-
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
● కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిమల్లాపూర్: ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ బూత్ లెవల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రైతుల సంక్షేమానిక అహర్నిశలు పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి వచ్చే ఏడాది డిసెంబర్లోగా చెరుకు క్రషింగ్ జరిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో బాండ్పేపర్లతో రైతులను మభ్యపెట్టి గెలిచిన అర్వింద్ నయా పైసా పనిచేయలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ పచ్చిఅబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కల్వకుంట్ల సుజిత్రావు, వాకిటి సత్యంరెడ్డి, ఎలాల జలపతిరెడ్డి, రుత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆరుగురు కౌన్సిలర్లు ఆదివారం కాంగ్రెస్లో చేరగా వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. యూనిఫాం సివిల్కోడ్, ఎన్ఆర్సీ, 370ఆర్టికల్పై పార్టీ విధానమే తన విధానమన్నారు. బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి, నాయకులు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ముంజాల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు మేలు
పూడికతీత మట్టి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. ఉపాధిహామీ పథకంలో చెరువుల్లో కూలీలతో పూడికతీత పనులు చేయిస్తున్నారు. చెరువుల నుంచి మట్టిని తీసుకెళ్లి వ్యవసాయ భూముల్లో పోయడంతో ఎరువుల భారం తగ్గుతుంది. రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. పంట భూముల్లో మట్టిని పోయడంతో అంతా చదునుగా మారుతుంది.– కొండ ఆంజనేయులు, రైతు, భూషణరావుపేట ట్రాక్టర్ ఖర్చులు భరించాలి ఉపాధిహామీ కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్లలో పోస్తున్నారు. ఆ మట్టిని ట్రాక్టర్లలో తీసుకెళ్లడానికి రైతులే ఖర్చు భరించాలని ప్రభుత్వం అంటోంది. రైతు సంక్షేమం ఆలోచించి ట్రాక్టర్ ఖర్చులు ప్రభుత్వం చెల్లించాలి. ఆర్థికంగా ఉన్న రైతులు తీసుకెళ్తున్నారు. పేద రైతులకు చెరువుల మట్టి అందని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. – ఆకుల నర్సయ్య, రైతు, సిరికొండ వినియోగించుకోవాలి జిల్లాలో 118 చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో పూడికతీత పనులు చేయిస్తున్నాం. మట్టిని కూలీలతో తవ్వించి ట్రాక్టర్లో పోయిస్తాం. కూలీలకు వేసవిలో పని కల్పించినట్లయింది. మట్టిని ఉచితంగానే ఇస్తాంకానీ ట్రాక్టర్లో తీసుకెళ్లేందుకు ఖర్చును రైతులే భరించాలి. పూడికతీత మట్టి పంట పొలాలకు మేలు చేస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ట్రాక్టర్లో మట్టిని తీసుకెళ్లి వినియోగించుకోవాలి. – సంపత్రావు, డీఆర్డీవో, జగిత్యాల -
అంజన్న సన్నిధిలో జిల్లా అడిషనల్ జడ్జి పూజలు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని ఆదివారం జిల్లా అడిషనల్ జడ్జి నారాయణ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆయన గోత్రనామాలపై ప్రత్యేక మంత్రాలు చదివి, అనంతరం తీర్థప్రసాదాలు ఆశీర్వచనం అందించారు. మోహన్రావుపేటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి చాయ్పే చర్చకోరుట్ల రూరల్: మండలంలోని మోహన్రావుపేటలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం చాయ్పే చర్చ నిర్వహించారు. గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద ఆగి చాయ్ తాగుతూ యువకులతో మాట్లాడారు. స్థానిక సమస్యలు, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లపై అడిగి తెలుసుకున్నారు. గోవర్ధన్ వెంట మాజీ ఎంపీటీసి దుంపెట రమేశ్, బీఆర్ఎస్ నాయకుడు బండ మల్లేశ్ యాదవ్, తదితరులున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనకథలాపూర్(వేములవాడ): కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని, వాటి ఆధారంగా దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని పోసానిపేట, దుంపేట, దూలూర్, బొమ్మెన, తక్కళ్లపెల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ డీసీసీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ అజీమ్, పులి హరిప్రసాద్, కారపు గంగాధర్, అల్లూరి దేవా రెడ్డి, రాజారెడ్డి, జీవన్రెడ్డి, కల్లెడ గంగాధర్, గడ్డం చిన్నారెడ్డి, వంగ మహేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు అండగా నిలవాలి మెట్పల్లి: లోక్సభ ఎన్నికల్లో కుల సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఆదివారం మున్నూరు కాపుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నాయకులు కొమొరెడ్డి కరం, విజయ్అజాద్, పట్టణాధ్యక్షుడు జెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలిపెగడపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్.. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్, బతికపల్లిలో గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ప్రజల ను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్కు మరో సారి ఓటేస్తే నీళ్లు, కరెంటు రాదని ఎద్దెవా చేశా రు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల గొంతుకనై పార్లమెంట్లో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించారు. తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ శోభ, పార్టీ రాష్ట్ర నాయకుడు రమణారావు, పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచి అంజ మ్మ, మల్లేశం, గంగాధర్, షకీల్, తిరుపతి, వెంకటేశం, రవి, రాజశేఖర్, శ్రీరాములు పాల్గొన్నారు. -
పడిపోతున్న భూగర్భ జలాలు
● ఏప్రిల్లో 5.70 మీటర్లకు పడిపోయిన జలాలు ● ఒక్క నెలలోనే 0.30మీటర్లు పడిపోయిన వైనంజగిత్యాలఅగ్రికల్చర్: భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే జిల్లాలో నీటి మట్టం 0.30మీటర్లు పడిపోవడంతో.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే నెలలో నీటి మట్టం మరెంతగా పడిపోయే అవకాశముందోననే ఆందోళన మొదలైంది. ఇప్పటికే పట్టణాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందించే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీల్లో పెరుగుతున్న నీటి వినియోగం జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలున్నాయి. ఈ పట్టణ ప్రాంతాల్లో నీటి వినియోగం రోజురోజుకు పెరిగిపోయి భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత నెలలో 7.42మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. నీటి మట్టం 0.27మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 7.69మీటర్లకు చేరుకుంది. కోరుట్లలో గత నెలలో 9.37మీటర్లున్న నీటి మట్టం 1.07మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 10.44మీటర్లకు చేరుకుంది. మెట్పల్లిలో గత నెలలో 5.08మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా.. 0.15మీటర్లు పడిపోయి 5.23మీటర్లకు చేరుకుంది. రాయికల్ మున్సిపాలిటీలో గత నెలలో 3.08మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. 0.12మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.20మీటర్లకు చేరుకుంది. ధర్మపురి మున్సిపాలిటీలో గత నెలలో 7.51మీటర్ల లోతులో భూగర్భ జలముండగా.. ప్రస్తుతం 0.66మీటర్లు పడిపోయి 8.17 మీటర్లకు చేరుకుంది. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పడిపోతున్న నీటి మట్టం జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతాలుగా ముద్రపడ్డ(సాగునీరందని) మల్యాల, మెడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పంటలకు సాగునీరును ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో గత నెలలో 6.67మీటర్ల లోతులో నీరుండగా.. నీటి మట్టం 0.25మీటర్లు పడిపోయి ప్రస్తుతం 6.92మీటర్లకు చేరుకుంది. కొడిమ్యాల మండలంలో గత నెలలో 10.70మీటర్లు ఉండగా.. 0.41మీటర్లు పడిపోయి ప్రస్తుతం 11.11మీటర్లకు భూగర్భ జలం చేరుకుంది. కథలాపూర్ మండలంలో 3.01మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.75మీటర్లకు పడిపోయి 3.76మీటర్లుకు చేరుకుంది. మేడిపల్లి మండలంలో 3.23మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం 0.23మీటర్లు పడిపోయి ప్రస్తుతం 3.46మీటర్లకు చేరుకుంది. ఒక్క నెలలోనే.. జిల్లాలో ఒక్క నెలలోనే నీటి మట్టం సగటున 0.30మీటర్లకు పడిపోయింది. మార్చి నెలలో 5.40మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ నెల చివరి నాటికి 0.30మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.70మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే 0.44మీటర్లు తగ్గింది. జిల్లాలో ఏప్రిల్ చివరి నాటికి కథలాపూర్ మండలంలో అతి తక్కువగా 2.80మీటర్ల లోతులో నీరు ఉండగా.. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో 11.11మీటర్ల లోతులో నీరు ఉండటం గమనార్హం. రోజురోజుకూ తగ్గుతున్నాయి భారీ ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే గాని భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం నెలకొంది. మే నెలలో మరింతగా భూగర్భ జల నీటి మట్టం పడిపోనుంది. – నర్సింహులు, జిల్లా భూగర్భజల వనరుల శాఖాధికారి, జగిత్యాల -
చెరువు మట్టి.. చేలకు పుష్టి
● ఉపాధి పథకంలో 118 చెరువుల్లో పూడికతీతలు ● కూలీలకు లభిస్తున్న పని.. రైతులకు మేలు ● పంట పొలాలకు తీసుకెళ్తున్న రైతులుకథలాపూర్(వేములవాడ): ఉపాధి హామీ పథకం కూలీలకే కాదు.. రైతులకూ మేలు చేస్తోంది. పంటల సాగులో అడ్డగోలుగా రసాయనిక ఎరువులు వినియోగం పెరిగి భూసారం క్షీణిస్తోంది. భవిష్యత్తులో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఉంది. అనుకున్న దిగుబడి రాకపోగా.. పెట్టుబడి పెరిగి రైతులు ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో రైతులు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యాన్ని గుర్తించి చెరువుల్లోని మట్టిని తమ పంట పొలాలకు తరలించుకుంటున్నారు. చెరువుల్లో పూడికతీత పనులను ఉపాధిహామీ పథకంలో కూలీలతో చేయిస్తున్నారు. కూలీలు తీసిన మట్టిని రైతులు ట్రాక్టర్లలో పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. పొలాలు విలువైన పోషకాలతో కూడి సారవంతమవుతున్నాయి. ఈ మట్టిని పొలాల్లో వేసుకోవడంతో.. సేంద్రియ ఎరువుగా పని చేసి భూసారం పెరిగి పంటల దిగుబడి పెరుగుతోంది. అంతేకాకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో రైతులకు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 118 చెరువుల్లో పూడికతీత పనులు జిల్లాలో 20 మండలాలుండగా.. 380 గ్రామాలున్నాయి. జిల్లాలో 1,39,822 మంది ఉపాధిహామీ కూలీలున్నారు. వేసవిలో వ్యవసాయ, ఇతర పనులు లేకపోవడంతో.. కూలీలు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సుమారు 54వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకం పనులకు హాజరవుతున్నారు. ఈ వేసవిలో 118 చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆయా చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఉపాధి పథకంలో పని చేస్తున్న కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్లో పోస్తుండగా.. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లో మట్టిని పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. గతంలో చెరువులోని మట్టిని ప్రభుత్వమే ఉచితంగా ట్రాక్టర్లో సరఫరా చేసేదని రైతులంటున్నారు. చెరువు మట్టితో ప్రయోజనాలు చెరువు మట్టితో పంట పొలాలు సారవంతమవుతాయి. పోటాషియం, జింక్, నత్రజని, భాస్వరం, బోరాన్ వంటి పోషకాలు పెరుగుతాయి. పంటలో తేమ శాతం పెరగడంతో నీటి వినియోగం తగ్గుతుంది. చెరువు మట్టి వేసుకున్న పంట భూముల్లో క్రిమిసంహారక మందుల వాడకం ఎకరానికి రూ.3వేల నుంచి రూ.4వేల పెట్టుబడి తగ్గుతుందని అధికారులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement