలయాలు ఉండేవని, నాలుగు నూర్ల దేవాలయాలు ఉన్న ఊరు కాస్త నగునూరుగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. గ్రామం వెలుపల అతిసుందరమైన పెద్ద నాగశిల్పం ఉంది. హైదరాబాద్కు చెందిన కాసుగంటి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దక్షిణకాశీ.. వేములవాడ కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదాయంలో తిరుపతి తర్వాత రెండోది. దక్షిణకాశీగా కీర్తిగాంచిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్య వంశీయుడైన ఆరో విక్రమాదిత్యుడు వెయ్యేళ్ల క్రితం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. కోడె మొక్కు ఆచారం ఇక్కడ తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. మతసామరస్యానికి ప్రతీకగా దర్గాతోపాటు జైన దేవాలయాలు ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సైఫన్.. నాగులపేట కోరుట్లకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేట సైఫన్ ఆసియా ఖండంలోనే అరుదైన నిర్మాణంగా కీర్తిగాంచింది. భూగర్భంలోకి కాలువలోని నీరు మాయమై, వాగు దాటాక తిరిగి ప్రత్యక్షమవుతుంది. కింద కాలువ, పైన వాగు ఉండటం ఈ సైఫన్ ప్రత్యేకత. కోర్కెలు తీర్చే అంజన్న.. కొండగట్టు మల్యాల మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. కరీంనగర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 ఏళ్ల కింద ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇప్పుడున్న గుడి మాత్రం 160 ఏళ్ల కింద కృష్ణారావు దేశ్ముఖ్ నిర్మించారు. భక్తుల కోర్కెలు తీర్చే దేవునిగా ఆంజనేయస్వామి పేరు పొందారు. కొండల రాయుని కోట, గుహలు, బొజ్జ పోతన, సీతమ్మవారి కన్నీటి గుంటలు చూడదగినవి. వందేళ్ల నాటి ఎలగందుల ఖిల్లా కాకతీయులు, బహమనీలు, కుతుబ్షాహీలు, మొగలులు, అసఫ్జాహీలకు రాజధానిగా విలసిల్లిన ఎలగందుల కరీంనగర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి కోట కొండపై మసీదు ఉంది. దాని మీనార్ ఒకటి కదిపితే కదులుతుందని అంటారు. లోపల బంగారు రంగు చిత్రాలు చూపరులను ఆకర్షిస్తాయి. బౌద్ధ స్తూపం.. ధూళికట్ట ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామం కరీంనగర్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1975 నుంచి 77 వరకు జరిపిన తవ్వకాల్లో నాటి కోట, బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. కోట ముఖద్వారం వద్ద రాగి నాణేలు, మట్టి బొమ్మలు దొరికాయి. శాతవాహనుల రాజధాని.. కోటిలింగాల శాతవాహనుల రాజధాని కోటిలింగాల. వెల్గటూర్ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఎక్కడచూసినా శివలింగాలు, శిల్పకళా ఖండాలు, ఖండాల ఖండికలు కనిపిస్తుంటాయి. పురవాస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల హయాంలోని నాణేలు, ఇతర స్మారక చిహ్నలు వెలుగుచూశాయి. ఇక్కడి గోదావరినది నడి ఒడ్డున శ్రీకోటేశ్వరస్వామి ఆలయం ఉంది. త్రివేణి సంగమ క్షేత్రం.. కాళేశ్వరం కరీంనగర్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం.. శ్రీశైలం, ద్రాక్షారామం అంతటి విశిష్టమైంది. గోదావరి, ప్రాణ హిత, సరస్వతీ నదులు సంగమించే చోటిది. ప్రధాన ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి లింగాలు ఒకే పానపట్టంపై ఉండటం విశేషం. ఇక్కడి లింగంపైన గల నాసికలో ద్రవం పోస్తే త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి. ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ముక్తీశ్వరాలయం ఉంది. దీని చుట్టూ ఉన్న చిన్నచిన్న రాళ్లలో నుంచి విభూది రాలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నృసింహుని క్షేత్రం.. ధర్మపురి కరీంనగర్కు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి నృసింహుని క్షేత్రం ఉంది. అర్ధాయుష్కు డైన కుమారుడి కోసం బలివర్మ మహారాజు దేవతాయాగం చేసి, విజయం సాధించడం, ప్రజలు ధర్మబద్ధంగా జీవించడం కారణంగా ధర్మపురిగా వాసికెక్కింది. పద్మాసనంలో లక్ష్మీ సమేతుడై వెలసిన నరసింహస్వామితోపాటు, రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉండి శైవ, వైష్ణవ సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీరభద్రస్వామి.. కొత్తకొండ భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ మీసాల వీరభద్రస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. కాకతీయ రుద్రేశ్వరుని కాలం క్రీ.శ. 1410లో మల్లికార్జున పండితుని మనవడైన కేదారిచే ఆలయ నిర్మాణం జరిగింది. ఏటా సంక్రాంతికి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. రాజ భవనాలు.. రామగిరి ఖిల్లా పెద్దపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో గోదావరినదీ తీరాన శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా ఉంది. ఇక్కడి కోటలో సీతారామలక్ష్మణలు కొంతకాలం నివసించి చాతుర్మస్య వ్రతం ఆచరించినట్లు స్థానికులు చెప్పుకుంటారు. కోట లోపల గల అనేక రాజ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడి ప్రకతి సౌందర్యానికి ఆకర్షితుడైన ఔరంగజేబు దీన్ని ఆరామ్ గిరి అని పిలిచారంటారు. మరికొన్ని ఆలయాలు.. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో దుబ్బ రాజేశ్వరస్వామి, ఓదెల మల్లికార్జునస్వామి, ఇల్లంతకుంట మండలంలోని జంగంపల్లి శ్రీరామలింగేశ్వర స్వామి, గంగాధర మండలంలోని నందగిరి లక్ష్మీనర్సింహస్వామి, రాయికల్లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు, కోరుట్ల మండలంలోని నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా సందర్శించదగినవి. సైనిక స్థావరం.. జగిత్యాల ఖిల్లా కరీంనగర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల ఖిల్లాను జాఫరుద్దౌలా హయాంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు నిర్మించారు. 20 ఎకరాల విస్తర్ణంలో పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఖిల్లా నాడు సైనిక స్థావరంగా ఉండేది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. పురావస్తు ప్రదర్శన శాల కరీంనగర్ బస్టాండ్కు ఎదురుగా ఉన్న పురావస్తు ప్రదర్శన శా లను 1964లో నెలకొల్పి, 1984లో ఆధునీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తవ్వకాల్లో వెలుగుచూసిన శాతవాహనులు, కాకతీయులు, అసఫ్జాహీల చిహ్నాలు, నాణేలు, స్టాంపులు, యుద్ధ సామగ్రి, పుణ్యక్షేత్రాల అవశేషాలను ఇక్కడ ఉంచారు. మంత్రపురి.. మంథని అనాదిగా వైదిక సంస్కృతి వైభవాన్ని పరిరక్షిస్తున్న మంత్రపురి ప్రస్తుతం మంథనిగా పిలువబడుతోంది. కరీంనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో గోదా వరి నదీతీరాన వెలసిన గౌతమేశ్వరాలయంలోని బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనంలో మేటిగా నిలిచారు. అప్పట్లో మంథనికి వాస్తు అక్కరలేకుండా నాలుగు దిక్కులా 4 శివలింగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం వాటిని దాటి, విస్తరించింది. రామాలయం.. ఇల్లందకుంట హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. దండకారణ్యంలో వవవాసం చేస్తున్న సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, దశరథుని మరణవార్త తెలిసి ఇల్లంద గింజలతో తర్పణం వదిలారని ప్రతీతి. నల్ల గొండ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. -
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో 2022లో డీజిల్ కుంభకోణానికి పాల్పడిన అప్పటి శానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్పై మున్సిపల్ శాఖ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ శనివారం విచారణ చేపట్టారు. డీజిల్ కుంభకోణానికి పాల్పడిన నగేశ్ను ఆ సమయంలో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగా రీజినల్ డైరెక్టర్ విచారణకు వచ్చారు. శతాధిక వృద్ధుడి మృతి కోనరావుపేట(వేములవాడ): మండలం మల్కపేటకు చెందిన గెంటె రామయ్య(103) వృద్ధాప్య కారణాలతో శనివారం మృతిచెందాడు. ఆయనకు నాలుగు తరాల కుటుంబసభ్యులు ఉన్నారు. రామయ్య భార్య గత కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. 8 నుంచి జిల్లాస్థాయి శిక్షణ తరగతులు వేములవాడ: సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు వేములవాడలో జూన్ 8 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముష్కం రమేశ్ తెలిపారు. వేములవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ఎంపిక చేసిన 100 మంది ముఖ్య నాయకులకు రాష్ట్ర పార్టీ నాయకులు శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు గణేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరిట యువతి మోసం
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రేమ పేరిట ఓ యువతి తిమ్మాపూర్కు చెందిన యువకుడిని మోసం చేసింది. రూ.16 లక్షలు తీసుకొని, పరారైంది. బాధితుడి తండ్రి, పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాదన నాగరాజు యోగా నిమిత్తం ఈశా ఫౌండేషన్కు వెళ్లాడు. అక్కడే విశాఖపట్టణానికి చెందిన కమలసంధ్య ప్రియాంకతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నాగరాజు ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. దీనికి అతని తండ్రి మల్లయ్య నిరాకరించాడు. దీంతో గ్రామంలోని ఓ ఇంట్లో కొన్ని రోజులు అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో నాగరాజు ఓ ఆస్పత్రిలో తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవడంతో రూ.16 లక్షలు వచ్చాయి. ప్రియాంక తెలివిగా ఆ మొత్తాన్ని తన బంధువుల ఖాతాలోకి పంపించుకుంది. తర్వాత ఆస్ట్రేలియాకు పరారైంది. మళ్లీ రూ.3 లక్షలు కావాలని అతన్ని కోరింది. అంతేకాకుండా, నీ తండ్రి పేరిట ఉన్న భూమిని నీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చి, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో డబ్బులు, భూ రిజిస్ట్రేషన్ కోసం అతను తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. భరించలేకపోయిన మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియురాలి మోసం, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. శనివారం తండ్రీకొడుకు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చేరాలు తెలిపారు. యువకుడిని నమ్మించి రూ.16లక్షలు కాజేసిన వైనం తర్వాత ఆస్ట్రేలియాకు పరార్.. కేసు నమోదు -
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
హుజూరాబాద్రూరల్/జమ్మికుంట(హుజూరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మండల సమ్మయ్య(60) శనివారం పని నిమిత్తం సైకిల్పై శాలపల్లి ఇందిరానగర్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా జమ్మికుంట నుంచి హుజూరాబాద్ వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వాహన యజమాని ఇంటి ఎదుట ధర్నా సమ్మయ్యను ఢీకొన్న వాహనం జమ్మికుంట పట్టణంలోని ఓ ఐరన్ షాపు యాజమానికి చెందినది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. కానీ, యజమాని అప్పటికే తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. ప్రమాద విషయం తెలిశాక బాధితులతో ఫోన్లో మాట్లాడాడు. పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడికి భార్య యాదక్క, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ టౌన్ సీఐ రమేశ్, జమ్మికుంట ఎస్సై రాజేశ్, ఇల్లందకుంట ఎస్సై రాజ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ రాదు
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అలా ఏం రాదు. వెంటనే బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలి. పిడుగుల సమయంలో విద్యుత్ పరికరాల కనెక్షన్ తీసివేయడం మంచిది. – సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, జగిత్యాలసూర్యుని కన్నా ఎక్కువ వేడి సూర్యుని ఉపరితలంపై 5 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, పిడుగు పడినప్పుడు 29 వేల డిగ్రీలు ఉత్పత్తి అవుతుంది. పిడుగుకు సూర్యుని ప్రభావం కంటే 5 రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది. మేఘాల్లో ఎలక్ట్రికల్ చార్జ్ జరగడంతో పిడుగు పడుతుంది. – డాక్టర్ శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస పరిశోధన స్థానం -
● వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతున్న వడ్ల కుప్పలు ● లారీలు రాక.. తూకం వేయక ● కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ● ఆందోళనలో రైతులు
సిరిసిల్ల: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. పంటను కోసి, తేమ వచ్చి రెండు, మూడు వారాలు గడుస్తున్నా తూకం వేయడం లేదు. లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నాలుగో వారంలో తూకం వేయం మొదలుపెట్టారు. ఫలితంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కేంద్రాల్లోనే ఆరబోస్తున్న రైతులు జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాఘం చేస్తున్నాయి. మే నెలలో ఇప్పటికి మూడు సార్లు వర్షాలు పడడంతో ఎండిన వడ్లు తడిసిపోయాయి. రైతులు మళ్లీ కేంద్రాల్లోనే ఆరబోస్తున్నారు. లారీల కొరతతో తూకం వేసి బస్తాలు సైతం కేంద్రాల్లోనే ఉంటున్నాయి. ప్రైవేటు కొనుగోళ్ల జోరు ప్రభుత్వం వడ్లకు మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించగా.. ప్రైవేటు వ్యాపారులు నేరుగా పచ్చి రూ.1800 నుంచి రూ.1900లకు క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం, వడ్లను శుద్ధి చేయాలనే నిబంధనలు ఉండడంతో చాలా మంది రైతులు నేరుగా వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నా రు. కొందరు రైతులు శుద్ధిచేసి కొనుగోలు కేంద్రాల్లో ఉంచితే.. ఇలా అకాల వర్షాలతో ఇబ్బందులు తప్ప డం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.కొనుగోలు కేంద్రాలు: 259కొనుగోళ్లు ప్రారంభించినవి : 249కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు : 61ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం : 2,03,225.280 మెట్రిక్ టన్నులు అమ్మిన రైతులు : 30,564ధాన్యం విలువ : రూ.447.71 కోట్లు వరి సాగు విస్తీర్ణం : 1.73 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా: 3.81 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు డబ్బులు పొందిన రైతులు : 26,574రైతులు పొందిన డబ్బులు : రూ.331.30 కోట్లుఇతను కోనరావుపేటకు చెందిన కస్తూరి సంజీవరెడ్డి. ఇతనికి ఐదెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి, కొనుగోలు కేంద్రంలో పోశాడు. 300 బస్తాల వడ్లు అయితయి. లారీలు రాకపోవడంతో తూకం వేయడం లేదు. ఫలితంగా సంజీవరెడ్డి వడ్లు ఎప్పుడు జోకుతారోనని నిరీక్షిస్తున్నాడు... ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు వడ్లను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.వడ్లకుప్ప వద్ద ఉన్న ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజ భూమయ్య. ఇతనికి ఎకరం భూమి ఉంది. నెల రోజుల కిందటే పంట కోసి వడ్లను కొనుగోలు కేంద్రంలో కుప్పపోశాడు. 20 రోజుల కిందటే తేమశాతం వచ్చినా లారీలు లేక, గన్నీ సంచుల కొరతతో తూకం వేయలేదు. వడ్లు తడిసిపోకుండా కవర్లు కప్పి కాపాడుకుంటున్నాడు. నెల రోజులు అయితంది పంట కోసి నెల రోజులు అయితంది. అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినం. కాంటా పెట్టి 10 రోజులు గడుస్తుంది. లారీలు రాకపోవడంతో బస్తాలను తీసుకుపోవడం లేదు. వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి. వడ్లు లాకలు వస్తే మళ్లీ కోత పెడుతరు. వెంటనే లారీల్లో ధాన్యం తరలించాలి. – ఊషయ్య, నాంపల్లి కాంటా పెట్టిండ్రు అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసినం. నెల రోజులుగా వడ్లు పోతలేవు. లారీల కొరత అంటున్నారు. కాంటా వేసి కేంద్రాల్లోనే బస్తాలు పెట్టిండ్రు. నావి 800 బస్తాల వడ్లు అట్లనే ఉన్నయి. అకాల వర్షాలకు బస్తాలు తడుస్తున్నాయి. అధికారులు స్పందించి లారీలను పంపించాలే. – నాగరాజు, సంకెపల్లి -
కేంద్రాల్లోనే ధాన్యం
వడ్ల బస్తాల ముందు నిల్చున్న ఈమె మైలారం పద్మ. కోనరావుపేట మండలం ధర్మారం. పద్మకు రెండెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి వడ్లను ఆరబోశారు. తేమ శాతం వచ్చింది. రెండుసార్లు వడ్లను భర్త శంకర్తో కలిసి బోర్లించారు. 130 బస్తాల వరకు వడ్లు అయ్యాయి. తూకం వేసిన బస్తాలను తీసుకుపోయేందుకు లారీలు రాకపోవడంతో ఇలా వర్షానికి తడిసిపోయాయి. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మహిళా రైతు చెవుల గౌరవ్వకు చెందిన వడ్లు. పది రోజుల కిందట నాలుగు ఎకరాల్లోని పంట కోసి బైపాస్రోడ్డులో ఆరబోశారు. తేమశాతం 17 వచ్చింది. వడ్లను కాంటా పెట్టాల్సి ఉండగా.. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో తడిసినయి. ఇక చేసేదేమీ లేక గౌరవ్వ, మల్లేశం కుటుంబ సభ్యులు ఇలా శుక్రవారం వడ్లను ఆరబోశారు. ధాన్యం కొనుగోళ్ల స్వరూపం -
రోడ్డెక్కిన రైతులు
వేములవాడఅర్బన్: ధాన్యం కాంటా పెట్టి పది రోజులు గడుస్తున్నా తరలించడం లేదంటూ వేములవాడ మండలం అనుపురంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ వరిధాన్యం కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు దాటుతున్నా తూకం వేయడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల బస్తాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడారు. పోలీసుశాఖపై అవగాహన సిరిసిల్లక్రైం: పోలీస్శాఖపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సర్ధాపూర్పూర్లోని 17వ బెటాలియన్లో పోలీస్శాఖకు సంబంధించిన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలపై అవగాహన కల్పించారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు కోరారు. మండలంలోని ధర్మారం, సుద్దాల, కొలనూర్, మామిడిపల్లి, నిజామాబాద్, వట్టిమల్ల గ్రామాల్లో చెవి, ముక్కు, గొంతు, దంతవైద్యశిబిరాలు నిర్వహించారు. వైద్యాధికారులు వేణుమాధవ్, శ్రీనివాస్, సుష్మా, శివరామకృష్ణ, ప్రీతి, అఖిల్, వెంకటేశ్, సూపర్వైజర్లు శ్రీదేవి, రషీద్ పాల్గొన్నారు. బిల్లుల కోసం జీపీ కార్యాలయానికి తాళం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలో మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు బిల్లుల కోసం శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన నూతన జీపీ భవనానికి సంబంధించిన బిల్లులు, గ్రామాభివృద్ధికి వెచ్చించిన రూ.8లక్షలు రావాల్సి ఉందన్నారు. సర్పంచులకు ప్రభుత్వం అందించే రూ.6వేల గౌరవ వేతనం మూడేళ్లుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు అందించాలని కోరారు. చెక్డ్యామ్ పనులు పరిశీలన వేములవాడరూరల్: రెండు రోజుల్లో చెక్డ్యాం పనులు ప్రారంభించాలని, లేకుంటే కేసులు న మోదు చేస్తామని ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ను హెచ్చరించారు. వేములవాడరూరల్ మండలం మూలవాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులను శుక్రవారం పరిశీలించారు. బొల్లారం, జయవరం గామాల్లోని మూలవా గుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈఈ అమరేందర్రెడ్డి, ఏఈ రాజు, కాంట్రాక్టర్ వంశీ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రైతులు అధికారులను నిలదీసినట్లు తెలిసింది. గత వర్షాకాలంలో చెక్డ్యామ్ తెగి పంటలు నష్టపోయామని, ఈసారి పనులు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ అనురాగ్ జయంతి ● ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో పర్యటన ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, అల్మాస్పూర్, వీర్నపల్లి మండలం కంచర్ల, గర్జనపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో చేపట్టిన పనులను శుక్రవారం పరిశీలించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యు త్ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అమ్మ ఆద ర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగుదొడ్లను మరమ్మతు చేయించాలన్నారు. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా తాగునీటి వసతి కల్పించాలని, తరగతిగదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 31 లోగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలన్నా రు. అదనపు కలెక్టర్ గౌతమి, డీఈవో రమేశ్కుమార్, మండల ప్రత్యేకాధికారి గీత, ఎంపీడీవో సత్త య్య, ఏఈలు అశోక్రావు, శ్రీకాంత్, వీర్నపల్లి తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నరేశ్కుమార్, ఆర్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
స్కూళ్లు తెరిచే నాటికి వసతులు
● జూన్ 10లోగా పనులు పూర్తి చేయండి ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిసిరిసిల్ల: స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల కు టాయిలెట్లు ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ వేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్స్ బట్ట జిల్లాలకు చేరుతుందని, అనుభవం గల స్వశక్తి సంఘాలకు కుట్టే ఆర్డర్లు ఇవ్వాలన్నారు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సీఎస్ సూచించారు. మార్చి 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 1.15లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, లోక్సభ ఎన్నికలు ముగిసినందున మరోసారి ధరణి దరఖాస్తులను పరిశీలించి మే చివరి నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి మళ్లీ ప్రారంభించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, డీఎస్వో జితేందర్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మేనేజర్ జితేంద్రప్రసాద్, మార్కెటింగ్ శాఖ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి, డీఈవో రమేశ్కుమార్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పిడుగులు పడుతున్నయ్.. జాగ్రత్త
● మేఘాల్లోని పాజిటివ్, నెగెటివ్ కణాల వల్లే.. ● వర్షం పడుతుంటే చెట్ల కిందకు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దు ● మెరుపులను చూసేందుకు ప్రయత్నించొద్దు జగిత్యాల అగ్రికల్చర్: ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో వాన పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు వచ్చి, పెద్ద శబ్ధాలతో పడిగులు పడతాయి. వీటికి బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. అందుకే మనుషులతోపాటు జంతువులు చనిపోతాయి. పిడుగుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం కాలిపోతుంటాయి. ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులే ఇలా మృతిచెందుతున్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పిడుగులు పడి, తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లెకు చెందిన కంబోళ్ల శ్రీనివాస్ అనే రైతులు, మూడు పశువులు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగు అంటే.. ఎలా పడుతుంది? మేఘాల్లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చిన్న చిన్న మంచు కణాలుగా విడిపోతుంది. అయితే, విపరీతమైన గాలులు వచ్చినప్పుడు వాటి మధ్య రాపిడి జరిగి, ఒక ఎలక్ట్రికల్ చార్జ్ విడుదలవుతుంది. ఇందులోని పాజిటివ్ కణాలు తేలికగా ఉండటం వల్ల మేఘాల పైకి వెళ్తుంటే, నెగటివ్ కణాలు బరువుగా ఉండి మేఘం కిందికి వెళ్తుంటాయి. అయస్కాంతంలో ఉత్తర, దక్షిణ ధృవాలు ఆకర్షించుకున్నట్లుగానే రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు పాజిటివ్, నెగెటివ్ కణాలు ఆకర్షించుకొని, ఆకాశంలో మెరుపులు వస్తాయి. ఈ సమయంలో మేఘంలోని నెగెటివ్ కణాలు, భూమిలోని పాజిటివ్ కణాలను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు భూమిపై ఎత్తుగా ఉండే చెట్లు, గుట్టలు, మనుషుల ద్వారా ఈ బాండింగ్ జరిగి, మెరుపుతో కూడిన పిడుగు పడుతుంది. అప్రమత్తంగా ఉండాలి.. వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లొద్దు. పిడుగు పడే సమయంలో ఆకాశంలోని మెరుపులు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి, ఆ వెలుతురును చూసేందుకు ప్రయత్నించొవద్దు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే సమయస్ఫూర్తితో వ్యవహరించి, మోకాళ్లపై చేతులు, తలపెట్టి, దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. దీనివల్ల, సమీపంలో పిడుగు పడినా అందులోని విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి, బతికేందుకు అవకాశాలు ఉంటాయి. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాలును భూమి మీద పూర్తిగా ఆనించొద్దు. కాలి వేళ్ల మీద ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యుత్ పరికరాలకు నష్టం.. పిడుగు పడినప్పుడు విద్యుత్ పరికరాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులు వస్తుంటే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలైన టీవీ, రిఫ్రిజిరేటర్, సెల్ఫోన్ వంటి వాటిని వినియోగించకపోవడం ఉత్తమం. అలాగే, మెరుపులు వస్తున్నప్పుడు ఆరుబయట స్నానం చేయడం, వంట పాత్రలు కడగడం చేయవద్దు. లోహపు వస్తువుల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
రైతు సమస్యలపై బీజేపీ రణభేరి
● నేడు ధాన్యం కల్లాల సందర్శన ● 20న తహసీల్దార్, కలెక్టర్లకు వినతిపత్రాలు ● 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు ● బీజేపీ నేతలతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి మోగించింది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు తమ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ శుక్రవారం రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందన్నారు. ఈక్రమంలోనే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా శ నివారం బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని సూచించారు. 19న అన్ని మండల, ని యోజకవర్గకేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతులు పడుతున్న బాధలు వివరించాలన్నారు. 20న తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలని, 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుదీక్షలు చేపట్టాలని కోరారు. -
గాలివాన బీభత్సం
సిరిసిల్ల/వేములవాడ/వేములవాడఅర్బన్/ రుద్రంగి/ముస్తాబాద్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సిరిసిల్ల లో 37.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. రుద్రంగిలో 2.8, చందుర్తిలో 9.8, వేములవాడలో 23.2, వేములవాడరూరల్లో 4.8, బోయినపల్లిలో 17.7, కోనరావుపేటలో 7.9, వీర్నపల్లిలో 6.4, ఎల్లారెడ్డిపేటలో 4.6, గంభీరావుపేటలో 4.8, ముస్తాబాద్లో 26.6, తంగళ్లపల్లిలో 12.8, ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్ల వర్షం పడిందని సీపీవో పీబీ శ్రీనివాస్ తెలిపారు. తడిసిన ధాన్యం రుద్రంగి, ముస్తాబాద్, వేములవాడఅర్బన్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. బస్తాల్లో నింపిన ధాన్యాన్ని రైతులు ఆరబోస్తూ కనిపించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట, ముస్తాబాద్, పోతుగల్, నామాపూర్, చీకోడు గ్రామాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తుమ్మచెట్టు గాలివానకు రోడ్డుపై పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి విరిగిన చెట్టును పక్కకు తొలగించారు. అత్యధికంగా సిరిసిల్లలో 37.3 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్లు రుద్రంగి, ముస్తాబాద్లలో తడిసిన ధాన్యం -
6న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నిక కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈమేరకు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర సహకార ఎన్నికల అఽధికారి శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 30న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితా ప్రకారం ఈనెల 31వ తేదీన గుర్తులు ప్రకటిస్తారు. జూన్ 1వ తేదీన ఎన్నికల ప్రచారం, జూన్ 6న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి, సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటిస్తారు. -
కిడ్నీ బీకేర్ఫుల్
● జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోగులు ● పెయిన్కిల్లర్స్ వినియోగంతో సమస్య ● జిల్లా వ్యాప్తంగా 116 మంది డయాలసిస్ బాధితులు ● సిరిసిల్ల పట్టణంలోనే అత్యధికం ● ఇష్టారీతిగా మందులు వాడొద్దని వైద్యుల సూచనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సంతోషంగా బతకాలంటే మన శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా ఉండాలి. శరీరంలో ఒక్క భాగానికి సమస్య వచ్చినా అది మన జీవన విధానాన్ని మార్చివేస్తుంది. అందరి మాదిరిగా హాయిగా ఉండాలనుకుంటున్నా కొందరిని మూత్రపిండాల వ్యాధి వెంటాడుతోంది. డయాలసిస్ చేయించుకుంటేనే బతికే పరిస్థితికి చేరిపోయారు. ఇలాంటి వారు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 116 మంది ఉన్నారు. వీరంతా కష్టాలతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. మూత్రపిండాల(కిడ్నీలు) సమస్యను వైద్యులు తీవ్రంగా పరిగణిస్తారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలమీదికొస్తుంది. జిల్లాలో 116 మంది బాధితులు జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు 116 మంది ఉన్నారు. వీరంతా రికార్డుల ప్రకారమే.. కానీ వ్యాధి నిర్ధారణ చేయించుకోని వారు పల్లెల్లో ఇంతకుమించి ఉంటారనేది వైద్యుల అంచనా. డయాలసిస్ బాధితులకు వైద్యసేవలు ఎప్పుడెప్పుడు అందించాలో చూసుకునే బాధ్యత జిల్లా వైద్యశాఖలో పనిచేస్తున్న 13 మంది ఆరోగ్యమిత్రలది. కొత్త కేసులను గుర్తించడం, పాత వారిని క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకునేలా ఫాలోఅప్ చేస్తుంటారు. వేములవాడ ప్రాంతంలో 30 మంది, సిరిసిల్ల ఏరియాలో 86 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో 10 డయాలసిస్ మిషన్లు, వేములవాడలో 5 మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లతోనే వీరంతా చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి వారంలో రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో అధికం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనే అత్యధికంగా 86 డయాలసిస్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్కువగా కార్మికులు ఉండడం, వారికి చదువు కూడా అంతంతే ఉండడంతో అవగాహన లేక అనారోగ్యానికి గురవుతున్నారు. అవగాహన లేకుండా పేయిన్కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడడం, కలుషిత నీరు తాగడం, మరికొందరైతే తక్కువ నీరు తీసుకోవడంతో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా కష్టాన్ని మరిచిపోయేందుకు చీప్లిక్కర్ సేవించడం ప్రధాన సమస్యగా వైద్యులు పేర్కొంటున్నారు. అవగాహన కల్పించని వైద్యశాఖ జిల్లాలో ఇంత మంది కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే వ్యాధి నివారణకు వైద్యశాఖ కనీసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. పల్లె, పట్టణాల్లోని హమాలీలు, కూలీల అడ్డాల వద్ద కనీసం అవగాహన సదస్సులు పెడితే ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా హైడోస్ పెయిన్కిల్లర్స్ రాసే ప్రైవేట్ వైద్యులపై చర్యలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతను కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన భూక్య నిమ్యానాయక్. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షలు చేసిన వైద్యులు మూత్రపిండాల సమస్య ఉందని గుర్తించారు. కొద్దికాలం వైద్యుల సూచనలతో వ్యాధి నివారణకు మందులు వాడాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సిరిసిల్లలోని ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇలా 116 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు.వ్యాధికి కారణాలు ఇవే.. రోజులో ఒక వ్యక్తి కనీసం ఐదు లీటర్ల నీటిని తాగితే కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కానీ జిల్లాలో చాలా మంది 2 నుంచి 3 లీటర్లే తాగుతున్నట్లు వైద్యశాఖ సర్వేలో తేలింది. గ్రామాల్లో కలుషిత నీటిని తాగడం ద్వారా కూడా మూత్రపిండాలు దెబ్బతింటున్నట్లు వైద్యులు తెలిపారు. పలు సందర్భాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షించిన సందర్భాల్లో కొన్ని ఖనిజాలు అధికంగా ఉన్నట్లు తేలింది. కాచి వడబోసిన నీటిని లేదా శుద్ధనీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో ప్రధానమైన సమస్య.. జిల్లాలోని పల్లెల్లో కూలీలు, రైతులు, హమాలీలు చిన్నపాటి సమస్యకే హైడోస్ పెయిన్కిల్లర్స్ వాడుతుండడంతో కిడ్నీలు పాడవుతున్నాయని జిల్లా వైద్యులు పేర్కొంటున్నారు. హైడోస్ పెయిన్కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని సూచిస్తున్నారు.పలు కారణాలతోనే.. మూత్రపిండాల వ్యాధి బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన నీటిని తాగకపోవడం, మోతాదుకు మించి పేయిన్కిల్లర్స్ వాడడం, శరీరానికి సరిపడ నీరు తీసుకోకపోవడంతోనే కిడ్నీలు పాడవుతున్నాయి. అనుమానం వచ్చిన గ్రామాల్లోకి వెళ్లి నీటిశాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నాం. సమస్య ఉందని తెలిస్తే ఆ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నాం. – సుమన్మోహన్రావు, డీఎంహెచ్వో -
ప్రజాచైతన్యంతోనే డెంగీ నివారణ
● డీఎంహెచ్వో సుమన్మోహన్రావుసిరిసిల్లటౌన్: ప్రజాచైతన్యంతోనే డెంగీని నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్రావు పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. డ్రైడే పాటించా లని సూచించారు. జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్జాన్, వైద్యులు లక్ష్మీప్రసన్న, ఉమాదేవి, హెచ్ఈవో బాలయ్య, ఎస్యూవో మోహన్, హెచ్ఎస్ భూమయ్య పాల్గొన్నారు. పది శాతం యారన్ సబ్సిడీ కొనసాగించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): పవర్లూమ్ కార్మికులకు అందిస్తున్న 10 శాతం యారన్ సబ్సిడీని ప్రభుత్వం, అధికారులు తగ్గించాలని చూస్తున్నారని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆరోపించారు. ఎప్పటిలాగే పది శాతం సబ్సిడీ కొనసాగించాలని కోరారు. తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో గురువా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి చెల్లించా ల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అందించినట్లుగానే సబ్సిడీని కొనసాగించకుంటే చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు కూచన శంకర్, అన్నల్దాస్ గణేశ్, అక్కల శ్రీ నివాస్, జెల్ల సదానందం, ఆడెపు శుభశేఖర్, రాజ మల్లు, శ్రీనివాస్, నరేశ్, శ్రీకాంత్, వెంకటేశ్, సంపత్, ఆంజనేయులు, రాజశేఖర్, ర మేశ్, రాజు, శంకర్, అంబదాస్ పాల్గొన్నారు. ‘సీఎం వ్యాఖ్యలను వక్రీకరించారు’ సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యా ఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించి, ఉనికి కోసం దొంగ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ కోకన్వీనర్ కనిమేని చక్రధర్రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఛీత్కరించారని, పార్లమెంటు ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుండడంతో ఆ పార్టీ నాయకులు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గొల్లపల్లి పర్శరాములు, నక్క నర్సయ్య, అన్నల్దాస్ భాను, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, తిరుపతి పాల్గొన్నారు. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ డ్రామాలు● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్చందుర్తి(వేములవాడ): పదేళ్లు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే రైతులపై కపట ప్రేమ చూపుతూ డ్రామాలాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. చందుర్తిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గతంలో ధాన్యం బస్తాకు 44 కిలోలు తూకం వేసి దోసుకున్న సంగతి రైతులు మరిచిపోలేదన్నారు. ప్రస్తుతం బస్తాకు 41.600 కిలోలు తూకం వేస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోతామనే బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. జెడ్పీటీసీ నాగం కుమార్, మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు దారం చంద్రం, పులి సత్తయ్య, గొట్టె ప్రభాకర్, చిలుక భూమేశ్, డిష్ రవి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలైన్ భూసేకరణ పూర్తి చేయండి
● కలెక్టర్ అనురాగ్ జయంతిసిరిసిల్ల: జిల్లా పరిధిలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి భూసేకరణ పనులు వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం రైల్వేలైన్ భూసేకరణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ, అనుపురం, కొడుముంజ, నాంపల్లి గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఎఫ్వో బాలమణి, రైల్వేశాఖ సీఈ, సిరిసిల్ల ఆర్డీవో రమేశ్, ఏడీ సర్వే శ్రీనివాస్, ఆర్అండ్బీ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలి జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. కలెక్టరేట్లో స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధిపై సమీక్షించారు. నూతన ఆలోచనలతో మహిళలు వివిధ వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందజేయాలన్నారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు అవసరమైన శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపార అవకాశాలు, ఉపాధి మార్గాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ పి.గౌతమి, రాష్ట్ర మెప్మా కో–ఆర్డినేటర్లు పద్మ, ప్రమోద్కుమార్, శరత్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అవినాశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
‘పెద్దపల్లి బైపాస్’ చకచకా
● ఊపందుకున్న రైల్వేస్టేషన్ పనులు ● చీకురాయి వద్ద స్టేషన్, ట్రాక్ కోసం భూమి చదును ● పెద్దపల్లి–నిజామాబాద్–కాజీపేట రూట్లో తగ్గనున్న దూరభారం ● తిరుపతి ప్రయాణికులకు సమయం ఆదా ● రైల్వేలైన్ పూర్తయితే మధ్యలో ఆగకుండా కాజీపేట వెళ్లే అవకాశంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్ మార్గంలో పెద్దపల్లి బైపాస్ స్టేషన్ పనులు ఊపందుకున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉండగా గతేడాది మోక్షం లభించిన విషయం విధితమే. ప్రస్తుతం చీకురాయి వద్ద ట్రాక్, స్టేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ట్రాక్ వచ్చే రైల్వే బడ్జెట్ నాటికి అందుబాటులోకి రావొచ్చని నిపుణుల అంచనా. అప్పుడు పెద్దపల్లి–నిజామాబాద్ రూట్ నుంచి కాజీపేట మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఎక్కడా ఆగే అవసరం ఉండదు. ఎక్కడ నిర్మిస్తున్నారు? 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్కు శంకుస్థాపన చేశారు. అది దాదాపు మూడు దశాబ్దాలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ముంబై నుంచి కాజీపేటను కలిపే రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గం నుంచి కాజీపేటకు వెళ్లాల్సి న రైళ్లు పెద్దపల్లి వెళ్లాలి. ఇలా దాదాపు 40 నుంచి 60 నిమిషాలకు పైగా వేచి చూడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా పెద్దపల్లి–బల్లార్షా–కాజీ పేట లైన్ను పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంతో అనుసంధానించాలని నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చీకురాయి సమీ పంలో స్థలాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. తొలుత ఈ మార్గంలో సర్వేలు చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు మధ్య పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ నిర్మించ తలపెట్టారు. దాంతో రెండు మార్గాలను కలపాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు రెండు గ్రామాల పరిధిలో గతేడాది భూసేకరణకు స్థాని కులను ఒప్పించారు. గత ఆగస్టులో బైపాస్లైన్లో ఎలరక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. తగ్గనున్న దూరభారం, సమయం ఈ స్టేషన్, రెండు కిలోమీటర్ల బైపాస్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ మీదుగా కాజీపేట వెళ్లాల్సిన రైళ్లు పెద్దపల్లిలో ఆగాల్సిన అవసరం లేదు. అవి నేరుగా కాజీపేట వెళ్లే వీలుంటుంది. ప్రస్తుతం తిరుపతి–కరీంనగర్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ గురువారం, ఆదివారం కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తోంది. ఈక్రమంలో కాజీపేటకు సిగ్న ల్ దొరికేందుకు దాదాపు 40 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతుంది. త్వరలో బైపాస్ స్టేషన్, ట్రాక్ పూర్తయితే తిరుపతి ప్రయాణంలో ఒక గంట కలిసి వస్తుంది. ఇదే రైలు తిరిగి వచ్చే క్రమంలోనూ మరో గంట సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నా రు. ఈ మార్గం పూర్తయితే విజయవాడతోపాటు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్ మార్గాల్లో దూరభారం, సమయం తగ్గనున్నాయి. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మా ర్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గంలో వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీని వల్ల చాలా ఇంధనం, సమ యం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూ ట్కు డిమాండ్ పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధి కంగా ఆదాయం తీసుకొచ్చే రైల్వే మార్గాల్లో పె ద్దపల్లి–నిజామాబాద్ మార్గం ఒకటిగా నిలిచింది. ఏఎంఆర్యూటీ పథకం కింద నిధులు మంజూరు ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్(డెమూ, మెమూ) ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాజీపేట నుంచి దాదర్ ముంబయి వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ఇటీవల నిలిపివేశారు. తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రమే రెగ్యులర్గా నడుస్తోంది. ఈ రైల్వే మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలున్నాయి. భవిష్యత్తులో ఈ మార్గం డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు ప్రయాణికుల రైళ్లు పెరిగే అవకాశాలున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మి షన్(ఏఎంఆర్యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు రూ.26.60కోట్లు, రామగుండం రూ.26.50కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్, రామగుండం పనులు త్వరలో పూర్తికానుండగా, పెద్దపల్లిలోనూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సంతోషంగా ఉంది చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య రైల్వేస్టేషన్ నిర్మిస్తారని తెలిసినప్పటి నుంచి సంతో షంగా ఉంది. ఇటీవల పనులు మొదలయ్యాయి. ఇక్కడ స్టేషన్ కడితే.. పెద్దపల్లి పట్టణం మరో పక్క నుంచి అభివృద్ధి మొదలవుతుంది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారికి సమయం, దూరభారం తగ్గుతాయి. – మేకల శ్రీనివాస్ -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి
సిరిసిల్లటౌన్/వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వం వ్య వహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడల్లో గురువారం దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి దోఖా ఇచ్చారన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు సన్నాలకే ఇస్తామని యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా రూ.15వేలు ఏమైందని ప్రశ్నించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, వెంగల శ్రీనివాస్, గజభీంకార్ రాజన్న, సురేందర్రావు, అందె సుభాశ్, కుంభాల మల్లారెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మినర్సింహారావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి, గోస్కుల రవి, మల్యాల దేవ య్య, కందుల క్రాంతికుమార్, ఏనుగు తిరుపతి రెడ్డి, బండ నర్సయ్యయాదవ్, రామ్మోహన్రావు, చంద్రయ్యగౌడ్, మారం కుమార్, నిమ్మశెట్టి విజ య్, గోలి మహేశ్, గడ్డం హన్మండ్లు పాల్గొన్నారు. రూ.500 బోనస్పై యూటర్న్ సిగ్గుచేటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య -
సమాన హక్కులు కల్పించాలి
జ్యోతినగర్(రామగుండం): చాలా ఏళ్ల నుంచి ఐదో షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ని వాసముంటున్న ఎస్సీలకు ఎస్టీలతో సమా న హక్కులు కల్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్కు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేశ్ విన్నవించారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్ జ్యోతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఏజెన్సీ ఐదో షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో జన్మించిన ఎస్సీలకు భూమిపై హక్కులు, రాజకీయ రిజర్వేషన్ లేక, జీవో 3తో ఉద్యోగ అవకాశాలు రాక ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టం, జీవో 3 తీసుకువచ్చి ఏజెన్సీ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5వ, 6వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న దళితుల జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి ఎస్టీలతో ఎస్సీలకు సమాన హక్కులు కల్పించాలని కోరారు. నేతకాని ఎస్సీ కులస్తుల కుల ధ్రువీకరణ పత్రం రాష్ట్ర గెజిట్లో నేత్కాని, కేంద్ర జాబితాలో నేతానిగా స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందని, నేతకానిగా వచ్చేలా కృషి చేయాలని కోరగా, రాంచందర్ సానుకూలంగా స్పందించి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కమ్మగిరి శ్రీకాంత్ పలువురు ఉన్నారు. -
జాతీయస్థాయి డాడ్జిబాల్ పోటీలు ప్రారంభం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): తెలంగాణ ప్రాంతంలో తొలిసారిగా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాం స్డేడియంలో గురువారం జాతీయస్థాయి డాడ్జిబాల్ ఫెడరల్ కప్– 24 పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో గుజరాత్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు చెందిన 24 మహిళ, పురుషుల జట్లు పాల్గొన్నాయి. డాడ్జిబాల్లో 12 మంది క్రీడాకారులతో 20 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఈ క్రీడ ఆసక్తికరంగా కొనసాగుతుంది. రెండురోజుల పాటు నిర్వహించే పోటీల్లో అత్యంత ప్రతిభచూపిన రెండు జట్లను ఎంపిక చేసి ఆగస్టులో 11 నుంచి 17 వరకు ఆస్ట్రియా దేశంలో నిర్వహించే అంతర్జాతీయస్థాయి పోటీలకు పంపిస్తారు. హాజరైన 12 రాష్ట్రాల క్రీడాకారులు రెండు రోజుల పాటు నిర్వహణ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
ప్రేమ పేరిట యువతి మోసం
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
పట్టించుకుంటలేరు
స్ట్రాంగ్రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలి
సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలి
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement