-
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
సాక్షి,బళ్లారి: కేంద్రంలో కాంగ్రెస్ అఽధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన ఆదివారం బెళగావి జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఈసారి ఎన్డీఏ అధికారంలోకి రాదని, బీజేపీకి 200 సీట్లు కంటే ఎక్కువ రావన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తందన్నారు. ఇండియా కూటమికి 300 సీట్లు కంటే ఎక్కువగా వస్తాయని, ఎన్డీఏ కూటమి 400 వస్తాయని కలలు కంటోందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని, ఈ విషయాన్ని యావత్ దేశ ప్రజలు గమనించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో పేదలు కడుపు నింపేందుకు బియ్యం అడిగినా, ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీతో పేదలకు ఎంతో మేలు జరగుతుందన్నారు. ప్రతి నెల రూ.2 వేలు మహిళలకు, ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, 10 కేజీలు బియ్యం అందిస్తున్నామన్నారు. నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గ్యారెంటీలను నిలుపుదల చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి మోదీకి చేతులు రాలేదని, అంబాని, అదానిలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. రైతులకు రుణమాఫీ అంటే నోట్లు ప్రింట్ చేయడం లేదని అంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకు పైగా గెలుస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ... ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జివాలా మాట్లాడుతూ... వందలాది మహిళలపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను రక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయం తెలిసినా జేడీఎస్తో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతి మహిళకు ఏడాదికి లక్ష ఈసారి బీజేపీకి 200 సీట్లు కంటే పెరగవు : సీఎం సిద్దరామయ్య -
విజృంభిస్తున్న ఎండలు
రాయచూరు రూరల్: వేసవి ఎండలు విజృంభిస్తున్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్కరోజే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని సింధనూరు తాలూకా ముక్కుందా గ్రామ పంచాయతీ పరిధిలోని హుడాలో ఒకే కుటుంబానికి చెందిన ప్రదీప్ (15), గంగమ్మ (60), దుర్గమ్మ (60), వీరేశ్ (50) వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు. రాయచూరు జిల్లాలో వడదెబ్బతో మరో నలుగురు మృతి ఆరుకు చేరుకున్న మృతుల సంఖ్య -
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
హుబ్లీ: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరిపిన ఘటన శనివారం అర్దరాత్రి సుతగట్టి గ్రామంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన సద్దాహుస్సేన్ నిందితుడు. ఇతను ఓ బాలికను ప్రేమ పేరుతో న మ్మించి గర్భవతిని చేసి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రులు నవనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగా సుతగట్టి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. విద్యాగిరి సీఐ సంగమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. వీరి రాకను గమనించిన సద్దాహుస్సేన్ పోలీసులపై చాకుతో దాడికి దిగాడు. దీంతో ఓ పోలీస్ గాయపడ్డాడు. సీఐ సంగమేశ్ నిందితుడి కాలికి షూట్ చేశాడు. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. దింగాలేశ్వర స్వామిపై ఫిర్యాదు హుబ్లీ: సిరహట్టి శ్రీ ఫక్కీరేశ్వర మఠం శ్రీ దింగాలేశ్వర స్వామిపై హుబ్లీ ఏపీఎంసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమారస్వామి నవళగుంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న జిల్లాలోని నవళగుందలో జరిగిన స్వాభిమాని ఓటర్ల సమావేశంలో కుల, మతం పేరుతో వైరం కలిగేలా దింగాలేశ్వర స్వామి మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదుహుబ్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్కు అపూర్వ ఆదరణ వస్తోందని, ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా చేరుకోలేదని మంత్రి దినేశ్ గుండూరావ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికలు సత్య, అసత్యానికి జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. బీజేపీ ఎప్పటికి రిజర్వేషన్లకు సానుకూలంగా లేదు. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ రాజ్యాంగం, రిజర్వేషన్ల గురించి మాట్లాడారన్నారు. రిజర్వేషన్లపై వారికి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పే బీజేపీని ఇంటికి సాగనంపి ధార్వాడ లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ప్రహ్లాద్జోషి అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కర్ణాటకకు బీజేపీ ఏం చేసిందని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు చేసుకోవాలి బళ్లారిఅర్బన్: గర్భిణులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రసవ సమయంలో వెంటనే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని డీహెచ్ఓ డాక్టర్.వై.రమేష్బాబు తెలిపారు. సమీపంలోని ఎమ్మిగనూరు గ్రామంలో ఓ గర్భిణి ఇంటికి వెళ్లి పరిశీలించారు. మాతా శిశు మరణాలు అరికట్టేందుకు సరైన మందులు వేసుకోవాలని, ఐరన్ మందుల సేవనం, బీపీ, హెచ్ఐవీ, రక్తహీనత తదితర అవసరమైన పరీక్షలను చేయించుకోవాలన్నారు. కాన్పులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో గర్భిణులు ఎక్కువగా పౌష్టికాహారం, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కంప్లి తాలూకా ఆరోగ్య పర్యవేక్షణ అధికారి డాక్టర్.అరుణ్, వైద్యాధికారి డాక్టర్, ఫరూక్, జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఈశ్వర్ హెచ్ దాసప్పనవర, జిల్లా నర్సింగ్ అధికారి గిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నవరతన్ నగలు.. పెట్టుబడికి మార్గం
బనశంకరి: ఇది స్మార్ట్ పథకం, ఈ నెలలో మీకు నచ్చిన బంగారు, వజ్రాభరణాలు, వెండి సామగ్రి కొనుగోలు చేస్తే మీ కలలు సాకారం అవుతాయి. నవరతన్ ప్రస్తుతం బంగారం, శ్రేష్టమైన సంపూర్ణం అనే మూడు విజయవంతమైన మిగులు పథకాలను మీకు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవరతన్ ఆభరణాల కొనుగోలు ద్వారా మీ డబ్బు ఆదా అయి పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం అవుతుందన్నారు. అంతేగాక అనవసర వ్యయం , విలాసవంతమైన కొనుగోళ్లుతో కలిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చన్నారు. డబ్బు ఉత్తమ భవిష్యత్ కోసమనే మంత్రంతో అందరి భవిష్యత్ సుభద్రంగా ఉండాలనేది నవరతన్ ఆశయమన్నారు. బంగారం కోసమే కాకుండా మీకు నచ్చిన ఆభరణాలను ధరించే కల సాకారమౌతుంది. దీనికోసం నవరతన్ ఆభరణాలను కొనుగోలు చేయాలని తెలిపారు. మేకింగ్ లేదా వేస్టేజ్ ఫీజుల బెడద ఉండదని అన్నారు. -
బహిరంగ ప్రచారానికి తెర
సాక్షి, బళ్లారి: లోక్సభ ఎన్నికల్లో రెండో విడత పోరు ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. రెండో దశలో మిగిలిన 14 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నెల రోజులుగా అన్ని పార్టీల నేతలు హోరాహోరీ ప్రచారం కొనసాగింది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు శ్రమించారు. ఈనెల 7న ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, దావణగెర, బాగల్కోట, బీదర్, హావేరి, విజయపుర, బెళగావి, గదగ్, కలబుర్గి తదితర 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రచారంలో అగ్రనేతలు : ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఎండలతో నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ప్రచారం హోరెత్తించారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, సీఎం సిద్ధరామయ్యలు విస్తృతంగా ప్రచారం చేశారు. మండుటెండల్లో నేతలు సైతం తమ పార్టీ అభ్యర్థులు తరపున తమదైన శైలిలో వాగ్భాణాలు సంధిస్తూ ప్రచారం చేశారు. చివరి రోజు జిల్లా వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, మాజీ సీఎం సదానందగౌడ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. బహిరంగ ప్రచారానికి తెరపడటంతో నేడు (సోమవారం) సాయంత్రం వరకు ఇంటింటా ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉండటంతో అభ్యర్థితో పాటు కలిసి నలుగురు లేదా ఐదుగురు ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. బహిరంగ ప్రచారానికి చివరి రోజు కావడంతో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సూర్జివాలా బెళగావి జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. బళ్లారి లోక్సభ నియోజవర్గ పరిధిలో బీజేపీ తరపున బీ.శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ తరపున తుకారం ఎన్నికల బరిలో ఉండటంతో ఇద్దరు సమఉజ్జీలే కావడంతో రెండు పార్టీలు గట్టి పోటీ పడుతున్నాయి. పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. నేడు ఇంటింటా ప్రచారం రేపే లోక్సభ ఎన్నికల పోలింగ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement