-
ఫ్లై ఓవర్ గోడెక్కిన బస్సు
● నెలమంగల వద్ద ప్రమాదం దొడ్డబళ్లాపురం: అదుపు తప్పిన కేఎస్ ఆర్టీసీ బస్సు ఫ్లై ఓవర్ అడ్డుగోడపైకి ఎక్కింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన నెలమంగల వద్ద చోటుచేసుకుంది. సోమవారపేట నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు నెలమంగల– బెంగళూరు హైవేలో అడకమారనహళ్లి వద్ద 40 అడుగుల ఎత్తైన ఫ్లై ఓవర్ వంతెనపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని అడ్డుగోడపైకి ఎక్కి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిసి ఆరుమందికి గాయాలయ్యాయి. బస్సు ఆ వంతెన మీద నుంచి కిందకు పడిఉంటే పెద్ద దారుణమే జరిగేది. ప్రయాణికులు ఈ ప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది జేసీబీని రప్పించి బస్సును జాగ్రత్తకు రోడ్డు మీదకు తెచ్చారు. -
కావేరిపై ఏదీ కరుణ?
బోరుమంటున్న మండ్య కృష్ణరాజ సాగర డ్యాం మండ్య: కావేరి, ఉప నదులపైనున్న డ్యాములు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. వర్షాలు ఊపందుకోని పక్షంలో తమ గతేమిటని పరిసర ప్రాంతాల రైతులు, ప్రజల్లో దిగులు నెలకొంది. గత ఆరేళ్లతో పోలిస్తే కృష్ణరాజసాగర జలాశయంలో నీటి మట్టం ఈ సీజన్లో కనిష్టంగా మారింది. ప్రస్తుతం జలాశయంలో 80.25 అడుగుల నీరు మాత్రమే ఉంది. 2019లో ఇదే జలాశయంలో 81.88 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో వెలవెలబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడుకు నిరంతరాయంగా నీటిని జలాశయం నుంచి విడుదల చేస్తోంది. దీంతో డ్యాం పరిస్థితి ఇంకా తీసికట్టు అయ్యింది. ప్రస్తుతం కేఆర్ఎస్కు 1,560 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 155 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కేరళ, అటవీ ప్రాంతాల్లో రుతు పవన వర్షాలు ఊపందుకుంటే కావేరి నదీ ప్రవాహం పెరిగే అవకాశముంది. అదే మాదిరిగా కబిని జిల్లాలోని హెచ్డీ తాలూకా బీచనహళ్లిలో కబిని జలాశయంలో నీటి ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతోంది. గత వారం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కబిని జలాశయానికి మాత్రం నీరు రావడం లేదు. జలాశయానికి నీరు రావాలంటే కేరళలో వర్షాలు పడాలి. కానీ అక్కడ వర్షం పడడం లేదు. ఈ నేపథ్యంలో వైనాడులో పుష్కలంగా వర్షాలు కురవాలని పరిసర ప్రాంతాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. డ్యాం ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరింది. కేఆర్ఎస్ డ్యాంలో క్షీణించిన నీటిమట్టం రాబోయే వర్షాలపైనే ఆశలు -
విహారయాత్రలో ఘోరం ●
● నదిలో మునిగి నలుగురు మృతి యశవంతపుర: బట్టలు ఉతకడానికి వెళ్లిన నలుగురు నదిపాలైన ఘటన కర్ణాటక – మహారాష్ట్ర సరిహాద్దులోని కొల్హాపుర జిల్లా కాగల్ తాలూకా బస్తవాడె గ్రామంలో జరిగింది. మహరాష్ట్ర ముర్కడ్ గ్రామానికి చెందిన జితేంద్ర విలాస్ లోక్త (36), రుక్ది గ్రామానికి చెందిన సవితా అమర్ కాంబళె (27), బెళగావి జిల్లా అథణికి చెందిన రేష్మా దిలీప్ (34), యశ్ దిలీప్ (17)లు మృతి చెందారు. వీరందరూ రెండు కుటుంబాలకు చెందినవారు. వీరు నలుగురు కలిసి విహారం కోసం వేదగంగా నదికి వెళ్లారు. శుక్రవారం అనూరు గ్రామంలోని అతిథి గృహంలో నిద్రించారు. శనివారం ఉదయం బట్టలు ఉతుక్కోవడానికి నది తీరానికి వెళ్లినప్పుడు ఇద్దరు జారి నీటిలోకి పడిపోయారు. వారిని కాపాడబోయి మరో ఇద్దరూ నదిలోకి పడిపోయారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారే కరువయ్యారు. కాగల్పురి పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
అమ్మవారికి విశేష పూజలు
బనశంకరి: భక్తుల మొక్కుల తీర్చే కల్పవల్లి బనశంకరీ దేవి భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చింది. శనివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం అర్చకుడు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకం, అర్చనలు చేశారు. పలు పుష్పాలతో అలంకకరించి భక్తులకు దర్శనం కల్పించారు. లంచగొండ్ల ఆటకట్టు ● పలుచోట్ల లోకాయుక్త దాడులు దొడ్డబళ్లాపురం/ యశవంతపుర: లంచం తీసుకుంటూ ఎస్సై, కానిస్టేబుల్ లోకాయుక్త వలలో చిక్కిన సంఘటన హావేరి జిల్లి శిగ్గాంవ్ తాలూకా తడస పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. ఎస్ఐ శరణబసప్ప, కానిస్టేబుల్ సురేశ్లు తమ స్టేషన్ పరిధిలో పేకాట ఆడించడానికి రూ.5 లక్షలు డిమాండు చేశారు. ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు ఎస్సై, కానిస్టేబుల్ రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. సర్వే చేయడానికి ముడుపులు లోకాయుక్త పోలీసులు శనివారం కలబురగి, విజయపురలో ఇద్దరు లంచగొండ్లను పట్టుకున్నారు. విజయపురలో రైతు ప్రకాష్సింగ్ భూమిని సర్వే చేయడానికి సర్వేయర్ మల్లప్ప జంబగి రూ. 47 వేల లంచం తీసుకొంటూ ఉండగా అరెస్టు చేశారు. కలబురగిలో విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ఎఫ్డిఎ శివశంకర్ పదో తరగతి మార్కుల కార్డు నకలు ఇవ్వడానికి అరుణ్ ఖతీబ్ అనే వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకొంటూ లోకాయుక్తకు చిక్కాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విమానానికి బాంబు బెదిరింపు.. అరెస్టు దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి పూణెకి బయలుదేరే విమానంలో బాంబు పెట్టినట్టు బెదిరించిన దుండగున్ని కెంపేగౌడ ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. హరియానాలోని హిస్సార్కు చెందిన రాజేశ్కుమార్ దేనివాల్ నిందితుడు. బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి దేనివాల్ వచ్చాడు. చెక్ఇన్ వద్దనున్న బ్యాగ్లో బాంబు ఉందంటూ బెదిరించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని, విమానంలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీ చేయగా ఎలాంటి బాంబు లభించలేదు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మిస్టరీగా దంపతుల మృతి ●● తేల్లారేసరికి శవాలుగా.. ● పిరియాపట్టణలో ఘటన మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ గొల్లరవీధి ఇంట్లో దంపతులు శవమై తేలారు. ప్రకాశ్ (47), యశోద (46)లు మృత దంపతులు. వివరాలు.. తాలూకా పంచాయతీ వద్ద టీ అంగడి నిర్వహిస్తున్న ప్రకాశ్, యశోదకి తనుశ్రీ అనే కుమార్తె ఉంది. మైసూరు యువరాజు కాలేజీలో ఆమె బీఎస్సీ చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. ఇక గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చిన దంపతులు తమ ఇంట్లో నిద్రించారు. శుక్రవారం బయటకు రాలేదు, టీ దుకాణం కూడా తెరవలేదు. కూతురు కాల్ చేస్తే కుమార్తె ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన తనుశ్రీ తన బంధువులకు సమాచారం అందించింది. ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా యశోద మంచంపై విగతజీవిగా కనిపించింది. ప్రకాశ్ మృతదేహం తలుపు వద్ద కనిపించింది. ఇవి హత్యలా, ఆత్మహత్యలా అనేది మిస్టరీగా ఉంది. జిల్లా ఎస్పీ సీమా లాట్కర్ , అదనపు ఎస్పీ నందిని చేరుకుని పరిశీలించారు. పిరియాపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
జర్మనీ నుంచి ఇంగ్లండ్కు!.. ప్రజ్వల్పై అరెస్ట్ వారెంట్ జారీ
బనశంకరి: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎప్పుడు వస్తాడనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత నెల 27వ తేదీన దేశం విడిచి వెళ్లిన ఎంపీ ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు, సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. నగ్న వీడియోలు, లైంగికదాడి కేసులో నిందితుడైన ప్రజ్వల్ జర్మనీ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్కి మకాం మార్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుసార్లు భారత్కు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్ అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.ఇంగ్లండ్లో ఓ భారత పారిశ్రామికవేత్త సహాయంతో ఎంపీ ప్రజ్వల్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బ్రిటన్కి వెళ్లాడని తెలిసింది. తన జాడ తెలుస్తుందనే భయంతో ప్రజ్వల్ గత 15 రోజులుగా కుటుంబంతో కూడా మాట్లాడలేదని తెలిసింది.జూన్ 4 తరువాతే నిర్ణయంప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే రెండుసార్లు లుఫ్తాన్సా విమాన టికెట్ రద్దు చేసుకున్నారు. మే 3, 15 తేదీన భారత్ కు రావడానికి టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశారు. దీంతో సిట్ అదికారులు ప్రజ్వల్ మళ్లీ ఎప్పుడు టికెట్ బుక్ చేసుకుంటాడా అని నిఘాపెట్టారు. దేశమంతా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడతాయి. ఆ తరువాత పరిణామాలను బట్టి బెంగళూరుకు రావాలా, మరింత ఆలస్యం చేయాలా అనేది ప్రజ్వల్ నిర్ణయించుకుంటారు. మరోపక్క వెంటనే రావాలని కుటుంబసభ్యులు ఆయనను కోరినట్లు తెలిసింది.ఇక.. ప్రజ్వల్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ప్ర జ్వల్కు చెందిన అన్ని బ్యాంకు అకౌంట్ల సమాచారం సేకరించి వాటిని స్తంభింపజేశారు. ఆయనకు ఏయే ఖాతాల ద్వారా నగదు జమైందో విచారణ చేపట్టారు. విదేశాల్లో గడపాలంటే చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆయనకు డబ్బు ఎలా చేరుతోందో కనిపెట్టే పనిలో ఉన్నారు. -
చురుగ్గా వ్యవసాయ కార్యకలాపాలు
హొసపేటె: విజయనగర జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నులయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల ముఖాల్లో చిరునవ్వు నిండింది. మండు వేసవితో విసిగి వేశారిన రైతులు వర్షం కోసం ఆకాశం వైపు దిక్కులు చూస్తూ కూర్చున్నారు. నీటి కొరతతో వ్యవసాయ పనులు చేయలేక రైతులు కుంగిపోయారు. వర్షం కురుస్తుందని ఆశించిన రైతులు పొలాలను పదును చేసి, పొలాన్ని దున్ని, ఎరువును చల్లి, నాట్లు వేసేందుకు భూమిని సిద్ధం చేసుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాలో ఐదు రోజుల క్రితం కురిసిన ముందస్తు వర్షాలతో వ్యవసాయ పనులకు అనుకూలంగా మారింది. -
ఇద్దరు బాలికల అదృశ్యం
హుబ్లీ: గుడికి వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలు తిరిగి ఇంటికి రాకుండా కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక ఏఎంపీసీ నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు..అమరగోళలోని జిద్ది వీధికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఈ నెల 14న సాయంత్రం తమ నివాసం నుంచి గామనగట్టి కరియమ్మదేవి ఆలయంలో ప్రవచనం విని వస్తామని చెప్పి అక్కడికి బయలువెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వీరిని ఏదైనా దురుద్దేశంతో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్లు ఢీకొని బాలుడు మృతి హొసపేటె: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న బాలుడు కిందపడి మృతి చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలైన ఘటన విజయనగర జిల్లాలో హరపనహళ్లి–కూడ్లిగి రహదారిపై ఆరాళ క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు..కూడ్లిగి తాలూకా నివాసి మహమ్మద్(13) మృతి చెందాడు. మహమ్మద్ తండ్రి అస్లాం బాషా కేఎస్ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోతుండగా ఆ సమయంలో ఎదురుగా మరో బైక్పై వస్తున్న రేవణసిద్దప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మహమ్మద్ తీవ్ర గాయాలతో చనిపోగా, అస్లాం బాషా, మరో కుమారుడు మహ్మద్ ఫర్హాన్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమసమాజ శిల్పులు ఉపాధ్యాయులు హొసపేటె: ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సిద్దలింగేశ్వర గ్రూప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో జ్ఞానభారతి కళాశాలలో ఏర్పాటు చేసిన బీఈడీ ప్రథమ సంవత్సరం ట్రైనీస్ షూట్– 2024 కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సత్పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే సమసమాజ నిర్మాతలని అన్నారు. గురువు అనే బిరుదుతో పాటు క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, సమయపాలన వంటి లక్షణాలు ఉంటేనే ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తాడన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది మంచి సమాజానికి రూపశిల్పులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయకుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్రన్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు బసవరాజ్, అర్చన అంగడి, ట్రైనీలు అశ్వినిరెడ్డి, గీత,, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సు బోల్తా.. ఐదుగురికి గాయాలు హుబ్లీ: ప్రైవేటు బస్సు బోల్తా పడి బస్సు డ్రైవర్తో పాటు ఐదుగురు గాయపడిన ఘటన సిద్దారూఢమఠం సమీపంలో జరిగింది. హుబ్లీ నుంచి 20 మందికి పైగా ప్రయాణికులతో విజయపురకు వెళుతున్న బస్సు డ్రైవర్ అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడిన వారిని కిమ్స్ ఆస్పత్రినికి తరలించారు. ఘటన స్థలాన్ని గ్రామీణ పోలీసులు పరిశీలించి హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించాలి రాయచూరు రూరల్: పిల్లల్లోని ప్రతిభను పోలీసులు ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ నిఖిల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల 10, 12వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారి పిల్లలను శుక్రవారం తన కార్యాలయంలో అభినందించి ఆయన మాట్లాడారు. పోలీసులకు దీటుగా వారి పిల్లలు కష్టపడి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు శశికుమార్, హరీష్లున్నారు. విద్యతో పాటు నైపుణ్యం ప్రధానంరాయచూరు రూరల్: నేటి విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. శనివారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌశల్యం–విద్యాభ్యాసం అనే అంశంపై ఆయన మాట్లాడారు. రాయచూరు, యాదగిరి జిల్లాల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకంగా కోర్సులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్యం విద్య కౌశల్య పథకం కింద తుమకూరు, దావణగెరె, కలబుర్గి, రాయచూరు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుందన్నారు. కార్యక్రమంలో కలబుర్గి డివిజన్ విద్యాశాఖాధికారి శివశరణ, కర్ణాటక కౌశల్య పథకం అధికారి జితేంద్ర నాగేష్, ఎర్రిస్వామి, సరోజ, రాఘవేంద్ర, భాగ్యజ్యోతి, రవి, ఉడేద్, యంకణ్ణ, గీతమ్మ, అనిల్, రశ్మీ తదితరులు పాల్గొన్నారు. -
సెగలు పుట్టిస్తోన్న పెన్డ్రైవ్
బనశంకరి/ శివాజీనగర: లాయరు, బీజేపీ నేత దేవరాజేగౌడ పెన్డ్రైవ్ కేసులో చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేకెత్తిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లక్ష్యంగా ఆయన కొన్నిరోజులుగా ఆడియోలు, డాక్యుమెంట్లను విడుదల చేస్తున్నారు. సంచలనాల హాసన్ నగ్నవీడియోలను మొదట ఆయనే బయట పెట్టడం తెలిసిందే. పెన్డ్రైవ్ కేసులో అనుకూలంగా ఉండాలని డీకే శివకుమార్కు నాకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని, ఈ స్కాం వెనుక మంత్రులు కూడా ఉన్నారని దేవరాజేగౌడ శుక్రవారం ఆరోపించడంపై చర్చ సాగుతోంది. శనివారం ఈ విషయమై డీకే శివకుమార్ స్పందిస్తూ దేవరాజేగౌడ తల చెడిపోయింది, దీనిపై స్పందించనని అన్నారు. నేను రూ.100 కోట్లు ఆఫర్ ఇవ్వడం పై లోకాయుక్తకు ఫిర్యాదు చేయొచ్చు. ఆయన మాటలను తీవ్రంగా పరిగణించరాదన్నారు. దేవరాజేగౌడ ఏమైనా చేసుకోనివ్వండి, నేను ఆఫర్ల గురించి ఎవరితోను మాట్లాడలేదు. నా వద్దకు ఎందరో వస్తుంటారు, వారందరినీ స్కాన్ చేయడం అవుతుందా అని ప్రశ్నించారు. కొందరు తన పేరు చెప్పుకుని మార్కెట్ చేసుకుంటున్నారని హేళన చేశారు. గౌడకు కస్టడీ పెన్డ్రైవ్ కేసులో దేవరాజేగౌడను అరెస్టు చేసి సిట్ అధికారులు శనివారం హాసన్ 5 వ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం ఒక్కరోజు పాటు సిట్ కస్టడీలో విచారించింది. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కేసును సీబీఐకి ఇవ్వాలి: విజయేంద్ర ప్రజ్వల్ పెన్డ్రైవ్ కేసులో ఎవరినీ కాపాడే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. నగరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇది క్షమించరాని నేరం. పెన్డ్రైవ్ వెనుక ఉన్నవారికి కూడా తగిన శిక్ష పడాలి. దీని వెనుక ఉన్నవారి పేర్లు వెలుగులోకి రావాలని, హేమాహేమీల పేర్లు వినిపిస్తున్న కారణాన కేసును సీబీఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. దేవరాజేగౌడ రోజుకో వార్తను వినిపిస్తున్నారు, ఈ కేసును చర్చా వస్తువుగా వాడుకోవడం సరికాదని చెప్పారు. 6 ఎమ్మెల్సీ సీట్లలో 4 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం రూ.100 కోట్లు ఆఫర్ చేశారన్న దేవరాజేగౌడ రాజకీయ వర్గాల్లో కలకలం నమ్మొద్దన్న డిప్యూటీ సీఎం -
సరస్సులో స్నానానికి దిగి యువకుడు మృతి
హొసపేటె: తన స్నేహితులతో కలిసి అంజనాద్రి కొండను వీక్షించేందుకు వచ్చిన ఓ యువకుడు శనివారం మధ్యాహ్నం తాలూకాలోని సణాపుర సరస్సులో స్నానానికి దిగి మృతి చెందాడు. వివరాలు..కొప్పళ తాలూకా కుణికేరికి చెందిన మంజునాథ్ (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి అన్ని ప్రాంతాలను తిలకించాడు. ఈక్రమంలో సణాపుర సమీపంలోని తుంగభద్ర ఎడమ గట్టు కాలువ కింద ఉన్న చెరువులో ఈతకు దిగి మృతి చెందాడు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు యువకుడి మృతదేహం కోసం సరస్సులో ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వైభవంగా కరగ ఉత్సవం
కోలారు: తాలూకాలోని చిట్నహళ్లి గ్రామంలోని ధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి అశేష భక్త సందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామంలో గత మూడేళ్లుగా కరగ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కరగ పూజారి బాలరాజ్ మూడోసారి ఆలయం ముందు మంగళవాయిద్యాలు, మేళతాళాలకు అనుగుణంగా పూల కరగను మోస్తూ చేసిన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వీర కుమారుల గోవిందనామ స్మరణ మధ్యన కరగ సాగింది. గ్రామానికి చెందిన తిగళ సముదాయం వారు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో కరగ నిర్వహిస్తున్నారు. భక్తులు తమ ఇంటి వద్దకు వచ్చిన కరగను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఉత్సవంలో జీపీ అధ్యక్షుడు మంజునాథ్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా వాసవీమాత జయంతి
గౌరిబిదనూరు: ఆర్యవైశ్య మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీమాత ఆలయంలో శనివారం వాసవీమాత జయంతిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, వివిధ పూజలు, అలంకరణలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా మండలి, యువక, యువతి మండలి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆస్పత్రిలో శనివారం జన్మించిన పిల్లలకు దుస్తులు, బేబీ క్యారీ బెడ్స్ వితరణ చేశారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం వాసవీ మాతను పల్లకీలో జానపద కళా బృందాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అధ్యక్షుడు రాజణ్ణ, శ్రీనివాసమూర్తి, రత్నయ్యశెట్టి, ఇస్తూరి రమేశ్, ఇస్తూరి సంపంగిరామ్, ఇస్తూరి సతీశ్, రామమోహన్, రాజేంద్ర ప్రసాద్, చేతన్ తదితరులు పాల్గొన్నారు. పావగడ: ఆర్యవైశ్యుల ఆరాధ్యదేవత కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. పావగడలోని ఆంజనేయస్వామి కల్యాణ మంటపంలో నిర్వహించిన వేడుకల్లో వాసవీ మాత ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు పూర్ణకుంభ కళశాలతో ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం పిండి దీపాలతో హారతులు వెలిగించారు.సాయంత్రం బంగారు రథంలో అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. మహిళలు భజనలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. -
ముగ్గురికి రూ.10.55 లక్షలకు పైగా వంచన
హుబ్లీ: కేవైసీ అప్డేట్ సాకుతో నగరంలో ముగ్గురిని కేటుగాళ్లు మోసగించి రూ.10.55 లక్షలకు పైగా వంచించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. విద్యానగర్కు చెందిన సురేష్ గౌడ బాధితుడు. ఇతని బ్యాంక్ ఖాతా నుంచి దుండగులు విడతల వారీగా రూ.5 లక్షల నగదును బదలాయించుకొని వంచించారు. ఆ మేరకు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో స్థానిక లక్ష్మీనగర నివాసి సంధ్యా జాలగార అనే ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఖాతా నుంచి రూ.4.19 లక్షలు వంచించిన ఘటనపై నగర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకో ఘటనలో బ్యాంక్ ఖాతా కేవైసీ ఆప్డేట్ అనే సందేశం పంపించిన గుర్తు తెలియని వ్యక్తి టీ.మంజుకుమారి అనే ఆమె వివరాలు తెలుసుకుని రూ.1,36,500 బదలాయించుకొని వంచించిన ఘటనపై కేశ్వాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఎంఎస్ వచ్చిన మొబైల్ నెంబర్కు మంజుకుమారి ఫోన్ చేసినా ఫలితం లేకపోయినట్లు పేర్కొన్నారు. -
మళ్లీ రోడ్డు వెడల్పు పనులు షురూ
సాక్షి,బళ్లారి: నగరంలో మళ్లీ రోడ్డు వెడల్పుపనులు ఊపందుకున్నాయి. ఇటీవల కనక దుర్గమ్మ గుడి సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టి పూర్తి చేశారు. శనివారం నగరంలోని సత్యనారాయణపేట ఫ్లై ఓవర్ కింద శబరి హోటల్ వద్ద నుంచి కేఈబీ సర్కిల్ వరకు సుమారు అర్ధ కిలోమీటర్కు పైగా రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. నగర కార్పొరేషన్ కమిషనర్ ఖలీల్సాబ్, జోనల్ కమిషనర్ గురురాజు, సంబంధిత ల్యాండ్ సర్వే అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రెండు జేసీబీలు, ఒక హిటాచీ తదితర యంత్రాలు తీసుకొని రావడంతో జనం పెద్ద సంఖ్యలో చేరారు. అర్ధ కిలోమీటర్ పొడవునా రోడ్డుకు అటు వైపు, ఇటు వైపు 80 అడుగుల మేర రోడ్డు విస్తరించేలా భవనాలను కూల్చివేసే ప్రక్రియను చేపట్టారు. రోడ్డు మధ్యన ఉన్న పచ్చని చెట్లను కూడా కూల్చివేస్తున్నారు. కార్పొరేషన్ అనుమతి లేకుండా, రోడ్డును అక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చివేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫళంగా జేసీబీలు, హిటాచీలు తీసుకొని వచ్చి కూల్చి వేయడం తగదని ఇళ్లు, భవనాల యజమానులు నితీన్, ఆనంద్, ఈరన్న ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులతో వాదించారు. నోటీసులివ్వకుండా కడుపు కొడుతున్నారని ఆగ్రహం గతంలో కార్పొరేషన్ అనుమతి తీసుకొన్నామని తమ ఇంటి ముంగిట కార్పొరేషన్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేసిందని ప్రభుత్వ స్థలాన్ని వదిలి తాము కొనుగోలు చేసిన పట్టా స్థలంలోనే భవనాల నిర్మాణం చేపట్టామని, అయితే కార్పొరేషన్ అధికారులు ఎలాంటి ఆదేశాలు, నోటీసులు ఇవ్వకుండా తమ కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్డు గుండా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండటంతో తాము బాడుగలకు ఇచ్చి జీవనోపాధి పొందేవారమని, భవనాల కూల్చివేతతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరి హోటల్ నుంచి కేఈబీ సర్కిల్ వరకు 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు వెడల్పు చేసి అనంతరం రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని, బాధితులకు కూడా ఎలాంటి అన్యాయం జరగదని, రోడ్డు వెడల్పు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రోడ్డు డివైడర్లు వేసి రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత బాధితులకు కూడా ప్రయోజనకరంగా కనిపిస్తుందన్నారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి గట్టి బందోబస్తు మధ్య రోడ్డు వెడల్పు పనులకు సహకరించారు. ఈసారి ఎస్ఎన్పేటె ఫ్లై ఓవర్ నుంచి కేఈబీ సర్కిల్ వరకు గట్టి పోలీసు బందోబస్తు మధ్య అక్రమ భవనాల కూల్చివేత -
వ్యాపారి నుంచి రూ.32 లక్షలు దోపిడీ
హుబ్లీ: పత్తి విక్రయించగా వచ్చిన నగదును క్యాంటర్ వాహనంలో తీసుకెళుతున్న వారిని దోపిడీ దొంగలు అడ్డగించి కళ్లల్లో కారం చల్లి రూ.32 లక్షలను దోచుకుని పరారైన ఘటన విజయపుర జిల్లా కోల్హార పట్టణం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. కలబుర్గి జిల్లా జేవరిగి పట్టణానికి చెందిన పత్తి వ్యాపారి చంద్రకాంత్ కుంబార తన పత్తి పంటను ధార్వాడ తాలూకా అమ్మినబావిలోని జిన్నింగ్ మిల్కు తీసుకెళ్లి విక్రయించాడు. ఆ బాపతు కింద వచ్చిన రూ.32 లక్షల నగదును తీసుకొని క్యాంటర్ వాహనంలో వ్యాపారి చంద్రకాంత్తో పాటు వాహనం డ్రైవర్ మహంతేష కుంబార, అటెండర్ మల్లు కొడచి జేవరిగికి వెళుతుండగా ఈ దోపిడీ చోటు చేసుకుంది. క్యాంటర్ వాహనాన్ని బోలెరో వాహనంలో వచ్చిన దోపిడీ దొంగలు అడ్డగించి క్యాంటర్ వాహనం గ్లాస్పై రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ ముగ్గురి కంటిలో కారం చల్లి నగదుతో ఉడాయించారు. బాధితులకు కోల్హార ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఘటన స్థలాన్ని విజయపుర ఎస్పీ రుషికేష్ సోనవనే, ఇతర అధికారులు పరిశీలించారు. ఘటనపై కోల్హార పోలీసులు కేసు నమోదు చేసుకొని దోపిడీ దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. -
నిధుల వ్యయంపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ఒకే రహదారికి రూ.2 కోట్లు వ్యయం చేయడంపై విచారణ చేపట్టాలని దళిత సంఘాల సంచాలకుడు శివకుమార్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొప్పర నుంచి చిక్కబూదూరు వరకు నరేగ పథకంలో మరమ్మతు పనులు చేపట్టారన్నారు. మే 15న ప్రజా పనుల శాఖాధికారులు రూ.2 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులను నిలుపుదల చేయించామన్నారు. కొప్పర నుంచి చిక్కబూదూరు వరకు ఎన్ని సార్లు ఏ పథకంలో పనులు చేస్తారో విదితం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్న శంకర్ నాయక్, బక్కలపై విచారణ జరిపి చర్యలు తీసుకొని వారిద్దరిని సస్పెండ్ చేయాలన్నారు. -
ఆవుల దొంగల హల్చల్
హోసూరు వార్తలు..కెలమంగలం: తళి ప్రాంతంలో పాడి ఆవుల దోపిడీకి యత్నించిన దొంగల ముఠా జనం ఎదురుతిరగడంతో పరారైంది. వివరాలు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కొడగారట్టి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి (40) పొలంలోని మూడు పాడి ఆవులను శుక్రవారం రాత్రి దుండగులు పికప్ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్లారు. సారకపల్లి గ్రామానికి చెందిన రైతు బాబు ఇంటి వద్ద పాడి ఆవులను దొంగలిస్తుండగా కుక్కలు మొరగడంతో రైతు లేచి కేకలు వేశాడు. దీంతో దొంగలు వ్యాన్లో పారిపోసాగారు. రైతు బాబు తన కారులో ఆ వాహనాన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక దొంగలు వ్యాన్ని, ఆవులను వదిలేసి పారిపోయారు. తళి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వ్యాన్ని పరిశీలించగా కర్ణాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని చామరాజ్నగర ప్రాంతానికి వాహనంగా తెలిసింది. వాహనంలో వేటకొడవళ్లు, కత్తులు, ఇనుపరాడులు దొరికాయి. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
చెరువు కట్టను బాగుచేయాలి
కెలమంగలం: కెలమంగలం సమీపంలోని చిన్నట్టి చెరువు కట్ట తెగిపోయి 30 ఏళ్లు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నట్టి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గత 30 ఏళ్ల క్రితం కురుసిన భారీ వర్షాలకు చెరువు మరువ తెగిపోయింది. అప్పటినుంచి మరమ్మతులు చేయడం లేదు. తమ పరిధిలో లేదని పిడబ్ల్యూడీ, బీడీఓ, పట్టణ పంచాయతీవారు చెబుతున్నారు. దీంతో చెరువు పరిస్థితి అనాథలా మారిపోయింది. ఈ చెరువులో వర్షపునీటిని నిలువ చేయడం ద్వారా జెక్కేరి, కెలమంగలం, చిన్నట్టి ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు, రైతులకు అనువుగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా చెరువు కట్టకు మరమ్మత్తులు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. మైత్రి కొనసాగుతుందిమైసూరు: దక్షిణ ఉపాధ్యాయ నియోజకవర్గ విధానపరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తలెత్తిన విభేదాలకు ఫుల్స్టాప్ పడింది. నగరంలోని చామరాజపురంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు జేడీఎస్ అభ్యర్థి వివేకానందకు మద్దతు తెలపడం ద్వారా మైత్రి ధర్మాన్ని పాటించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మేశ్ గౌడ మాట్లాడుతూ బీజేపీ–జేడీఎస్ మైత్రిని విధాన పరిషత్ ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు తీర్మానించినట్లు తెలిపారు.ఆరు నియోజకవర్గాల్లో రెండు స్థానాలను జేడీఎస్కు వదిలివేసినట్లు చెప్పారు. మైత్రి అభ్యర్థి విజయానికి కలసికట్టుగా శ్రమిస్తామని చెప్పారు. జేడీఎస్ కోర్కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ పాల్గొన్నారు. -
లావుగా ఉందని భర్త ఎగతాళి
●ఆత్మహత్య చేసుకున్న భార్య దొడ్డబళ్లాపురం: లావుగా ఉన్నావని భర్త ఎగతాళి చేస్తుండడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు మంజునాథ్ నగర్లో ప్రకాష్, సంధ్య(31) దంపతులు నివాసం ఉంటున్నారు. సంధ్య లావుగా ఉందని, అందువల్లే బిడ్డ ఆరోగ్యంగా పుట్టలేదని ఎగతాళి చేసేవాడు. రోజూ ఇదేవిధంగా ఎగతాళి చేస్తుండటంతో విసుగు చెందిన సంధ్య భర్తలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంధ్య మృతికి భర్త ప్రకాశ్, అతని కుటుంబ సభ్యులు కారణమని మృతురాలి తండ్రి కందన్ ఇచ్చిన ఫిర్యాదుతో బసవేశ్వర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అధిక వడ్డీలపై ఉక్కుపాదం.. ఏడుగురిపై కేసులు శివమొగ్గ: అధిక వడ్డీ వసూలు చేస్తూ పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వారిపై శివమొగ్గ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏడుమంది వడ్డీవ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశారు. ఖళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి స్థలాల పత్రాలు, వాహనాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడు మందిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వడ్డీ వ్యవహారాలపై స్థానిక పోలీసు స్టేషన్లో లేదా 112కు కాల్ చేసి సమాచారం అందివ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న బైక్ ●భర్త మృతి, భార్యకు గాయాలు మైసూరు: కరెంటు స్తంభాన్ని బైక్ ఢీకొని భర్త మృతి చెందగా భార్య గాయపడింది. ఈఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా మంచేదేవనహళ్లి సమీపంలోని బీఎం రోడ్డులో జరిగింది. పిరియాపట్టణ తాలూకా హెమ్మిగే గ్రామవాసి సయ్యద్ ఖలీం (73)భార్య బతులాబీతో కలిసి బైక్పై వెళ్తూ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొన్నాడు. గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సయ్యద్ ఖలీం మృతి చెందాడు. బైలకుప్పే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హత్యకేసులో నిందితుడి ఊహా చిత్రం విడుదల
యశవంతపుర: రైల్వే సిబ్బందిని చాకుతో దాడిచేసి హత్య చేసి, నలుగురిపై దాడికి పాల్పడిన నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. పుదుచ్ఛేరి–దాదర్ ఎక్స్ప్రైస్ రైల్లో గురువారం సాయంత్రం ఖానాపుర తాలూకా లోండా వద్ద టీటీఈ అశ్రఫ్ కిత్తూర టికెట్లను పరిశీలిస్తుండగా ముసుగు ధరించిన వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. టీటీఈకి మద్దతుగా వచ్చిన హౌస్కీపింగ్ సిబ్బంది దేవర్షి(23)పై చాకుతో పొడిచాడు. మరో నలుగురిపై దాడి చేసి ఉడాయించాడు. దేవర్షిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోలీసులు గాలింపు చేపట్టి సీసీకెమెరాలను పరిశీలించారు. నిందితుడు రైలు దిగి వెళ్తున్న ఫుటేజీ ఆధారంగా ఊహా చిత్రం గీసి విడుదల చేశారు. నగలు, నగదు స్వాధీనం బనశంకరి: చోరీ కేసులో జయనగర పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. జయనగర ఐదోబ్లాక్ నివాసి ద్వారకనాథ్ ఇంట్లో గతనెల 28న చోరీ జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జేపీ నగరకు చెందిన 16 సంవత్సరాల బాలుడు నిందితుడిగా గుర్తించారు. రూ.8 లక్షల విలువైన వజ్రాభరణాలు, రూ.49వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని న్యాయమండలి ఎదుట హాజరు పరిచారు. -
గిరిజన విద్యార్థులకు చేయూత
హోసూరు: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళాశాల కల పథకం ద్వారా శనివారం క్రిష్ణగిరి కలెక్టరేట్లో కలెక్టర్ శరయు గిరిజన విద్యార్థులకు పై చదువుల్లో ప్రతిభను చాటుకోవడంపై చైతన్యం కల్పించారు. ఈ పథకం ద్వారా ప్లస్టూ ఉత్తీర్ణత పొంది మధ్యలోనే చదువును ఆపివేస్తున్న విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి డిగ్రీ, డిప్లమో, వైద్యం, వ్యవసాయ, సాప్ట్వేర్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలను వివరిస్తూ పై చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 450 మందికి పైగా ప్లస్టూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులు రమేష్కుమార్, శరవణన్, వెంకటేష్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. యువకుడు ఆత్మహత్య కెలమంగలం: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అంచెట్టి వద్ద జరిగింది. సి.రాశీపురం గ్రామానికి చెందిన కణ్ణియప్పన్ కొడుకు అరవింద్(19) ఓ మహిళతో చనువుగా ఉండేవాడు. దాంతో ఆమె భర్త అరవింద్ తండ్రికి ఫిర్యాదు చేశాడు. బుద్ధిగా ఉండాలని తల్లిదండ్రులు మందలించడంతో అరవింద్ గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. వ్యభిచార నిర్వాహకుల అరెస్టు క్రిష్ణగిరి: క్రిష్ణగిరి సమీపంలో పరుగు రాష్ట్రాలకు చెందిన మహిళలను ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తమిళరసికి తెలిసి శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహారాజగడ ప్రాంతానికి చెందిన శక్తికుమార్ (28), అద్దె ఇంటిలో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. శక్తికుమార్తో పాటు బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. అంధ చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలుతుమకూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ 92వ జన్మదిన వేడుకలను శనివారం ఆ పార్టీ ముఖ్య నేతలు నగరంలోని అంధ పిల్లల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. బటవాడి మహాలక్ష్మి నగరంలోని అంధ పిల్లల ఆశ్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్సీ ఆంజనప్ప, జిల్లా కార్యధ్యక్షుడు టీఆర్ నాగరాజు కేక్ కట్ చేసి ఆశ్రమంలోని పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. -
అంజలి హంతకుడు నాలుగు నెలలుగా మైసూరులో మకాం
మైసూరు: హుబ్లీలో సంచలనం రేపిన అంజలి హత్య కేసు నిందితుడు విశ్వనాథ్ అలియాస్ గిరీష్ సావంత్ నాలుగు నెలల నుంచి మైసూరులోని ప్రైవేటు హోటల్లో పని చేసినట్లు వెలుగు చూసింది. వినాయక నర్సింగ్కేర్ ఏజెన్సీ ద్వారా తన తండ్రిని చూసుకునేందుకు అతడు వచ్చినట్లు హోటల్ యజమాని గోవర్ధన్ తెలిపారు. అక్కడ పని వదిలేసి హోటల్లో ఆ తర్వాత పనికి చేరినట్లు, రూమ్బాయ్గా, సప్లయర్గా హోటల్లో పని చేశాడని గోవర్ధన్ తెలిపాడు. అతడు సరిగ్గా పనికి వచ్చేవాడు కాదని, ఐదు రోజులకొకసారి, పది రోజులంటూ సెలవు పెట్టేవాడని చెప్పాడు. మంగళవారం సాయంత్రం రూ. 5 వేల అడ్వాన్స్ తీసుకొని వెళ్లి తిరిగి రాలేదని తెలిపాడు. మరుసటి రోజే పోలీసులు తనకు కాల్ చేసి అతడొక హత్య చేశాడని చెప్పినట్లు వివరించాడు. తన హోటల్ సిబ్బంది మొబైల్ ఫోన్ తీసుకుని ఎక్కువ సేపు మాట్లాడేవాడని తెలిసినట్లు చెప్పారు. కంపెనీ ఫోన్ నుంచి కూడా ఎక్కువగా మాట్లాడేవాడని తెలిపారు. ఘటన జరిగే ముందు రోజు కూడా చాలా ఎక్కువగా మొబైల్మాట్లాడాడని చెప్పారు. తన హోటల్కు ఏడుగురు పోలీసులు వచ్చారని, శుక్రవారం రాత్రి వరకు కూడా తన హోటల్లోనే ఉన్నారని వెల్లడించారు. విశ్వనాథ్ దావణగెరెలో పట్టుబడటంతో మధ్యరాత్రి పోలీసులు హోటల్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీ తనయుడు మృతియశవంతపుర: రోడ్డు ప్రమాదంలో తండ్రీతనయుడు మృతి చెందిన ఘటన కలబురగి నగరానికి సమీపంలోని సుల్తానపుర రింగ్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగింది. అఫ్జలపుర తాలూకా టాకలి గ్రామానికి చెందిన చాంద్పాషా మకానదార(35) తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి బైక్పై కలబురిగిలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా బైక్ను లారీ ఢీకొంది. ఘటనలో చాంద్పాషా, కుమారుడు అమీర్(6) మృతి చెందారు. భార్య, మరో కుమారుడు గాయపడ్డాడు. కలబురిగి నగర ట్రాఫిక్–2 పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దాడికేసులో నిందితుల అరెస్ట్బనశంకరి: మద్యం మత్తులో స్నేహితుడిపై దాడికి పాల్పడిన మనోజ్, కిరణ్, తరుణ్ను బ్యాటనారాయణపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12 తేదీన బాపూజీనగర మదుర ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ వద్ద హొసగుడ్డదహళ్లికి చెందిన విజయ్తో పై నలుగురు స్నేహితులు మందుపార్టీకి వెళ్లారు. ఈ సమయంలో తమాషా కోసం సెల్ఫోన్ తీసుకున్న విషయాన్ని విజయ్ ప్రస్తావించాడు. తాము కనబడిన సమయంలో సెల్ఫోన్ గురించి అడుగుతావా అని విజయ్పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన విజయ్ అసుపత్రిలో చికిత్స పొంది తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
రూ.20 వేల కోసం అవ్వను చంపేశాడు
శివమొగ్గ: ఆప్యాయత పంచి, భుజాలపైకి ఎత్తుకొని లాలించిన అవ్వను మనవడు అంతమొందించాడు. అవ్వ వద్ద ఉన్న రూ.20వేల కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రావతి తాలూకా అంతరంగెలో జరిగింది. అంతరంగె గ్రామానికి చెందిన రామక్క (72)కు ఇద్దరు కుమారులు గోవింద్, హనుమంతప్ప ఉన్నారు. కొంతకాలం క్రితం గోవింద్ జేసీబీని కొనుగోలు చేశాడు. కంతు చెల్లించేందుకు గోవింద్ తన తల్లి రామక్కకు రూ. 20 వేలు ఇచ్చి దావణగెరెకు వెళ్లాడు. కాగా నిండా అప్పుల్లో మునిగిపోయిన హనుమంతప్ప కుమారుడు చేతన్ తన అవ్వ వద్ద రూ. 20 వేలు దోచుకోవాలని కుట్ర పన్నాడు. తండ్రి హనుమంతప్ప స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన సమయంలో చేతన్ అవ్వ ముఖంపై తలదిండు ఉంచి శ్వాస అందకుండా చేసి ప్రాణం తీశాడు. ఆమె వద్ద ఉన్న రూ. 20 వేలు, చెవి కమ్మలు తీసుకొని ఉడాయించాడు. చేతన్, భరత్, రోహిత్, ఆదర్శ్పై కుమారుడు గోవింద్ భద్రావతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
తమ్మున్ని కడతేర్చిన కిరాతక అన్న
దొడ్డబళ్లాపురం: బెంగళూరు శివార్లలోని సర్జాపుర సమీపంలోని నెరిగా గ్రామం వద్ద ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రాణేష్ అనే బాలుడిది హత్య అని తేలింది. సెల్ఫోన్ ఇవ్వలేదనే అక్కసుతో తమ్ముడిని అన్న సుత్తితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్లోని సూళెకెరి గ్రామానికి చెందిన చెన్నమ్మ,బసవరాజు దంపతులకు ప్రాణేశ్, శివకుమార్ అనే కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం మూడు నెలల క్రితం వారంతా నెరిగా గ్రామానికివచ్చారు. కాగా ఆన్లైన్ గేమ్స్కు బానిసైన శివకుమార్ సెల్ఫోన్ కోసం తమ్ముడితో గొడవ పడేవాడు. ఈక్రమంలో తమ్ముడు ప్రాణేష్(15) బహిర్భూమికి వెళ్లిన సమయంలో శివకుమార్ వెళ్లి సుత్తితో తమ్మున్ని బాది హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు ప్రాణ్ష్ కోసం గాలించగా శవమై కనిపించాడు. పోలీసులు శివకుమార్ను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పెట్టాడు. మిస్టరీ వీడిన బాలుడి అనుమానాస్పద మృతికేసు సెల్ఫోన్ కోసం ఘాతుకం -
సిలిండర్ పేలి దంపతులకు గాయాలు
యశవంతపుర: గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు తీవ్రంగా గాయపడిన ఘటన బెళగావి తాలూకా సుళగా గ్రామంలో జరిగింది. గ్రామంలో కల్లప్ప పాటిల్(62), సుమన పాటిల్(60) దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం వేకువజామున టీ చేసేందుకు దంపతులు వంట గదిలోకి వెళ్లి కరెంటు స్విచ్ ఆన్ చేశారు. అప్పటికే గ్యాస్ లీక్ అయ్యింది. స్విచ్ వేయగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. వంటికి నిప్పంటుకొని కల్లప్ప పాటిల్, సుమన్ పాటిల్ గాయపడ్డారు. ఇంటిలోని వస్తు సామగ్రి కాలి బూడిదైంది. స్థానికులు స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. దంపతులకు 75శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బైక్లు ఢీ.. ఒకరి మృతిమైసూరు: ౖబెకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మైసూరు రింగ్రోడ్డు దేవెగౌడ సర్కిల్ వద్ద జరిగింది. బన్నూరు నివాసి జమీల్ (45), ముబారక్, అవేశ్ అనే బాలురతో కలిసి మైసూరు నుంచి బన్నూరుకు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే జమీల్ మృతి చెందాడు. మైసూరు సిద్ధార్థ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘హేమావతి’పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం
తుమకూరు: హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ ప్రాజక్టు సాధకబాధకాలపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర తెలిపారు. హేమావతి ఎక్స్ప్రెస్ లింక్ కెనాల్ వద్ల జిల్లాకు కలిగే ఇబ్బందులను గురించి మంత్రివర్గ భేటీలో తాను, మంత్రి రాజణ్ణ వివరించినట్లు గుర్తు చేశారు. శనివారం ఆయన తుమకూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ లింక్ కెనాల్ నిర్మాణం కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. తన సొంత నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి, డీసీఎం, జలవననుల శాఖ మంత్రితో చర్చించి ఈ ప్రాజెక్టుపై సమీక్షిస్తానన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెబుతున్నట్లు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని, రాష్ట్రంలో శాంతి లేకుండా చేయాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement