ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే? | Sakshi
Sakshi News home page

Ilaiyaraaja: రజినీకాంత్‌ సినిమాపై వివాదం.. ఇళయరాజా నోటీసులపై స్పందించిన తలైవా!

Published Sun, May 5 2024 9:09 AM

 Ilaiyaraaja Issues Copy right Notices To Rajinikanth Movie Makers

ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్‌ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్‌ ఎలా స్పందించారో తెలుసా?

రజనీకాంత్‌ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్‌. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్‌ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సీన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశా రు.

కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్‌ హీరోగా నటించిన తంగమగన్‌ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్‌ వా పాట ట్యూన్‌నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్‌ పిక్చర్స్‌ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్‌ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్‌ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు.    

Advertisement
 
Advertisement