Kollywood
-
రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్-2 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు రజనీ మాజీ అల్లుడు ధనుష్ తన 55వ చిత్రాన్ని కూడా దీపావళి టార్గెట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే.. కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు మామఅల్లుళ్లు.. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారన్నమాట.నిజానికి జైలర్-2 సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. అయితే రీషూట్స్ కారణంగా సినిమా పలుమార్లు డిలే అవుతూ వచ్చింది. ఇక అలా వాయిదాలు పడుతూ ఆకరికి దీపావళి బరిలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అటు ధనుష్ మాత్రం తన సినిమా ప్రారంభం నుంచి అక్టోబర్ నెల రిలీజ్ టార్గెట్ గానే తన సినిమాను రెడీ చేస్తున్నాడు.ఈ విషయంలో ప్రాక్టికల్గా చూసుకుంటే సూపర్స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్తో ధనుష్ పోటీ పడే అవకాశం లేదు. కానీ వీళ్ల మధ్య ఉన్న పాత బంధం కారణంగా ఈ బాక్సాఫీస్ క్లాష్ అందర్నీ ఆకర్షించే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ధనుష్ తన సినిమాని థియేటర్లలోకి తెచ్చేంత సాహసం చేయడంటున్నారు మరికొంతమంది. ధనుష్ సినిమాలన్నీ కూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతాయి. దాంతో బరిలో రజనీకాంత్ ఉన్నా ధనుష్ తగ్గకపోవచ్చని అంటున్నారు మరికొంతమంది. చూడాలి ఈ ఆసక్తికర పోరులో చివరికి ఏమౌతుందో.రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ 2004లో వివాహం చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో వారి 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడిచి 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అనంతరం 2024లో కోర్టు వీళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. -
ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని''సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు. ఆయనని డార్లింగ్ అని పిలుస్తూ అందుకు గల కారణాన్ని కూడా చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)'ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్కి. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో డార్లింగ్ అనే పిలుస్తున్నాను. లయోలా కాలేజీ రోజుల నుంచి, మీతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆ పిలుపు మారలేదు. ఎన్నో అటుపోట్లు, విమర్శలు తట్టుకుని మీరు సూపర్స్టార్గా ఎదగడం చూశా. ఇప్పుడు మీరు తమిళనాడు సీఎం కావడం ఆనందంగా ఉంది. మీ హోదా, పదవి మారి ఉండొచ్చు గానీ మీరు ఏ మాత్రం మారలేదు. కళైంజ్ఞర్ అయ్య నుంచి జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుంచి ఉదయ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలిచే అదృష్టం నాకు దక్కడం స్పెషల్గా అనిపిస్తోంది. ఎప్పటికీ నేను మీ అభిమానినే''మిమ్మల్ని కలిసే సందర్భంలో బొకే, శాలువా ఇవ్వకుండా ఆ మొత్తాన్ని ఆర్థికంగా వెనకబడిన ముగ్గురు ఆడపిల్లల చదువు కోసం మీ పేరుతో సాయం చేస్తున్నాను. ఆ పిల్లలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారనే నమ్మకం నాకుంది. మీ పదవీకాలంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళనాడుకు ఉత్తమ భవిష్యత్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విశాల్ రాసుకొచ్చాడు. సాయం అందుకున్న పిల్లల పేర్లు కూడా తన ట్వీట్లో చేర్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)Dearest darling CM Vijay @CMOTamilnadu The word “darling “ hasn’t changed which I used to call u for the last so many years since i knew u from Loyola college. It all started wen I got to know you as a budding star and then seeing u rise up the ladder as the SUPERSTAR facing… pic.twitter.com/iTLAeCZ3cp— Vishal (@VishalKOfficial) June 16, 2026 -
ఓటీటీకి రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.బ్లాస్ట్ కథేంటంటే..'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా. #ArjunSarja #Abhirami & #PreityMukundan in Blockbuster Action Movie #Blast Coming to Netflix on 25th June... #BlastOnNetflix pic.twitter.com/48kX1z7Hjp— The South Movies (@TheSouthMovies1) June 16, 2026 -
జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిక అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం తన స్నేహితుడికి సాయం చేయాలని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన జీవీ ప్రకాశ్ తన తరఫున చిన్న సాయం అంటూ రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ జీవీ ప్రకాశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ మూవీకి సంగీమందించనున్నారు. అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వస్తోన్న చిత్రానికి పని చేయనున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. రోటీన్కు భిన్నంగా బీచ్లో మ్యూజిక్ కొడుతూ అనౌన్స్ చేశారు. ఇందులో కూడా అనిల్ రావిపూడి తనలోని క్రియేటివిటీని చూపించారు. ఈ సినిమాకు అనంత శ్రీరామ్ లిరిసిస్ట్గా పని చేయనున్నారు. Best of luck a small help from my side . Hope it’s authentic pic.twitter.com/9SYOjM2ohk— G.V.Prakash Kumar (@gvprakash) June 16, 2026 -
12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్
మన జీవితంలో కుటుంబం తర్వాత స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. చాలామంది ఫ్రెండ్స్ని కూడా తమ ఫ్యామిలీలో ఒకరిగానే చూస్తుంటారు. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా తన స్కూల్ ఫ్రెండ్ అరవింద్ని అలానే గుర్తుపెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన అరవింద్.. అనిరుధ్లోని మ్యూజిక్ టాలెంట్ని గుర్తించాడు. స్టార్ డమ్ రాకముందే అనిరుధ్ దగ్గర సౌండ్ ఇంజినీర్గానూ పనిచేశాడు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2014లో గుండెపోటుతో అరవింద్ చనిపోయాడు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఫ్రెండ్ చనిపోయిన బాధని మనసులో దాచుకున్న అనిరుధ్.. తన తొలి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ సాంగ్ని స్నేహితుడికి అంకితమిచ్చేశాడు. 'అరవింద్' పేరుతోనే రీసెంట్గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. వేగంగా మారుతున్న ఈ డిజిటల్ మ్యూజిక్ రంగంలో నిలదొక్కుకోవడానికి పోరాడే ఒక స్వతంత్ర కళాకారుడి సవాళ్లని ఈ అరవింద్ మ్యూజికల్ ఆల్బమ్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇదని అనిరుధ్ చెప్పాడు.2012లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రం '3' కోసం రూపొందించిన వై దిస్ కొలవెరి డి పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్.. ఇటీవల జైలర్, విక్రమ్, కూలీ, లియో, దేవర, జవాన్ తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించి రాక్స్టార్గా పేరు సంపాదించాడు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ) -
సీఎంగా విజయ్.. 12 ఏళ్ల తర్వాత త్రిషకు కలిసిరానుందా?
ఏదైనా కొత్త సినిమాలు ఏడాదికో, రెండేళ్లలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే అది కాస్తా మూడు నుంచి నాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ది భారీ బడ్జెట్ మూవీస్ సైతం అనుకున్న టైమ్లోనే విడుదలైన సందర్భాలే ఎక్కువ. కానీ షూటింగ్ పూర్తై ఐదు నుంచి పదేళ్లయినా కూడా రిలీజ్ కానీ చిత్రాలు రిలీజ్కు నోచుకోలేదంటే చాలా కారణాలే ఉండొచ్చు. ఈ జాబితాలో విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం దాదాపు 8 ఏళ్లవుతున్న విడుదల కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవలే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్కు మరో నెల రోజుల సమయం కోరాడు.మరి ఒక సినిమా విడుదలకు ఇదే చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ అంతకు మించి రిలీజ్ కాకుండా ఆగిపోయిన మూవీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నటించిన చిత్రం కావడం మరో విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇటీవల రాజకీయ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే గతంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శతురంగ వట్టై-2 ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2014లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్థిక సమస్యల వివాదంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరవింద్స్వామి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ నిర్మల్కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్ వినోద్ కథ అందించారు.అయితే తాజాగా ఈ మూవీ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట ఉన్న క్రేజ్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సీఎం అయ్యాక ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆమెకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో చిత్రీకరణ పూర్తయిన తర్వాత పుష్కర కాలానికి త్రిష మూవీ రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..!
కోలీవుడ్ స్టార్స్ సినిమాలతో పాటు పాలిటిక్స్ వైపు దూసుకెళ్తున్నారు. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం అయ్యారు. అదే స్ఫూర్తితో రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. విజయ్ పార్టీలో చేరతారా? లేదా అన్నదానిపై రాబోయే రోజుల్లో తెలియనుంది.ఇదిలా ఉండగానే మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన జీవీ ప్రకాశ్ కుమార్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నారు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనతో భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని హింట్ ఇచ్చారు జీవీ ప్రకాశ్. తాజా ఇంటర్వ్వూలో ఈ కామెంట్స్ చేశారు.ఇటీవలే రాఘవ లారన్స్, రజినీకాంత్ అల్లుడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. లారెన్స్ ఇప్పటికే ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ సంకేతాలిచ్చారు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ.. తమిళనాట రాజకీయాలను శాసించనుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
సీఎంగా తొలి బర్త్ డే.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ప్రియులను ఎక్కువగా భయపెట్టిన చిత్రాల్లో ఈ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. రాఘవ లారెన్స్ తన నటన, గాంభీర్యంతో ఆడియన్స్ను భయపెట్టిన తీరు ఆకట్టుకుంది. కాంచన సిరీస్లో వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ సిరీస్లో కాంచన-4 కూడా వచ్చేస్తోంది. ఈ మూవీతో రాఘవ లారెన్స్ బిజీగా ఉన్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్కు ఆమెను ఎంపిక చేశారని టాక్. ఈ హారర్ కామెడీ చిత్రంలో నయన్ పాత్ర హైలెట్గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్లో చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కరుప్పు బ్లాక్ బస్టర్.. సూర్య పై కన్నేసిన రావిపూడి
-
ముగిసిన భారతీ రాజా అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి
దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్హౌస్కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్హౌస్కు తరలివచ్చారు.అంతకుముందు సీనియర్ హీరోయిన్ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.VIDEO | Tamil Nadu: Actor Suhasini Maniratnam pays tributes to Bharathiraja in Theni, says “He changed the colour and character of Tamil cinema”.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/VkhkLxtFst— Press Trust of India (@PTI_News) June 11, 2026 -
విశాల్ త్రిపాత్రాభినయం.. మకుటం యాక్షన్ టీజర్ రిలీజ్
విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టీజర్లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు. -
రాజకీయాల్లోకి సూపర్ స్టార్ అల్లుడు.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని రుజువైంది. ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్కు మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎంజీఆర్ కూడా సినీ రంగ నుంచే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈనెల 12న పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారు. అయితే తాజాగా సూపర్స్టార్, తలైవా అల్లుడు వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో కలిసి అడుగులు వేయనున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కె. అన్నామలై కొత్తగా ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమంలో వైశాగన్ పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ తమిళనాడుతో ఆసక్తికరంగా మారింది. ఇది రజినీకాంత్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం అన్నామలై ద్రవిడ నాట సరికొత్త రాజకీయశక్తిగా అవతరించనున్నారు. రజినీకాంత్ అల్లుడు వైశాగన్ అన్నామలే ఉద్యమంతో చేరడంపై తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. సూపర్స్టార్ రజనీకాంత్తో ఆయనకున్న సంబంధం.. తమిళనాడులో వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల ఆయన రాజకీయ ఎంట్రీపై ప్రజల్లో చర్చ మొదలైంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలకు వైశాగన్ చేరిక బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గతంలో రజనీకాంత్ స్వయంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాగన్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
తీరని కలగానే మిగిలిపోయింది: సెలబ్రిటీల భావోద్వేగం
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు తారలు భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వెలకట్టలేనిదిభారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.- చిరంజీవి Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026 కలగానే మిగిలిపోయింది: ఖుష్బూమనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్మార్క్ను సెట్ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.- ఖుష్బూ Devastated to know that our most beloved, loved and respected Director, the legendary #BharathiRaaja avl is no longer with us. His demise is a gloomy cloud in tamil cinema. His films have been bench marks and shall continue to be the actual school of film making. He leaves behind… pic.twitter.com/p5a6yhn95y— KhushbuSundar (@khushsundar) June 10, 2026ఆయన శైలి ప్రత్యేకం : పవన్ కల్యాణ్ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.- పవన్ కల్యాణ్నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిఒక శకం ముగిసింది: విశాల్'భారతీరాజా గారితో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మనల్ని విడిచి వెళ్లారన్న వార్త వినడం ఎంతో దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చిన దార్శనికుడు ఆయన. మన గ్రామాలు, ప్రజలు, భావోద్వేగాలలోని అంతరార్థాన్ని వెండితెరపై మరెవరూ చూపించలేనంత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలాంటి పాత్రలను అందించారు. ఆయన సినిమాలు ఎన్నో తరాల దర్శకులకు, నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సృష్టించిన ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుంది.సృజనాత్మక దర్శకులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారికి ఆయన కృషి ఒక నిదర్శనంగా, చలనచిత్ర నిర్మాణంలో ఒక 'బైబిల్' (మార్గదర్శి)గా నిలుస్తుంది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తమిళ సినిమా గొప్ప కథకులలో ఒకరిని కోల్పోయింది. మీతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా #PandiyaNaadu చిత్రంలో తండ్రీకొడుకులుగా కలిసి పనిచేసినప్పుడు మీతో గడిపిన సమయం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.ఈ గొప్ప చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగమేనన్న భావనను ఆ క్షణాల్లో మీరు నాకు కలిగించారు. ఎప్పుడూ ఉత్సాహభరితమైన చిరునవ్వుతో, యువకుడిలాంటి ఉత్సాహంతో మీరు వ్యవహరించిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని విశాల్ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమా టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Shocking and sad to hear the news about our legendary filmmaker, Iyakunarimayam Bharathiraja sir passing away and leaving us all this morning. A visionary who changed the landscape of Tamil cinema forever, he brought the soul of our villages, our people and our emotions to the…— Vishal (@VishalKOfficial) June 10, 2026 గొప్ప పాఠాలుహిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.- కాయల్ దేవరాజ్இயக்குனர் இமயமே! நீ சரியவில்லை;இன்னும் நீ உயரமான இடத்தை நோக்கி சஞ்சரிக்க சென்றுள்ளாய்! என்றும் உன் படைப்புகள் எங்களுக்கு பாடங்கள்!#LegendaryDirector #Bharathiraaja #RIPBharathiraaja Sir pic.twitter.com/ZoP6ozrmAf— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 10, 2026 A director who found poetry in the soil, truth in silence, and soul in every frame. Sharing screen space with Bharathiraja Sir in Thudarum was an honour I will cherish forever.Rest in peace, Sir. Your legacy will continue to inspire generations, and your presence will be deeply… pic.twitter.com/9yP88mLtCO— Mohanlal (@Mohanlal) June 10, 2026 Our @ikamalhaasan sir pays his last respects to ace director and his friend Mr #bharathiraja after he passes away.#ripbharathiraja #kamalhaasan pic.twitter.com/WZtuTMcOku— Kamal Haasan’s Diehard Kamalians (@DiehardKamalian) June 10, 2026இயக்குநர் பாரதிராஜாவுக்கு நடிகர் ரஜினிகாந்த் அஞ்சலி | RIPBharathiraja | Rajinikanth |#RIPBharathiraja | #Rajinikanth | #IyakkunarImayam | #IyakkunarImayamBharathiraja pic.twitter.com/3NnjefQ9OL— Ilaya Bharatham (@IBharatham) June 10, 2026 చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత
సినీ దిగ్గజం భారతీరాజా (84) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. భారతీరాజా మృతితో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు.. పచ్చని పొలాలు అంటే పెయింట్ చేసిన బ్యాక్డ్రాప్లు. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి.. పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండితెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమాను కొత్త దారిలో నడిపించిన ఆయన ప్రభావం తెలుగు సహా దక్షిణ భారత సినిమా మొత్తంపైనా కనిపించింది.సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అయితే కళలపై ఉన్న మక్కువ ఆయనను సినీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఎన్నో కష్టాలు, నిరీక్షణల తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, గ్రామీణ కథలను చూపించే విధానాన్నే మార్చేశారు. అప్పటి వరకు సెట్లలో నిర్మించిన కృత్రిమ గ్రామాలే ఎక్కువగా కనిపించేవి. కానీ భారతీరాజా మాత్రం కెమెరాను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లారు. మట్టి వాసన, పల్లె మనుషుల భాష, వారి ఆనందాలు, బాధలు అన్నింటినీ సహజత్వంతో చూపించారు. అందుకే ఆయనను తమిళ సినీ ప్రపంచం ప్రేమగా "దర్శకుల హిమాలయం"గా అభివర్ణించింది.భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి.. కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే, ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది.దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానూ భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన భారతీరాజా, తన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినప్పటికీ సినిమాపై ప్రేమను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. కెరీర్ చివరి దశలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి, తాత, గ్రామ పెద్ద.. ఇలాంటి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా ఎంత సహజత్వాన్ని చూపించారో, నటుడిగానూ అంతే సహజమైన అభినయంతో మెప్పించారు.భారతీరాజా మరో గొప్ప సేవ ఏమిటంటే.. కొత్త ప్రతిభను వెలికితీయడం. ఆయన చిత్రాల ద్వారా అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత వారు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.కెరీర్భారతీరాజా.. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంట్గా చేరి తన కెరీర్ ఆరంభించారు. పలువురు దర్శకుల దగ్గర పని చేసిన ఈయన 1977లో '16 వయిదినిలే' అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కిళక్కేపోగుమ్ రైలు, సిగప్పురోజాక్కళ్, టిక్ టిక్ టిక్, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.తెలుగులోనూ..తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకిగానూ నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ప్లేను అందించారు. తన సినిమాల ద్వారా రాధ, రాధికా శరత్కుమార్, రేవతి, కార్తీక్ సహా పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక సినిమాలు చేశారు.ఆరు జాతీయ అవార్డులుఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.కరుప్పు కథేంటంటే..మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. god mode ON 🔥 #KaruppuOnPrime, June 12@Suriya_offl @RJ_Balaji @SaiAbhyankkar @dop_gkvishnu @trishtrashers @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy #AnaghaMayaRavi #VikramMor @kalaivananoffl #ArunVenjaramoodu @PraveenRaja_Off @ZeeTamil… pic.twitter.com/VeKFZ4qViA— prime video IN (@PrimeVideoIN) June 8, 2026 -
టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్ఫామ్స్ వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్
మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎందరు దీన్ని పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్ ఠాకుర్ ఇప్పుడే తెలుసుకుందట. ఉత్తరాది భామనే అయినప్పటికీ బాలీవుడ్లో కంటే దక్షిణాదిలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం, హాయ్నాన్న వంటి చిత్రాలు మృణాల్ కెరీర్కి చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామ.. కోలీవుడ్ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉంది.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)ఈ పాటికే హీరో శివకార్తికేయన్తో జోడీ కట్టే అవకాశం ఈమెని వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ మూవీలో నటించలేకపోయింది. తాజాగా ధనుష్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపోతే రీసెంట్గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె.. జీవితంలో నిజమైన ఆనందం గురించి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుందని అనుకున్నా. అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుందని తెలుసుకున్నా. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానిలో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అనేదాని గురించి ఎదురుచూడను. చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్ ఠాకుర్ చెప్పింది.(ఇదీ చదవండి: వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు.. కమెడియన్ మృతి) -
విజయ్ ఆంటోని.. ఏ స్టార్ ఊహించని నిర్ణయం
చాలామంది నటీనటులు, తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాం, తమ జీవితం కళామతల్లికే అంకితం లాంటి మాటలు చెబుతూ ఉంటారు. కొందరు మాత్రమే కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ లిస్టులోకి తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని చేరేలా కనిపిస్తున్నాడు. తన భవిష్యత్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. అంతకు ముందు సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతానికైతే హీరోగా అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'నూరు సామి'. తెలుగులో 'వంద దేవుళ్లు' పేరుతో రిలీజ్ కానుంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో చెన్నై వదిలేసి, పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఏ స్టార్ కూడా తీసుకోడు.'నాకు ఎప్పటినుంచి సాధారణంగా బతకడంపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కారణంగా చెన్నైలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు.. టెంకాశీలో స్థిరపడినట్లు నేను పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో నివసించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఏదైనా గ్రామంలో భూమి కొనేందుకు చూస్తున్నాను. గ్రామ జీవితం నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య అనుబంధం లాంటి మంచి విషయాలు గ్రామాల్లో ఉన్నాయి' అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.ఇకపోతే విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ.. మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. సినిమాలు కూడా చాలా తగ్గించేశాడు. చూస్తుంటే రాబోయే రెండేళ్లలో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి ఏదైనా పల్లెటూరిలో స్థిరపడిపోతాడేమో?(ఇదీ చదవండి: రామ్ చరణ్ని సర్ప్రైజ్ చేసిన కూతురు) -
'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన చివరి సినిమాకు మోక్షం కలగట్లేదు. 'జన నాయగణ్' ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 19న థియేటర్లలో విడుదల పక్కా అని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన 'జన నాయగణ్'.. లెక్క ప్రకారం ఈ ఏడాది జనవరి 9నే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా అప్పటినుంచి అలా ఉండిపోయింది. మధ్యలో నిర్మాతలు కోర్టుకెళ్లారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. మూవీ కూడా లీక్ అయింది. విజయ్ ముఖ్యమంత్రి కావడంతోనే ఇక సినిమా సాఫీగా రిలీజ్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమస్యలు తప్పట్లేదు.ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ రద్దవగా.. తాజాగా థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా రద్దు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ తిరిగిచ్చేయమని నిర్మాతకు హీరో విజయ్ సూచించారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోమని నిర్మాతకు సలహా ఇచ్చారట. ఇప్పుడీ విషయం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త) -
రాఘవ లారెన్స్కి కూతురుందా? ఇప్పుడామె కూడా ఇండస్ట్రీలోకి
రాఘవ లారెన్స్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది డాన్స్. డ్యాన్సర్గా కెరీర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్స్తో స్టెప్పులు వేయించారు. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చే మరో విషయం హారర్ థ్రిల్లర్ సినిమాలు. ముని నుంచి కాంచన 3 వరకు హారర్ థ్రిల్లర్ చిత్రాలతో సెపరేట్ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడీయన వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)లారెన్స్ ప్రస్తుతం 'కాంచన 4' చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో 'బెంజ్' అనే యాక్షన్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇలా కొరియోగ్రాఫర్, హీరో, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న లారెన్స్.. త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వైరల్ అవుతోంది. లారెన్స్.. రాఘవేంద్రస్వామి భక్తుడు అని తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే పేరు పెట్టారు. అయితే ఈమె ఉందనే సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు.ఇకపోతే రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తున్నారు. త్వరలోనే చైన్నెకి తిరిగి వచ్చి, దర్శకురాలిగా కెరీర్ ప్రారంభిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి ఈమె తండ్రిలా హారర్ సినిమాలు తీస్తుందా? లేదంటే వేరే జానర్ ట్రై చేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: త్రిషతో వివాదం.. సీఎం విజయ్కి పార్తీబన్ కానుక!) -
అల్లు అర్జున్- లోకేశ్ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. -
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
సినీ నటి ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి త్వరలో జరగనుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని అతడి స్వగృహంలోనే కలిసి పెళ్లి కార్డ్ అందజేశారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'ఇది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ఆయన నివాసంలోనే కలిసి శ్రీ శ్రవణ్ శ్రీనివాసన్తో జరగనున్న నా కుమార్తె పెళ్లికి ఆహ్వానించాం. విజయ్ను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నా కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్లోనూ విజయ్ ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతో మమ్మల్ని ఆత్మీయంగా పలకరించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!
విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్ను పరామర్శించారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్షాట్లు, ఆమె పెంపుడు కుక్క చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. -
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. -
కమెడియన్ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు
దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.ఆయనలా నటించా..ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.చదువు లేదుఅందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్ నేర్చుకుందామని క్లాసెస్కు వెళ్లాను. అక్కడ ఇన్స్ట్రక్టర్ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. అప్పుడే డిసైడయ్యా..ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్ చేశావ్ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.చదవండి: డోలారే సాంగ్ షూటింగ్లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్? -
నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్కు ఎంత కష్టమొచ్చింది? -
300 కోట్ల క్లబ్ లో కరుప్పు
-
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
వరుస బ్లాక్బస్టర్స్తో స్పీడుమీదున్న ప్రదీప్ రంగనాథన్కు ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) పెద్ద షాకే ఇచ్చింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా అతడి భార్య, హీరోయిన్ నయనతార నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఊహించని ఈ ఫలితానికి విఘ్నేశ్ విస్తుపోయాడు. కనీసం రూ.200-300 కోట్లు వసూలు చేస్తుందనుకున్నానని బాధపడ్డాడు.నెగెటివ్ టాక్థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎల్ఐకేపై ఎందుకు నెగెటివిటీ ప్రచారం చేశారో తెలియడం లేదు కానీ సినిమా అదిరిపోయిందని పలువురు అతడికి మెసేజ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విక్కీ. 'ఆన్లైన్లో ఎల్ఐకే మూవీపై వచ్చిన నెగెటివిటీ చూసి దీన్ని థియేటర్లలో చూడటం మిస్ అయ్యాం అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు.కలలు నాశనంపెద్ద తలకాయల అండదండలు లేని చిన్న సినిమాలపై కొందరు విశ్లేషకులు తమ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని సినిమా చూడనివ్వకుండా నిరాశపరుస్తున్నారు. దర్శకుల కలల్ని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ బలంగానే ఉన్నప్పటికీ ఈ నెగెటివ్ ప్రచారం సినిమాను దెబ్బకొట్టింది. సినిమా ఫలితాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎల్ఐకే అనేది ఒక విభిన్నమైన తమిళ చిత్రం. ఆ కష్టం ఎవరికీ కనపడదుదీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ రావాల్సింది. ఇలాంటి సినిమా తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సినిమాను రూపొందించి, రిలీజ్ చేయడం వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి థియేటర్లవరకు తీసుకొచ్చాను. కానీ, దానికి చివరకు ఇలాంటి ముగింపు రావడం కలిచివేసింది. అయినా కొన్ని గొప్ప సినిమాలు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆదరణకు నోచుకోవు.. కానీ, తర్వాతి కాలంలో అవే క్లాసిక్ చిత్రాలుగా పరిగణించబడతాయి. భవిష్యత్తులో నా సినిమాకు కూడా అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను' అని విఘ్నేశ్ ఎమోషనల్ లేఖను పంచుకున్నాడు.చదవండి: ప్రముఖ సింగర్ ఇక లేరు -
అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఇళయరాజా
సంగీత రంగంలో రారాజుగా వెలుగుతున్న సంగీతదర్శకుడు ఇళయరాజా. తమిళం, తెలుగు మొదలగు భాషల్లో తన ఖ్యాతిని చాటిన ఈయన సంగీత పయనం 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం, ఆదివారం.. రెండు రోజులపాటు చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సంగీత కచేరి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘‘నేను అవార్డుల కోసం వేచి చూసే వ్యక్తిని కాదు. నేను నడిచినా, మాట్లాడినా సాధననే’’ అని ఇళయరాజా పేర్కొన్నారు. సంగీత కచేరిఈ వేదికపై తన ఇద్దరు మనవళ్ల మధ్య కూర్చుని ఇళయరాజా సంతోషంగా కనిపించారు. ముందుగా విదేశీ సంగీత కళాకారులు సింపోనిని వాయించారు. అనంతరం ఇళయరాజా గతంలో సంగీతం అందించిన పాటలను శ్రోతల కోసం వాయించారు. ఇళయరాజా 'పుదియ వార్పుగళ్' చిత్రంలోని 'ఇదయం పోగుదే..' అనే పాటను రూపొందించిన విధానం గురించి, దానికి వాడిన సింపోని గురించి వివరించారు. అతిథులుఈ కార్యక్రమంలో ఇళయరాజా వారసులు యువన్ శంకర్రాజా, కార్తీక్రాజాలతో పాటు దర్శకుడు మిష్కిన్, కార్తీక్ సుబ్బరాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, మారి సెల్వరాజ్, విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్ధ్, పార్తీబన్, సంతానభారతి, ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది సంగీత ప్రియులు ఆనందంతో తరించారు. -
ఎల్సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్కమ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్ డీసీ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. Welcome to the universe @iam_RaviMohan sir 🤗🤗❤️❤️ #Benz @offl_Lawrence @nivinofficial @iamsamyuktha_ @Dir_Lokesh @PassionStudios_ @TheRoute @GSquadOffl @Sudhans2017 @Jagadishbliss @bakkiyaraj_k @SaiAbhyankkar pic.twitter.com/kxF51Vtb9Z— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 31, 2026 -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
అజిత్ కు పరామర్శ.. ఒకే వాహనంలో సీఎం విజయ్, త్రిష
-
కోలీవుడ్లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు
నటి ఐశ్వర్యరాజేశ్ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలును అందుకున్నారు. అక్కడ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అలా తెలుగులో చిత్రాలు చేయడంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ వచ్చింది. కాగా ఇప్పుడు ఇక్కడ మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్–18 అనే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు కిచ్చా సుదీప్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు కార్తీక్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఆర్ ప్రొడక్షన్న్స్ పతాకంపై బి.జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసినందుకు దక్కిన అవకాశం ఈ చిత్రం అని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
హీరో అజిత్ తల్లి కన్నుమూత
చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి మోహిణి మణి (84) చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న అజిత్.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్ తల్లి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అజిత్ కుమార్ తల్లి మోహిని ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయిన అజిత్కు ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.- కమల్ హాసన్ சகோதரர் திரு. அஜித்குமார் அவர்களின் தாயார் திருமதி. மோகினி மணி அவர்கள் மறைந்த செய்தி அறிந்து வருத்தமடைந்தேன். அன்புத் தாயை இழந்து தவிக்கும் அஜித்குமாருக்கும் அவரது குடும்பத்தாருக்கும் எனது மனமார்ந்த ஆறுதல்களைத் தெரிவித்துக்கொள்கிறேன்.— Kamal Haasan (@ikamalhaasan) May 30, 2026 డియర్ అజిత్.. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకర సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను- రాధికా శరత్కుమార్Dear #ajith so sorry to hear of the passing of your mother. Condolences to the family and pray for strength in this sad phase of your life.🙏🙏may she be in peace.— Radikaa Sarathkumar (@realradikaa) May 30, 2026 చదవండి: జూన్లో విడుదలయ్యే సినిమాల జాబితా -
'కూతురి పెళ్లికి తప్పక రండి'.. మోదీకి ఖుష్బూ ఆహ్వానం
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కూతురు అవంతిక పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఖుష్బూ కుటుంబం శుక్రవారం ఢిల్లీలో కలిసింది. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఖుష్బూ- సుందర్ దంపతులు మోదీకి శుభలేఖ అందించారు. ఖుష్బూ దంపతుల వెంట కూతురు అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ సైతం ఉన్నారు. ఈ ఫోటోను ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మోదీకి రుణపడి ఉంటాం'నా కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. శ్రవణ్ శ్రీనివాసన్తో జరగబోయే నా కూతురి పెళ్లికి తప్పక హాజరవాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించాను. కాబోయే దంపతులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ మోదీ మాకు సమయం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ ప్రధానమంత్రిగారు' అని ఖుష్బూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. ఫ్యామిలీఇది చూసిన అభిమానులు ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుర్లు సంతానం. ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అవంతిక యాక్టింగ్పై దృష్టి సారించింది. మలయాళంలో ఆరంభం అనే సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అభిమానిని పట్టించుకోని పూజా.. ఆమె సమాధానమిదే!
సౌత్లోని స్టార్ హీరోయిన్స్లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిందీ బ్యూటీ. తెలుగులోనే ఆమెకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ నిరాశపర్చినా మంచి గుర్తింపయితే తీసుకొచ్చింది. విజయ్తో రెండోసారి జతకట్టిన జననాయకన్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజవనేలేదు. ఎలాగైనా సరే జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీడియో వైరల్ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఓ యువకుడు పూజాతో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటే ఆమె పట్టించుకోలేదని ఓ వీడియో వైరలయింది. దానిపై తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు జీవితాన్నిస్తోంది ప్రేక్షకులేనంది. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో అభిమానులను పట్టించుకోకపోవచ్చని, అలాగని తామేదో పొగరు చూపిస్తున్నట్లు అర్థం కాదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే అభిమానులే తమ దేవుళ్లు అని పేర్కొంది. View this post on Instagram A post shared by STARGAZE 🧿 (@stargazeoffiical) -
స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)#CMJosephVijay at #Jagadish's New Home Function ✨️#ThalapathyVijaypic.twitter.com/14gsYE41FA— Movie Verse (@_MovieVerse) May 29, 2026 -
సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్
గత కొన్నాళ్ల నుంచి సనాతన ధర్మం అనే టాపిక్ ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతెందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగానూ ఇదే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై నటుడు అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు జీవన విధానం. అది తల్లిదండ్రులని దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. మీరు మీ సొంత తల్లిదండ్రులని తిరస్కరించగలరా? లేదు కదా.. అధే విధంగా సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు' అని అర్జున్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన 'బ్లాస్ట్' మూవీ నిన్న(మే 28) తెలుగు, తమిళంలో రిలీజైంది. దీని సక్సెస్ మీట్ చెన్నైలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డీఎంకే నేత ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అర్జున్ విషయానికొస్తే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మైసూరుకి చెందిన ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 180కి పైగా సినిమాల్లో నటించారు. హీరో అనే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్గానూ పలు బాధ్యతల్ని నిర్వహించారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలపై తన అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు అలానే సనాతన ధర్మం గురించి మట్లాడారు.(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Hero #Arjun Counter To #UdayStalin 👌💥"సనాతన ధర్మం అనేది ఒక మ* త0 కాదు జీవన విధానం, అది తల్లిదండ్రులను దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుందిని. మీరు మీ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా?” “లేదు కదా” “అదేవిధంగా, సనాతన ధర్మాన్ని ఎన్నటికీ తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు."💥💥 pic.twitter.com/ke5vYibc9i— Anil U (@UAnil07) May 29, 2026 -
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్.సిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీళ్ల కుమార్తెలు గురించి మాత్రం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఖుష్బూ.. ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసింది. చిన్న కుమార్తె ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పుడు పెద్ద కూతురు ఆనందిక నిర్మాతగా మారిపోయింది.ఖుష్బూకి చెందిన అవ్నీ మూవీస్ సంస్థ, బెంజ్ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన తమిళ మూవీ 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్, సంయుక్త విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాకు ఖుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. చైన్నెలో రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ఇందులో నటించిన సంతోష్, నా కూతురు ఆనందిత.. స్కూల్ నుంచే ఫ్రెండ్స్. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటిది వారిద్దరే ఈ మూవీ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆనందిత ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం అవుతోంది. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదు. వారి నుంచే ఏమి నేర్చుకోవాలనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు) -
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
డ్యూడ్ హీరోయిన్తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్!
ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.హీరోగానూ సక్సెస్ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా..ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే! -
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం) -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
త్రిష ఏ హీరోతో నటించినా.. సినిమా బ్లాక్ బస్టర్ !
-
ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా విజయ్, నేను చనిపోయేవాళ్లం!
సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.కేరళలో ఫైట్ సీన్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు. కదిలే రైలుపై..ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.గుండె ఆగిపోయినంత పని!70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం. ఆయన భయం లేకుండా..కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్ -
మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్!
ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను విడుదల చేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి (2012) మంచి విజయాన్ని సాధించింది. అదే చివరి సినిమాఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ వచ్చిన ఈయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. ఉదయనిది స్టాలిన్ చివరిగా నటించిన చిత్రం మామన్నన్. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. రీఎంట్రీ?ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్ జెయింట్ మూవీస్ మూవీస్ సంస్థ నిర్వహణ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బనిధి స్టాలిన్ చేపట్టిన విషయం తెలిసిందే. -
సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?
స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి చాలారోజులు అయింది. కానీ ఈయన చివరి సినిమాకు మాత్రం మోక్షం దొరకట్లేదు. స్వయంగా నిర్మాతే రీసెంట్గా ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని చెబుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? 'జన నాయగణ్' విడుదల ఎప్పుడు?(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)తమిళ స్టార్ హీరో అయిన విజయ్.. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోతే తిరిగి మూవీస్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో ఇక సినిమాలు చేయడం కష్టమే. అందుకే 'జన నాయగణ్' ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.అయితే సెన్సార్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో 'జన నాయగణ్' అసలు ఎప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్న టైంలో జూన్ 19న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుందని టాక్ బయటకొచ్చింది. డిస్ట్రిక్ట్ టికెట్ బుకింగ్ సైట్లో ఈ తేదీనే ఉండటంతో ఇదే ఫైనల్ అని అనుకుంటున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు రిలీజ్ అయితే తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం థియేటర్ల దగ్గర సందడి వాతావరణం గ్యారంటీ. మరి ఇదెంత వరకు నిజమవుతుందనేది చూడాలి?విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో చేసిన 'జన నాయగణ్'.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. తొలుత ఇది నిజమా కాదా అని అంతా అనుకున్నారు గానీ తమిళనాడు ఎన్నికల రిలీజ్ టైంలో మూవీ పైరసీ ప్రింట్ లీక్ కావడంతో రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆస్కార్లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ) -
త్రిష రాజకీయాల్లోకి రావాలి.. తనకు ఆ అర్హత ఉంది: నటి
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు రుచి చూశారు దళపతి విజయ్. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు. అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓపక్క భార్యకు విడాకులు ఇస్తూనే.. మరోపక్క హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా మెదులుతున్నారు.తప్పేముంది?ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నటి వనితా విజయకుమార్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించింది. పాలిటిక్స్లో అడుగుపెట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని త్రిషను వెనకేసుకొచ్చింది. పైగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత చదివిన స్కూల్లోనే త్రిష కూడా చదువుకుందని గుర్తు చేసింది. రాజకీయాల్లోకి రావాలితను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుందని, జనంతో ఎలా మమేకం అవాలి? ఎదుటివారితో ఎంత గౌరవంగా మెదలాలనే విషయాలు తనకు బాగా తెలుసని పేర్కొంది. త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడింది. మరి నిజంగా త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తుందా? కేవలం సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో చూడాలి!చదవండి: అందుకే 20 ఏళ్లుగా ఆయనతో నటించలేదు: ఊర్వశి -
ఆ కారణం వల్లే ఆయనతో 20 ఏళ్లుగా నటించలేదు!
తలైవా తలైవి (తెలుగులో సార్ మేడమ్) వంటి హిట్ చిత్రం తర్వాత పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం వహించిన సినిమా పరిమళ అండ్ కో. జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్స్ మాస్టర్ శాండి, దర్శకుడు మిస్కిన్, యోగిబాబు, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక, జీకేఎం తమిళ్ కమరన్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోషించా..తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో కథే హీరో అనే నమ్మకం కలుగుతుందన్నారు. పరిమళ అండ్ కో సినిమా కథ మొదట వినగానే అలాంటి భావనే కలిగిందన్నారు. ఇందులో జయరాం నటిస్తున్నారని తెలియగానే సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. తామిద్దరం ఇంతకుముందు 20కి పైగా చిత్రాల్లో కలిసి నటించామన్నారు. కానీ తర్వాత ఇద్దరి ఆసక్తులు వేరవడంతో చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.అదే కారణం..పలు అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన కథ జయరాంకు నచ్చకపోవడం, ఆయనకు నచ్చింది తనకు నచ్చకపోవడం జరిగిందన్నారు. దాంతో తామిద్దరం కలిసి నటించి దాదాపు 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సినిమాను పాండిరాజ్ చాలా వేగంగా పూర్తి చేశారని ఊర్వశి తెలిపారు. -
కోలీవుడ్ కాలింగ్?
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను అను కుంటున్నారట.మరి... ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్–జాన్వీల జోడీ కన్ఫార్మ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణీ వసంత్ని అనుకున్నారట. కాల్షీట్స్ సర్దుబాటు చేయడంలో రుక్మిణీకి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకుంటున్నారని చెన్నై టాక్. -
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్టైమ్ రికార్డ్ -
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు -
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా..అవ్నీ మూవీస్ అధినేత కుష్బూ సుందర్, బెంజ్ మీడియా అధినేత సీసీఎస్ అరుణ్కుమార్ కలిసి నిర్మిస్తున్న డబుల్ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథ్, వీనోద్ కిషన్, వీటీవీ.గణేశ్, భగవత పేరుమాళ్, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రెండు సినిమాలు..చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్ ఫుల్ ఎంటర్టెయినర్గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్కుమార్ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్.. మీసయ్య మురుక్కు సీక్వెల్ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. View this post on Instagram A post shared by anandita (@anisundar_) -
రామ్కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో చై మూవీ!
ఆనందం, రన్, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్ (సికిందర్) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్కు సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న గ్యాప్ తర్వాత..ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్పోతినేని కథానాయకుడిగా ది వారియర్ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాఇది మంచి యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి! -
CM విజయ్ VS కోలీవుడ్
-
కోలీవుడ్లో త్రిష మరో సంచలనం.
-
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది. -
ఇకపై ఇతను పూర్తిగా మీకే సొంతం.. జయం రవితో రిలేషన్ కి కెనీషా గుడ్ బై..
-
సూర్య 'కరుప్పు' మూవీకి బాక్సాఫీస్ షేక్.. ఊహించని కలెక్షన్స్!
-
హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే?
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా, విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్ ఫాజిల్ తాజాగా తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్తో షూటింగ్కు రెడీ అవడం ఈయన విధానం. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్కుమార్ల రేర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చెన్నైలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, నటీనటులు ,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
85 ఏళ్ల నిర్మాత.. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్లు, మూవీ ఈవెంట్స్లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా) -
పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..!
సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..పేరెంట్స్ విడాకులుశరత్కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పుఅయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.మళ్లీ పెళ్లి చేయాలని..అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరినీ దగ్గరకు రానివ్వనుఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. శరత్కుమార్ రెండో పెళ్లివరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్రౌండర్గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి -
బోరున ఏడ్చిన హీరో జయం రవి
-
అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్న్యూస్ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.కూతురి నామకరణంమీర్, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.టాప్ డైరెక్టర్గా..అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్ అయ్యాడు. విజయ్కు తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో సూపర్ హిట్లు అందించాడు. షారూఖ్ ఖాన్కు జవాన్తో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. Our art of love now has a name 💕🧿MIYOU — beauty, gentleness & loveWith luv , MEER , PRIYA & ATLEE 💕🧿 pic.twitter.com/hoUi9D5Fw9— atlee (@Atlee_dir) May 17, 2026చదవండి: చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్ -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
విజయ్ కి నేను చెప్తాలే.. ఫ్యాన్ కోరిక తీర్చిన త్రిష
-
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్లోనూ క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్గా నిలిచే దేవదాస్గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
షూటింగ్ సెట్లో విషాదం.. జైలర్-2 సిబ్బంది మృతి
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్గా గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు. -
కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది.ఇవాళ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్ సీన్లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #RJBalaji - HUGGED TRISHA AFTER A BLOCKBUSTER RESPONSE - Of #Karuppu Film 🔥🔥🔥🔥This Man Deserves this SUCCESS.pic.twitter.com/LmeMv8q3Fv— GetsCinema (@GetsCinema) May 15, 2026 -
సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు. ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు. గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. -
కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by MUBARAK🇮🇳 (@mubaraksvlog) -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మిగతా భాషల్లోనూ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకటి సైలెంట్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'ప్రేమిస్తే' సినిమాతో గతంలో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత కాలంలో ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాళిదాస్ 2'. గత నెల 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడుది అమెజాన్ ప్రైమ్, లయగ్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహ తమిళ, సన్ నెక్స్ట్, షార్ట్ ఫ్లిక్స్ ఇండియా ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్లోకి వచ్చింది.లయన్స్ గేట్ ప్లేలో తెలుగు వెర్షన్స్ ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్లో మాత్రం అద్దె విధానంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగం చూడకపోయినా సరే దీన్ని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు.'కాళిదాస్ 2' విషయానికొస్తే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు రాత్రి అక్కడే ఉన్న మిత్ర అనే నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని కాళిదాసు దర్యాప్తు చేస్తుంటాడు. ఓసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ల గురించి ఓ డార్క్ సీక్రెట్ కాళిదాస్కి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు) -
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026 -
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్ శివన్ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్ రంగనాథన్ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నేను ఓ డ్రీమ్తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్గా పాత్రలో కనిపించనున్నారు. -
రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా
షకీలా పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ) -
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
గవర్నర్తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్తో పాటు తమిళనాడు గవర్నర్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)#ThalapathyVijay's Latest video with Governor and He stakes claim to form Government in TN..🔥🤩 All is Well..🤝pic.twitter.com/kbYBy4TVMZ— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2026 -
అప్పుడేమో త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. ఇప్పుడేమో ఇలా..!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నోటిదూలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్లో నటించానని తెలిపారు. విడయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. చిరంజీవి, ఖుష్బూతో సహా పలువురు సినీతారలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ వివాదంపై మన్సూర్ కోర్టుకు వెళ్లారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. అక్కడి అతనికే కోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ పిటిషన్ కొట్టవేసింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఎలక్షన్ టైమ్లో విజయ్కు మద్దతుగా మన్సూర్ నిలిచారు. తొక్కిసలాట టైమ్లో విజయ్ను వెనకొసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ గెలిచాక మన్సూర్ స్పందించారు. వెంటనే విజయ్ను ఆహ్వానించి సీఎం చేయాలని గవర్నర్ను కోరారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయవద్దని విజయ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించకండి.. రాష్ట్రంలో ఏదీ సక్రమంగా పనిచేయడం లేదు. వెంటనే విజయ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అప్పుడు త్రిషపై వ్యాఖ్యలతో వివాదానికి కారణమైన మన్సూర్.. ఇప్పుడు విజయ్కు మద్దతుగా నిలవడం విశేషం. Don’t create unrest in the state. Nothing is functioning properly in the state. Quickly invite @TVKVijayHQ and make him sit in the CM’s chair! 🙏— Actor Mansoor Ali Khan pic.twitter.com/oM5aRntwkB— Arun Vijay (@AVinthehousee) May 8, 2026 -
ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ నటించారు. విజయ్తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.అన్నాదురైద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.కరుణానిధినాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.ఎంజీఆర్నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.జయలలితజయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారుస్టాలిన్తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.ఎన్టీఆర్తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.విజయ్(ఇంకా సీఎం కాలేదు)తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.1937 మే 26న మన్నార్గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది. -
నిర్మాత ఆర్బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అధినేత ఆర్బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.కాగా... ఆర్బీ చౌదరితో విజయ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. தயாரிப்பாளர் ஆர். பி. சௌத்ரி உடலுக்கு தலைவர் விஜய் நேரில் அஞ்சலி! pic.twitter.com/GmhMrE5ByT— Tamilaga Vettri Kazhagam (@TVKFor_TN) May 6, 2026 -
విజయ్ జన నాయగన్.. తొలి హీరోగా రికార్డ్
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్ అభినందిస్తూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ టైటిల్ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్.. అంటూ జననాయగన్ టైటిల్ కార్డు వేసింది. పోలీసు డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్న విజయ్ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. India's first time CM title card for actor !pic.twitter.com/7xrz4QgbmO— ʲᵈᴀʟᴇxᴀɴᴅᴇʀᵗʷᵉᵉᵗˢ (@JDALEXtweets) May 6, 2026 -
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్తో పాలిటిక్స్లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్టాపిక్గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో జేసన్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు. ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్ను అన్ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై జూన్లో విచారణ జరగనుంది. -
ఆర్బీ చౌదరి అంత్యక్రియలకు చెన్నైలో ఏర్పాట్లు
90కి పైగా సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి.. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం విశాల్ హీరోగా ఈయన నిర్మాతగా 99వ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే 100వ మూవీపై ప్రకటన చేయాలనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో విషాదం నెలకొంది.(ఇదీ చదవండి: ఆర్బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!)ఇకపోతే నేడు(మే 06) ఆర్బీ చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు. మైలాపుర్లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో ఈయనకు అంత్యక్రియలు చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో జీవా(వీడియో)) -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్ విజయంపై అభినందనలు చెబుతున్నారు.అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ట్రోల్స్ మొదలయ్యాయి. విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
ఎన్నికల ఫలితాల్లో సూపర్ హిట్.. 'జన నాయగన్' సంగతేంటి?
ఎవరూ ఊహించలేదు. తమిళ హీరో విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ రేంజ్ ఆధిక్యం సాధిస్తాడని. ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్కి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత విషయాలు పక్కనబెడితే ఇతడు నటించిన చివరి సినిమా 'జన నాయగన్'ని కూడా విడుదల కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ అద్భుతం చేయడంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిషలెక్క ప్రకారం 'జన నాయగన్' సినిమా ఈ ఏడాది జనవరి 9న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది వారం వారం ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది కొన్నాళ్ల క్రితం ఏకంగా పూర్తి మూవీ పైరసీకి గురవడం ఇండస్ట్రీని షాక్కి గురిచేసింది. దీంతో మూవీ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుండు అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు తమిళనాడులో విజయ్.. అధికారం చేజిక్కుంచుకుని ముఖ్యమంత్రి అయితే మాత్రం 'జన నాయగన్'కి మార్కెట్లో కచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది. అటు ఆడియెన్స్ కూడా విజయ్ని చివరిసారి వెండితెరపై చూడాలనే ఆసక్తి కనబరచొచ్చు. తద్వారా టాక్తో సంబంధం లేకుండా వంద రెండొందల కోట్ల కలెక్షన్స్ రావొచ్చేమో అనిపిస్తుంది. మరి సమస్యలని దాటి 'జన నాయగన్'.. ఈ నెలలోనే రిలీజ్ అవుతందా? లేదంటే జూన్లో వస్తుందా అనేది చూడాలి?తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేకే 'జన నాయగన్'. విజయ్ లీడ్ రోల్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతదర్శకుడు. ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి కూడా.ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా? -
త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?
సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. ఎందుకంటే స్టార్స్గా చెలామణీ అయిన చాలామంది.. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అక్కడాఇక్కడా అని కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ హీరో దళపతి విజయ్ చేరబోతున్నాడు. తమిళనాడులోని అధికారం చేజిక్కుంచుకునే దిశగా విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యం చూపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా బలంగా కనిపిస్తోంది. ఇదే టైంలో త్రిష, రాజకీయ రంగప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది.(ఇదీ చదవండి: దళపతి విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)టీవీకే అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయం! అదే జరిగితే హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు! ఇకపోతే ఎన్నికలు జరగడానికి ముందు విజయ్ విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అదే టైంలో త్రిషతో కలిసి జంటగా విజయ్ ఓ పెళ్లికి హాజరవడం వీళ్ల గురించి వినిపించిన రూమర్స్ నిజమేనేమో అనే సందేహాలు కలుగజేసింది. ఒకవేళ విజయ్ అధికారం దక్కించుకుంటే త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా అనిపిస్తుంది.ఎందుకంటే గతంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష.. సరదాగానే అన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొచ్చింది. మరి సీఎం కాకపోవచ్చు గానీ విజయ్ తలుచుకుంటే ఈమెకు కచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వకపోడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి త్రిష మనసులోనూ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమైనా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే గెలవడం దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే ఈరోజే త్రిష పుట్టినరోజు కూడా. తిరుమల వెళ్లి ఉదయమే వేంకటేశ్వర స్వామిని ఈమె దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఈమె తిరుమల వెళ్లిందని, ప్రత్యేక పూజలు కూడా చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)Happy birthday to the Chief Minister of Tamil Nadu. #Trisha 🔥🥶#HBDTrisha ❣#HBDSouthQueenTrisha 💥 pic.twitter.com/SvSkDR7nm1— CricFDFS (@lokiMSD93) May 4, 2026 -
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష
తమిళనాడులో ఊహించని అధికార మార్పు దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లోనూ డీఎంకే పార్టీకే మరోసారి అధికారం దక్కొచ్చని చాలామంది అంచనా వేశారు. విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఊహించనవి జరుగుతున్నాయి. టీవీకే పార్టీ ఈ స్టోరీ రాసే సమయానికి 100 సీట్లకు మించి ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ట్రెండింగ్లో మాత్రం త్రిష ఉంది.(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)విజయ్, త్రిష కలిసి పలు సినిమాలు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ విడాకుల వ్యవహారం బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. సరిగ్గా ఆ టైంలో ఓ పెళ్లికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయిపోయింది.నేడు(మే 04) ఎన్నికల ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు. త్రిష పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఆమె తిరుపతి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. త్రిష గురించి చేసి ట్వీట్ వైరల్ అవుతోంది.'ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ని ఉద్దేశించే ఇతడు ఈ ట్వీట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏకంగా సీఎం కావాలని ఉందని చెప్పింది. అప్పుడు సరదాగానే అని ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న రూమర్స్, విజయ్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుండటంతో త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!) -
స్టూడియోలో బంధించి నాపై..! టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన సింగర్
-
ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే సినిమా నుంచి తప్పుకున్నా
స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశమొస్తే ఏ దర్శకనిర్మాత వదులుకోడు. దీన్ని ఉపయోగించి స్టార్డమ్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి మాత్రం కమల్-రజనీ సినిమా నుంచి తప్పుకొన్నాడు. గతేడాది నవంబరులో ఇది జరిగింది. తొలుత ఇతడినే డైరెక్టర్ అని ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే కొన్నిరోజులకే సదరు ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. ఇన్నాళ్లకు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. కమెడియన్ మహేశ్)'నిజం చెప్పాలంటే ఆ సినిమా చేయడానికి సిద్ధమవగానే చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ సినిమాలు చేశాను. కానీ రజనీ సినిమాని డీల్ చేసే కెపాసిటీ నాకు లేదనిపించింది. ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలని ఇతరులకు ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. నాకు స్టోరీ సరిగా చెప్పడం రాదు. అదే టైంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురుతిరగకుండా ఓకే చెప్పేస్తాను''ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడి నిర్ణయమే ఉండదు. సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్కి నేను పూర్తిగా న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభంలోనే సినిమా నుంచి తప్పుకొన్నా. రజనీ-కమల్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో నాకు కోరిక ఉంది. వారితో గడిపిన కొన్నిరోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ అది నా జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం. ఇలా చేయడానికి ముందే స్వయంగా రజనీకాంత్ని కలిసి విషయం చెప్పాను' అని సుందర్.సి వివరణ ఇచ్చాడు.గతంలో రజనీకాంత్తో 'అరుణాచలం', కమల్ హాసన్తో 'సత్యం శివం' సినిమాలు చేసిన సుందర్.సి.. తర్వాత నుంచి మాత్రం హారర్, మిడ్ రేంజ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గత నెలలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ప్రస్తుతం నయనతార లీడ్ రోల్లో 'ముకుతి అమ్మన్ 2' అనే మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య) -
స్టార్ హీరో సినిమాకు మోక్షం.. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత..!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ధృవనక్షత్రం రిలీజ్కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది.దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్ గౌతమ్ మేనన్ యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది.ఆ తర్వాత కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇప్పటికే పలుసార్లు పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. -
స్టార్ హీరోపై జెడి చక్రవర్తి సంచలన ఆరోపణలు.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త
టాలీవుడ్ నటుడు జెడి చక్రవర్తి సుమారు 35ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారు. తన ప్రయాణం శివ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ స్టేటస్ను ఆయన అందుకున్నారు. హీరోగా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలోనే అతిపెద్ద స్టార్ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పేరు రివీల్ చేయకుండానే బిగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే కామెంట్స్ను షేర్ చేశారు.మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటే అది పొరపాటే అంటూ తనకు ఎదురైన ఒక సంఘటనను జె. డి. చక్రవర్తి ఇలా పంచుకున్నారు.'ఒక నటుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు కూడా ఆయన అంటే గౌరవం. అలాగే నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. కానీ, సినిమా సెట్స్కు ఆయన ఆలస్యంగా వస్తారు సార్ అని నాతో కొందరు చెప్పారు. ఎందుకంటే..? రాత్రి తాగింది దిగలేదన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజమా..! ఆయన తాగుతారా..? అని ప్రశ్నించాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్లో కూడా బస చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం తన గర్ల్ఫ్రెండ్తో ఉంటున్నారని చెప్పడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు గర్ల్ఫ్రెండ్తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్ను బట్టి నేను కూడా మహానుబావుడు అనుకున్నాను.' అని రియాలిటీ మరోలా ఉంటుంది అనేలా జెడి చక్రవర్తి పేర్కొన్నారు. అయితే, ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం ఆయన రివీల్ చెయలేదు. Huge controversy!!!! pic.twitter.com/NZCOl6wIzn— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 29, 2026 -
ధనుష్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?
టాలీవుడ్లో ఇప్పుడో చిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో చాలామంది ఒక్క సినిమా కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తారు. పోనీ ఆ మూవీ సరిగా ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేసిన హీరోలు కూడా ఫెర్ఫెక్షన్ పేరిట టైమ్ అంతా వృథా చేస్తున్నారు. అదే టైంలో తెలుగు హీరోల్లానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మాత్రం ఒంటి చేత్తో మూడు బాధ్యతల్ని అద్భుతంగా పూర్తి చేస్తున్నాడు. ధనుష్ వల్ల అవుతున్న ఆ పని.. మిగతా హీరోల వల్ల ఎందుకు కావట్లేదు?(ఇదీ చదవండి: స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్: తమిళ సింగర్)చాలామందికి ధనుష్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఇతడిలో ఓ డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడు. గడిచిన 15 నెలలు తీసుకుంటే.. గతేడాది ప్రారంభంలో తన మేనల్లుడు పవిష్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీశాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకుంది. ఇక వేసవిలో 'కుబేర'తో వచ్చాడు. బిచ్చగాడి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. దసరా వచ్చేసరికి 'ఇడ్లీ కొట్టు' మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం కోసం హీరో, డైరెక్టర్, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. తెలుగులో ఇది ఫెయిలైనప్పటికీ తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాద చివరలో 'తేరే ఇష్క్ మై' అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగు నెలలు తిరిగేసరికల్లా 'కర' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. దీని ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.అయితే ఏడాదిన్నర కాలంలో ధనుష్.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఐదు సినిమాలు చేశాడు. మరి ఇతడి వల్ల అవుతున్న పని మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఫెర్ఫెక్షన్ పేరు చెప్పి ఆలస్యం చేయడమనేది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చేస్తేనే సినిమా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే రెగ్యులర్ టచ్లో ఉంటే ఆడియెన్స్ కూడా సదరు హీరోల చిత్రాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఈ విషయాన్ని తెలుగు, తమిళ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్
మహిళా గాయని స్వాగత కృష్ణన్.. తమిళ ప్రముఖ సంగీత దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్ని 'ఎప్స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’ సినిమా కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం)'ఏడేళ్ల క్రితం చెన్నై వదిలిపెట్టి రిషికేష్ వెళ్లిపోవడం వెనక కారణం ఇప్పుడు బయటపెడుతున్నా. బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి ఆ సంగీత దర్శకుడు వచ్చాడు. నా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. మాయమాటలు చెప్పి తనపై నమ్మకం పెరిగేలా చేసి, గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు అసలు రంగు బయటపెట్టాడు. కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ లాంటివి చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. మళ్లీ అప్పుల్లో ఉన్నానని చెప్పి నా దగ్గరే చాలా డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వలేదు''ఆయన స్టూడియో సౌండ్ప్రూఫ్గా ఉండేది. ఆ గది తలుపులు లాక్ చేసి బలవంతంగా నాపై లైంగిక దాడి చేశాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఇదంతా రికార్డ్ చేసి తర్వాత నన్ను బెదిరించాడు. ఈ ఘటన తర్వాత తిరిగి నాపైనే అబద్దాలు చెప్పడం, దొంగతనం లాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. చికిత్స కూడా తీసుకున్నా. అందుకే చెన్నై వదిలేసి రిషికేష్ వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటున్నా''ఈ మధ్యే మరో యువతి తనకు ఇలానే జరిగిందని నాతో చెప్పడంతోనే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. నేనే కాదు చాలామంది అమ్మాయిలు అతడి బాధితులే. భయం, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్తా. అయితే ఇది ఆయనపై ప్రతీకారం కాదు. ఇకపై నాలాగా మరెవరూ మానసిక వేదన అనుభవించకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నాను' అని సింగర్ స్వాగత కృష్ణన్ చెప్పుకొచ్చింది.'యెనో పెన్నే', 'కాదల్ కన్మణి' లాంటి పాటలు పాడిన ఈమె.. సదరు సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈమె సోదరి మాయ కృష్ణన్.. విక్రమ్, లియో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
ధనుశ్ కర.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
పెద్ది ఐటమ్ సాంగ్.. శృతి హాసన్కు భారీ రెమ్యునరేషన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్పై టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్కు పోస్ట్పోన్ చేశారు. -
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది)కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్స్టార్లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.'సిరీస్ కోసం అగ్రిమెంట్పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు''ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి) View this post on Instagram A post shared by Anugraha S Nambiar (@anugraha_s_nambiar_) -
విలువలు ముఖ్యం.. కోట్ల డబ్బును కాదన్న జి.వి. ప్రకాష్
సినిమా, స్పోర్ట్స్ రంగాలకు చెందిన అగ్ర నటులు, గొప్ప క్రీడాకారులు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, వృత్తిపరంగా తీసుకునేంత రేంజ్లో వాణిజ్య ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇందులో కొందరు మాత్రం ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా దొరికిన ప్రతి బ్రాండ్లకు ప్రచారం చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. మరికొందరు సమాజ హితం కోరి ప్రజలకు హాని చేసే వస్తువులకు ప్రమోషన్ చేయరు. ఇప్పుడు ఇదే కోవలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయంలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఒక బలమైన ప్రకటన చేశారు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను మద్యం, జూదాన్ని ప్రచారం చేయనని పేర్కొన్నారు. ఈ అంశంలో కొందరు తనను సంప్రదించారని భారీ మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. పలుమార్లు చాలామంది పదేపదే తనను సంప్రదించినప్పటికీ నిరంతరం నిరాకరిస్తున్నానని ఆయన వెల్లడించారు.తాజాగా ప్రముఖ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ను ప్రచారం చేయడానికి తనకు కోట్లు కూడా ఆఫర్ చేశారని, కానీ అది తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేకపోవడంతో దానిని తిరస్కరించానని ప్రకాష్ కుమార్ తెలిపారు. కీర్తితో పాటు తమకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని అందుకే వాటికి దూరంగా ఉంటున్నాని అన్నారు. వినోద పరిశ్రమలో ఆర్థిక లాభం కంటే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన వైఖరికి అభిమానులు ప్రశంసలు కురిపించారు.సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే హీరోగా కూడా జి. వి. ప్రకాష్ రాణిస్తున్నారు. యుగానికి ఒక్కడు, మదరాసు పట్టణం, ఆకాశం నీ హద్దురా, అమరన్, లక్కీ భాస్కర్, పరాశక్తి, ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. -
కమల్-రజనీకి విలన్గా మెగా డైరెక్టర్?
సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది. కేఎస్ రవికుమార్, సెల్వరాఘవన్ తదితరులు ఇప్పటికే కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ డైరెక్టర్ చేరబోతున్నాడట. రజనీ-కమల్ మల్టీస్టారర్ కోసం ఈయన నటుడిగా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)కమల్హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గించినప్పటికీ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్ని రెట్టింపు చేసే విషయం ఒకటు బయటకు వచ్చింది.కమల్హాసన్తో 'భారతీయుడు', రజనీకాంత్తో రోబో, శివాజీ లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. రీసెంట్ టైంలో ఈయన తీసిన గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 చిత్రాలు, బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన నటుడిగా మారబోతున్నాడని, అది కూడా రజనీ-కమల్కి విలన్గా చేయబోతున్నారని అనేసరికి ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది నిజమా కాదో అనేది తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాలేమో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా) -
'తాను నాటింది తానే నరుక్కోవాలి'.. ఆసక్తిగా కర తెలుగు టీజర్
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
తమిళనాడు ఎన్నికలు.. హీరోయిన్కు చేదు అనుభవం
ప్రముఖ నటి అక్షయ హరిహరన్కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్కు గురైంది. అడయార్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది. నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లానుకానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యానునా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని… pic.twitter.com/SJtyWZkQ8L— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2026 -
ధృవ నక్షత్రం విడుదలపై క్లారిటీ రానుందా..?
విక్రమ్- దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.. సుమారు పదేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. సినిమా మొదలు పెట్టిన సమయం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్ట్ చివరకు కోర్టు వరకు పంచాయితీ చేరింది. హీరో శింబుతో దర్శకుడు గౌతమ్ మేనన్ ఒక సినిమా చేస్తానని ఒప్పుకుని రూ. 2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకుని పూర్తి చేయలేదంటూ ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ చెన్నై హకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాతే ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ‘ధృవ నక్షత్రం’ చిత్రానికి బ్రేకులు పడ్డాయి.‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాల వాదనలను మద్రాస్ హైకోర్టు వినడం పూర్తి చేసింది. కోలీవుడ్లో తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 24న తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ‘ధృవ నక్షత్రం’ మూవీ విడుదలపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్, ఐశ్వర్య రాజేశ్, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. -
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026 -
ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి
సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్ ఇంటర్నేషనల్.. సాయి వ్యాఖ్యలు వైరల్)'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పొందుపరచలేదు.(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య) -
బ్యాంక్ దొంగగా ధనుష్.. ఆసక్తికరంగా ట్రైలర్
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా) -
లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్చగా తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని ఒకప్పటి హీరోయిన్ రాధిక వెళ్లి పరామర్శించింది. భావోద్వేగానికి గురవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)రాధిక రీసెంట్గా లీడ్ రోల్ చేసిన 'తాయ్ కిళవి' సినిమాని భారతీ రాజా చూశారు. దీని గురించి రాధిక ఆయన మధ్య చర్చ కూడా జరిగింది. సినిమా చూశారా అని రాధిక అడగ్గా.. చూశానని చెప్పిన భారతీరాజా, ఈ చిత్రానికి మీకు జాతీయ అవార్డ్ అందుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రాధిక.. అదే జరిగితే, ఆ అవార్డుని మీ పాదాల దగ్గర అర్పిస్తానని స్పందించింది.ఇన్ స్టాలో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోని పోస్ట్ చేసిన రాధిక.. ఆయన ఆశీర్వాదం, అవార్డు కంటే గొప్పది. ఆయనని ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమే ఆయనని ముందుకు నడిపిస్తోంది అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది.. ఎలా ఉండే భారతీరాజా ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈయన చివరగా గతేడాది రిలీజైన 'దేశియా తలైవర్' సినిమాలో నటించారు.(ఇదీ చదవండి: బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్: అనన్య నాగళ్ల) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..!
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.అయితే గతంలో బాయ్ఫ్రెండ్తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ గురించి కోలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్కు మ్యారేజ్ చేయాలని కమల్ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో లండన్కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. -
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్కు తెరపడింది. -
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్లను ఎవరూ వాడకూడదని కోరుతూ ఒక పిటీషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను ఉపయోగించుకుని పలు ఉత్పత్తులను విక్రయిస్తూ డబ్బు సంపాదించుకుంటూ తన ప్రతిష్ణను దెబ్బతీసేలా చేస్తున్న వారికి ఈ కేసు వర్తిస్తుంది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ దావా వేశారు. నేడు జస్టిస్ తుషార్ రావు కమిటీ నేతృత్వంలో విచారణకు రానుంది.ఇదే అంశంలో ఇప్పటికే చిరంజీవి , మోహన్ లాల్ , నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ఐశ్వర్య రాయ్ తదితరులు తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులలో సినీ ప్రముఖల ప్రైవసీ హక్కులను రక్షించకపోతే వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. -
శానిటరీ నాప్కిన్ యాడ్.. వివాదంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నిర్మించారు.ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్ ఓ శానిటరీ నాప్కిన్ యాడ్లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. -
హారర్ థ్రిల్లర్ సినిమా.. భయానికి కొత్త నిర్వచనం ఇస్తామంటున్న మేకర్స్
హారర్, మిస్టరీ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పోస్టర్లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పిస్తూ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు
హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గతవారం థియేటర్లలోకి వచ్చింది. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత నష్టాలొస్తాయో చూడాలి? అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం గురించి విఘ్నేశ్ శివన్ ఇన్నాళ్లకు స్పందించాడు. అసలేం జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)తొలుత ఈ సినిమాకు 'LIC' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. LIC సంస్థ ఈ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని చెప్పడంతో టీమ్ మెట్టు దిగింది. టైటిల్లోని C బదులు K అనే అక్షరాన్ని జోడించారు. అలానే థియేటర్లలో రిలీజైంది.అయితే LIC అనే పేరు ఉపయోగించుకోవాలంటే తమకు రూ.112 కోట్లు ఇవ్వాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా విఘ్నేశ్ శివన్ బయటపెట్టాడు. ఇన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని బదులుగా తను LIP, LIT, LIK, LIF టైటిల్స్ ఆలోచించి పెట్టుకున్నానని.. చివరగా LIK టైటిల్ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విషయానికొస్తే.. 2040లో జరిగే ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఫోన్లోని యాప్ చెబితేనే ప్రేమిస్తాననుకునే అమ్మాయి.. లేదంటే ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలనుకునే అబ్బాయి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది? చివరకు వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్తో ఈ సినిమాని తీశారు. కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలానే హీరో ప్రదీప్ రంగనాథన్.. హ్యాట్రిక్స్ హిట్స్కి కూడా ఈ చిత్రంలోనే బ్రేక్ పడింది.(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)#VigneshShivan about LIK Title- We initially titled #LIK as “LIC” (Love Insurance Company), but LIC demanded ₹112 crores for us to use the name.- Since that wasn’t feasible, I explored alternative options like LIP, LIT, LIK, and LIF.pic.twitter.com/TfjB0D9qlH— Movie Tamil (@_MovieTamil) April 14, 2026 -
రుక్మిణి వసంత్కి మరో సూపర్ ఛాన్స్!
కన్నడ భామ రుక్మిణి వసంత్కి తమిళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. నటుడు విజయ్ సేతుపతికి జంటగా 'ఏస్' మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఇది హిట్ అవ్వకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి. శివకార్తీకేయన్కి జంటగా గతేడాది 'మదరాసి' చిత్రంలో నటించింది. ఇది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత సొంత భాషలో చేసిన 'కాంతార' ప్రీక్వెల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ధనుష్కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం.ధనుష్ ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో చేసిన 'కర' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తాడు. ఇది ధనుష్ 55వ చిత్రం. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరస పద్యముత్తు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడ. ఇందులోనే ఈయనకు జంటగా రుక్మిణి వసంత్ని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమచారం.రుక్మిణి.. కన్నడ, తమిళంతో పాటు తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్కు జంటగా 'డ్రాగన్' చేస్తున్నారు. కన్నడంలో చేసిన 'టాక్సిక్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇకపోతే ధనుష్ తో నటి రుక్మిణి తొలిసారిగా జోడీ కట్టబోతోందన్న మాట. ఇందులో విజయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించనున్నారనీ టాక్. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)
-
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
రూ.50 లక్షల సాయం.. ఆ హీరో వల్లే నా కొడుకు ఇలా
ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him.- Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026 -
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇక్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు) -
కోలీవుడ్లో సీక్వెల్స్ జోరు.. లైన్లో పది హిట్ సినిమాలు
‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి). మరింత యాక్షన్ డోస్తో...టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్గా చూపించనున్నారు నెల్సన్. ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్ని మరింత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్తో తెలుగులో విడుదల కానుంది. త్వరలో సెట్స్కి కంగువ 2గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్లైన్స్లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్గా డ్యుయల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్కి డిల్లీ ఒకటి కాదు... రెండు సీక్వెల్స్లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. సర్దార్ ఎప్పుడు వస్తాడు? కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.రెండింతల యాక్షన్... ఎమోషన్ డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. మరోసారి అమ్మవారిగా...నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. మళ్లీ బాక్సింగ్ రెడీబాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్లో సీక్వెల్ షూటింగ్ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్ని జూన్లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘తని ఒరువన్ 2’ ఆగదు‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్లో త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్. కుస్తీకి రెడీవిష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. నీలాంబరి రిటర్న్స్రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట. మరగద నాణ్యం 2‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది. -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026 -
'జన నాయగణ్' లీక్.. కావాలనే చేశారు: కమల్ హాసన్
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగణ్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఓటీటీ డీల్ కూడా రద్దయింది. ఈ క్రమంలో జననాయగణ్ సినిమా సోషల్ మీడియాలో లీకవడం సంచలనంగా మారింది. ప్రారంభ సన్నివేశాలు సహా సినిమాలోని అనేక సీన్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.అందుకే ఇలా..ఈ ఘటనపై శివకార్తికేయన్, చిరంజీవి సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలని, తమ కష్టాన్ని గౌరవించాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఎవరు కాపాడతారు?ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రజనీ రియాక్షన్ఈ ఘటనపై రజనీకాంత్ సైతం స్పందిస్తూ.. 'ఇంటర్నెట్లో జననాయగణ్ రిలీజైందన్న విషయం తెలిసి షాకయ్యాను. సినిమా సంఘాలు ఇటువంటి విషయాలపై తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం పైరసీకి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు' అని ట్వీట్ చేశారు. The leak of #Jananayagan is not an accident - it is the result of systemic failure. Had due process been timely, we would not be here. Inordinate delays in certification created fertile ground for piracy. When legal access is stalled, illegitimate channels take over.Piracy is…— Kamal Haasan (@ikamalhaasan) April 10, 2026ஜனநாயகன் திரைப்படம் இணையத்தில் யாராலோ வெளியிடப்பட்டிருப்பது அதிர்ச்சியையும்,வேதனையையும் அளிக்கிறது. திரை அமைப்புகள் இதற்கு எதிராகக் குரல் எழுப்பி, அரசு இதைச் செய்தவர்களைக் கண்டுபிடித்து கடுமையான தண்டனை அளிக்க வேண்டும். இது போன்ற குற்றம் இனியும் தொடரக்கூடாது.— Rajinikanth (@rajinikanth) April 10, 2026 చదవండి: మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు -
మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్తో పోల్చరాదని పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్.. ఏ మాత్రం నమ్మలేని రూమర్!
పవన్ కల్యాణ్కి ప్రస్తుతం సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే ఈయన నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కొత్తగా ఏ మూవీస్ ఒప్పుకోలేదని, ఒకవేళ కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తే ఆయన వెల్లడిస్తారనేది సదరు పోస్ట్ సారాంశం. దీంతో పవన్ ఇప్పట్లో కొత్తగా ఏం చేయరని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఇంతలోనే ఓ రూమర్ వినిపిస్తోంది. 'జైలర్ 2'లో ఏకంగా అతిథి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)చూస్తుంటే ఈ రూమర్లో ఏ మాత్రం నిజం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ తన సినిమాలకే సరిగా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో మూవీ అంటే అనుకున్న టైం కంటే చాలా ఆలస్యమైపోతుంటాయి. రీసెంట్గా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఏది తీసుకున్నా సరే పూర్తవడానికి ఏళ్లకు ఏళ్లు పట్టాయి. అలానే పవన్ ఇప్పటివరకు చిరంజీవి సినిమాల్లో తప్పితే వేరే వాటిలో అతిధి పాత్రలు చేయలేదు.అలాంటిది 'జైలర్ 2'లో షారూఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రని పవన్ చేస్తారని అనుకోవడం అస్సలు నమ్మేలా లేదు. రూమర్ అంటే కనీసం నమ్మేలా అయినా ఉండాలి. కానీ తమిళ మీడియాలో ఏ మాత్రం నమ్మశక్యం కాని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే మూవీలో క్యామియో కోసం హీరో బాలకృష్ణని కూడా సంప్రదించారని, కానీ వర్కౌట్ అవ్వలేదని టాక్ వినిపించింది. చూస్తుంటే 'జైలర్ 2'లో అతిథి పాత్రలు ఎవరు చేస్తారనే సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా) -
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. -
నాకు నచ్చిందంటే నా భార్య వద్దన్నా వినను: హీరో
దివంగత నటుడు ముత్తరామన్ మనవడిగా, ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ రామ్ కార్తీక్. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవగా, తొలి చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోయాడు. 2022లో నటి మంజిమ మోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు క్రిమినల్, మిస్టర్ ఎక్స్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, లెగసీ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఆయనతో నటించడం..తాజాగా అతడు మాట్లాడుతూ.. లెగసీ చిత్రంలో నటుడు మాధవన్తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నాడు. ఆయన తనకు చాలా సూచనలు ఇచ్చారన్నాడు. ఈ చిత్రంలో తనది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనీ, అయితే అలా ఎందుకు ప్రవర్తిస్తాను? అన్న దానికి కారణం కూడా ఉంటుందన్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ యాక్షన్ కథా చిత్రాలేనని, మంచి రొమంటిక్ కామెడీ కథా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తాను అంగీకరించే కథల గురించి తన భార్య మంజిమ మోహన్తో చర్చిస్తానని తెలిపాడు. భార్య చెప్పినా విననుఆమె నటి కాబట్టి సలహాలు తీసుకుంటానన్నాడు. అయితే ఒక్కోసారి ఆమె వద్దని చెప్పినా, తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనని అనిపిస్తే నటించడానికి అంగీకరిస్తానన్నాడు. తన తండ్రి కార్తీక్తో కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, కాకపోతే అందుకు తగ్గ మంచి కథ కుదరాలన్నాడు. భార్య మంజిమ మోహన్తో నటించరా? అని అడుగుతున్నారని, ఆమెతో నటించడానికి ఎప్పుడూ రెడీనే అని, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. -
హీరో విజయ్ ర్యాలీలో ప్రమాదాలు.. యువతను హెచ్చరించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్–2 మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్హాసన్తో కలిసి రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ బుధవారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విజయ్ నటించిన జననాయకన్ చిత్ర విడుదలకు ఆటంకాలు కలగజేయడం, విజయ్ కారు వెంటపడి యువత ప్రమాదాలకు గురవడం, కమల్హాసన్తో నటించడం వంటి పలు విషయాల గురించి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.చదువుకోండికాగా విజయ్ నటించిన జననాయకన్ సినిమాపై స్పందించేందుకు రజనీకాంత్ ఇష్టపడలేదు. అయితే నటుల వాహనాల వెనక పడి యువత ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో విద్యపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, చదువుకునే సమయాన్ని అశ్రద్ధ చేస్తే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. దూరంగా ఉండండిఅదేవిధంగా యువత మద్యానికి, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. అలాంటి దురలవాట్లు కలిగిన ఫ్రెండ్స్ను దూరం పెట్టాలన్నారు. ఇకపోతే తాను, కమల్ హాసన్ కలిసి నటించనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభం అవుతుందని రజనీకాంత్ తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరవుతున్న తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. -
శింబు కోసం రాలేదు, కానీ ఒక్కటి అడుగుతా..: హీరో తండ్రి
కోలీవుడ్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అరసన్'. వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ చైన్నెలో జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ను తమిళ సినీ నిర్మాతల మండలి, పెప్సీ కలిసి నిలిపేసినట్లు సమాచారం. ఈ విషయంపై శింబు తండ్రి, దర్శక నిర్మాత టి.రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరసన్ చిత్రం కోసమో, శింబు కోసమో వాదించడానికి నేను రాలేదు. ఆ గొడవ ఎప్పుడో అయిపోయిందితమిళ చిత్ర నిర్మాతల మండలి, దానికి సహకరిస్తున్న దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధర్మంగా ప్రవర్తించకూడదని చెప్పడానికే నేను వచ్చాను. ఇంతకు ముందు శింబు నటించిన 'వెందు తనిందదు కాడు' చిత్ర నిర్మాత ఐసరి గణేష్.. శింబుకు వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ కేసులో శింబు సరసన చట్టపరంగా నేను పోరాడి గెలిచాను. నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ శింబుకే చెందుతుంది అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నకళ్లు నా చేతిలోనే ఉన్నాయి. నటుడికి మద్దతుగా నిలబడరా?ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత కేసును దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య.. ఈ రోజు అరసన్ చిత్ర షూటింగ్ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయంలో నేడు అడగదలచుకున్నది ఒక్కటే. ఒక నిర్మాత కోసం నిర్మాతల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య పోరాడుతుంటే ఒక నటుడికి దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎందుకు మద్దతుగా నిలబడడం లేదు. ఈ సంఘం నటుడికి మద్దతుగా నిలబడాలి. అతడికి న్యాయం చేయాలి. మంచి పరిష్కారాన్ని చూపాలి అని టి.రాజేంద్రన్ పేర్కొన్నారు.చదవండి: నయనతార సర్ప్రైజ్.. ఎమోషనలైన విఘ్నేశ్ శివన్ -
నయనతార సడన్ సర్ప్రైజ్.. స్టేజ్పై భర్త ఎమోషనల్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసింది. ప్రమోషనల్ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్మీట్లోనూ పాల్గొని సందడి చేసింది.సర్ప్రైజ్తాజాగా మరోసారి ప్రమోషన్స్లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మంగళవారం (ఏప్రిల్ 7న) గ్రాండ్గా జరిగింది. విఘ్నేశ్ మాట్లాడుతున్న సమయంలో నయన్ సడన్గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. వీడియో వైరల్భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భర్త కోసమే నయన్ ఈ ఈవెంట్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ఐకే (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
మాతృభాష మలయాళంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయికగా పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ వెంటనే తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో సత్తా చాటింది. ఈ మధ్య బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ హిందీ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏదేమైనా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.సినిమాకీర్తి చివరిగా నటించిన హిట్ చిత్రం మామన్నన్. ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవర కొండకు జంటగా రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఈమె నటించిన కన్నివెడి చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్, హీరోయిన్ సమంత మంచి స్నేహితురాళ్లు అన్నది తెలిసిందే. కాగా నటి కీర్తి సురేష్కి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ అలవాటు లేదు కానీ..దీని గురించి సమంత స్పందిస్తూ.. కీర్తి సురేష్కు మద్యం అలవాటు లేదు కాని ఒక్క అలవాటు మాత్రం ఉందని చెప్పింది. అదేమిటంటే హైపర్ మ్యాక్ అనే అధికంగా నవ్వించే గుణం ఉందని తెలిపింది. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అతి వేగంగా రైమింగ్ మాటలతో ఇతరులను ఆటపట్టిస్తుందని సమంత చెప్పుకొచ్చింది. -
సినిమాలకు పూర్తిగా గుడ్ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!
ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
10 ఏళ్లుగా ట్రోలింగ్.. ధోనికే తప్పలేదు, ఇంకేం చేస్తాం!: విఘ్నేశ్
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుని పోతారు, సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్లో తాము పెట్టే ఫోటోలు చూసి సంతోషపడేవారి కన్నా తిట్టుకునేవారే ఎక్కువయ్యారంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.నా ఆన్సరేంటంటే..ఇతడు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. మన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను, నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశామనుకోండి. అంతా మారిపోయింది!కాస్త దిగులుగా, డల్గా ఉన్నవాళ్లు ఆ పిక్స్ చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఫీల్ అవొచ్చు. కానీ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. నన్నయితే 10 ఏళ్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా ఎంఎస్ ధోనిలాంటివారికే ఈ విమర్శలు తప్పలేవు. గతంలో ఐపీఎల్లో సరిగా ఆడనప్పుడు ఆయన్ని ఎంత విమర్శించారో! ఇది చాలా బాధాకరం.. కానీ మనమేం చేయగలం?నన్ను ఆడేసుకుంటున్నారుఇలాంటి కామెంట్లను లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడూ ఈ ట్రోల్స్ గురించి నయన్, నేను సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నయితే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. ఇలా ట్రోల్స్ చేసేవారు ఎలాగో మారరు, కాబట్టి మనమే వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లికాగా విఘ్నేశ్ శివన్ నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే) సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2022 జూన్లో వీరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.చదవండి: నేను మంచివాళ్లకే మంచివాడిని.. అనవసరంగా నాలో రాక్షసుడిని నిద్రలేపొద్దు: బిగ్బాస్ పవన్ -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.అసలేంటి వివాదం?విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్తో వివాదం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)


