సఖి సెంటర్‌ను సందర్శించిన జడ్జి | Sakshi
Sakshi News home page

సఖి సెంటర్‌ను సందర్శించిన జడ్జి

Published Sun, May 5 2024 2:40 AM

సఖి సెంటర్‌ను సందర్శించిన జడ్జి

ములుగు: జిల్లాకేంద్రంలో సఖి వన్‌స్టాఫ్‌ సెంటర్‌ను శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి టి.కన్నయ్యలాల్‌ సందర్శించారు. సఖి సెంటర్‌లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయం, చైల్డ్‌లైన్‌, బాలల సంక్షేమ సమితి కార్యాలయాలను పరిశీలించారు. బాలలకు ఉన్న సమస్యలు, వస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మేకల మహేందర్‌, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ బానోత్‌ స్వామిదాస్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాచర్ల రాజ్‌కుమార్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, సఖి సెంటర్‌ అడ్మిన్‌ లావణ్య తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement