-
సఖి సెంటర్ను సందర్శించిన జడ్జి
ములుగు: జిల్లాకేంద్రంలో సఖి వన్స్టాఫ్ సెంటర్ను శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి టి.కన్నయ్యలాల్ సందర్శించారు. సఖి సెంటర్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయం, చైల్డ్లైన్, బాలల సంక్షేమ సమితి కార్యాలయాలను పరిశీలించారు. బాలలకు ఉన్న సమస్యలు, వస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య తదితరులు ఉన్నారు. -
రోడ్డుపైనే ఇసుక లారీలు
● ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులుమంగపేట: మండల పరిధిలోని గంపోనిగూడెం– కమలాపురం మధ్య ఏటూరునాగారం–బర్గంపాడు ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలు నిలిపి వేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంపోనిగూడెం మార్కెట్ యార్డు సమీపంలోని గోదావరి ఇసుక క్వారీకి వచ్చే వందలాది లారీలు రోడ్డుపైనే నిలిపి వేస్తున్నారు. దీంతో తరచుగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. ప్రధాన రోడ్డు ఇరుకుగా ఉండటంతో రోడ్డుపైనే ఇసుక లారీలు నిలపడం మూలంగా వచ్చి వెళ్లే ద్విచక్రవాహనదారులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంటొంది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారిణి స్వర్ణలత లెనినా అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయో వృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. నడవలేని వారి కోసం పోలింగ్ రూంలోకి తీసుకెళ్లడానికి వీల్చైర్లతో పాటు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదే విధంగా వీరికోసం ప్రత్యేకమైన క్యూలైన్లు, తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లతో పాటు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బధిరులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంతరం ఏటూరునాగారం ఎంపీడీఓ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కుపై పలు సూచనలు చేశారు. అనంతరం ఓటర్లతో ఓటు నమోదుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయం లోని ఉద్యోగులందరికీ ఎస్వీఈఈపీ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ వద్ద ఏపీఓ వసంతరావుతో కలిసి ఓటర్ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, దివ్యాంగుల సంఘం నాయకులు పొన్నం సంతోష్, మాణిక్యరావు, స్థానిక బీఎల్ఓలు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో ఓటర్లకు అవగాహన మంగపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారి స్వర్ణలత లెనినా, ములుగు అసెంబ్లీ నోడల్ అధికారి సతీష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై వారు వివరించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యంతో పాటు తదితర అంశాలపై వివరించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఏటూరునాగారం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ అప్పయ్య అధికారులకు హెచ్చరించారు. మండల పరిధిలోని చెల్పాకలో రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్పయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా మొదటగా హాజరు పట్టికను పరిశీలించి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ సంతకాలు లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్ సుమలతను ప్రశ్నించారు. ఫార్మాసిస్ట్ ఈ రోజు టీకాల సరఫరాకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి వెళ్లారని బదులిచ్చారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గురించి అడగగా ఈ రోజు సెలవుల్లో ఉన్నారని వివరించారు. అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్, ఫార్మసిస్టులు గైర్హాజర్ కావడంతో వారికి మోమోలు జారీ చేశామన్నారు. అలాగే కుక్క, పాము కాటు వ్యాక్సిన్ల గురించి ఆరా తీయగా 35 నిల్వ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా వడదెబ్బపై గ్రామాల్లోని ప్రజలకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కల్పించాలని సిబ్బందిని సూచించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి
వెంకటాపురం(ఎం): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని మాజీ రాష్ట్రమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మండల పరిధిలోని వెంకటాపురం, లక్ష్మీదేవిపేట గ్రామాలలో బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడారు. ఎంపీగా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమిలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపించి కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం నల్లగుంట గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు పోరిక హర్జినాయక్ తండ్రి వాగ్యానాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ అభ్యర్థి కవిత, బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, నాయకులు పోరిక గోవింద్నాయక్, మల్క రమేష్, అశోక్, రమణారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement