-
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ) -
ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే
సౌత్ ఇండియాలో టాప్ హీరోల లిస్ట్లో విజయ్ పేరు ఉంటుంది. గతేడాది 'లియో'తో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, హీరో విజయ్ సోదరి విద్య ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన అభిమానులు కూడా కోలీవుడ్లో గత ఐదు రోజులుగా తెగ షేర్ చేస్తున్నారు.తెలుగులోనూ విజయ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే, విజయ్కి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు 'విద్య'. ఆమె మరణించి ఇప్పటికి సరిగ్గా 40ఏళ్లు అవుతుంది. దీంతో విజయ్ అభిమానులు విద్య సమాధి ఫోటోను నెట్టింట షేర్ చేస్తున్నారు.1980లో జన్మించిన విద్య 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించింది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా నాలుగేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓ కార్యక్రమంలో విద్య గురించి మాట్లాడిన విజయ్.. 'నా జీవితంలో పెద్ద ప్రభావం మా చెల్లెలు విద్యా మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైంది.. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడు. వారందరిలో నా చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటాను.' అని చెప్పడం గమనార్హం. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. ఆ పాప ఇప్పుడు బ్యాడ్మింటన్లో రాణిస్తోంది. చెల్లెలుపై అంతప్రేమను చూపించే తమ అభిమాన హీరో కోసం తాజాగా విద్య మెమోరియల్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. మెమోరియల్లో ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ డార్లింగ్ విద్య అనే పదాలు ట్రెండింగ్లో ఉన్నాయి. -
నీట్ పరీక్షా విధానంపై వస్తున్న మొదటి సినిమా ఇదే
వైద్యవిద్యలో నీట్ పరీక్షల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా నీట్ పరీక్షల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కారణంగా నీట్ వద్దని తమిళనాడుసహా పలు రాష్ట్రాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది నీట్ పరీక్షల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎలాంటి చిత్రం రూపొందలేదు. కాగా తొలిసారిగా అలాంటి కథతో 'అంజామై' అనే చిత్రం కోలీవుడ్లో రూపొందింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు మోహæన్రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. నటుడు విదార్థ్, వాణిభోజన్, రఘుమాన్, క్రితిక్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తిరుచ్చిత్రం పతాకంపై డాక్టర్ ఎన్.తిరునావుక్కరసు నిర్మించారు. మనోతత్త్వ వైద్యుడు, ఉపాధ్యాయుడు అయిన ఈయన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో నిత్ర నిర్మాణం చేపట్టి నిర్మించిన తొలి చిత్రం అంజామై. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్రం విడుదల హక్కులను పూర్తిగా డ్రీమ్ వారియర్స్ సంస్థ పొందడం విశేషం. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ 'అంజామై' చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. -
కాంబినేషన్ కుదిరింది
‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గుప్తాఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది.‘‘మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్ తేజ్కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం. -
కేన్స్లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
ఫ్రాన్స్లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్కు చెందిన 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' షార్ట్ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీమ్కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes) -
'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్
మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ కేవ్స్లో కేరళ యువకుడు పడిపోవడం జరిగింది. ఆ నిజజీవిత ఘటన ఆధారంగా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం నిలిచింది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న క్లైమాక్స్ సన్నివేశాన్ని అసలు ఎలా చిత్రీకరించారో తాజాగా ఆ చిత్ర డైరెక్టర్ చిదంబరం రివీల్ చేశాడు. ఈ సినిమాలో సుభాష్ పాత్రలో నటించిన శ్రీనాథ్ భాసి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. ఆ గుహలో పడిపోయిన సుభాష్ నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు. ఆయనకు గాయాలు అయినట్లుగా చూపించడానికి ఓరియో బిస్కెట్లను మేకర్స్ ఉపయోగించారని చిదంబరం వెల్లడించాడు. ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీమ్తో సుభాస్కు మేకప్ వేశామన్నారు. అతనికి అయినటువంటి గాయాలను చూపించేందుకు తాము ఈ టెక్నిక్ ఉపయోగించామని ఆయన తెలిపాడు. అయితే, ఈ క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్కు చెందుతుందని చెప్పాడు. అయితే, ఈ మేకప్ వల్ల సుభాస్ ( శ్రీనాథ్ భాసి) చాలా ఇబ్బంది పడ్డాడు. బిస్కెట్ క్రీమ్ వాసనకు ఆయన చుట్టూ చీమలు కూడా చేరిపోయాయి. ఈ సీన్ తీస్తున్నప్పుడు ఆ చీమలు కూడా అతన్ని కుట్టడం ప్రారంభించాయి. అయినా కూడా శ్రీనాథ్ భాసి చాలా చక్కడా చేశాడని దర్శకుడు చిదంబరం గుర్తుచేసుకున్నాడు. -
ఐదోసారి ఆ స్టార్ హీరో సినిమాలో నయనతార.. భారీ రెమ్యునరేషన్
సౌత్ ఇండియాలో నయనతార జోరు మామూలుగా లేదుగా. నాలుగు పదుల వయసు.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. చేతి నిండా చిత్రాలు.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీ. ఇంకోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోవడం, ఇదీ లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుత పొజిషన్. ఇటీవల నయనతార నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవచ్చునేమోగానీ, ఆమె క్రేజ్, అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఈ భామ హిందీలో షారూక్ఖాన్ సరసన నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం, ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపు తట్టడమే. ప్రస్తుతం నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం మన్నాంగట్టి సిన్స్ 1960 చిత్రాన్ని పూర్తి చేశారు. మరో పక్క మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న టెస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా హీరో అజిత్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అజిత్, నయనతారలది సూపర్హిట్ జంట అనే చెప్పాలి. వీరిద్దరూ ఇప్పటికి ఏగన్, బిల్లా, ఆరంభం, విశ్వాసం తదితర నాలుగు చిత్రాల్లో నటించారు. వీటిలో ఏగన్ చిత్రం మినహా మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ జంట ఐదోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తరువాత ఆయన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఆయనకు జంటగా టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఈ వరుసలో లేడీ సూపర్స్టార్ నయనతార పేరు వినిపించడం విశేషం. అంతే కాదు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం జూన్ నెలలోనే సెట్పైకి వెళ్లనుందని, ఈ చిత్రం తొలి షెడ్యూల్లో నయనతార మూడు రోజులు పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం కోసం ఈ భామ పారితోషకాన్ని ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నటుడు అజిత్ రూ.163 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చాలా కాస్టీలీ గురూ అంటున్నారు నెటిజన్లు. -
రజనీకాంత్కు గోల్డెన్ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ..
సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్టర్మ్ వీసా 10 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖలకు యూఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్ తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, నటులు వంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిని వారందరూ పూర్తి ఓనర్షిప్తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.ఇప్పటికే గోల్డెన్ వీసా పొందిన ప్రముఖులుభారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, సంజయ్ దత్,ఊర్వశి రౌతేలా, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి,మీరా జాస్మిన్, టొవినో థామస్,విజయ్ సేతుపతి,కమల్ హాసన్, విక్రమ్, యువన్ శంకర్ రాజా,టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఉన్నారు.Thalaivar #Rajinikanth receives THE Golden Visa from the UAE (DUBAI) govt, through chairman and MD of LULU group. Benefits:* He can own a property. * He can visit any time. * He can reside for 10 years. * Can sponsor family members & even domestic staff. And many more 🔥 pic.twitter.com/2y8F6k3yvJ— Rana Ashish Mahesh (@RanaAshish25) May 23, 2024 -
ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
తమిళ చిత్రం ‘పార్కింగ్’కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ లైబ్రరీలో ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్ప్లేకు చోటు దక్కింది. హరీష్ కల్యాణ్, ఎమ్ఎస్ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్ లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘పార్కింగ్’. రామ్కుమార్ బాలకృష్ణన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుధన్ సుందరం–కేఎస్ సినీష్ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది.తాజాగా ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్ మేనేజింగ్ లైబ్రేరియన్ ఫిలిఫ్ గార్సియా నుంచి ఇ–మెయిల్ వచ్చిందని చిత్రనిర్మాత కేఎస్ సినీష్ సోషల్ మీడియాలో పేర్కొని, ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వోద్యోగి ఎస్. ఇళంపరుతి పార్కింగ్ విషయంలో ఈగోలకు పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు? ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారు? అనే అంశాల నేపథ్యంతో ‘పార్కింగ్’ కథ సాగుతుంది.రూ. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ తమిళ ‘పార్కింగ్’ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఓ విదేశీ భాషలోనూ రీమేక్ చేయడానికి చిత్ర దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. -
బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి గుడ్ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే తాజాగా శృతిహాసన్ ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్ శృతి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.శృతి హాసన్ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్ స్పందించింది.కాగా.. శృతిహాసన్, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్ ప్రస్తుతం అడివి శేష్ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్ లుక్లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు.కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది. Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem AutmotiveFor the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥Made Up with a Cost of 7Cr for Car which is INSANE pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024 -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్లాల్ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్లాల్ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సమ్మర్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
సమ్మర్ వచ్చిందంటే సినీ తారల్లో చాలా మంది విదేశీ ట్రిప్కు రెడీ అయిపోతారు. అలాంటి ట్రిప్ను నటి ప్రియాంక మోహన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషతోపాటు, తెలుగు, తమిళం భాషల్లోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. తెలుగులో 'నాని' సరసన 'గ్యాంగ్లీడర్' చిత్రంలో నటించిన ఈమె ఆ తరువాత తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ కావడంతో ఈ వెంటనే నటుడు సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్ (ET) చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రియాంక మోహన్కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తొలి రోజుల్లో పక్కింటి అయ్యాయి ఇమేజ్ను తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ ఫొటోలతో హల్చల్ చేస్తూ అలాంటి పాత్రలకు రెడీ అనే సిగ్నల్ను పంపుతున్నారు. కాగా ప్రస్తుతం మరోసారి తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో యువ నటుడు కవిన్తో జత కట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా నటిగా బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ప్రస్తుతం సమ్మర్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్నారో గానీ అక్కడ దిగిన ఫొటోలను సామాజక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేడు రజనీకాంత్ పేరు కాసులు వర్షం కురిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్పై ఆయన పేరు కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు వేస్తారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీ కాంత్ మెచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?14 ఏళ్లకే ఎంట్రీ1970, 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో మరింత ప్రతిభావంతులైన నటీమణులు వచ్చారు. ఈ కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన నటీమణులు చాలామంది నేటికీ సుపరిచితులే. అయితే, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్ డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.'అంతులేని కథ' చిత్రంతో పాపులర్1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'అవల్ ఒరు తొదర్ కథై' విడుదలైంది. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం 'ఫటాఫట్'. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో 'ఫటాఫట్ జయలక్ష్మి'గా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళి, న్యాయం కావాలి, జ్యోతి,స్వర్గం నరకం,తిరుగులేని మనిషి,రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయస్సు కేవలం 14 సంవత్సరాలు.మాజీ ముఖ్యమంత్రి బంధువుతో పెళ్లిజయలక్ష్మి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా 60కి పైగా చిత్రాలలో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమార్ను ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా భాదలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆరోజుల్లో పెద్ద షాకిచ్చింది.అసహజ శృంగారం కారణంగా మరణందక్షిణాది సినిమాలో అగ్ర హీరోలు చిరంజీవి,కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథానాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ.. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం. -
హిట్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తాజాగా మరో సినిమా యూనిట్కు నోటీసులు జారీ చేశారు. తను సంగీతం అందించిన పాటును అనుమతిలేకుండా ఉపయోగించుకున్నారని ఆయన నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన పాటలను ఉపయోగించుకున్న పలు సినిమాలకు సంబంధించిన మేకర్స్కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాదిలో మలయాళం నుచి విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ కొట్టింది. తెలుగు,తమిళ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే 1991లో ఇళయరాజా- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన గుణ చిత్రంలోని 'కణ్మణి అన్బోడు' పాటను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున న్యాయవాది శరవణన్ నోటీసు పంపారు.కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని, అలాంటి సమయంలో పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే.. వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనబడింది. లేకుంటే కాపీరైట్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. రజనీకాంత్ నటిస్తున్న 'కూలి' చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు కూడా ఇళయరాజా నోటీసు పంపారు. -
ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు.ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ఆయన ఇలా మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ ప్రాజక్ట్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. భవిష్యత్లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారుమోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్కు పరిచయం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో బుజ్జి లుక్ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024 -
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కమల్హాసన్- శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
పోకెమాన్ కార్టూన్.. అప్పటినుంచే స్ట్రీమింగ్
కొత్త పాత్రలు, సాహసాలతో కూడిన పోకెమాన్ హరిజన్స్: ది సీరీస్ షో వీక్షణ కోసం ప్రేక్షకులు సిద్ధం కావాలని నటులు విశాల్, శేఖర్ పిలుపునిచ్చారు. హంగామా వేదికగా ఈనెల 25వ తేదీ నుంచి ఈ యానిమేటెడ్ షో ప్రసారం కానుంది. పోకెమాన్ హరిజన్స్: ది సీరీస్లో పాత్రలు, కొత్త అంశాల గురించి నటులు విశాల్, శేఖర్ చెన్నైలో మంగళవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో వివరించారు. కొత్త సాహసయాత్రతో, కొత్త పాత్రల పరిచయాలతో, ఉత్తేజకరమైన అంశాలను జోడించి ఈ షోను రూపొందించారన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటలకు కొత్త ఎపిసోడ్లతో హంగామా టీవీలో సందడి నెలకొననుందని పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
- సిరుల విరులు..కొండ చీపుర్లు
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
Advertisement