-
కంటి క్యాన్సర్పై అవగాహన అవసరం
బీచ్రోడ్డు: వైటాథాన్ పేరుతో ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం కంటి క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్కేబీచ్ నుంచి వైఎంసీఏ వరకు జరిగిన ఈ అవగాహన ర్యాలీని రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్ను జయించిన వనుము చంద్రశేఖర్, అర్జున్ అవార్డు గ్రహీత జయరామ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్దేవా మాట్లాడుతూ ప్రజలు కంటి క్యాన్సర్ సాధారణ లక్షణాల గురించి తెలుసుకోవటం, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. రెటినోబ్లాస్టోమా అత్యంత సాధారణ లక్షణం వైట్ రిప్లెక్స్ అని తెలిపారు. వైట్ రిప్లెక్స్ అనేది తెల్లటి లేదా పసుపు తెలుపు కాంతి... పిల్లల కంటిపై కాంతి పడినప్పుడు, ప్లాష్తో ఫొటో తీసినపుడు కళ్లు సరిగా కనిపించకపోవటం, ఎర్రబడటం, మెల్లకన్ను వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా జంబో డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వైటాథాన్లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. -
రాయితీలతో ప్రోత్సాహం
మాగాణి భూముల్లో ఆయిల్ పామ్ తోటలు వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి. ఆయిల్పామ్లో అంతర పంటగా కోకో, అరటి పంట కూడా సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించింది. రెండేళ్లలో మండలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. – వి. భానుపుష్పలీలావతి, మండల ఉద్యానవనశాఖాధికారి, మాడుగుల మండలం ● -
వర్షాధార పంటలకు వాతావరణం అనుకూలం
అనకాపల్లి : వర్షాధార పంటలకు ప్రస్తుత వాతా వరణం అనుకూలంగా ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ పి.వి.కె.జగన్నాథరావు తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాగల ఐదు రోజుల్లో వర్ష సూచన ఉన్నందున తేమను సద్వినియోగం చేసుకోవాలని, వర్షాధార చెరకు పంటలకు నేలను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. తేమను ఉపయోగించి 120 రోజుల వయస్సు గల చెరకు మొక్క, కార్సి చేసిన తోటలో మొక్కల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలన్నారు. ఖరీఫ్లో కొర్రను వేసుకునే రైతులు, అధిక దిగుబడి వచ్చే తక్కువ కాల పరిమితిగల రకరాలైన గరుడ, సూర్యనంది, రేనాడు వంటి రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఖరీఫ్లో విత్తుకోవడానికి అనువైన రకాలైన ఆర్జీఎల్ 2537, బీపీటీ 5204, 3291,ఎంటీయూ 1262, 1318, 1224, 1064 వంటి రకాలను ఎంపిక చేసుకుని విత్తనాన్ని సేకరించుకోవాలన్నారు. వర్షాలను ఉపయోగించుకుని నేలను 2–3 సార్లు మెత్తగా దుక్కిచేసి చదును చేసుకుని విత్తటానికి నేలను సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. నువ్వు పైరును ఈ నెలాఖరులోగా వేసుకోవాలని, రైతులు వర్షాలను ఉపయోగంచుకుని వెంటనే నేలను దున్ని తయారు చేసుకుని నువ్వులలో అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం 17 లేదా వైఎల్ఎం 66 రకాలను విత్తన శుద్ధ్ది చేసి విత్తుకోవాలన్నారు. ఆఖరి దుక్కిలో యూరియా 22 కిలోలు, సింగిల్ సూపర్ పాస్ఫేట్ 63 కిలోలు, మ్యురేట్ ఆఫ్ పొటాస్ 17 కిలోల చొప్పున వేసుకోవాలని ఆయన తెలిపారు. జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర వంటి పచ్చి రొట్ట పైరులను వరికి ముందు వేసుకుని, 40–45 రోజుల తరువాత నేలలో కలియ దున్నకుంటే, వరి దిగుబడులు పెరగడమే కాకుండా నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ జగన్నాథరావు -
31వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు ఇవ్వాలి
మహారాణిపేట (విశాఖ) : వచ్చేనెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈనెల 31వ తేదీలోగా అభ్యర్థులు తమ ఏజెంట్ల జాబితాను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంది. ఒక్కొక్క టేబుల్కు ఒక్కో ఏజెంటును నియమిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 14 మంది ఏజెంట్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టేబుల్కు ఒకరు చొప్పన ఏజెంట్లను నియమిస్తారు. ఏజెంట్లగా ఉండాలంటే.. ●18 ఏళ్లు నిండిన వ్యక్తులను తమ ఏజెంట్లగా అభ్యర్థులు నియమించుకోవచ్చు. ●భారత పౌరసత్వం ఉన్న ఎన్నారైలు కూడా ఏజెంట్లగా ఉండొచ్చు ●సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏజెంట్లగా వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ●కౌంటింగ్ హాలులోకి అభ్యర్థిని లేదా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ను అనుమతి ఇస్తారు. ●ఏజెంట్లను హాలు బయట ఉంచుతారు. ●ఏజెంట్లకు అవసరమైన ఆహారం కూడా అభ్యర్థే భరించాలి ●కౌంటింగ్ హాలులో టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలోని వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టంపజేసి 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. అర్చకుడు అప్పాజీ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్ పిల్లా శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి,శ్రీదేవి,భూదేవిలను కల్యాణమండపంలోని వేదికపై అధిష్టంపజేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణం నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. -
బిందు సేద్యం.. సిరులు తథ్యం
సూక్ష్మ(బిందు, తుంపర్ల) సేద్యం.. తక్కువ నీటి వినియోగంతో మేలైన సాగు మార్గం. నేరుగా మొక్కలకు మాత్రమే నీరందించే వ్యవస్థ. దీంతో కలుపు, చీడ పీడల బెడద చాలా తక్కువ. విద్యుత్, ఎరువులు, కూలీల వినియోగం కూడా నామమాత్రమే. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం అందించే రాయితీ. దీంతో సూక్ష సేద్యం వైపు రైతుల ఆసక్తి పెరుగుతోంది. ఈ ఏడాది జిల్లాలో 1200 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టాలన్నది అధికారుల లక్ష్యం. నాతవరం: ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం(ఏపీఎంఐపీ)లో భాగంగా బిందు(డ్రిప్), తుంపర్ల(స్ప్రింక్లర్) సేద్యానికి ప్రభుత్వం రాయితీపై యూనిట్లు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యాన, వ్యవసాయ పంటల నాణ్యతను మెరుగుపర్చడంలో డ్రిప్ ఇరిగేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రైతుల్ని ఈ దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)ల ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులకు రాయితీపై ఈ యూనిట్లను అందిస్తోంది. 1200 హెక్టార్ల సాగు లక్ష్యం సూక్ష్మ సాగు నీటి పథకం 2023–24కి గాను ప్రభుత్వం జిల్లాలోని 24 మండలాల్లో 1200 హెక్టార్లకు సాగు విస్తరించాలని లక్ష్య నిర్దేశం చేసుకుంది. ఇంత వరకు 880 మంది రైతులకు 825 హెక్టార్లల్లో ఈ పథకంలో భాగంగా యూనిట్లు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏపీఎంఐపీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రాయితీపై ఈ యూనిట్లు పొందేందుకు రైతుకు చెందిన భూమిలో నీరు, విద్యుత్ వసతి తప్పనిసరి. డ్రిప్ ఇరిగేషన్ కోసం 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుకు 90 శాతం రాయితీపై యూనిట్ను ఏర్పాటు చేశారు. అంతకు మించి భూములున్న రైతులకు 55 శాతం మాత్రమే రాయితీ లభిస్తుంది. తుంపర్ల సేద్యంలో యూనిట్ మంజూరుకు ఐదెకరాల్లోపు రైతులకు 55 శాతం రాయితీ, అంతకు మించి భూమి ఉన్నవారికి 45 శాతం రాయితీ అందిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్లు అర్హులైన రైతులు ముందుగా ఆర్బీకేల్లో రిజిసే్ట్రషన్ చేసుకోవాలి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2,011 మంది రైతులు 2,071 హెక్టార్లలో సాగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు 1,259 మంది రైతులు, 1,209 హెక్టార్ల సాగుకు అర్హత పొందారు. కలెక్టర్ ఆమోదంతో వీరికి రూ.5,16,15,697 వ్యయంతో 825 హెక్టార్లలో బిందు, తుంపర్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన రైతుల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్లో పంటల సాగు ద్వారా నీరు, విద్యుత్, ఎరువుల వృధా అరికట్టవచ్చు. కూలీల అవసరం కూడా చాలా తక్కువ. కలుపు మొక్కలు, తెగుళ్ల సమస్య తగ్గుతుంది. దీంతో పంట సాగులో పెట్టుబడి వ్యయం బాగా తగ్గి, దిగుబడి పెరుగుతుంది. కాలానుగుణంగా వస్తున్న అధునిక వ్యవసాయ పద్ధతుల్లో నాణ్యమైన పంట ఉత్పత్తులకు, దిగుబడులకు సూక్ష్మ సాగు విధానం దోహదపడుతోంది. రైతుల్లో ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతోంది. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా మండలాల్లో అవగాహన సదస్సుల ద్వారా రైతుల్లో చైతన్యం పెంచుతున్నారు. గతంలో ఈ పథకం పొందేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్బీకేల ద్వారా రైతులు తమ స్వగ్రామంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సూక్ష్మ నీటి సాగుపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి నీరు, విద్యుత్, ఎరువులు, కూలీల వినియోగం తగ్గుదల డ్రిప్ యూనిట్కు 90 శాతం, స్ప్రింక్లర్లకు 55 శాతం రాయితీ జిల్లాలో 825 హెక్టార్లలో రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు ఏర్పాటు రైతులు సద్వినియోగం చేసుకోవాలి నిబంధనల మేరకు అర్హత ఉన్న రైతులందరికీ డ్రిప్ స్పింక్లర్ల యూనిట్లు అందిస్తున్నాం. సూక్ష సాగు నీటి పఽథకం ద్వారా సాగు చేసే రైతులు తక్కువ పెట్టుబడితో, అధిక ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్బీకేల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలించి కలెక్టరుకు నివేదిస్తాం. కలెక్టర్ ఆమోదం తర్వాత యూనిట్లు ఏర్పాటు చేస్తాం. గతంతో పోల్చుకుంటే రైతుల్లో బిందు సేద్యం పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. – జీవీ లక్ష్మి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అఽధికారి, ఏపీఎంఐపీ పథకం, అనకాపల్లి -
ఐద్వా జిల్లా అధ్యక్షురాలిగా మాణిక్యం
● ప్రధాన కార్యదర్శిగా వరలక్ష్మి అనకాపల్లి : అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా అధ్యక్షురాలుగా పి.మాణిక్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్ధానిక దొడ్డి రామునాయుడు భవనంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.డి.వరలక్ష్మి, కోశాధికారిగా కె.వి.సూర్యప్రభ, ఉపాధ్యక్షరాలుగా ఎల్.గౌరీ, సహాయ కార్యదర్శిగా రావి లక్ష్మి, కమిటీ సభ్యులుగా వాణిశ్రీ, మానస, ఆర్.లక్ష్మి, యూ.లోవ, ఎం.శ్రీదేవి, మంగతాయారు, రెడ్డి వరలక్ష్మి, ఆఫీస్ బేరర్లుగా యు.నాగమణి, లావణ్య, సుస్మిత, కుమారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూపై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మహిళలందరూ బాగా చదువుకుని విద్యావంతులు కావాలని, తమ సమస్యలు పరిష్కరించుకునే పరిజ్ఞానం సంపాదించుకోవాలని ఆమె కోరారు. మహిళలు అనేక రంగాలలో వివిధ స్థాయిల్లో అభివృద్ధి సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం మహిళలందరూ ఐకమత్యంగా పోరాటాలు చేయాలని ఆమె కోరారు. దేశంలో సుమారుగా కోటి 50 లక్షల మంది మహిళలు ఐద్వా సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. -
మెట్ట భూముల్లో ఆయిల్పామ్ సిరులు
● గిరిజన గ్రామాల్లో పెరుగుతున్న విస్తీర్ణం ● ప్రస్తుతం ఽటన్ను పామాయిల్ రూ.14,095 ● జిల్లాలో 7800 ఎకరాల్లో సాగు ఒకప్పుడు బీడు భూములుగా వున్న ప్రాంతం అంతా నేడు ఆయిల్పామ్ తోటలతో కళకళలాడుతోంది. చెరకు, సరుగుడు, తోటల స్థానంలో రైతులు పామాయిల్ తోటలు సాగు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. వాణిజ్య పంటగా విరాజిల్లుతున్న ఆయిల్పామ్ను ముఖ్యంగా మండలంలో గిరిజన గ్రామాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 7800 ఎకరాల్లో సాగవుతోంది. మాడుగుల రూరల్ : జిల్లాలో చెరకు, సరుగుడు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. చెరకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, అలాగే సరుగుడు తోటల ధర కావడం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృషి సారించేలా చేస్తోంది. ఈ రెండు పంటలుకు ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా గిరిజన, మెట్ట ప్రాంతాల్లో పామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ పలు రాయితీలు ప్రకటించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కూడా కల్పించారు. ప్రస్తుతం 2019 సంవత్సరం తర్వాత గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయంలో ఉద్యానవనశాఖాధికారి రైతులకు తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా పామాయిల్, కోకో, అరటి, తదితర పంటలు పెంపకం, వాటి వల్ల వచ్చే లాభాలు గురించి అవగాహన కల్పిస్తున్నారు. మండలంలో తాటిపర్తి, శంకరం, జాలంపల్లి, అవురువాడ, ఎల్.పొన్నవోలు, పొంగలిపాక, గ్రామ పంచాయతీల పరిధిలో శివారు గ్రామాల్లో సుమారు 175 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. పామాయిల్ వేసిన తర్వాత నాలుగు నుంచి ఐదేళ్ల తరువాత తోటలు కాపునకు వస్తాయి. హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్ల పాటు రాయితీ ఉద్యానవన శాఖ ద్వారా ఎరువులు వినియోగానికి అందిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం అంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు వారు అందిస్తున్నారు. జిల్లాలో టెనీరా రకం పామాయిల్ను ఎక్కువగా సాగు చేస్తున్నారు. పండిన పామాయిల్ ప్రూట్ను కాటాల వద్ద తూకం వేసి, అనంతరం బంగారుమెట్టతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో గల పెద్దాపురం, తదితర చోట్ల గల ఆయిల్పామ్ కంపెనీలకు రవాణా చేస్తున్నారు. అక్కడ టన్నుకు ధర నిర్ణయించి నగదు రైతులకు చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో... ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట, కశింకోట, కె.కోటపాడు, దేవరాపల్లి, రావికమతం, నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, మునగపాక, యలమంచిలి, చీడికాడ,సబ్బవరం, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, కోటవురట్ల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, నాతవరం, మాకవరపాలెం, గోలుగోండ, రాంబిల్లి, రోలుగుంట తదితర మండలాల్లో ఆయిల్పామ్ విరివిగా సాగవుతోంది. గత రెండేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 7800 ఎకరాల్లో సాగు అవుతుంది. పామాయిల్ మొక్క ఖరీదు రూ.133 కాగా, 90 శాతం రాయితీతో మొక్కలను రైతులకు పామాయిల్ కంపెనీ వారు అందిస్తున్నారు. రాయితీ సొమ్ము ఆయా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ ఏడాది టన్ను ధర రూ.14,095లుగా ఉంది. రావికమతం, చోడవరం, బుచ్చెయ్యపేట, మండలాల్లో 120 ఎకరాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. తోటబడి కార్యక్రమం ద్వారా రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. -
‘12 వేల మెజారిటీతో విజయం సాధిస్తా..’
అనకాపల్లి : మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి జూన్ 9న విశాఖ కేంద్రంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలో ఆ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో అత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు మౌనంగా ఉండడంతో అవతల వ్యక్తులు సైరన్ మోగిస్తున్నారని, జూన్ 4న సార్వత్రిక ఫలితాల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా తాను 12వేల ఓట్లు మెజార్టీతో గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. విజయోత్సవ సంబరాలు స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన చెప్పారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు తన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. తాను పదేళ్లు అమెరికాలోను కుటుంబ సమేతంగా జీవించానని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీర్వదంతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగిన వెంటనే పార్టీ శ్రేణులు నాలుగు మాసాలు శక్తి వంచన లేకుండా ఎన్నికలకు పని చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గంలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మహిళలు, యువత, వృద్ధులు ప్రశాంతంగా వైఎస్సార్సీపీ గెలుపుకోసం సైలెంట్గా ఓటు వేశారని అన్నారు. జిల్లాలో 6 అసెంబ్లీ, ఎంపీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జూన్ 9న విశాఖ కేంద్రంగా మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకులు అత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, రాష్ట్ర వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహం, జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, కశింకోట మండలం జెడ్సీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిన అప్పారావు, కొణతాల భాస్కర్, మూనూరు శ్రీనివాసరావు, నర్సింగరావు, కొండూరు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. జిల్లాలో 6 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం వైఎస్సార్సీపీదే.. వైఎస్సార్సీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మలసాల భరత్ -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చీడికాడ: మండల కేంద్రానికి చెందిన డోకల నాయుడు (45) చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణరావు అందించిన వివరాలు. మృతుడు నాయుడు పెదగంట్యాడ సమీపంలోని సీతానగరానికి చెందిన మంగదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. మృతుడికి గతంలో రెండు వివాహాలు జరిగాయి. ప్రస్తుతం మంగదేవితో ఉంటూ, పెదగంట్యాడలో కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. భార్యతో తరచూ గొడవలు పడేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని డోకల మరిడమ్మ కల్లం పాకల వద్ద చింత చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. తొలుత దీన్ని గుర్తించిన చీడికాడకు చెందిన బోడ్డు ఎర్రినాయుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న భార్య మంగదేవి ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకుని బోరుమంది. తన భర్త ఐదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
బాలల అదృశ్యంపై ఎఫ్ఐఆర్ వేయాల్సిందే
● తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి రత్నకుమార్చోడవరం రూరల్ : బాలల అదృశ్యంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే జనరల్ డైరీలో నమోదు చేయడంతో సరిపెట్టకుండా కచ్చితంగా ఎఫ్ఐర్ నమోదు చేయాల్సిందేనని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ అదృశ్య బాలల దినోత్సవం సందర్భంగా శనివారం చోడవరం కోర్టుల సముదాయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. హాజరైన కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అదృశ్యమైన పిల్లలను తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చగలగడం, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇతర పిల్లలు తప్పిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న ఉద్దేశ్యంతో మే 25ని అంతర్జాతీయ అదృశ్య బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. బాలల సంరక్షణ ఉద్యమంలో భాగంగా మిస్సింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. దీనిని జిల్లా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుపుతామని, నాలుగు నెలల్లోగా వారి ఆచూకీ తెలియని పక్షంలో జిల్లా టీం పరిశోధన చేస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వారు సెల్ఫోన్ వాడుతున్న తీరును గమనించాలని ఆయన సూచించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.సూర్యకళ మాట్లాడుతూ పిల్లల చర్యలను తల్లిదండ్రులు గమనిస్తుండాలని సూచించారు. పాఠశాలలకు వారు వెళ్లి వస్తున్న తీరు గమనించాలన్నారు. అదృశ్యమైన బాలలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల పోలీసులు గత వైఖరిని మార్చుకుని, తల్లిదండ్రులను ఆరా తీసి దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల చోడవరం పట్టణంలో చోటుచేసుకున్న ముగ్గురు బాలల అదృశ్య సంఘటన, వారి ఆచూకీ కనుగొనడంలో సిబ్బంది కృషిని వివరించారు. ఐసీడీఎస్ రావికమతం సీడీపీవో ఎస్.పుష్పాదేవి, లేబర్ ఆఫీసర్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
తుమ్మపాల: పాలిసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఐ.వి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 3వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు వీలుందన్నారు. కౌన్సెలింగ్ ఫీజు ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలన్నారు. జూన్ 7న సీట్ కేటాయింపు గురించి తెలుస్తుందని, 10 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ వివరాలు తేదీ ర్యాంక్ 27.05.2024 1–12000 28.05.2024 12001–27000 29.05.2024 27001–43000 30.05.2024 43001–59000 31.05.2024 59001–75000 01.06.2024 75001–92000 02.06.2024 92001–108000 03.06.2024 108001– చివరి ర్యాంక్ -
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ (సీబీసీఎస్)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్)లో 98.66, బీకాం(కంప్యూటర్స్)లో 99.71, బికాం(జనరల్)లో 99.92, బీహెచ్ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్ సైన్స్లో 100, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీలో 100, బ్యాచిలర్ ఆఫ్ ఓకేషన్లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు. -
స్ట్రాంగ్రూమ్ చేరిన సర్వీస్ ఓట్లు
● రక్తదానంపై క్రమంగా పెరుగుతున్న అవగాహన ● జిల్లాలో మూడు బ్లడ్ బ్యాంకుల్లో రక్త సేకరణ ● సత్ఫలితాలనిస్తున్న ప్రత్యేక శిబిరాలుఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024అనకాపల్లి: రక్తదాతల పెద్ద మనసు ఎందరికో ప్రాణం పోస్తుంది. రోగులకు స్వస్థత చేకూరుస్తుంది. వైద్యుల కృషికి తోడై ఆందోళనను దూరం చేసి బాధిత కుటుంబాల్లో ఆనందం నింపుతుంది. రక్తదానం చేసే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. శరీరంలో రక్తం వృథాగా ఉండిపోతోందన్న అవగాహన ప్రజల్లో మరింత పెరిగి, వారు దాతలుగా మారితే రోగులకు మరింత మేలు జరుగుతుంది. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రుల్లో రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయి. అనకాపల్లి పట్టణంలో అభయాంజనేయ రక్త నిల్వల కేంద్రం పేరిట ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఈ మూడు కేంద్రాలే ఉన్నాయి. రక్త సేకరణ బస్ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఉంది. ఇందులో ఇద్దరు టెక్నీషియన్లు ఉంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ గ్రామాల్లో రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతలు, తీర్థాలు వంటి జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట శిబిరాలు నిర్వహించి రక్తసేకరణ చేస్తారు. రోటరీ, సంజీవని, ఫస్ట్ బ్లడ్బ్యాంకులు అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహిస్తుంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి క్యాంపుల్లో 100 బ్లడ్ బ్యాగ్లు సేకరిస్తే అందులో 30 స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. దాతకు ఆరోగ్యం.. స్వీకర్తకు ప్రాణదానం రక్తదానంపై ఇటీవల కాలంలో అవగాహన పెరిగింది. దాతలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం ప్రాణాపాయంలో ఉన్న వారికి ఊపిరి పోయడమే కాదు దాతలకు కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులు రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం వచ్చి ఆరోగ్యవంతులవుతారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో రోగులకు రోజుకు 6 నుంచి 8 బ్యాగ్ల రక్తం అవసరం ఉంటుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రోగులకు రోజుకు 2 నుంచి 3 బ్యాగ్ల రక్తం కావాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అనుబంధ బ్లడ్ బ్యాంకుల నుంచి ఉచితంగా రక్తం ఇస్తారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం వివిధ రకాల పరీక్షల నిమిత్తం ప్రభుత్వం రూ.800లు వసూలు చేసి రక్తం అందిస్తుంది. ప్రైవేట్ బ్లడ్బ్యాంకులయితే రూ.1000 నుంచి 2000లు వసూలు చేస్తాయి. ఎవరు రక్తదానం చేయవచ్చంటే.. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. ఆరోగ్యవంతులు మూడు మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. రక్తదానం చేసిన వ్యక్తికి రెండు, మూడు రోజుల్లో శరీరంలో కొత్తరక్తం ఉత్పత్తి అవుతుంది. రక్తదాతలు 48 గంటల ముందు మద్యం సేవించరాదు. రెండు గంటల ముందు పొగతాగరాదు. అటువంటి వ్యక్తుల నుంచి మాత్రమే రక్త నిల్వ సిబ్బంది రక్తం తీసుకుంటారు. ఆరోగ్యవంతులైన వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని బ్లాడ్ బ్యాంక్ వైద్యులు ప్లాస్మా, ప్యాకెట్ సెల్స్, ప్లేట్లెట్స్గా విభజిస్తారు. ప్లాస్మా గుండె ఆపరేషన్లు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, కిడ్నివ్యాధి రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్యాకెట్ సెల్స్ ఎనీమియా రోగులు, చిన్నచిన్న ఆపరేషన్లు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న రోగులు తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా రోగులకు ఉపయోగిస్తారు. ప్లేట్లెట్స్ను డెంగ్యూ, క్యాన్సర్ రోగులు, రక్తం ఆగకుండా శరీరంలో బ్లీడింగ్ అయిన రోగులకు మాత్రమే వినియోగిస్తారు. ఎన్టీఆర్ వైద్యాలయంలో ప్లాస్మా,, ప్లేట్లెట్స్, ఎజిటేటర్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదిసార్లు రక్తదానం చేశా రక్తదానం చేయడంతో ఆరోగ్యంగా జీవించవచ్చను. శరీరంలో పాతరక్తం పోయి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్తదానం చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. కొత్త రక్తం శరీరంలో అభివృద్ది చెందడంవలన శక్తిపెరుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 9సార్లు రక్తదానం చేశాను. మాకుటుంబ సభ్యులకు కావలసినప్పుడు ఒకసారి ఇక్కడనుంచే తీసుకువెళ్లడం జరిగింది. –లోకేష్, అనకాపల్లి వేసవిలో రక్తదాతలు ముందుకు రావాలి వేసవి కాలంలో రక్తనిల్వలు కొరత ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు వేసవి సెలవులు, ఉద్యోగులు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, విలాసయాత్రలకు వెళ్లడం వలన చాలా తక్కువ మంది రక్తదానం చేస్తారు. దాతలు ముందుకు వచ్చి రక్తం ఇస్తే కొరతను అధిగమించవచ్చు. రక్తనిల్వలు తక్కువగా ఉండడంతో 15మంది ఆస్పత్రి ఉద్యోగులు మూడు వారాల క్రితం రక్తదానం చేశారు. కొంతమంది యువత స్వచ్ఛందంగా వైద్యాలయానికి వచ్చి రక్తదానం చేస్తున్నారు. ప్రధాన ప్రదేశాల్లో రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నెలకు రెండు క్యాంపులు నిర్వహిస్తాం. –ఎస్.కనకదుర్గ, ఎన్టీఆర్ వైద్యాలయం బ్లడ్బ్యాంక్ వైద్యురాలు స్ట్రాంగ్రూమ్లో సర్వీస్ ఓట్లను భద్రపరిచాక గదికి సీల్ వేయిస్తున్న డీఆర్వో దయానిధి తుమ్మపాల: ఈనెల 25వ తేదీ నాటికి 1,262 విభాగాల్లో విధుల్లో ఉన్న సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు. ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా సర్వీస్ ఓటర్లు) పోస్టల్ బ్యాలెట్లను శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములో భద్రపరిచినట్లు తెలిపారు. జూన్ 4న అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. మహిళా కానిస్టేబుల్ స్వచ్ఛంద రక్తదానంన్యూస్రీల్ -
హింసకు పాల్పడితే కఠిన చర్యలు
● కౌంటింగ్ రోజున జిల్లా అంతటా 144 సెక్షన్ ● ర్యాలీలు, బాణసంచా కాల్చడం నిషేధం ● అవగాహన సదస్సులో ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణఅచ్యుతాపురం : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ మురళీకృష్ణ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణపై అచ్యుతాపురం మండలంలోని ఒక ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఐదేళ్లకొకసారి జరిగే వాటికోసం కొట్లాడుకోవద్దని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. జూన్ ఒకటిన వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఓ అంచనా మాత్రమేనని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవకాశం ఉన్నంత వరకూ కౌంటింగ్ రోజు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. హింసకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. ఏజెంట్లకు పెన్ను, పేపర్లు తామే అందిస్తామని తెలిపారు. ఫలితాలు వచ్చిన తర్వాత గ్రామాల్లో ర్యాలీలు, బాణసంచా కాల్చడం నిషేధించామని పేర్కొన్నారు. అనవసరంగా గొడవలకు పాల్పడి ప్రశాంతమైన జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. డీఎస్పీ సత్యనారాయణ, అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, యలమంచిలి సీఐ గఫూర్, నాలుగు మండలాల ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. -
ప్లాంటేషన్ పనులకు ప్రాధాన్యం
● ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్సబ్బవరం : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్లాంటేషన్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర జాయింట్ కమిషనర్ శివప్రసాద్ సూచించారు. మండలంలోని బాటజంగాలపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న మినీ అమృత సరోవర్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. సుమారు రూ.8.84 లక్షల ఉపాధి నిధులతో నీటి నిల్వకు సంబంధించి చేపడుతున్న ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి వాటర్ హార్వెస్టింగ్ చేస్తే బోర్ల కింద పొలాలకు ఎటువంటి నీటి వనరుల కొరత లేకుండా పంటలను సమృద్ధిగా పండించుకోవచ్చని ఆయన సూచించారు. మండలంలో సుమారు 5 వేల మంది ఉపాధి కూలీలతో 50 వరకూ ఫారం పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు ఆయనకు వివరించారు. కూలీలకు రూ.300 వరకూ వేతనం గిట్టుబాటు అయ్యేలా పనులు చేయిస్తున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ.సందీప్, అనకాపల్లి క్లస్టర్ ఏపీడీ మణికుమార్, విశాఖపట్నం ఏపీడీ ఆంజనేయులు, ఎంపీడీవో రామ్మోహనరావు, ఏపీవో మళ్ల శ్రీనివాసరావు, ఈసీ పరమేష్ పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్కు కేరాఫ్ ఆర్జీయూకేటీ
సాక్షి, విశాఖపట్నం: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల ఉన్నత విద్య కలను సాకారం చేస్తూ వారు అత్యున్నత స్థానాల్లో కొలువులు సాధించేందుకు ఆసరాగా ఉంటున్నాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశాలు లభిస్తాయి. రాష్ట్రంలో నాలుగు క్యాంపస్లు శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలులో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో క్యాంపస్లో 1100 సీట్లు (ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ కలిపి) అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రెవేషన్ స్కోర్ ఇస్తారు. 10వ తరగతి మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, ఆంగ్లో ఇండియన్, దివ్యాంగులు వంటి ప్రత్యేక కోటాలు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అత్యుత్తమ విద్య.. ఆర్జీయూకేటీలో ఆరేళ్లు చదువుకునే అవకాశం లభిస్తుంది. రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు చదువుకోవచ్చు. లేదంటే పీయూసీ పూర్తిచేసి రిలీవ్ కావచ్చు. పీయూసీ అనంతరం ఇంజినీరింగ్లో కొనసాగవచ్చు. సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ, ఐటీ వంటి బ్రాంచ్తో పాటు ఇడుపులపాయ, నూజివీడుల్లో ప్రత్యేక బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన గేట్ వంటి ర్యాంకులు సాధిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ వంటి అత్యున్నత ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. పరిశ్రమల్లో మంచి ప్యాకేజీలకు సైతం సాధిస్తున్నారు. జూలై 11న జాబితా.. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కాగా, 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 11న ఎంపికై న వారి జాబితా విడుదల చేస్తారు. జూలైలో ప్రవేశాలు పూర్తిచేసి, ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు. రెసిడెన్షియల్ విధానంలో బోధన ఏడాదికి పీయూసీ ఫీజు స్ట్రక్చర్ రూ.45 వేలు కాగా, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.50 వేలు, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు లభిస్తాయి. తెలుపు రేషన్ కార్డు ఉన్న కుటుంబాల పిల్లలకు ఉచితంగా విద్య లభిస్తుంది. పూర్తిగా రెసిడెన్సియల్ విధానంలో బోధన జరుగుతుంది. అందుబాటులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు మంచి అవకాశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రవేశాల్లో నాలుగు శాతం డిప్రెవేషన్ స్కోర్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జూన్ 25 ఆఖరు తేదీ -
No Headline
ఏలేరు కాలువ నుంచి బాలశంకర్ మృతదేహాన్ని తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలంలో సీఐ శంకరరావు అనకాపల్లి : బహిర్భూమికి వెళ్లి తుమ్మపాల ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తూ కాలుజారి పడి దేవీనగర్కు చెందిన వెదురుపర్తి బాలశంకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ సీఐ జి.శంకరరావు తెలిపిన వివరాలివి. మృతుడి సోదరుడు నాగ వీరవెంకట సత్యనారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఘటనపై మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
తోట చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం
మాడుగుల రూరల్/ యలమంచిలి రూరల్ : యలమంచిలి తండాలదిబ్బ కూడలికి సమీపంలో వున్న తోట చెరువులో శుక్రవారం 35 ఏళ్ల వయసుగల వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడిది మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామానికి చెందిన శానాపతి రామాంజనేయలు (35)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదై ఉందని స్థానిక ఎస్ఐ పి.దామోదర్నాయుడు శనివారం సాయంత్రం తెలిపారు. రామాంజనేయులు ఈ నెల 21 వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 23 తేదీన రామాంజనేయులు భార్య దేవి స్థానిక పోలీసుస్టేషన్కు ఫిర్యాదు చేశారు. 24న యలమంచిలి చెరువులో రామాంజనేయులు మృతదేహం బయ ల్పడింది. మృతుడి భార్య, బంధువులు శనివారం యలమంచిలి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించడంతో శనివారం అంత్యక్రియలు జరిపారు. కాగా ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి యలమంచిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత రామాంజనేయులుది హత్యా? ఆత్మహత్యా? నిర్థారిస్తామని యలమంచిలి సీఐ షేక్ గఫూర్ తెలిపారు. -
జంపెన వాసవీమాత ఆలయంలో హుండీ చోరీ
పగులగొట్టి పొలాల్లో పడేసిన హుండీ మాడుగుల రూరల్ : మండలంలో జంపెన గ్రామంలో గల వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి హుండీ చోరీకి గురైంది. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్వక్తులు ఆలయం తలుపులు తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాను తెరిచారు. బీరువాలో వున్న చీరలు చిందర వందరగా పడవేసారు. ఆలయంలో గల హుండీని పగులగొట్టి అందులోని సుమారు రూ. 25000 నగదును తస్కరించారు. ఈ హుండీని తీసుకెళ్లి సమీపంలో గల పొలాల్లో పడేశారు. శనివారం ఉదయం గ్రామంలో గల వాసవీ క్లబ్ సభ్యులు ఆలయానికి వెళ్లినపుడు గుడి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ కమిటీవారికి సమాచారం అందించారు. కమిటీ వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శనివారం వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మండలంలో పలు గ్రామాల్లో గ్రామ దేవతల హుండీలు చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా తాజాగా వాసవీమాత ఆలయంలో ఈ నెల 18న వాసవీమాత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీలో దాతలు వేసిన నగదు చోరీకి గురికావడం పట్ల వాసవీక్లబ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ పాలిటెక్నిక్లో ‘ఉద్యోగ విజయోత్సవం’
చోడవరం రూరల్ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 55 మంది కంప్యూటర్, మెకానికల్ విభాగాల్లో ఆరు కంపెనీల్లో ఉద్యోగావకాశాలను సాధించారు. వీరిలో కంప్యూటర్ బ్రాంచి విద్యార్థి పి.అనురాగ్ కార్తీక్ ఆల్కోవెక్స్ ప్రొడక్ట్ స్టూడియో కంపెనీలో అత్యధికంగా 5.8 లక్షల రూపాయల వార్షిక వేతనంతో నియమితుడయ్యాడు. అలాగే రూ.3.05 లక్షల వార్షిక వేతనంతో టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ కంపెనీకి ఐదుగురు విద్యార్థులు, రూ.2.98 లక్షల వార్షిక వేతనంతో మేథా సెర్వో డ్రైవ్స్ కంపెనీకి ముగ్గురు, రూ.2.43 లక్షల వార్షిక వేతనంతో డైకిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అత్యధికంగా 34 మంది, రూ.2.32 లక్షల వార్షిక వేతనంతో వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏడుగురు, రూ.1.40 లక్షల వార్షిక వేతనంపై ఐదుగురు విద్యార్థులు పిక్సెల్ విండ్ టెక్నాలజీస్ కంపెనీకి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నాగరాజు అధ్యక్షతన ఉద్యోగ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక వేతనంతో నియామకం పొందిన విద్యార్థి అనురాగ్ కార్తీక్ తల్లిదండ్రులను సత్కరించారు. నియామకాలు పొందిన 55 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. కళాశాల హెచ్ఓడీలో డి.రజని, వై.వెంకటరత్నం, అధ్యాపకులు మాట్లాడుతూ మరిన్ని తరగతి గదులు, సాంకేతిక పరికరాలను అందించి ప్రోత్సహించాలని కోరారు. రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో.. తుమ్మపాల : కృషి పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎం.వెంకటలక్ష్మమ్మ అన్నారు. మండలంలో రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జరిగిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలు పొందడం వల్ల సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాగలరని అన్నారు. కళాశాలకు చెందిన 2023–24 వార్షిక సంవత్సరంలో 76 మంది విద్యార్థులు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపాల్ ఐవీఎస్ఎస్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి డీవీ రమణ, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. -
కౌంటింగ్కు కౌంట్డౌన్
● ఎన్నికల ఫలితాలకు సరిగ్గా 10 రోజులు ● జోరందుకున్న అధికారుల ఏర్పాట్లు ● అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా గదుల కేటాయింపు ● ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు ● తొలుత 19,374 పోస్టల్, సర్వీస్, హోమ్ ఓట్ల లెక్కింపు, తరువాత ఈవీఎంలు ● లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్న1500 మంది సిబ్బంది మాడుగులదే తొలి ఫలితం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1,88,989 పోలైనవి 1,62,580 పోలింగ్ కేంద్రాలు అత్యల్పంగా 235 సాక్షి, అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. జూన్ 4న జరిగే కౌంటింగ్కు సరిగ్గా పది రోజులే ఉండడంతో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన సంగతి తెలిసిందే. అదే స్కూల్లో మరో పక్క కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థుల సమక్షంలో గురువారం నుంచి లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలివి. మొత్తం 1500 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 84 టేబుల్స్ ఉంటాయి. వీటితో పాటుగా పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు మరో ఆరు హాళ్లలో 14 టేబుల్స్ చొప్పున సిద్ధం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు సమయంలో గెజిటెడ్ ర్యాంకు కల్గిన స్టాఫ్ కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్, ఈవీఎంలు అందజేయడానికి ఇద్దరు వీఆర్వో (బీఎల్వోలుగా పనిచేసినవారు) ఉంటారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర ప్రత్యేకంగా నియమించిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఆ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను, ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారి ఓట్లను అసెంబ్లీ, పార్లమెంట్కు వేర్వేరుగా లెక్కిస్తారు. జిల్లాలో హోమ్ ఓట్లు 1082, ఎన్నికల సిబ్బంది ఓట్లు 12,864, సర్వీసు ఓట్లు 1051, ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నవారి ఓట్లు 2,909 మొత్తం 19,374 ఓట్లు ఉన్నాయి. వీటి లెక్కింపు పూర్తయిన అరగంట తరువాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ పోలింగ్ రోజులాగే లెక్కింపు జరిగే జూన్ 4న వెబ్కాస్టింగ్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచే కౌంటింగ్ తీరును పర్యవేక్షించవచ్చు. అధికారుల కోసం ఒకటి, పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం మరొకటి కమాండ్ కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోలు జారీ చేసిన పాస్లు ఉన్నవారినే లోపలకి అనుమతిస్తాం. అభ్యర్థుల సమక్షంలో ఈనెల 23 నుంచి లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. – రవి పట్టన్శెట్టి, జిల్లా ఎన్నికల అధికారిఈనెల 13న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ తీరును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టి.. కౌంటింగ్ రోజుకూడా ఇదే విధంగా కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది (ఇన్సెట్) కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ ప్రతి రౌండ్కు అర్ధ గంట ఒక రౌండ్ లెక్కింపునకు సగటున అరగంట పడుతుందని అంచనా. ప్రతి రౌండ్కు 14 టేబుల్స్ చొప్పున లెక్కింపు జరగనుంది. నియోజకవర్గం పోలింగ్ రౌండ్లు చివరి రౌండ్లో కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు చోడవరం 243 18 5 పాయకరావుపేట 292 21 12 మాడుగుల 235 17 11 అనకాపల్లి 251 18 13 యలమంచిలి 246 18 8 నర్సీపట్నం 262 19 10 -
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్.రాయవరం/రావికమతం: కౌంటింగ్ సమయంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని వివిధ రాజకీయపార్టీల నాయకులతో అడ్డురోడ్డు శ్రీనివాస్ కల్యాణ మండపంలో, చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల నాయకులతో రావికమతంలోని తిరుమల కల్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని, అదే వాతావరణంలో కౌంటింగ్ కూడా జరగాలన్నారు. రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు సిబ్బందితో నిఘా ఉంచామని చెప్పారు. బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా సామరస్యంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా వచ్చేనెల 4న ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. రావికమతంలో జరిగిన సమావేశంలో డీఎస్పీ అప్పలరాజు మాట్లాడుతూ జూన్ ఆరో తేదీ వరకూ జిల్లాలో సభలు,సమావేశాలు,ర్యాలీలు, ధర్నాలు నిషేధమని తెలిపారు. బాణసంచా కాల్చకూడదని, కౌంటింగ్ ఏజెంట్గా నియమితులైన వారు నిబంధనలు పాటించాలన్నారు. ఎస్.రాయవరంలో జరిగిన కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ మోహన్, సీఐలు అప్పన్న, విజయ్కుమార్, పాయకరావుపేట జెడ్పీటీసీ లంక సూరిబాబు, ఎస్.రాయవరం వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, వివిధ పార్టీల నాయకులు నల్లపరాజు వెంకటరాజు, నరేష్, సత్యనారాయణ, రావికమతంలో జరిగిన సమావేశంలో కొత్తకోట సీఐ ఎల్.అప్పలనాయుడు,చోడవరం సీఐ బి.శ్రీనివాసరావు,రావికమతం, కొత్తకోట ఎస్లు పాల్గొన్నారు. ● ఎస్పీ మురళీకృష్ణ -
చందనోత్సవంలో బాలల వసతులపై ప్రశంస
సింహాచలం: ఈ నెల 10న జరిగిన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవంలో బాలలు ఇబ్బంది పడుకుండా సింహాచలం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారని ఏపీ బాలల వాక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. ఈమేరకు శుక్రవారం సింహగిరిపై దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తిని సీతారాం ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు. దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ దేవదాయశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారుల సహాయసహకారాలతో భక్తులు ఇబ్బంది పడకుంగా మెరుగ్గా ఏర్పాట్లు చేశామన్నారు. -
తొలిరోజు టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ● టెన్త్ తెలుగు పరీక్షకు 593 మంది హాజరు ● తొలి రోజు ఇంటర్ పరీక్షలు రాసిన 2,840 మందిఅనకాపల్లి/తుమ్మపాల: ప్రశాంతమైన వాతావరణంలో టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్షకు 1,086 మంది విద్యార్థులకు గాను 54.60 శాతంతో 593 మంది హాజరుకాగా, 493 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. డీఈవో స్వయంగా అచ్యుతాపురం పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. మూడు తనిఖీ బృందాలు 11 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు విడతలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.సుజాత తెలిపారు. ఉదయం జనరల్ కేటగిరీలో జరిగిన పరీక్షలకు 2,067 మందికిగాను 1,948 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషన్ కేటగిరీలో 273 మందిలో 236 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో జనరల్ కేటగిరీలో 521 మందికి 483 మంది పరీక్ష రాయగా, ఒకేషనల్లో 194 మందికి 173 మంది హాజరయ్యారు. మొత్తం 3,055 మందికి గాను 2,840 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక సదుపాయాలతోపాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- టార్గెట్ పిన్నెల్లి
- ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Advertisement