ధన్వాడ/మరికల్: ప్రస్తుతం వరి కోనుగోళ్లు లేక గత ప్రభుత్వం అందించే పథకాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తేచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తిసుకొచ్చిన కరువు అని, మరోసారి వారి మాయమాటలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ధన్వాడలోని మందిపల్లిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన్నె శ్రీనివాస్రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల చెవిలో పూలు పెట్టారని, ఇప్పుడు దేవుడి మీద ఒట్టు, అన్ని పథకాలు అమలు చేస్తామని మళ్లీ మాకు ఓటు వేయండంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారని, ప్రజలు వారి మాయమాటలు నమ్మకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకువచ్చిన పథకాలను గుర్తించి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇక బీజేపీకి ఓటు వేస్తే ముందుగా వారు చేసేది రైతుల పొలాల వద్ద మిటర్లు బిగిస్తారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కాంచిరెడ్డి, లక్ష్మినారాయణ, మాధవరెడ్డి, మాదవులు, రాఘవేందర్రెడ్డి, సంజప్ప, నర్సిములుతో పాటు పలువురు గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేశారు.
హామీల అమలులో విఫలం
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపొతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. మరికల్ మండలంలోని మాధవరం, పెద్దచింతకుంటల్లో ఆదివారం ఆయన రోడ్షో నిర్వహించారు.