-
హజ్యాత్రికులకు వ్యాక్సినేషన్
నారాయణపేట రూరల్: హజ్యాత్రకు వెళ్తున్న ముస్లింలకు ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకునే క్రమంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ వాక్సినేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యబృందం డాక్టర్ కార్తిక్, డాక్టర్ బాలాజి, హజ్ కమిటి నాయకులు అమిరోద్దిన్, ఉస్మాన్, వైద్య సిబ్బంది గోవిందరాజు, శ్రీనివాస్రెడ్డి, స్నేహ, విజయ్కుమార్, ప్రహ్లాద్, అమీనా, శివశేషమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దు
ధన్వాడ/మరికల్: ప్రస్తుతం వరి కోనుగోళ్లు లేక గత ప్రభుత్వం అందించే పథకాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తేచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తిసుకొచ్చిన కరువు అని, మరోసారి వారి మాయమాటలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ధన్వాడలోని మందిపల్లిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన్నె శ్రీనివాస్రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల చెవిలో పూలు పెట్టారని, ఇప్పుడు దేవుడి మీద ఒట్టు, అన్ని పథకాలు అమలు చేస్తామని మళ్లీ మాకు ఓటు వేయండంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారని, ప్రజలు వారి మాయమాటలు నమ్మకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకువచ్చిన పథకాలను గుర్తించి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇక బీజేపీకి ఓటు వేస్తే ముందుగా వారు చేసేది రైతుల పొలాల వద్ద మిటర్లు బిగిస్తారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కాంచిరెడ్డి, లక్ష్మినారాయణ, మాధవరెడ్డి, మాదవులు, రాఘవేందర్రెడ్డి, సంజప్ప, నర్సిములుతో పాటు పలువురు గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేశారు. హామీల అమలులో విఫలం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపొతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. మరికల్ మండలంలోని మాధవరం, పెద్దచింతకుంటల్లో ఆదివారం ఆయన రోడ్షో నిర్వహించారు. -
కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
నర్వ: బీడి కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నర్వ, లంకాల్ బీడీ ఫ్యాక్టరీల వద్ద కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత మూడు దఫాలుగా బీడీ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రస్తుతం వెయ్యి బీడీలకు అందిస్తున్న రూ.207కు మరో రూ.10మాత్రమే యాజమాన్యాలు పెంచుతామనడం అన్యాయమన్నారు. కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్న యాజమాన్యాలు వేతన పెంపును పునారాలోచించాలన్నారు. దీంతో పాటు పీఎఫ్ వాటా 50 శాతం జమచేయాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలని, పీఎఫ్లో ఉన్న తప్పొప్పులను వెంటనే సవరించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ వనసర్తి జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాయకులు మన్యం, తిరుపతమ్మ, కృష్ణమ్మ, వెంకటమ్మ, చెన్నమ్మ, భాగ్య, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి నారాయణపేట రూరల్: జిల్లాలో వరుస చోరీల నేపథ్యంలో ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కలిసిరావాలని, మీ చుట్టు పక్కల ఎవరైన కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయి పెట్రోలింగ్ జరగుతుందని, ప్రత్యేక పోలీసు బృందాలు మఫ్తీలో గస్తీ చేపడుతున్నారని, వేసవి దృష్ట్యా బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని సూచించారు. తాళం వేసిన ఇళ్లను దొంగలు లక్ష్యం చేసే అవకాశం ఉన్నందున పక్కింటి వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వీలైనంత వరకు కాలనీ కమిటీలు, వ్యాపార సముదాయాల వారు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని తెలిపారు. మహిళల అభ్యున్నతికి పెద్ద పీట నారాయణపేట: దేశంలోనే అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతంతో పార్లమెంట్లో బిల్లు పెట్టి మహిళల అభ్యున్నతికి పెద్ద పీఠ వేసింది మోదీ ప్రభుత్వం అని ఆ పార్టీ మహిళా మోర్చ అధ్యక్షురాలు లక్షిచ్మ అన్నారు. ఆదివారం మండలంలోని లింగంపల్లిలో పాలమూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డికే అరుణ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతోపాటు మరుగుదొడ్లు, రేషన్ బియ్యం మంజూరు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని వివరించారు. దేశామంత మరో సారి మోదీని పీఎం చేయాలనే చూస్తుందని, ఈ ఎన్నికల్లో హాట్రిక్ పీఎం మోదీ ఖావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఽఈ ప్రాంతానికి చెందిన ధన్వాడ ఆడబిడ్డ అరుణను గెలిపించాలని, ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గ్రామ శివారులో ఉపాధి పనుల్లోని మహిళ కూలీలకు మజ్జిగ అందజేశారు. సుజాత, భీంష న్ జోషి. రాందాస్ నాయక్, కృష్ణ, ఎన్ ఎల్లప్ప, రాజు. విజయ్. వెంకటేష్. ఎల్లాగౌడ్. కార్యకర్తలు మహిళ లు పాల్గొన్నారు. మరోసారి బీజేపీదే అధికారం కల్వకుర్తి రూరల్: దేశంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ఆదివారం సాయంత్రం కల్వకుర్తిలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్తో కలిసి కల్వకుర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట శక్తికేంద్ర ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ నాగర్కర్నూల్ పార్లమెంట్లో భరత్ ప్రసాద్ విజయం ఖాయమన్నారు. శక్తి కేంద్ర ఇన్చార్జ్లకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తమ పరిధిలోకి వచ్చే ప్రతి ఓటరును కలిసి ఈ పదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడగాలన్నారు. ప్రతి కార్యకర్త ఎన్నికల వరకు కష్టపడి పనిచేసి బీజేపీ విజయం కోసం శ్రమించాలని సంతోష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement