-
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
యలమంచిలి : రాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) అన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల చేనేత సంఘాల సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం యలమంచిలిలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి యూవీ రమణమూర్తిరాజు చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి సీఎం జగన్మోహన్రెడ్డి తోడ్పాటునందించారన్నారు. యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న చేనేత కార్మికులకు ఒక సామాజిక భవనం నిర్మిస్తానని తెలిపారు. మగ్గం లేని పేద, వృద్ధ చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. బీసీలను రాజ్యసభకు పంపిన ఎకై క ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత సంఘం సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమను ఎలా ఆదుకున్నారో తెలిపారు. ఆయనకు బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చేనేత సంఘం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి రమణమూర్తిరాజుకు చరఖా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోదెపు గోవింద్, యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్లు అర్రెపు గుప్త, బెజవాడ నాగేశ్వరరావు, యలమంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొద్దపు యర్రయ్యదొర, పట్టణ సచివాలయ కన్వీనర్ కర్రి శివ, పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి త్రినాఽథ్, కో ఆప్షన్ సభ్యుడు దూది నర్సింహమూర్తి, జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ సూరిఽశెట్టి సూరిబాబు, తేలు ఈశ్వరరరావు, వానపల్లి జగన్నాథరావు అరుణలత, మాడెం అప్పలరాజు, శేశెట్టి శ్రీను, మాడెం రమణ, తెడ్లపు సతీష్, శ్రీ భద్రావతి చేనేత సంఘం ప్రెసిడెంట్ దుప్పితూరు, మాడెం నూకరత్నం, మాడెం అప్పారావు, పోతిరెడ్డిపాలెం చేనేత సంఘం సభ్యుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి బూటకపు హామీలు మగ్గం లేని చేనేత కార్మికులకు కూడా పింఛన్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు -
ప్రధాని సభకు భారీ భద్రత
భద్రత ఏర్పాట్లలో పోలీసులు కశింకోట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మండలంలోని ఉగ్గినపాలెం వద్ద అమలోద్భవి హోటల్ పక్కన ఉన్న న్యూ వెంచర్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సభ వేదిక వద్దకు ప్రధానమంత్రి చేరుకుంటారు. సుమారు 2500 మంది కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. డీఐజీ విశాల గున్ని, విశాఖ సిటీ పోలీసు కమిషనర్ రవికుమార్ అయ్యనార్, ఎస్పీ మురళీకృష్ణ, తదితరులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. సభా ప్రాంగణం సమీపంలో మూడు హెలిపాడ్లను ఏర్పాటు చేశారు. -
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
తుమ్మపాల : ప్రధానిని నరేంద్ర మోదీ కశింకోట మండలం రాజుపాలెం గ్రామంలో ఈ నెల 6న బహిరంగ సభకు విచ్చేయు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్టు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు లారీలు, ఇతర వాహనాలను ట్రాఫిక్ దృష్ట్యా మళ్లించడం జరుగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. వివరాలిలా... ●విశాఖపట్నం నుంచి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు విశాఖపట్నం నుంచి బయలుదేరి లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి. ●తుని నుండి విజయనగరం, విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – యలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్– అసకపల్లి జంక్షన్ మీదుగా విజయనగరం, శ్రీకాకుళం లేదా దేశపాత్రునిపాలెం నుంచి జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. ●సబ్బవరం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు అసకపల్లి – లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – యలమంచిలి బైపాస్ – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు. ●చోడవరం నుంచి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి – మునగపాక – పూడిమడక రోడ్డు – అచ్యుతాపురం జంక్షన్ – యలమంచిలి బైపాస్– రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు. -
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు భగవత్ రామానుజాచార్యుల తిరునక్షత్రం పూజలను విశేషంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 8, 11, 12 తేదీల్లో రాత్రి 7గంటల వరకే స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. అలాగే, శ్రీవైష్ణవ శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ నెల 13న సాయంత్రం 5గంటలకు హనుమత్ వాహనంపై స్వామికి తిరువీధి జరుగుతుందని తెలియజేశారు. -
పేదింట విషాదం
● లగేజి ఆటో నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణంయలమంచిలి రూరల్ : వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా కాలేజీ చదువుల కోసం కూలి పనికి వెళ్లిన ఓ పదో తరగతి ఉత్తీర్ణుడైన విద్యార్థి ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణుడైన తమ కుమారుడు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. విగతజీవిగా మారిన కొడుకుని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. వివరాలివి. కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన గూడుపు అర్జున్ చిన్న కుమారుడు సతీష్ (17) వేసవి సెలవులను ఆటపాటలతో వృధా చేయకుండా ఏదో పనిచేసి కొంత మొత్తాన్ని సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లిలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. షేకిళ్లపాలెం వద్ద రాము అనే టెంట్ హౌస్ యజమాని వద్ద రోజువారీ కూలి పనిలో చేరాడు. శనివారం ఓ లగేజీ ఆటోలో టెంట్హౌస్ సామగ్రిని తీసుకెళ్తుండగా సామగ్రికి కట్టిన తాడు ఊడిపోవడంతో తొట్టెలో ప్రయాణిస్తున్న సతీష్ రోడ్డుపై పడిపోయాడు. అతడిపై టెంట్హౌస్ సామగ్రి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి షేకిళ్లపాలెం కూడలికి సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనపై మృతుని సోదరుడు మోహన్సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పైల సింహాచలం ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతదేహానికి యలమంచిలి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్ఐ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement