Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

A to Z మూవీ న్యూస్‌

Advertisement

గాసిప్స్

View all

రివ్యూలు

View all
Advertisement

సినీ ప్రపంచం

Do You now Mamitha Baiju Original Name?
ప్రేమ‌లు బ్యూటీ అస‌లు పేరేంటో తెలుసా? చిన్న పొర‌పాటు..

మ‌మితా బైజు.. ఇప్ప‌టివ‌ర‌కు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్‌లో ఒక్క‌సారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమ‌లుతోనే! ఇప్ప‌టివ‌ర‌కు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క‌ ప్రేమ‌లు మూవీతో వ‌చ్చింది. ప్ర‌స్తుతం రెబ‌ల్ మూవీతో త‌మిళంలో ఎంట్రీ ఇవ్వ‌నుంది. అస‌లు పేరు అది కాదు!తెలుగులోనూ అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నాయి. అయితే ఈమె అస‌లు పేరు మ‌మిత కాద‌ట‌.. న‌మిత‌! హాస్పిట‌ల్ సిబ్బంది బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌లో ఎన్ అనే అక్షరానికి బ‌దులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో న‌మిత కాస్త మ‌మిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్న‌స‌లు చూసుకోనేలేదు.ఒక్క అక్ష‌రంబ‌డిలో చేర్పించే స‌మ‌యంలో మ‌మిత అని ప‌డింద‌ని గ‌మ‌నించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉంద‌ని అలాగే ఉంచేశారు. మ‌మిత అంటే మ‌ల‌యాళంలో మిఠాయి అని అర్థం. ఈ విష‌యాన్ని ప్రేమ‌లు బ్యూటీయే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఒక్క పొర‌పాటుతో త‌న జాత‌క‌మే మారిపోయింద‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారుచ‌ద‌వండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్

Upcoming OTT Release Movies In Telugu May 2nd Week
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృ‍ష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‪‌గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)నెట్‍‌ఫ్లిక్స్ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10అమెజాన్ ప్రైమ్ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09 హాట్‌స్టార్ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ 58 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10జియో సినిమామర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10సోనీ లివ్అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లేద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10సన్ నెక్స్ట్ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10ఆపిల్ ప్లస్ టీవీడార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

Malayalam Actor Jayaram Daughter Malavika Grand Reception
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్‌ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!

ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్‌లో మాళవిక-నవనీత్‌ రిసెప్షన్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024

Kovai Sarala Didn't Go To Her Father Funeral, Here The Reason
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్‌

కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్‌ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్‌ నటి బాక్‌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్‌ కమెడిన్‌ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్‌, ఒక బ్రదర్‌ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్‌ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్‌ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్‌ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్‌. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్‌ అయింది.  

Getup Srinu Movie Raju Yadav Trailer Out Now
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!

జబర్దస్త్ కమెడియన్ రాజు యాదవ్, అంకిత కారత్ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. యధార్థం సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గెటప్‌ శ్రీను తన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌ ప్రారంభంలోనే క్రికెట్‌ ఆడుతుండగా శ్రీనుకు బాల్ తగలడంతో ముఖచిత్రం మారిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా ఫేస్‌ విచిత్రంగా తయారవుతుంది. దీంతో అతని నవ్వుతో పడే ఇబ్బందులను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌గా గెటప్ శ్రీను కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్‌ విడుదల చేయగా.. ఆడియన్స్‌ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రంలో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. 

Geethanjali Malli Vachindi Movie OTT Release Details
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)

Kareena Kapoor Says Elder Son Taimur Want to be With Me
ఎప్పుడూ ప‌నీప‌నీ.. మాతో ఉండ‌వా? అని నా కుమారుడు నిల‌దీశాడు

హీరోయిన్ క‌రీనా క‌పూర్ ఇప్పుడు యునిసెఫ్ (యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ ఎమర్జెన్సీ ఫండ్‌) జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌. ఈ అరుదైన ఘ‌న‌త అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలోని ఈవెంట్‌లో పిల్ల‌ల గురించి మాట్లాడింది. 'పిల్ల‌లు తండ్రి గురించే కాదు త‌ల్లి చేసే ప‌ని గురించి కూడా ఆలోచిస్తారు. నీతో ఉండాల‌నుంద‌మ్మాఅంతేకాదు అమ్మ‌ ఎప్పుడూ ఏదో ఒక ప‌నితో బిజీగా ఉంటోంద‌ని ఒకింత గౌర‌వ‌మిస్తారు. ఈ రోజు నా పిల్ల‌ల‌కు హాలీడే.. నేను కూడా వారితో క‌లిసుండాల‌ని కోరుకున్నారు. కానీ నాకు ప‌నుంద‌ని చెప్పి వ‌చ్చేశాను. పెద్ద‌బ్బాయి తైమూర్ అయితే.. నువ్వెప్పుడూ ప‌నీప‌నీ అంటూ ఢిల్లీ, దుబాయ్ వెళ్తూ ఉంటావు.. నాకు నీతో ఉండాల‌నుంద‌మ్మా అన్నాడు. మ‌న‌సు చివుక్కుమంది. ప‌ని కూడా ముఖ్య‌మైన‌దే కాబ‌ట్టి వెళ్ల‌క త‌ప్ప‌డం లేద‌ని చెప్పాను. మాటిచ్చానుత్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని, ఎక్కువ స‌మ‌యం త‌న‌తో గ‌డుపుతాన‌ని మాటిచ్చాను. అది నెర‌వేరుస్తాను కూడా.. అందుకే పిల్ల‌లు వాళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేసిన‌ట్లుగా భావించ‌రు. పేరెంట్స్ ఇద్ద‌రూ వ‌ర్క్ చేసుకుని ఇంటికి వ‌చ్చేస్తార‌ని తైమూర్‌ అర్థం చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ నుంచే కొన్ని ల‌క్ష‌ణాలు నేర్చుకుంటారు. చివ‌గా సూపర్ హిట్ మూవీలో..సైఫ్ ఎప్పుడూ పిల్ల‌ల ముందు మ‌నం ప్రేమ‌గా, ఆప్యాయంగా మెద‌లాల‌ని, అంతే ప్రేమ‌గా మాట్లాడాల‌ని చెప్తుంటాడు. మ‌న‌ల్ని చూసే వాళ్లు నేర్చుకుంటార‌న్నాడు. అందుకే మాలాగే నా పిల్ల‌లిద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌర‌వంగా మెదులుతారు అని చెప్పుకొచ్చింది. క‌రీనా చివ‌ర‌గా క్రూ సినిమాలో క‌నిపించింది.  ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.చ‌ద‌వండి: 'హీరోయిన్' సెట్‌లో అదృశ్యం.. స్నేహితులే శ‌రీరాన్ని ముక్క‌లు చేసి..!

Sharmin Segal Turns Off Comments Post Backlash For Alamzeb Role
ఓటీటీలో హీరామండి.. స్టార్‌ డైరెక్టర్‌ మేనకోడలిపై విమర్శలు!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్‌ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్‌పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్‌ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్‌లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్‌లో ఓకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్‌ చేసిన బిగ్ మిస్టేక్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్‌కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ  సినిమాలో నటించింది.     View this post on Instagram           A post shared by Sharmin Segal Mehta (@sharminsegal)

Meenakshi Thapa: Heroine Sad Life Story
న‌టిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్‌.. త‌ల అడ‌విలో, మొండెం..

కరీనా క‌పూర్ హీరోయిన్‌గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్ర‌స్తావ‌న సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన న‌టి మీనాక్షి థాప‌ర్ గురించి! ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న ఆమెకు ఇదే చివ‌రి సినిమా! చిన్న వ‌య‌సులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్ర‌త్యేక క‌థ‌నం..సినిమా ఛాన్స్‌కు ముందు1984 అక్టోబ‌ర్ 4న మీనాక్షి థాప‌ర్ జ‌న్మించింది. డెహ్రాడూన్‌లో త‌న విద్యాభ్యాసం జ‌రిగింది. సినిమాల మీద ఆస‌క్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావ‌డానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్ర‌య‌త్నాల త‌ర్వాత‌ 2011లో 404 అనే హార‌ర్ సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ అవ‌లేదు.సెట్స్‌లో అదృశ్యంత‌ర్వాత మ‌ధుర్ భండార్క‌ర్ సినిమా 'హీరోయిన్‌'లో ఛాన్స్ వ‌చ్చింది. క‌రీనా క‌పూర్‌తో యాక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డిపోయింది. త్వ‌ర‌లోనే న‌టిగా గొప్ప స్థాయికి చేరుకోవ‌చ్చ‌ని భావించింది. అంత‌లోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్‌కి రాగా అక్క‌డే ఆమె అదృశ్య‌మైంది.  ఆమె ఎక్క‌డికి వెళ్లిందో ఎవ‌రికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న న‌టి త‌ల్లికి ఫోన్ కాల్ వ‌చ్చింది. రూ.15 ల‌క్ష‌లు డిమాండ్‌అందులో మీనాక్షి మాట్లాడుతూ.. త‌న ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్‌, ప్రీతి సురిన్‌తో క‌లిసి  అల‌హాబాద్‌కు వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మూడు రోజుల త‌ర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి త‌ల్లికి ఒక మెసేజ్ వ‌చ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 ల‌క్ష‌లు పంపండి.. మూడు రోజులు మాత్ర‌మే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే త‌ను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంట‌ర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని బెదిరించారు. రోజులు గ‌డుస్తున్నాఈ బెదిరింపుల‌కు న‌టి త‌ల్లి లొంగ‌లేదు. ఆర్మీలో ప‌ని చేస్తున్న త‌న కుమారుడితో క‌లిసి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా పూస గుచ్చిన‌ట్లు చెప్పింది. రోజులు గ‌డుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొర‌క‌లేదు. ఒక‌రోజు అమిత్‌, ప్రీతి(వీరిద్ద‌రూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని ప‌ట్టుకుని విచారించ‌గా అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మీనాక్షిని హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించాడు.శ‌రీరాన్ని ముక్క‌లుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన స‌మాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన త‌ర్వా ఆమె త‌ల‌, మొండెం వేరు చేశారు. అల‌హాబాద్‌లో ప్రీతి ఇంటికి ద‌గ్గ‌ర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో త‌న శ‌రీరాన్ని ముక్క‌లుగా కోసి ప‌డేశారు.  త‌ల‌ను అలహాబాద్ నుంచి ల‌క్నోకు వెళ్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో బ‌స్సులో నుంచి అడ‌విలో విసిరేశారు. 2018లో న్యాయ‌స్థానంలో నిందితులిద్ద‌రికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వ‌ల్ల‌ 27 ఏళ్ల వ‌య‌సుకే న‌టి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక త‌ల్లికి తీర‌ని క‌డుపుకోత మిగిలింది.చ‌ద‌వండి: సింగ‌ర్‌పై బాటిల్ విసిరిన ఆక‌తాయి.. అయినా స‌హ‌నం కోల్పోకుండా..

Aditya Roy Kapur and Ananya Panday BREAK UP After Nearly 2 Years
ప్రియుడితో బ్రేకప్‌ చేసుకున్న లైగర్ భామ!

బాలీవుడ్‌లో మరో స్టార్‌ జంట బ్రేకప్‌ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్‌ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ‍వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.  

Advertisement


Advertisement