breaking news
Kollywood
-
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. -
'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్
ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.శ్వేతా మోహన్ తన ఇన్స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్లో నేను లండన్లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.ఈ పోస్ట్కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు. View this post on Instagram A post shared by Shweta Mohan (@_shwetamohan_) -
జరిగిన విషయాన్ని ఎవరూ మార్చలేరు: హన్సిక
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగతంగా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇంతకుముందు ఓ హీరోని ప్రేమించిన వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తర్వాత కొన్నాళ్లకు సొహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. కొన్నాళ్ల క్రితం హన్సిక తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకుంది. తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టి గుళ్లు, గోపురాలు తిరిగింది. విదేశాలు చుట్టొస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇలా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వస్తున్న విమర్శలు, వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలోని రూమర్స్ గురించి హన్సిక ఘాటుగా స్పందించింది. 'సాధారణంగా సెలబ్రిటీస్ అనగానే వారి వ్యక్తిగత విషయాల గురించి ఎవరైనా విమర్శించొచ్చు అనే భావన పలువురిలో ఉంటుంది. ప్రముఖులకు మనసు అనేది ఒకటి ఉంటుందని అలాంటి వారు గ్రహించాలి. జీవితంలో కష్టకాలాన్ని అధిగమించే సమయంలో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. జరిగిన విషయాలను ఎవరు మార్చలేరు. ఇకపై సాగే జీవితం ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గత కాలాన్ని తలుచుకుంటూ కూర్చోవడం పూలిష్నెస్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎదగడమే ముఖ్యం' అని హన్సిక చెప్పుకొచ్చింది.ఇకపోతే హీరోయిన్గా 50 సినిమాలు చేసిన హన్సిక.. నిర్మాతగా మారి ఓ మూవీ తీసింది. కానీ భారీ నష్టాలతో చేతులు కాల్చుకుంది. మళ్లీ ఈ అమ్మడిని తెరపై ఎప్పుడు చూస్తామో ఏంటో?(ఇదీ చదవండి: శరత్ని లాగి చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక) -
మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక
సీనియర్ నటుడు శరత్ కుమార్ చేయని పాత్రంటూ లేదు. తెలుగు, తమిళంలో హీరో, విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మంగళవారం తన 62వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కాగా ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్ కుమార్ గురించి ఆయన భార్య, నటి రాధిక శరత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో శరత్ కుమార్ జోక్స్ గురించి రాధిక మాట్లాడిన విధానం అందరినీ నవ్వించింది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)శరత్ కుమార్ని నేను తొలిసారిగా కలిసినప్పుడు లాగి చెంప పగలగొట్టాలనిపించింది. దానికి కారణం ఆయన ఓ జోక్ చెప్పి తనే నవ్వుకుంటున్నారు. నాకు అస్సలు నవ్వే రాలేదు. అంతకంటే మంచి జోక్ మీకు తెలియదా? అని అడిగాను. అప్పటి నుంచి ఆయన ఆ అలవాటు ఇప్పటికీ మార్చుకోలేదు. అలాంటి చెత్త జోక్స్కి శరత్ కుమార్ ఓ యూనివర్సిటీ లాంటివారు' అని రాధిక చెప్పుకొచ్చింది.అలానే ఒక తండ్రిగా శరత్ కుమార్ ఎలా ఉంటారు అనే దానికి కూడా రాధిక సమాధానమిచ్చింది. నా కూతురు రాయన్ని నేను సింగిల్ పేరెంట్గానే పెంచాను. మంచి, చెడు అంటూ జీవిత అనుభవాన్ని నేనే నేర్పించాను. మా కొడుకు విషయంలో అలా కాదు. అతనికి నేను ఏదైనా చెప్పే ప్రయత్నం చేయగానే వదిలేయ్ నేను చెబుతాను అంటూ శరత్ కుమార్ వచ్చేస్తారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు. అందుకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మా అబ్బాయి పెద్దయిన తర్వాతే తెలుస్తుంది' అని రాధిక పేర్కొంది. (ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా) -
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు) -
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?) -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ శుభవార్త చెప్పేసింది. చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ పాల్గొంది. ఈ క్రమంలోనే అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)గతేడాది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. ముంబైలోని శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోని ఫరా.. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఆ ఇంటిని శ్రుతి హాసన్ తన అభిరుచులకు అనుగణంగా డెకరేట్ చేసుకుంది. ఇప్పుడు చెన్నైలోని ఇంటిని కొనుగోలు/కట్టించుకుని మరోసారి తన సొంతిటి కల నెరవేర్చుకుంది.శ్రుతి హాసన్ కెరీర్ విషయానికొస్తే గతేడాది 'కూలీ'లో నటించింది. రీసెంట్గా వచ్చిన 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న తెలుగు మూవీ 'ఆకాశంలో ఒక తార', విజయ్ సేతుపతి 'ట్రైన్' చిత్రాల్లో శ్రుతి హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
బికినీ వేసుకోవడంపై కాజల్ రియాక్షన్
సినిమా ఒక ఎంటర్టైన్మెంట్. అది ఒక అట్రాక్షన్. ఎలాంటి చిత్రానికైన బీజం ప్రేమే. ఆ ప్రేమలో అనేక అంశాలు దాగి ఉంటాయి. అందులో అందాలు ఆరబోసే గ్లామర్ ఉంటుంది. బికినీ అందాలతో కవ్వించే సీన్స్ ఉంటాయి. నయనతార, అనుష్క లాంటి టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు తమ అందాలను బికినీ దుస్తుల్లో ఆరబోస్తుంటారు. తద్వారా పాపులర్ అవుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం తాను బికినీ దుస్తులకు పూర్తి వ్యతిరేకిని అని చెప్పింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)నిజం చెప్పాలంటే కాజల్ కూడా గ్లామరస్ నటనతోనే స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు ,తమిళ, హిందీ తదితర భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి తర్వాత నటనకు చిన్న బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత కొన్నేళ్లుగా మళ్లీ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన 'ది ఇండియా స్టోరీ' అనే పాన్ ఇండియా చిత్ర విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బికినీ దుస్తుల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది.అంతేకాదు సినిమాల్లో హద్దులు మీరిన రొమాంటిక్ సీన్స్లోనూ నటించనని కాజల్ చెప్పుకొచ్చింది. తనకు తాను కొన్ని హద్దులు విధించుకున్నానని పేర్కొంది. కాదు కూడదు అంటే అలాంటి చిత్రాల్లో నటించలేనని స్పష్టంగా చెప్పింది. అది ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా, ఎంత ముఖ్యమైన పాత్ర అయినా తనకు చింత లేదని స్పష్టం చేసింది. నటన విషయంలో తనకంటూ ఒక పరిమితిని పెట్టుకున్నట్లు , దాన్ని తాను కచ్చితంగా పాటిస్తానని నటి కాజల్ పేర్కొంది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో సింగర్ పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది) -
ప్రియుడితో పెదకాపు హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా.. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. -
'బిగ్బాస్' ఫేమ్ వాటర్మెలన్ స్టార్ అరెస్ట్
తమిళనాట 'వాటర్మెలన్' స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దివాకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది జరిగిన తమిళ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొన్న ఇతడు.. రీసెంట్ టైంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)తన వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్కి చాలా ఆదాయం వస్తున్నందున, రూ.లక్ష డిమాండ్ చేస్తూ దివాకర్ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ సంధర్భంగా జరిగిన గొడవలో దివాకర్.. ఖరీదైన కెమెరాని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ తరఫున సంబంధిత ఆధారాలతో కిల్పాక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా పోలీసులు, దివాకర్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగులు తనని అక్రమంగా ఓ గదిలో బంధించి, దాడి చేశారని చెబుతూ వీడియోలని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దివాకర్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివాకర్ కోరాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) -
ఇది నా నిజ జీవిత పాత్రలానే ఉంది
పారి ఇళవళగన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'అన్బే డయానా'. మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాస్టిల్ క్రిమేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్య నారాయణన్ హీరోయిన్. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నటి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మా ఇంటి బంగారం'.. అధికారిక ప్రకటన)'సుమారు 11 ఏళ్ల తరువాత నేను నటించిన సినిమా 'లెనిన్ పాండియన్'. దాని తర్వాత ఇదే. దర్శకుడు పారి ఇళవళగన్ నన్ను కలిసి కథ చెప్పినప్పుడే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనిపించింది. నేను ఇందులో ఆంధ్రా నుంచి చైన్నెకి వచ్చి సెటిల్ అయిన అమ్మాయిగా నటించాను. ఇది నా నిజజీవిత పాత్రలానే ఉంది. మూవీ కోసం అందరూ బాగా పనిచేశారు' అని రోజా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల) -
'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్కుమార్ ఆగ్రహం
టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026 -
మీ పేరు శాశ్వతం.. మాట లేకపోయినా పాట ఉంటుంది.. జానకమ్మకు అశ్రు నివాళులు
-
అర్జున్ దాస్ లేటేస్ట్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కేఎస్ సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై సమర్పణలో 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ దాస్కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓజీ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. Super Hero Babu.. Title & Poster 👌 @sinish_s presents #SUPERHERO BABUA commercial family entertainer.@iam_arjundas @iamSandy_Off #SuperHeroBabu pic.twitter.com/XPkx6Rp4kW— H A N U (@HanuNews) July 10, 2026 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. జాతీయ అవార్డ్ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ చెజియాన్(57) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చెన్నైలోని తారామణిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు డైరెక్టర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు.. సినిమాటోగ్రాఫర్గా రాణించారని కొనియాడుతున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాని పోస్టులు పెడుతున్నారు.కాగా.. తమిళనాడులోని శివగంగైలో జన్మించిన చెజియాన్.. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తనకున్న అభిరుచితో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ వద్ద సహాయకుడిగా కెరీర్ మొదలెట్టారు. ఆ తర్వాత 2007లో 'కల్లూరి' చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా అరంగేట్రం చేశారు. అనంతరం 'రెట్టైసుళి', 'తెన్మెర్కు పరువకాట్రు', 'మగిళ్చి', 'పరదేశి', 'జోకర్' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'పరదేశి' సినిమాకు గానూ 2013లో లండన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది.ఆ తర్వాత ఆయన 'టు లెట్' అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రం జాతీయ సీనీ పురస్కారాన్ని గెలుచుకోవడంతో పాటు.. పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. ఆయన సినిమాలతో పాటు రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు పాఠకులకు ప్రపంచ సినిమాను పరిచయం చేయగా.. ఆయన చిత్రాలు వాస్తవికత, భావోద్వేగం, కళాత్మక నిజాయితీ పట్ల నిబద్ధతను ప్రతిబింబించాయి.His work behind the camera will continue to inspire! His contribution to cinema will always be remembered! Rest in peace, Chezhiyan. 🤍#RIPChezhiyan #AGSCinemas pic.twitter.com/GSGcjgza8A— AGS Cinemas (@agscinemas) July 10, 2026 -
కాయదు.. ఆ హీరోతో సినిమా సెట్ అవ్వట్లేదు!
సినిమా రంగంలో ఎవరిని ,ఎప్పుడు అదష్టం వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు వరస అవకాశాలు తలుపుతడతాయి. హీరోయిన్ కాయదు లోహర్ విషయంలోనూ ఇదే జరిగింది. కన్నడం, తెలుగు చిత్రాలతో తొలుత ఉనికి చాటుకున్న ఈ అమ్మడు.. తమిళంలో చేసిన 'డ్రాగన్' మూవీతో సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాయదుకు సడన్ క్రేజ్ వచ్చేసింది. అదేచిత్రంలో నటించిన అనుపమకు రాని క్రేజ్ కాయదుని వరించింది. నిజం చెప్పాలంటే 'డ్రాగన్' తర్వాత ఈమెకు హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అవకాశాలు వరుస కడుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ప్రస్తుతం ఈమె తమిళంలో 'ఇమ్మోర్టల్', మారి సెల్వరాజ్ 'మంజనది', మలయాళంలో 'ఐ యామ్ గేమ్', తెలుగులో 'ది ప్యారడైజ్' మూవీస్ చేస్తోంది. తాజాగా సూర్య చిత్రంలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా బిజీగా ఉన్న కాయదు లోహార్ని ఇంతకుముందే శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో అందులో నుంచి కాయదు డ్రాప్ అయిందని టాక్ నడిచింది.ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాయదు మాట్లాడుతూ.. శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణంతో ఆ చిత్రం ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. దీంతో తాను ఆయనతో కలిసి నటించిన చిత్రం కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతున్నానని పేర్కొంది. ఆ చిత్రం విధి చేతిలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిమానులు మాత్రం త్వరలోనే శింబుతో జోడీకడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ) -
హీరోకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్.. దర్శకుడికి గోల్డ్ చెయిన్
తమిళ హీరో విష్ణు విశాల్ లేటెస్ట్ సినిమా 'గట్ట కుస్తీ 2'. ఐసరి గణేష్తో పాటు విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని కోట్ల కొద్ది కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం మధ్యాహ్నం చైన్నెలోని థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఐసరి గణేష్ మాట్లాడుతూ తాను ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఆడియో విడుదల కార్యక్రమానికి, ఇప్పుడు సక్సెస్ మీట్ మాత్రమే హాజరయ్యానన్నారు. మిగతాదంతా విష్ణు విశాల్నే చూసుకున్నాడు. విష్ణు విశాల్ మాట్లాడుతూ ఐసరి గణేష్ తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన స్వేచ్ఛనే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని అన్నాడు. తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు దక్కిన తొలి సక్సెస్ క్రెడిట్ ఈ చిత్రమేనని విష్ణు విశాల్ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత గణేష్.. యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరికి 40 గ్రాముల వెండి పలకాన్ని బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకుడు సెల్లా అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రాస్లెట్ని అందించారు, విష్ణు విశాల్కు ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' మూవీ ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by M VIGNESH (@wikkitalks_official) View this post on Instagram A post shared by Rahul 😉 (@_sm_rahul) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ఆల్ క్లియర్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి చిత్రమిదే. విజయ్ సీఎం అయినా కూడా ఇంకా విడుదల కాలేదు.తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్టైమ్ 183 నిమిషాలుగా నిర్ణయించింది. గతంలో సెన్సార్ సమస్యల వల్లే ఆ మూవీ రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఆ సమస్య క్లియర్ కావడంతో ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. OFFICIAL: #JanaNayagan Censored "🅰️"DURATION : 3 Hours 3 Minutes 11 Seconds📌LINK: https://t.co/M7W87PlkKV pic.twitter.com/ar4JpmMQQ8— Actor Vijay Team (@ActorVijayTeam) July 9, 2026 -
జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం జన నాయగన్. సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. జన నాయగన్ రిలీజ్ డేట్పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ జన నాయగన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో జన నాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేసింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాతనైనా జన నాయగన్ థియేటర్లలో సందడి చేయనుంది.పాలిటిక్స్లో ఎంట్రీకి ముందు ఇదే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు. 🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥🇨🇦 Canada Release by York Cinemas🎬 Igniting screens from July 24.Get ready for the ultimate theatrical celebration. Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp— York Cinemas (@yorkcinemas) July 8, 2026 -
సక్సెస్ ఫార్ములా.. 100 కోట్ల క్లబ్ లోకి సూర్య.!
-
ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది
పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటుడు ధనుష్. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్ ప్రస్తుతం 'ఓమ్' అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. ఇదలా ఉండగానే మరొకటి ప్రాజెక్ట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్)ఇందులో డీ,వీ అనే ఇంగ్లీష్ అక్షరాలు, 10–07–26 అనే తేదీ మాత్రమే ఉన్నాయి. ధనుష్ తదుపరి మూవీ సత్యజ్యోతి సంస్థలో చేయబోతున్నట్లు చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ పోస్టర్లో వీ అనే అక్షరానికి దర్శకుడు వెంకట్ ప్రభు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అని, విలన్ ఎస్జే సూర్య అని ప్రచారం సాగుతోంది. మరోవైపు '12th ఫెయిల్'తో ఆకట్టుకున్న విదు వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. మరి ధనుష్తో పనిచేసే ఆ దర్శకుడు ఎవరు?(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి) -
ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు
ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ప్రేమ ఉంటుంది. కొందరు దాన్ని బయటకు చెప్పుకొంటారు. కొందరు మనసులోనే రహస్యంగా ఉంచుకుంటారు. సినిమా వాళ్లు దీనికి అతీతం కాదు. చాలామంది హీరోయిన్లు తన చిన్నప్పటి ప్రేమ సంగతుల్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. హీరోయిన్ అంజలికి అలాంటి చిన్న లవ్ స్టొరీ ఉందట.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)2006లో 'కట్రదు తమిళ్' సినిమాతో కథానాయికిగా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. తెలుగులోనూ పలు మూవీస్ చేసి హిట్స్ అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్లో' మకుటం'లో నటించింది. విశాల్ హీరోగా నటించి తొలి సారిగా దర్శకత్వం వహించిన చిత్రమిది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి.. టీనేజీలో తన జీవితంలో జరిగిన ప్రేమ సంఘటన గురించి చెప్పింది. నా క్లాస్ మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దానికి ఫుల్స్టాప్ పెట్టాలని భావించి, నువ్వు అంటే ప్రేమ లేదని చెప్పా. దాంతో అతను నీకు ధైర్యం ఉంటే నాకు రాఖీ కట్టు అని అన్నాడు. వెంటనే నేను రాఖీ కట్టేసరికి షాక్ అయినా అతడు.. వెంటనే దాన్ని తీసిపారేసి వెళ్లిపోయాడు. తర్వాత మేం ఎప్పటికీ కలుసుకోలేదు అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్) -
సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్కి కాస్ట్లీ కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే హీరోలకు లేదా దర్శకులకు నిర్మాత.. కారు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి టాలీవుడ్లో చూస్తూనే ఉంటాం. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేస్తుంటాడు. అలా ఈ ఏడాది ఓ మూవీ నిర్మించగా అది ఊహించని సక్సెస్ అందుకుంది. ఇప్పడా చిత్ర దర్శకుడికే ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)రాధిక ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన సినిమా 'థాయ్ కిళవి'. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్గానే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తి చేసుకుని మొత్తంగా రూ.80 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాత శివకార్తికేయన్.. దర్శకుడు శివకుమార్కి రూ.20 లక్షలు విలువ చేసే మహీంద్రా బీఈ6 కారుని బహుకరించాడు.ఇకపోతే శివకుమార్ మురుగేశ్ ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా 'సెయాన్' అనే సినిమాని తీస్తున్నాడు. కుమారస్వామి నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Sivakarthikeyan Productions (@skprodoffl) -
20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా వస్తోన్న చిత్రం హృదయం మురళి. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ సీన్స్ చూస్తుంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కథగా కనిపిస్తోంది. ఈ మూవీకి తమనే సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. 20 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో తమన్ నటించిన సంగతి తెలిసిందే. -
ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది
ఏ భాషలో చూసుకున్నా సరే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే ఏ సినిమాలు కూడా నిలబడవు. అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మహా అయితే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వస్తాయి. అదే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే లెక్క వేరే ఉంటుంది. రీసెంట్ టైంలో తెలుగులో అలా 'మా ఇంటి బంగారం' కనెక్ట్ అయింది. హిట్ అయింది. ఇప్పుడు దీనిలా తమిళంలో ఓ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)తమిళ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు. దీనికంటే తెలుగు షట్లర్ గుత్తా జ్వాల భర్తగానే చాలామందికి తెలుసు. ఇతడు హీరోగా నటించిన 'మట్టీ కుస్తీ' అనే సినిమా 2022లో రిలీజైంది. హీరో రవితేజ దీని నిర్మాణంలో భాగమయ్యాడు. కానీ ఇదేమంత సక్సెస్ కాలేదు. ఇలాంటి చిత్రానికి సీక్వెల్ తీస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ విష్ణు విశాల్ తీశాడు. అదే 'గట్ట కుస్తీ 2'. ఈసారి తమిళం వరకు మాత్రమే విడుదల చేశారు.గత వీకెండ్ థియేటర్లలో రిలీజ్ చేయగా యావరేజ్, పర్లేదు అనే రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కానీ కుటుంబ ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయిపోయింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విష్ణు విశాల్ మార్కెట్కి ఇది చాలా ఎక్కువ. అసలు ఇది హిట్ అవుతుందని కూడా ఊహించి ఉండరు. అలాంటిది చూస్తుంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ వసూళ్లు తెచ్చుకునేలా కనిపిస్తోంది.ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటే యావరేజ్ సినిమాకు వసూళ్లు ఎంతలా వస్తాయనేది 'గట్ట కుస్తీ 2' నిరూపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కుస్తీ ఫైట్, మూవీలోని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీనిని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా? లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు
తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అకస్మాత్తుగా కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకు నివాళి అర్పించారు. ఇకపోతే ఈయన ఎప్పటినుంచో కోరుకున్న విషయాన్ని ప్రముఖ రచయిత వైరముత్తు నెరవేర్చారు.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్.. గతంలో తన స్వీయచరిత్రాన్ని పుస్తకంగా రాశారు. దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తుని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ భాగ్యరాజ్ బతికుండగా అది జరగలేదని, ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికని నెరవేర్చినట్లు వైరముత్తు చెప్పారు. ఆయన భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ కి సదరు ప్రతిని అందించినట్లు వెల్లడించారు.భాగ్యరాజ్ చనిపోయిన తర్వాత ఆయన చివరి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచండి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను' అని ఈయన రాసినట్లు అందులో ఉంది.(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో ధనుష్.. ఎంట్రీ ఫిక్స్ అయిందా?) -
అప్పుడు విలన్ ఇప్పుడు హీరోయిన్
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈయన లీడ్ రోల్ చేసిన 'డీసీ' ఈ నెల చివరలోనే రిలీజ్ రానుంది. జీ స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లతో పలు చిత్రాల్ని తీస్తున్నాడు. ఈయన నిర్మిస్తున్న 'బెంజ్', 'ఫైట్ క్లబ్' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకుడు.విశాల్ వెంకట్ ఇంతకు ముందు సిరి నేరంగలిల్ సిల మనిదర్గళ్, బాంబ్ వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన ఇప్పుడు మహిళా నేపథ్య కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రెజీనాని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో తమిళంలో అజిత్ 'విడాముయర్చి'లో రెజీనా విలన్గా చేసింది. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో నటించనుంది.విశేషం ఏమిటంటే లోకేష్ కనకరాజ్ తొలి మూవీ 'మానగరం'లో రెజీనానే హీరోయినే. తాజాగా రూపొందనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్నాడు. -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కమల్ హాసన్ లాంటి స్టార్స్కు సాధ్యం కానీ ఫీట్ సాధించారు.ఇక విజయ్ గెలుపుతో ద్రవిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సినీ స్టార్స్ వరుసగా రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుశ్ సైతం ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన అభిమాన సంఘం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ధనుశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.దళపతి విజయ్ లాగే ధనుశ్ సైతం రాజకీయాల్లో అడుగు పెడతారనే చర్చ కోలీవుడ్లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల కల్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్కో ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల వేళ.. ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. -
దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో
కోలీవుడ్లో మరో వారసుడి అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దివంగత మ్యూజిక్ కంపోజర్ ఆర్డి.భాస్కర్ వారసుడు జైయన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఆర్డి భాస్కర్ ఒకరు. మ్యూజిక్ కంపోజర్గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడు జైయన్.జైయన్ హీరోగా చేస్తున్న సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని ఇళయరాజాని గుర్తుచేసేలా టైటిల్ పెట్టారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్ బాలగంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్ ఎన్.సుబ్రమణియమ్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు.జైయన్కు జంటగా సోనా ఒలికల్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. షూటింగ్ చైన్నెలో ఆదివారం జరిగిన పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు
లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
రజనీకాంత్ రీల్ కోడలికి హీరోయిన్గా మరో ఛాన్స్
తమిళ నటుడు అరుణ్ విజయ్.. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1995లో 'మురై మాప్పిళై' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా మూడు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 'బ్రూస్ లీ', సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తడం, కుట్రం 23 ,మాఫియా , సెక్క సివంద వానం వణంగాన్ వంటి పలు చిత్రాలను కథానాయకుడుగా తన నటనా ప్రతిభకు ప్రదర్శించిన ఈయన రీసెంట్ టైంలో 'రెట్ట తల' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన 'పార్టనర్' అనివార్య కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈయన ముత్తయ్య దర్శకత్వంలో హీరోగా చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కుట్టి పులి, కొంబన్, మరుదు, విరుమన్ వంటి చిత్రాలతో ముత్తయ్య ఫేమస్. ఇందులో నటుడు అరుణ్ విజయ్ జంటగా 'జైలర్' ఫేమ్ మిర్నా మీనన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన మిర్నా.. హీరోయిన్గా ఇది మంచి అవకాశమే అవుతుంది.ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళంలో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన ప్రస్తుతానికైతే 'జైలర్ 2'లో రజనీకాంత్ కోడలి పాత్రలో, డాన్ బాస్కో అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత తమిళంలో హీరోయిన్గా అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్
జీవితం అంటే కేవలం సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు మంచి రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, తమిళ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు రాజకీయాలు నేర్పిన వారు, తన లాంటి వారు, తందై పెరియార్ చేసిన రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. అందుకే రాజకీయమే తన వృత్తిగా మార్చుకున్నానని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు)తాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాటకాలు ఆడాలనుకోవడం లేదని అన్నారు. సమాజంలో అవినీతి ఉందని చెబితే సరిపోదని, ఎవరైనా లంచాలు తీసుకుంటుంటే, అందులో ఇచ్చే వారి ప్రమేయం కూడా ఉంటుందన్నారు. లంచం ఇస్తే, తీసుకునే చేయి మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్గానో, దర్శకుడిగానో రాలేదన్నారు. తన కష్టార్జితం, అర్హతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాను నేరుగా ముఖ్యమంత్రిగా రాలేదని, దానికి కావలసిన అర్హతలు తనకు వచ్చినప్పుడు, ప్రజలు తనకు ఆ పదవిని ఇస్తారని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి, చెడు రెండూ ఉన్నాయని కమల్ హాసన్ వివరించారు. సాంకేతికతను నేర్చుకున్న వారు దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేంత వరకు నేర్చుకుంటున్నారని చెప్పారు. యువత వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి రాజకీయ నాయకుడు ఎవరో గుర్తించే వయసుకు తమరు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్) -
స్టార్ కమెడియన్ సాహసం.. కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్..!
గతంలో దివంగత నటుడు శివాజీ గణేషన్ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటిస్తే.. కమలహాసన్ ఏకంగా దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ రికార్డ్ను ప్రముఖ స్టార్ కమెడియన్ యోగిబాబు బ్రేక్ చేయనున్నారు. ఆయన ఏకంగా 11 పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్ కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్ రాజా శిష్యుడు కాగా.. ఈ చిత్రాన్ని 9 లైట్స్ పతాకంపై సురేష్ ముత్తు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేస్తుంది. ఈ మూవీలో మలయాళ నటి అతిథి రవి హీరోయిన్గా నటిస్తున్నారు.యోగి బాబు 11 పాత్రలు నటిస్తున్న కామెడీ యాక్టర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో హీరో,విలన్, కమెడియన్ పాత్రల్లో యోగిబాబు నటిస్తున్నట్లు చెప్పారు .అదే విధంగా ఇందులో కవల పిల్లల పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని అందులోని బ్లాక్ బాక్స్ కనుగొనే ప్రయత్నం అన్నారు. ఈ ప్రమాదానికి కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొని సవాళ్లను వినోదం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ఇంగ్లాండ్, కెన్యా దేశాల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్ లీ,వీటీవీ గణేశ్, పంజు సుబ్బు, ఏ.వెంకటేశ్ ముఖ్యపాత్రులు పోషిస్తున్నారు. -
వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?) -
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
తమిళ ప్రముఖ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ కరాటే బాబు. 'డాడా' ఫేమ్ గణేష్ కె బాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అయితే ఈ మూవీతో తమిళనాడు మాజీ డీజీపీ శంకర్ జివాల్ కూతురు హీరోయిన్గా పరిచయమవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్)మాజీ డీజీపీ కుమార్తె పేరు దౌదీ జివాల్. ఇకపోతే ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, వీటివీ. గణేష్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. సుందర్ ఆరుముగం నిర్మాత. ఇంతకుముందు ఈయన రవి మోహన్తో అఖిలన్, బ్రదర్ లాంటి మూవీస్ తీశారు. ఇది మాత్రం రాజకీయ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించారు.ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయని అయితే వాటికి పూర్తి భిన్నంగా 'కరాటే బాబు' ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం, బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే కథ చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా శాసనసభ్యుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే రాజకీయ థ్రిల్లర్గా తెరకెక్కించారట.శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఎళిల్ అరసు.కె ఛాయాగ్రహణం అందించారు.(ఇదీ చదవండి: సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్) -
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో మలయాళీ బ్యూటీ చేరేందుకు రెడీ అయింది. ఆమెనే రియా షిబు.మొదట నటిగా ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా మారి తమిళంలో విక్రమ్తో 'వీర ధీర సూరన్' సినిమాని నిర్మించింది. తర్వాత కథానాయకగా అవతారమెత్తి 'సర్వం మాయ' అనే మలయాళ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్న రియా.. కోలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త మూవీలో హీరోయిన్గా అవకాశం వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అలా ఉండగానే ఇప్పుడు మరో అవకాశం తలుపు తట్టిందని సమాచారం.విజయ్ సేతుపతితో రియా కలిసి నటించడానికి సిద్ధమవుతోందని తెలిసింది. క్రితిక ఉదయనిది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళ దర్శకురాలు ఈసారి కుటుంబ అనుబంధాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణను జరుపుకొంటున్నట్లు, మరో వారంలో తొలి షెడ్యూల్ పూర్తికాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా?
తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన జైలర్ మూవీ సీక్వెల్గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విశ్వంభరతో పోటీ?అయితే మెగాస్టార్ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్లో రిలీజవుతుందని ఆశించినప్పటికీ అలా ఏం జరగలేదు. ఈ దసరాకే విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మెగాస్టార్ మూవీని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారని టాలీవుడ్ టాక్. తాజాగా అక్టోబర్ 15న జైలర్-2 తేదీని ఫిక్స్ చేయడంతో విశ్వంభర రిలీజ్కు సాహసం చేస్తారా? మరోసారి వాయిదా వేయకతప్పదా? రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. జైలర్-2తో మెగాస్టార్ పోటీకి దిగుతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. Alappara Kelappurom! #Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh— Sun Pictures (@sunpictures) July 2, 2026 -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక కంటెంట్కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.తాజాగా మరో సక్సెస్ఫుల్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్బీట్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి.అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.One world became two. But the heartbeat remains one. ❤️Hotstar Specials #HeartBeatSeason3 streaming from July 30 only on #JioHotstar #HBS3 #HBS3OnJHS #HeartBeatS3OnJioHotstar #HeartBeat3OnJioHotstar #HeartBeat3StreamingFromJuly30 #HeartBeatS3FirstLook #JioHotstarTamil… pic.twitter.com/RQFWVdi5uP— JioHotstar Tamil (@JioHotstartam) July 1, 2026 -
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందులో తన కళ్లు దానం చేయాలనే చివరి కోరికతోపాటు తన కొడుకు శాంతనుకి అండగా నిలవాలని అభిమానులని ఆయన వేడుకుంటున్నట్లు ఉంది.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)లెటర్ లో ఏముందంటే?'మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సాహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి'కొడుకు, నటుడు శాంతను భాగ్యరాజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నా కోసం కొట్టిన చప్పట్లే నా కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నా. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను' అని లెటర్లో రాసుకొచ్చారు.తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనకు భార్య పూర్ణిమ, కొడుకు శాంతను, కుమార్తె శరణ్య ఉన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ సినిమాల ఫేమ్ అభిషేక్ జీవంత్ హీరోగా గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో ఓ మూవీ రూదుతోంది. డ్రామా కంపెనీ సమర్పణలో ఎ. బాలమురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగారం, యోగలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అభిషేక్ , శివరాజ్ కుమార్, శివానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తమిళంలో నేను నటిస్తున్న తొలి సినిమా ఇది. నాకు కొంచెం తమిళ భాష వస్తుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. శివ రాజ్కుమార్ సార్తో కలిసి నటిస్తున్నాను. అభిషేక్ చాలా ప్రతిభావంతుడు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శివానీ నాగారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. -
పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా
రీసెంట్ టైంలో ట్రెండింగ్ హీరోయిన్ అంటే కచ్చితంగా వినిపించే పేరు కాయదు లోహర్. 'ముఖిల్ పేట్టై' అనే కన్నడ మూవీతో హీరోయిన్ అయిన ఈ అస్సామీ బ్యూటీ.. 'అల్లూరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే తమిళంలో 'డ్రాగన్' చేసింది ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి చిత్రాలతో వచ్చింది. ఇప్పుడు సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది. రెండురోజుల క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 16 ఏళ్లున్నప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)'పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్కు వెళ్తుండేదాన్ని . ఒకరోజు ఒక కుర్రాడు నన్ను ఫాలో అవుతూ ఈవ్ టీజింగ్ చేశాడు. పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ నా వెంట పడుతూ హద్దులు మీరడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే పక్కనే ఉన్న పెద్ద రాయి తీసి అతడి తల మీద కొట్టా. రక్తం కారడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని కాయాదు లోహర్ గుర్తుచేసుకుంది.చూడటానికి నేను చాలా సాఫ్ట్గా కనిపించినా.. ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుందని, దానికి ఎదురు వెళ్తాను. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని కాయదు చెప్పుకొచ్చింది. ఈమె నాని 'ప్యారడైజ్' మూవీలోనూ నటిస్తోంది. వచ్చే నెల చివరలో ఆ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత) -
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది.సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి) -
రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఇతడు రాజకీయాల్లోకి రానున్నాడని.. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో నిలబడతాడనే రూమర్స్ చాలా వినిపించాయి. మూడు వారాల క్రితం దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. చెప్పి చెప్పకుండానే మాట్లాడాడు. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)రెండు వారాల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. నేను రాజకీయాల్లోకి రావడం పట్ల మీ సలహాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే మాత్రం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని అన్నారు.తాజాగా మంగళవారం మధ్యాహ్నం దాదాపు 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. చాలా విషయాలు మాట్లాడాడు. నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయను. కానీ రాజకీయాల్లోకి రానని మాత్రం అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే లారెన్స్ ఊపు చూసి పక్కాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావించారు. మరి ఏమైందో ఏమో గానీ సడన్ యూటర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
కుమారస్వామి ఎక్కడివాడు? సోషల్ మీడియాలో వింత చర్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరిని ట్రోల్ చేసుకుంటారో అస్సలు అర్థం కాదు. రీసెంట్గా 'ఇడుపు కాయితం' అనే పదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవడో ఓ ఆకతాయి పెట్టిన కామెంట్ కారణంగా ఒకరి భాష, యాసపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇందులోకి రాజకీయాలు కూడా ఎంటరయ్యాయి. సరే ఈ గోల ఎప్పుడు ఆగుతుంది అనుకుంటే కొత్తది మొదలైంది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)నిన్నటివరకు ఆంధ్రా vs తెలంగాణ నెటిజన్ల మధ్య రచ్చ నడవగా.. ఇప్పుడు తెలుగు vs తమిళ నెటిజన్ల మధ్య ట్రోల్స్ హంగామా నడుస్తోంది. దీనంతటికీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కొత్త పోస్టరే కారణం. చాన్నాళ్లుగా కుమారస్వామి కథతో తీసే సినిమాలో తారక్ నటిస్తాడనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు. త్రిశూలం, డీఎన్ఏ, యుద్ధాలు తదితర అంశాలు ఈ పోస్టర్లో చూపించారు.అయితే ఈ చిత్ర నిర్మాతలు నాగవంశీ, కల్యాణ్ రామ్.. పోస్టర్ షేర్ చేస్తూ 'ఉత్తరంలో జననం.. మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం.. దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం!' అని కుమారస్వామి గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని తమిళ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు కుమారస్వామి ఎక్కడివాడు? అనే వింత చర్చ మొదలైంది. మరి ఇదెప్పుడు ఆగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)Original name of Murugan is Ceyon ( சேயோன் ) , he was red in colour , he was the warrior god and he is the origin of all of us tamils , and his mother’s name is Kottravai - the original form of Tirupathi Venkateswara swamy .Do not ready made up history and convince yourself… https://t.co/to9yfeMLSm— Prashanth Rangaswamy (@itisprashanth) June 29, 2026 -
ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్
పవి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి బ్రిగిడా సాగా.. సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరల అయిపోయిన బ్రిగిడా సాగా.. 2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. తర్వాత అంతా మర్చిపోయారు.అలాంటిది ఇప్పుడు బ్రిగిడా సాగా తన ప్రేమ విషయం రివీల్ చేసి ప్రియుడి గురించి చెప్పడంతో తోటీ నటీనటులు విషెస్ చెబుతున్నారు. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.బ్రిగిడా సాగా తన ఇన్ స్టాలో ఆనంద్ గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి అందమైన ప్రేమకథలు సినిమాల్లో ఉంటాయని అనుకునే దాన్ని, కానీ జీవితం నాకోసం మరో అందమైన కథ రాసింది. సినిమా ప్రయాణంలో నా లాంటి డ్రీమ్స్, ఇష్టాలు కలిగిన ఆనంద్ రామ్ని కలుసుకున్నాను. స్నేహంతో మొదలైన బంధం ఇప్పుడు ప్రేమవరకు వచ్చింది. అలానే మేం 'ఐ లవ్ యూ' చెప్పుకొనే జోడీ కాదు' అని బ్రిగిడా సాగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ
నటుడు సూర్య స్టార్ హీరోగా రాణిస్తూ తన అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈయన కూడా హీరో విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిలా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిచ్చేలా ఆదివారం చెన్నైలో జరిగిన సూర్య అఖిల ఇండియా అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్.వీరమణి.. నటుడు సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహకులు స్పందించారు. ఆర్.వీరమణి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.సూర్య కెరీర్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేదు. గత నెలలో విడుదలైన 'వీరభద్రుడు' మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో మాత్రం అద్భుతమైన హిట్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో రాబోతున్న సూర్య.. మరోవైపు దర్శకుడు జీతూ మాధవన్ తీస్తున్న ఓ మూవీలో పోలీస్గా చేస్తున్నారు. నిన్ననే 'సలార్' నిర్మాతలతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్న సూర్య.. రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం.(ఇదీ చదవండి: అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం) -
మరో హిట్ కాంబో.. ఈ సారి భారీ ప్రాజెక్ట్..!
ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.అంతలోనే మరో భారీ ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో. భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్తో జతకట్టారు. ఈ సందర్భంగా సూర్యకు ఆహ్వానం పలుకుతూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జూన్ 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. The next chapter... #SuriyaXHombaleHe built it.Frame by frame. Film by film. Fight by fight.Roles that bled truth.Characters that carried the weight of real lives.A journey defined by courage, conviction, and craft.Three decades of truth on screen.Countless hearts… pic.twitter.com/HoZOgQRbC7— Hombale Films (@hombalefilms) June 29, 2026 -
అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం
రెండు రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకుని భాగ్యరాజ్కు నివాళి అర్పించేందుకు వచ్చిన సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టారు. నటి రాధిక కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆరోజే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది. ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన అసహనాన్ని బయటపెట్టింది.'అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. హంగామా చేసేందుకు వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల టైంలో మీడియాని నిషేధించాల్సిందే' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీన్ని రీట్వీట్ చేసిన రాధిక.. కచ్చితంగా నిషేధం విధించాలి అని రాసుకొచ్చింది. ఇక భాగ్యరాజ్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది.50 ఏళ్ల స్నేహానికి వీడ్కోలు. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచారు. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన ప్రదేశం ఓ సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడూ మారిపోయాం? ప్రభుత్వం, ఇండస్ట్రీ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల టైంలో ప్రోటొకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు, ఆత్మకు గౌరవం ఇవ్వాలి' అని రాధిక తన ఆవేదన వ్యక్తం చేసింది.pic.twitter.com/dE4PWoyHRG— Radikaa Sarathkumar (@realradikaa) June 29, 2026கையெடுத்து கும்பிடறன், TRP வேணாம்னு சினிமால நடிச்சி தரோம் , கொஞ்சம் பிரைவேசி கொடுங்க #Bhagyaraj #Radhika pic.twitter.com/PdbuKivcW1— Behind Talkies (@BehindTalkies) June 27, 2026 -
'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి
సినిమా ప్రాంతీయ భాషలని దాటి చాలా కాలమైపోయింది. హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా భారతీయ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది హిందీ యాక్టర్స్.. దక్షిణాదిలో నటించేందుకు గత కొన్నాళ్ల నుంచి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్ల నుంచి ప్రియాంక చోప్రా, కియారా అడ్వాణీ వరకు సౌత్లో నటించిన వాళ్లే. రీసెంట్ టైంలో అయితే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో 'దేవర', 'పెద్ది' చేసింది.(ఇదీ చదవండి: బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?)తెలుగు సినిమాల్లో యాక్టింగ్ కంటే తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. చాలామంది దర్శకనిర్మాతలు ఈమె కోసం ప్రయత్నించగా చివరకు డైరెక్టర్ సర్గుణం కోలీవుడ్లోకి జాన్వీని పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలవాణి, వాగై చుడవా తదితర మూవీస్ తీసిన ఈయన ఈ మధ్యే 'ఎగ్జామ్' వెబ్ సిరీస్ తీశారు. ఇప్పుడు మరొకటి తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోనే జాన్వీ కపూర్ కీలక పాత్ర చేయనుందట.ఈ వెబ్ సిరీస్ని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్కి చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మించనుందట. కురత్తి అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. మరి తెలుగులో గుర్తింపు కంటే విమర్శలు ఎక్కువగా అందుకున్న జాన్వీ.. తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా?) -
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సింపుల్గా నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)స్వతహాగా కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే.. 2007 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'కెవ్వు కేక' మూవీలో నటించింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు సినిమాలు చేసింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్ మెంటైన్ చేసింది.కొన్నిరోజుల క్రితమే షర్మిల-సుధాన్ డేటింగ్ సంగతి బయటపడింది. ఇప్పుడు సదరు రూమర్స్ నిజం చేస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న షర్మిల.. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చు. సుధాన్ సుందరం విషయానికొస్తే విజయ్ సేతుపతి 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్) -
ఖుష్బుపై విమర్శలు.. నెటిజన్కు స్ట్రాంగ్ కౌంటర్..!
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ స్టార్స్ సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఖుష్బు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పెళ్లి కూతురైన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆమె షేర్ చేసిన కొద్ది నిమిషాల్లో విమర్శలొచ్చాయి. వాటిపై ఖుష్బు సైతం తనదైన శైలిలోనే స్పందించింది. ఇంతకీ ఏంటా వివాదం? ఎందుకు విమర్శలొచ్చాయి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.అయితే ఈ శనివారం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మరణించారు. ఈ విషాద సమయంలో ఖుష్బు సుందర్ తన కుమార్తె పెళ్లి ఫోటోలు షేర్ చేయడంపై కొందరు విమర్శలు చేశారు. గోవాలో జరిగిన తమ కుమార్తె వివాహంలో భర్త సుందర్తో ఉన్న ఫ్యామిలీ ఫోటోపై ట్రోల్స్ చేశారు. డైరెక్టర్ భాగ్యరాజ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్న విషాద సమయంలో ఈ పోస్ట్ అవసరమా? అంటూ ఖుష్బును ప్రశ్నించారు.దీనికి ఖుష్బు సైతం తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. మీరు నన్ను ఎందుకు అనుసరిస్తున్నారు?? కేవలం విమర్శించడానికేనా?? నా కూతురికి పెళ్లి జరిగి 48 గంటలు కూడా కాలేదు. మీకు అంత కష్టంగా ఉంటే, నన్ను అనుసరించడం మానేయండి. మీలాంటి వాళ్లు లేకుంటేనే నేను బాగుంటా. నా లైఫ్లో సంతోషంగా ఉండే హక్కు నాకు ఉందంటూ అతనికి ఘాటూగానే బదులిచ్చారు.భాగ్యరాజ్కు ఖుష్బు నివాళి..అయితే తనపై విమర్శలు ఎదురైనప్పటికీ.. ఖుష్బు సుందర్ తన ఇన్స్టాగ్రామ్లో భాగ్యరాజ్కు నివాళులర్పించారు. ఆయన ఫోటోను పంచుకుంటూ గుర్తు చేసుకన్నారు. మీరు ఇకపై విశ్రాంతి తీసుకోండి సర్. మీతో గడిపిన నా సరదా క్షణాలు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతాముంటూ పోస్ట్ చేశారు. కాగా.. భాగ్యరాజ్ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఐదు దశాబ్దాలకు కోలీవుడ్లో పనిచేశారు. -
ఇంతలో ఎంతలా మారిపోయారో? ఫొటోలు వైరల్
కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తిండి, ఫిట్నెస్ చాలా అవగాహన పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లే బరువు తగ్గుతూ సన్నగా మారిపోయి షాకిస్తున్నారు. ఇప్పుడు అలానే నటి ఖుష్బూ ఫ్యామిలీ కూడా మారిపోయింది. గతేడాది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పటికీ ఇప్పుడు మరోసారి సదరు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఖుష్బూ తర్వాతి కాలంలో దర్శకుడు సుందర్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుళ్లు పుట్టారు. అయితే 2020 టైంలో వీళ్ల కుటుంబంలో అందరూ బొద్దుగా ఉండేవారు. దీంతో ఖుష్బూ కూతుళ్లపై ట్రోలింగ్ కూడా జరిగింది. తర్వాత కాలంలో బరువు తగ్గడంపై దృష్టి పెట్టి అంతా ఒకేసారి తగ్గిపోయి షాకిచ్చారు.గతేడాది వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటోతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు కూతురు అవంతిక పెళ్లి సందర్భంగా మరోసారి అప్పుడలా ఉండేవారు ఇప్పుడిలా మారిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ నటి ఫ్యామిలీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అవంతిక.. శ్రవణ్ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంది. గోవాలో జరిగిన ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ) -
భాగ్యరాజ్కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
'మండాడి' మేకింగ్ వీడియో.. రా అండ్ రస్టిక్ లుక్లో సుహాస్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మండాడి'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీస్తుండగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. కత్తి పట్టుకుని కనిపించాడు. ఈ మూవీలో సాట్ట పులి పాత్రని సుహాస్ చేశాడు.(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ) -
ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఖుష్బూ.. పెళ్లి ఫొటోలని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)'ప్రస్తుతం మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కుటుంబమే ఎప్పుడూ మా జీవితంలో అత్యంత విలువైనది. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయిస్తారని మేం నమ్ముతాం. మా కుమార్తె అవంతిక, శ్రవణ్ల వివాహం మా జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల ప్రేమాభిమానాల మధ్య ఈ వివాహ వేడుక ఎంతో ఆత్మీయంగా జరిగింది. వధూవరుల కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక నిర్వహించాం''కొన్ని సందర్భాల్లో అత్యంత అందమైన క్షణాలు మనకు అత్యంత దగ్గరైన వారితో కలిసి గడిపేవే. అవంతిక, శ్రవణ్లు తమ వైవాహిక జీవితంలో ఆనందం, అనుబంధం, ప్రేమతో కూడిన చిరకాల సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాం. వారిద్దరికీ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, శుభాకాంక్షలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం" అని ఖుష్బూ దంపతులు తమ పోస్టులో రాసుకొచ్చారు. అవంతిక ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అజిత్ కొత్త సినిమా.. ఆ విషయంలో నో క్లారిటీ..!
సినిమాల వల్ల నిర్మాతలకు లాభమా? నష్టమా? అన్న ప్రశ్నకు రకరకాల బదులు వస్తుంది. ఒక పక్క చిత్ర పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో నెట్టబడుతోంది అనే వేదన వినిపిస్తోంది. మరో పక్క కోట్లు కొల్లగొడుతున్నాయి అనే ప్రచారాన్ని ఊదరగొడుతుండం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా కొత్త నిర్మాతలు వస్తూనే ఉన్నారు. చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల స్టార్ హీరో హీరోయిన్ల చిత్రాలు లాభాల్లో షేర్ విధానంలో నటించాలనే డిమాండ్ నిర్మాతల మండలి నుంచి పెరుగుతోంది.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించి ఏడాదిన్నర అవుతోంది. గతేడాది వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తర్వాత మరో చిత్రం ప్రారంభం కాలేదు. ఆయన 64వ చిత్రానికి దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథను సిద్ధం చేసి చాలా నెలలే అయ్యింది. త్వరలోనే చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది.అయితే సమస్య అంతా అజిత్ రెమ్యునరేషన్తో అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అజిత్ రూ.180 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత పారితోషికం ఇస్తే చిత్రం వర్కౌట్ కాదని రోమియో పిక్చర్స్ అధినేత రాహుల్.. అజిత్ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే ఆయన విజ్ఞప్తిని అజిత్ నిరాకరించారన్న టాక్ కోలీవుడ్లో వైరల్గా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు అజిత్ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం అజిత్ కుమార్ కారు రేసులతో బిజీగా ఉన్నారు. రేస్ పూర్తయ్యాక చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత అజిత్ కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి స్వీయ నిర్మాణంలో చిత్రం చేయనున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. మరి అజిత్ నిర్మాతగా మారతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
సీఎం విజయ్ కాదు.. రియల్ లైఫ్ హీరో..!
తమిళనాడు సీఎం విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకున్నారు. సీఎంగా విజయ్ మానవత్వం చాటుకున్నారు. ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తాను కూడా ఒక మనిషేనని నిరూపించారు.విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రం కోసం ఒక గర్భిణీ స్త్రీ కూడా హాజరైంది. అయితే ఆమెను వేదికపైకి పిలవకుండా విజయ్ స్వయంగా వెళ్లి ఆమెకు అందించారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ మానవత్వాన్ని మరువలేదని నిరూపించారు. ఒక గర్భిణీ పట్ల విజయ్ చూపిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. పూర్తి మెజారిటీ రాకపోయినా కొన్ని పార్టీల మద్దతుతో సీఎం అయ్యారు. BREAKING: A Heartwarming Gesture by Tamil Nadu Chief Minister Joseph Vijay. Instead of asking her to come up to the stage, he stepped down from the stage and personally handed the very first appointment order to a pregnant woman. A small gesture that spoke volumes. pic.twitter.com/GTZgd20MYW— Actor Vijay Team (@ActorVijayTeam) June 24, 2026 -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా అవతార్ 3, బ్లాస్ట్ తదితర చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో: రష్మిక)'బ్రేక్ ఫాస్ట్' తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా. రానవ్, రోస్మిన్, కృతిక్ మోహన్, అమిత రంగనాథ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలు జీవితాలని ఎలా నాశనం చేస్తాయనే విషయాన్ని ఇందులో చూపించారు.'బ్రేక్ ఫాస్ట్' విషయానికొస్తే.. లక్ష్మి, ఆమె భర్త (కృతిక్ మోహన్) పెళ్లయిన కొన్ని నెలలకే మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. న్యాయస్థానం వీళ్లని కౌన్సిలర్ (కస్తూరి) దగ్గరకు పంపిస్తుంది. అక్కడ కూడా వీరిద్దరూ విపరీతంగా గొడవ పడుతుంటారు. ఇది చూసిన కౌన్సిలర్.. వీరి కళ్ళు తెరిపించడం కోసం గతంలో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ల స్టోరీ చెబుతుంది. అందులో శంతను (రానవ్) అనే యువకుడు జానవి(రోస్మిన్)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే జానవి తన తండ్రి (సంపత్ రాజ్) కంపెనీలో ప్రియుడిని చేర్చుతుంది.తన ప్రేమ ఇష్టం లేని తండ్రిని జానవి జైలుకి పంపిస్తుంది. శంతనుని పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొద్దిరోజులకే గొడవలు, శారీరక హింస వస్తాయి. ఒక బాబు పుట్టినప్పటికీ రిలేషన్ మరింత దారుణంగా తయారవుతుంది. ఇంతకీ కౌన్సిలర్ చెప్పిన ఆ పాత జంట కథకు, ప్రస్తుతం విడాకులకు సిద్ధమైన లక్ష్మి దంపతులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?) -
ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ
తమిళ ప్రముఖ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటీవలే దర్శకుడు, నిర్మాతగా మారిన ఈయన.. రవి మోహన్ స్టూడియోస్ పతాకంపై యోగి బాబు హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. తానే హీరోగా మరో సినిమా తీస్తున్నాడు.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)మరోవైపు తన భార్య ఆర్తితో మనస్పర్థల కారణంగా విడాకులు కోరుతూ కొన్నాళ్ల క్రితం రవి మోహన్ కోర్టుకి వెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరో ఇంట్లో చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. నీలాంగరై పోలీస్ స్టేషన్లో రవి మోహన్ ఫిర్యాదు చేశాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఫిర్యాదులో పొందుపరిచాడు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని తనతో చెప్పినట్లు రవి మోహన్.. మీడియాకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'పాప్కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!) -
సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు
సౌత్ సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తమన్నా మాట్లాడుతూ.. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో ఒకింత పురుషాధిక్యత కనిపిస్తుంది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారు. అయితే బాలీవుడ్లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే.. తమన్నా కెరీర్లో టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ స్టేటస్, భారీ పారితోషికంతో పాటు అభిమానుల నుంచి ఆదరణ కూడా వచ్చింది. ఇవన్నీ ఆమెకు దక్షిణాదే ఇచ్చాయి. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే జాబితాలో చేరిందని సినీ వర్గాలు అంటున్నాయి. -
హీరోయిన్ త్రిష సర్ప్రైజ్.. సీఎం విజయ్కు విషెస్..!
హీరోయిన్ త్రిష అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ రోజే దళపతి విజయ్ను అన్ఫాలో చేసిన ముద్దుగుమ్మ.. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవన్నీ విలువైనవిగా చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కానీ ఈనెల 22న సీఎం విజయ్ బర్త్ డే కాగా.. ఒక రోజు ఆలస్యంగా విష్ చేయడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. తాజాగా ఇవాళ విజయ్కు పుట్టినరోజు విషెస్ చెప్పడం మరోసారి హాట్టాపిక్గా మారింది.త్రిష పేరు వైరల్..హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరలైంది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారనే రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
టీనేజ్లో చేసిన పనికి నాన్న కోప్పడ్డారు: శృతిహాసన్
కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే రామ్ చరణ్ పెద్ది మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది ముద్దుగుమ్మ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోన్న శృతిహాసన్.. తాజాగా అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.ఈ సెషన్లో పాల్గొన్న నెటిజన్స్ శృతికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిలో ఓ ఆసక్తికర ప్రశ్న కూడా ఎదురైంది. మీరు బొడ్డుకు పియర్సింగ్ ఉందా?.. ఎప్పుడు చేయించుకున్నారు అని అడిగింది ఓ నెటిజన్. దీనికి శృతిహాసన్ కూడా బదులిచ్చింది. అవును, ఉంది. నాకు 19 ఏళ్ల వయసులో చేయించుకున్నానని తెలిపింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి నాన్న నాపై చాలా కోపంగా ఉన్నారని వెల్లడించింది.అంతేకాకుడా తన జుట్టు సంరక్షణ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది. జుట్టు సంరక్షణ, స్టైలింగ్ కోసం తరచుగా సెలూన్లకు వెళ్తారని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది. తాను ఐదేళ్లుగా హెయిర్ సెలూన్కు వెళ్లలేదని శృతి వెల్లడించారు. చివరిసారిగా నా జుట్టుకు 2017లో రంగు వేసుకున్నానని తెలిపింది. నా జుట్టును నేనే కత్తిరించుకుంటా..నేనే ట్రీట్మెంట్ చేసుకుంటానని సమాధానమిచ్చింది. తరచుగా సెలూన్లకు వెళ్లడంపై ఆధారపడటం కంటే తన జుట్టు సంరక్షణను తానే చూసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.ఇక శృతి సినిమాల విషయానికొస్తే ఆమె ఇటీవలే 'పెద్ది' చిత్రంలోని ఐటమ్ సాంగ్లో కనిపించింది. ప్రస్తుతం మైస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కనిపించనున్నారు. -
టాలీవుడ్లో హిట్ టాక్.. అక్కడ కూడా సింగ్ గీతం రిలీజ్
ఇటీవలే టాలీవుడ్లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.టాలీవుడ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. From our hearts to the big screen...#SingGeetham releases on June 26th ❤️All set for a Grand Tamil Nadu Release through @agscinemas 🔥#SingGeethamFromJune26#SingeethamSrinivasaRao @ThisIsDSP @nagashwin7 @archanakalpathi @aishkalpathi @Nivetha_Tweets @23_rahulr… pic.twitter.com/sNAkVFmIiC— AGS Cinemas (@agscinemas) June 23, 2026 -
ఆ విషయంలో ఫెయిల్.. నాకు ముందే తెలుసు: కరుప్పు డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో సూర్య నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే ఈ సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ షాట్స్ ఓటీటీలో నిరాశపరిచాయని పలువురు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. వీటిపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. తాజాగా ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విజువల్ ఎఫెక్ట్స్ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు.. దీనిపై నేను చాలాసార్లు మాట్లాడానని అన్నారు. వీఎఫ్ఎక్స్లో లోపాలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ.. భవిష్యత్ ప్రాజెక్టులలో మెరుగైన ఫలితాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.వీఎఫ్ఎక్స్ గురించి వివరిస్తూ..' ఈ షాట్స్లో కొన్ని సన్నివేశాలు పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. వాటి కోసం సీజీఐ కంపెనీలకు ముందస్తు చెల్లింపులు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని చెల్లింపుల షెడ్యూళ్లను.. నిర్మాణ కాలపరిమితులను మా టీమ్ పాటించలేకపోయింది. అవే తుది ఫలితంపై ప్రభావం చూపాయి. 'సింగం' ఫైట్ సీక్వెన్స్ సీన్ను పూర్తి చేయడానికి మేము వీలైనన్ని తక్కువ షాట్లను ఉపయోగించాం. సినిమా ఓటీటీకి వచ్చాక ప్రేక్షకులు లోపాలను గమనిస్తారని మాకు ముందే తెలుసు ఓటీటీ విడుదల తర్వాత ప్రజలు ఎత్తి చూపినవి కొన్ని మాత్రమే. థియేటర్లలో చూసినట్లే ఓటీటీలో కూడా మమ్మల్ని ప్రశంసిస్తూ, సినిమాను ఆస్వాదిస్తున్నారు' అని అన్నారు.ఈ చిత్రాన్ని ప్రధానంగా థియేటర్లో అనుభూతి కోసమే రూపొందించామని ఆర్జే బాలాజీ తెలిపారు. మీరు ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూసినప్పుడే వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని చూస్తారని అన్నారు. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి.. కానీ ఆ తప్పులను పట్టించుకోకపోవడం కూడా సినిమాలో ఒక భాగమేనని ఆయన అన్నారు. ప్రేక్షకులకు కంటే ముందే మా తప్పుల గురించి తెలుసని అన్నారు. ఓటీటీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పోస్ట్ చేస్తున్న స్క్రీన్షాట్ల కంటే.. నేను అంతకంటే చాలా ఎక్కువ స్క్రీన్షాట్లు తీసుకున్నానని తెలిపారు. ఇది ఒక పొరపాటు.. మిమ్మల్ని నిరాశపరిచినందుకు ఓటీటీ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా.. వచ్చేసారి మేము మరింత మెరుగ్గా చేస్తామని పేర్కొన్నారు. -
తల్లి కాబోతున్న ప్రముఖ మహిళా యాంకర్
తమిళంలో యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక శుభవార్త చెప్పేసింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే సరదాగా డ్యాన్స్ చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)యాంకర్ ప్రియాంక.. చాన్నాళ్ల పాటు ప్రేమించిన ప్రవీణ్ కుమార్ని 2016లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. మరి ఏమైందో ఏమోగానీ 2022లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ప్రియాంక.. గతేడాది డీజే వశిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఈమె సోషల్ మీడియాలో వెల్లడించింది.గతంలో బిగ్బాస్ షోలోనూ పాల్గొన్న ప్రియాంక.. కొద్దిలో ట్రోఫీ చేజార్చుకుంది. రన్నరప్గా నిలిచింది. పలు టీవీ షోలు బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: శుభవార్త.. తల్లిదండ్రులయిన టాలీవుడ్ హీరోహీరోయిన్) View this post on Instagram A post shared by Priyanka Deshpande (@priyankapdeshpande) -
మరో ఆఫర్ కొట్టేసిన బేబి
'బేబి' సినిమా అనగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య గుర్తొస్తుంది. ఒక్క మూవీనే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఫోకస్ అంతా తమిళంపై పెట్టింది. ఇంతకు ముందే అజిత్ హీరోగా నటించిన 'వలిమై'తో తమిళ ఎంట్రీ ఇచ్చింది కానీ అందులో చిన్న పాత్ర మాత్రమే చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్గా అవకాశాలు అందుకుంటోంది.సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్ కుమార్కు జంటగా వైష్ణవి నటిస్తోంది. చిత్రమైన సినిమాలు తీసే విఘ్నేష్ కార్తీక్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు తిట్టం ఒండ్రు, అడియే, హాట్ స్పాట్ 1,2 మూవీస్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ దీనిని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడట. మరోవైపు ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలోనే వైష్ణవి చైతన్య ఓ హీరోయిన్గా చేస్తోంది. -
రజనీ, సూర్య, ధనుష్తో సినిమాలు చేసి.. ఇప్పుడేమో
వైవిధ్యభరిత సినిమాలు తీసిన తమిళ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు. 2012లో 'పిజ్జా' మూవీతో డైరెక్టర్ అయ్యాడు. వరుస చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది సూర్యతో 'రెట్రో' తీస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అంతకు ముందు 'జిగర్తండా డబులెక్స్' పర్లేదనిపించింది. కాగా చిన్న గ్యాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ డైరెక్షన్ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తీయబోతున్నాడు. ఇందులో అధర్వ హీరో. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా హీరోకి తండ్రిగా కనిపించనున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో రజనీకాంత్తో 'పెట్టా', సూర్యతో 'రెట్రో', ధనుష్తో 'జగమే తంత్రం', విక్రమ్తో 'మహాన్' లాంటి మూవీస్ చేసి.. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోతో చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
సగం రెమ్యునరేషన్కే సినిమా చేసిన స్టార్ కమెడియన్
సాధారణంగా నటీనటులు ఎవరైనా సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. కానీ కొన్నిసార్లు మాత్రం పారితోషికం తగ్గించుకోవడం లాంటివి చేస్తుంటారు. తాజాగా స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ ఓ మూవీకి మాత్రం సగం రెమ్యునరేషన్ తీసుకుని చేశాడు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)నటుడు ఆర్జున్దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్సిటీ. యోగిబాబు, వీటీవీ.గణేశ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. హరీష్ దురైరాజ్ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఈ శుక్రవారమే(జూన్ 26) తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యోగిబాబు.. దర్శకుడు హరీష్తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, ఆయన శ్రమ, అంకితభావం చూసి తను దర్శకుడు కావాలనేది తన కోరిక అని చెప్పారు.దర్శకుడు హరీష్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా దర్శకుడిని కావాలని అనుకున్నానని, దర్శకుడిగా అవకాశం రాగానే ఇందులో యోగిబాబును నటింపజేయాలని అనుకున్నానని.. ఆయన సగం పారితోషికంతోనే ఇందులో నటించినట్లు చెప్పారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు?) -
సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. మరోవైపు వరసగా సినీ ప్రముఖులని కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు కీలక పదవి కట్టబెట్టడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసని తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్గా నియమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. మనోజ్ ఒకప్పుడు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నారు. తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఖాళీ సమయాల్లో సినిమాటోగ్రఫీకి సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహించడం, క్లాసులు చెప్పడం లాంటివి మనోజ్ పరమహంస చేస్తుంటారు. విజయ్ హీరోగా నటించిన స్నేహితుడు, లియో, బీస్ట్ సినిమాలకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఈయనకు పదవి ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విజయ్ తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.ఇకపోతే మనోజ్ పరమహంస తెలుగులో.. రేసుగుర్రం, ఏ మాయ చేశావె, బ్రూస్ లీ, రాధేశ్యామ్, గుంటూరు కారం, హరిహర వీరమల్లు, ఓజీ తదితర సినిమాలకు పనిచేశారు. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవముంది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) -
నా భర్త నుంచి ప్రాణహాని.. నటుడి మొదటి భార్య ఫిర్యాదు
తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి పరుత్తివీరన్(తెలుగు మల్లిగాడు) సినిమా ఫేమ్, ప్రముఖ నటుడు శరవణన్ కారణమని.. ఆయన మొదటి భార్య సూర్యశ్రీ చెన్నై మౌళివాక్కం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. 1990లో తమిళ ఇండస్ట్రీలో హీరోగా చేసి, తర్వాత పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించిన శరవణన్.. 2003లో సూర్యశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2019లో శ్రీదేవి అనే మరో మహిళని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మంగాడు సమీపంలోని ఒకే అపార్ట్మెంట్లోని ఎదురెదురు ఇళ్లలో మొదటి, రెండో భార్యతో కలిసి శరవణన్ నివసిస్తున్నాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)సీసీటీవీ కెమెరాల తొలగింపుతో తనకు ప్రాణహాని ముప్పు ఏర్పడిందనే భయాందోళన వ్యక్తం చేస్తూ సూర్యశ్రీ తన లాయర్లతో కలిసి మౌళివాక్కం పోలీస్ స్టేషన్లో భర్తపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారని, ఇప్పటికే తనపై పలుమార్లు దాడులు చేశారని ఇందులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు తీసేసి తన ప్రాణానికి భయం కల్పించారని.. తనకు, తన ఆస్తికి ఏ హాని జరిగినా దానికి శరవణన్ పూర్తి బాధ్యుడని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై మౌళివాక్కం పోలీసులు ఇరు పక్షాలని పిలిపించి విచారణ చేస్తున్నారు.(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ) -
హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్
మెగా ఫ్యాన్స్ని భయపెట్టిన దర్శకుల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు శంకర్. గతంలో ఒకే ఒక్కడు, జెంటిల్మన్, రోబో లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ఈయన.. గత కొన్నేళ్లలో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్నాడు. రామ్ చరణ్తో తీసిన 'గేమ్ ఛేంజర్', కమల్ 'ఇండియన్ 2' ఫలితాల దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి ఈయన వారసుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)డైరెక్టర్ శంకర్కి ముగ్గురు పిల్లలు. అందులో ఇదరమ్మాయిలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇప్పటికే పెళ్లయిపోయింది. తర్వాత పుట్టిన అదితీ ఇప్పటికే హీరోయిన్గా సినిమాలు చేసింది. కార్తీ, శివకార్తికేయన్ లాంటి హీరోలతో కలిసి పనిచేసింది. 'భైరవం' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వీళ్ల తర్వాత పుట్టిన కొడుకు అర్జిత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.'లవర్ బాయ్' పేరుతో ఓ సినిమా ప్రారంభమైంది. కృతి శెట్టి హీరోయిన్. చెన్నైలో గురువారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అశోక్ కుమార్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. జన నాయగణ్, టాక్సిక్, చిరు-బాబీ సినిమాలని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.(ఇదీ చదవండి: 'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే) -
రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్-2 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు రజనీ మాజీ అల్లుడు ధనుష్ తన 55వ చిత్రాన్ని కూడా దీపావళి టార్గెట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే.. కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు మామఅల్లుళ్లు.. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారన్నమాట.నిజానికి జైలర్-2 సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. అయితే రీషూట్స్ కారణంగా సినిమా పలుమార్లు డిలే అవుతూ వచ్చింది. ఇక అలా వాయిదాలు పడుతూ ఆకరికి దీపావళి బరిలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అటు ధనుష్ మాత్రం తన సినిమా ప్రారంభం నుంచి అక్టోబర్ నెల రిలీజ్ టార్గెట్ గానే తన సినిమాను రెడీ చేస్తున్నాడు.ఈ విషయంలో ప్రాక్టికల్గా చూసుకుంటే సూపర్స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్తో ధనుష్ పోటీ పడే అవకాశం లేదు. కానీ వీళ్ల మధ్య ఉన్న పాత బంధం కారణంగా ఈ బాక్సాఫీస్ క్లాష్ అందర్నీ ఆకర్షించే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ధనుష్ తన సినిమాని థియేటర్లలోకి తెచ్చేంత సాహసం చేయడంటున్నారు మరికొంతమంది. ధనుష్ సినిమాలన్నీ కూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతాయి. దాంతో బరిలో రజనీకాంత్ ఉన్నా ధనుష్ తగ్గకపోవచ్చని అంటున్నారు మరికొంతమంది. చూడాలి ఈ ఆసక్తికర పోరులో చివరికి ఏమౌతుందో.రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ 2004లో వివాహం చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో వారి 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడిచి 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అనంతరం 2024లో కోర్టు వీళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. -
ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని''సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు. ఆయనని డార్లింగ్ అని పిలుస్తూ అందుకు గల కారణాన్ని కూడా చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)'ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్కి. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో డార్లింగ్ అనే పిలుస్తున్నాను. లయోలా కాలేజీ రోజుల నుంచి, మీతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆ పిలుపు మారలేదు. ఎన్నో అటుపోట్లు, విమర్శలు తట్టుకుని మీరు సూపర్స్టార్గా ఎదగడం చూశా. ఇప్పుడు మీరు తమిళనాడు సీఎం కావడం ఆనందంగా ఉంది. మీ హోదా, పదవి మారి ఉండొచ్చు గానీ మీరు ఏ మాత్రం మారలేదు. కళైంజ్ఞర్ అయ్య నుంచి జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుంచి ఉదయ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలిచే అదృష్టం నాకు దక్కడం స్పెషల్గా అనిపిస్తోంది. ఎప్పటికీ నేను మీ అభిమానినే''మిమ్మల్ని కలిసే సందర్భంలో బొకే, శాలువా ఇవ్వకుండా ఆ మొత్తాన్ని ఆర్థికంగా వెనకబడిన ముగ్గురు ఆడపిల్లల చదువు కోసం మీ పేరుతో సాయం చేస్తున్నాను. ఆ పిల్లలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారనే నమ్మకం నాకుంది. మీ పదవీకాలంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళనాడుకు ఉత్తమ భవిష్యత్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విశాల్ రాసుకొచ్చాడు. సాయం అందుకున్న పిల్లల పేర్లు కూడా తన ట్వీట్లో చేర్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)Dearest darling CM Vijay @CMOTamilnadu The word “darling “ hasn’t changed which I used to call u for the last so many years since i knew u from Loyola college. It all started wen I got to know you as a budding star and then seeing u rise up the ladder as the SUPERSTAR facing… pic.twitter.com/iTLAeCZ3cp— Vishal (@VishalKOfficial) June 16, 2026 -
ఓటీటీకి రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.బ్లాస్ట్ కథేంటంటే..'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా. #ArjunSarja #Abhirami & #PreityMukundan in Blockbuster Action Movie #Blast Coming to Netflix on 25th June... #BlastOnNetflix pic.twitter.com/48kX1z7Hjp— The South Movies (@TheSouthMovies1) June 16, 2026 -
జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిక అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం తన స్నేహితుడికి సాయం చేయాలని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన జీవీ ప్రకాశ్ తన తరఫున చిన్న సాయం అంటూ రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ జీవీ ప్రకాశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ మూవీకి సంగీమందించనున్నారు. అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వస్తోన్న చిత్రానికి పని చేయనున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. రోటీన్కు భిన్నంగా బీచ్లో మ్యూజిక్ కొడుతూ అనౌన్స్ చేశారు. ఇందులో కూడా అనిల్ రావిపూడి తనలోని క్రియేటివిటీని చూపించారు. ఈ సినిమాకు అనంత శ్రీరామ్ లిరిసిస్ట్గా పని చేయనున్నారు. Best of luck a small help from my side . Hope it’s authentic pic.twitter.com/9SYOjM2ohk— G.V.Prakash Kumar (@gvprakash) June 16, 2026 -
12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్
మన జీవితంలో కుటుంబం తర్వాత స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. చాలామంది ఫ్రెండ్స్ని కూడా తమ ఫ్యామిలీలో ఒకరిగానే చూస్తుంటారు. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా తన స్కూల్ ఫ్రెండ్ అరవింద్ని అలానే గుర్తుపెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన అరవింద్.. అనిరుధ్లోని మ్యూజిక్ టాలెంట్ని గుర్తించాడు. స్టార్ డమ్ రాకముందే అనిరుధ్ దగ్గర సౌండ్ ఇంజినీర్గానూ పనిచేశాడు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2014లో గుండెపోటుతో అరవింద్ చనిపోయాడు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఫ్రెండ్ చనిపోయిన బాధని మనసులో దాచుకున్న అనిరుధ్.. తన తొలి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ సాంగ్ని స్నేహితుడికి అంకితమిచ్చేశాడు. 'అరవింద్' పేరుతోనే రీసెంట్గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. వేగంగా మారుతున్న ఈ డిజిటల్ మ్యూజిక్ రంగంలో నిలదొక్కుకోవడానికి పోరాడే ఒక స్వతంత్ర కళాకారుడి సవాళ్లని ఈ అరవింద్ మ్యూజికల్ ఆల్బమ్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇదని అనిరుధ్ చెప్పాడు.2012లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రం '3' కోసం రూపొందించిన వై దిస్ కొలవెరి డి పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్.. ఇటీవల జైలర్, విక్రమ్, కూలీ, లియో, దేవర, జవాన్ తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించి రాక్స్టార్గా పేరు సంపాదించాడు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ) -
సీఎంగా విజయ్.. 12 ఏళ్ల తర్వాత త్రిషకు కలిసిరానుందా?
ఏదైనా కొత్త సినిమాలు ఏడాదికో, రెండేళ్లలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే అది కాస్తా మూడు నుంచి నాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ది భారీ బడ్జెట్ మూవీస్ సైతం అనుకున్న టైమ్లోనే విడుదలైన సందర్భాలే ఎక్కువ. కానీ షూటింగ్ పూర్తై ఐదు నుంచి పదేళ్లయినా కూడా రిలీజ్ కానీ చిత్రాలు రిలీజ్కు నోచుకోలేదంటే చాలా కారణాలే ఉండొచ్చు. ఈ జాబితాలో విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం దాదాపు 8 ఏళ్లవుతున్న విడుదల కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవలే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్కు మరో నెల రోజుల సమయం కోరాడు.మరి ఒక సినిమా విడుదలకు ఇదే చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ అంతకు మించి రిలీజ్ కాకుండా ఆగిపోయిన మూవీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నటించిన చిత్రం కావడం మరో విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇటీవల రాజకీయ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే గతంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శతురంగ వట్టై-2 ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2014లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్థిక సమస్యల వివాదంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరవింద్స్వామి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ నిర్మల్కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్ వినోద్ కథ అందించారు.అయితే తాజాగా ఈ మూవీ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట ఉన్న క్రేజ్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సీఎం అయ్యాక ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆమెకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో చిత్రీకరణ పూర్తయిన తర్వాత పుష్కర కాలానికి త్రిష మూవీ రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..!
కోలీవుడ్ స్టార్స్ సినిమాలతో పాటు పాలిటిక్స్ వైపు దూసుకెళ్తున్నారు. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం అయ్యారు. అదే స్ఫూర్తితో రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. విజయ్ పార్టీలో చేరతారా? లేదా అన్నదానిపై రాబోయే రోజుల్లో తెలియనుంది.ఇదిలా ఉండగానే మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన జీవీ ప్రకాశ్ కుమార్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నారు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనతో భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని హింట్ ఇచ్చారు జీవీ ప్రకాశ్. తాజా ఇంటర్వ్వూలో ఈ కామెంట్స్ చేశారు.ఇటీవలే రాఘవ లారన్స్, రజినీకాంత్ అల్లుడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. లారెన్స్ ఇప్పటికే ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ సంకేతాలిచ్చారు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ.. తమిళనాట రాజకీయాలను శాసించనుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
సీఎంగా తొలి బర్త్ డే.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ప్రియులను ఎక్కువగా భయపెట్టిన చిత్రాల్లో ఈ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. రాఘవ లారెన్స్ తన నటన, గాంభీర్యంతో ఆడియన్స్ను భయపెట్టిన తీరు ఆకట్టుకుంది. కాంచన సిరీస్లో వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ సిరీస్లో కాంచన-4 కూడా వచ్చేస్తోంది. ఈ మూవీతో రాఘవ లారెన్స్ బిజీగా ఉన్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్కు ఆమెను ఎంపిక చేశారని టాక్. ఈ హారర్ కామెడీ చిత్రంలో నయన్ పాత్ర హైలెట్గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్లో చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కరుప్పు బ్లాక్ బస్టర్.. సూర్య పై కన్నేసిన రావిపూడి
-
ముగిసిన భారతీ రాజా అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి
దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్హౌస్కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్హౌస్కు తరలివచ్చారు.అంతకుముందు సీనియర్ హీరోయిన్ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.VIDEO | Tamil Nadu: Actor Suhasini Maniratnam pays tributes to Bharathiraja in Theni, says “He changed the colour and character of Tamil cinema”.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/VkhkLxtFst— Press Trust of India (@PTI_News) June 11, 2026 -
విశాల్ త్రిపాత్రాభినయం.. మకుటం యాక్షన్ టీజర్ రిలీజ్
విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టీజర్లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు. -
రాజకీయాల్లోకి సూపర్ స్టార్ అల్లుడు.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని రుజువైంది. ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్కు మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎంజీఆర్ కూడా సినీ రంగ నుంచే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈనెల 12న పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారు. అయితే తాజాగా సూపర్స్టార్, తలైవా అల్లుడు వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో కలిసి అడుగులు వేయనున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కె. అన్నామలై కొత్తగా ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమంలో వైశాగన్ పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ తమిళనాడుతో ఆసక్తికరంగా మారింది. ఇది రజినీకాంత్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం అన్నామలై ద్రవిడ నాట సరికొత్త రాజకీయశక్తిగా అవతరించనున్నారు. రజినీకాంత్ అల్లుడు వైశాగన్ అన్నామలే ఉద్యమంతో చేరడంపై తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. సూపర్స్టార్ రజనీకాంత్తో ఆయనకున్న సంబంధం.. తమిళనాడులో వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల ఆయన రాజకీయ ఎంట్రీపై ప్రజల్లో చర్చ మొదలైంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలకు వైశాగన్ చేరిక బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గతంలో రజనీకాంత్ స్వయంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాగన్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
తీరని కలగానే మిగిలిపోయింది: సెలబ్రిటీల భావోద్వేగం
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు తారలు భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వెలకట్టలేనిదిభారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.- చిరంజీవి Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026 కలగానే మిగిలిపోయింది: ఖుష్బూమనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్మార్క్ను సెట్ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.- ఖుష్బూ Devastated to know that our most beloved, loved and respected Director, the legendary #BharathiRaaja avl is no longer with us. His demise is a gloomy cloud in tamil cinema. His films have been bench marks and shall continue to be the actual school of film making. He leaves behind… pic.twitter.com/p5a6yhn95y— KhushbuSundar (@khushsundar) June 10, 2026ఆయన శైలి ప్రత్యేకం : పవన్ కల్యాణ్ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.- పవన్ కల్యాణ్నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిఒక శకం ముగిసింది: విశాల్'భారతీరాజా గారితో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మనల్ని విడిచి వెళ్లారన్న వార్త వినడం ఎంతో దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చిన దార్శనికుడు ఆయన. మన గ్రామాలు, ప్రజలు, భావోద్వేగాలలోని అంతరార్థాన్ని వెండితెరపై మరెవరూ చూపించలేనంత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలాంటి పాత్రలను అందించారు. ఆయన సినిమాలు ఎన్నో తరాల దర్శకులకు, నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సృష్టించిన ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుంది.సృజనాత్మక దర్శకులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారికి ఆయన కృషి ఒక నిదర్శనంగా, చలనచిత్ర నిర్మాణంలో ఒక 'బైబిల్' (మార్గదర్శి)గా నిలుస్తుంది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తమిళ సినిమా గొప్ప కథకులలో ఒకరిని కోల్పోయింది. మీతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా #PandiyaNaadu చిత్రంలో తండ్రీకొడుకులుగా కలిసి పనిచేసినప్పుడు మీతో గడిపిన సమయం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.ఈ గొప్ప చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగమేనన్న భావనను ఆ క్షణాల్లో మీరు నాకు కలిగించారు. ఎప్పుడూ ఉత్సాహభరితమైన చిరునవ్వుతో, యువకుడిలాంటి ఉత్సాహంతో మీరు వ్యవహరించిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని విశాల్ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమా టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Shocking and sad to hear the news about our legendary filmmaker, Iyakunarimayam Bharathiraja sir passing away and leaving us all this morning. A visionary who changed the landscape of Tamil cinema forever, he brought the soul of our villages, our people and our emotions to the…— Vishal (@VishalKOfficial) June 10, 2026 గొప్ప పాఠాలుహిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.- కాయల్ దేవరాజ్இயக்குனர் இமயமே! நீ சரியவில்லை;இன்னும் நீ உயரமான இடத்தை நோக்கி சஞ்சரிக்க சென்றுள்ளாய்! என்றும் உன் படைப்புகள் எங்களுக்கு பாடங்கள்!#LegendaryDirector #Bharathiraaja #RIPBharathiraaja Sir pic.twitter.com/ZoP6ozrmAf— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 10, 2026 A director who found poetry in the soil, truth in silence, and soul in every frame. Sharing screen space with Bharathiraja Sir in Thudarum was an honour I will cherish forever.Rest in peace, Sir. Your legacy will continue to inspire generations, and your presence will be deeply… pic.twitter.com/9yP88mLtCO— Mohanlal (@Mohanlal) June 10, 2026 Our @ikamalhaasan sir pays his last respects to ace director and his friend Mr #bharathiraja after he passes away.#ripbharathiraja #kamalhaasan pic.twitter.com/WZtuTMcOku— Kamal Haasan’s Diehard Kamalians (@DiehardKamalian) June 10, 2026இயக்குநர் பாரதிராஜாவுக்கு நடிகர் ரஜினிகாந்த் அஞ்சலி | RIPBharathiraja | Rajinikanth |#RIPBharathiraja | #Rajinikanth | #IyakkunarImayam | #IyakkunarImayamBharathiraja pic.twitter.com/3NnjefQ9OL— Ilaya Bharatham (@IBharatham) June 10, 2026 చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత
సినీ దిగ్గజం భారతీరాజా (84) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. భారతీరాజా మృతితో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు.. పచ్చని పొలాలు అంటే పెయింట్ చేసిన బ్యాక్డ్రాప్లు. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి.. పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండితెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమాను కొత్త దారిలో నడిపించిన ఆయన ప్రభావం తెలుగు సహా దక్షిణ భారత సినిమా మొత్తంపైనా కనిపించింది.సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అయితే కళలపై ఉన్న మక్కువ ఆయనను సినీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఎన్నో కష్టాలు, నిరీక్షణల తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, గ్రామీణ కథలను చూపించే విధానాన్నే మార్చేశారు. అప్పటి వరకు సెట్లలో నిర్మించిన కృత్రిమ గ్రామాలే ఎక్కువగా కనిపించేవి. కానీ భారతీరాజా మాత్రం కెమెరాను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లారు. మట్టి వాసన, పల్లె మనుషుల భాష, వారి ఆనందాలు, బాధలు అన్నింటినీ సహజత్వంతో చూపించారు. అందుకే ఆయనను తమిళ సినీ ప్రపంచం ప్రేమగా "దర్శకుల హిమాలయం"గా అభివర్ణించింది.భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి.. కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే, ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది.దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానూ భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన భారతీరాజా, తన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినప్పటికీ సినిమాపై ప్రేమను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. కెరీర్ చివరి దశలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి, తాత, గ్రామ పెద్ద.. ఇలాంటి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా ఎంత సహజత్వాన్ని చూపించారో, నటుడిగానూ అంతే సహజమైన అభినయంతో మెప్పించారు.భారతీరాజా మరో గొప్ప సేవ ఏమిటంటే.. కొత్త ప్రతిభను వెలికితీయడం. ఆయన చిత్రాల ద్వారా అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత వారు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.కెరీర్భారతీరాజా.. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంట్గా చేరి తన కెరీర్ ఆరంభించారు. పలువురు దర్శకుల దగ్గర పని చేసిన ఈయన 1977లో '16 వయిదినిలే' అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కిళక్కేపోగుమ్ రైలు, సిగప్పురోజాక్కళ్, టిక్ టిక్ టిక్, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.తెలుగులోనూ..తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకిగానూ నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ప్లేను అందించారు. తన సినిమాల ద్వారా రాధ, రాధికా శరత్కుమార్, రేవతి, కార్తీక్ సహా పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక సినిమాలు చేశారు.ఆరు జాతీయ అవార్డులుఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.కరుప్పు కథేంటంటే..మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. god mode ON 🔥 #KaruppuOnPrime, June 12@Suriya_offl @RJ_Balaji @SaiAbhyankkar @dop_gkvishnu @trishtrashers @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy #AnaghaMayaRavi #VikramMor @kalaivananoffl #ArunVenjaramoodu @PraveenRaja_Off @ZeeTamil… pic.twitter.com/VeKFZ4qViA— prime video IN (@PrimeVideoIN) June 8, 2026 -
టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్ఫామ్స్ వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్
మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎందరు దీన్ని పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్ ఠాకుర్ ఇప్పుడే తెలుసుకుందట. ఉత్తరాది భామనే అయినప్పటికీ బాలీవుడ్లో కంటే దక్షిణాదిలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం, హాయ్నాన్న వంటి చిత్రాలు మృణాల్ కెరీర్కి చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామ.. కోలీవుడ్ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉంది.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)ఈ పాటికే హీరో శివకార్తికేయన్తో జోడీ కట్టే అవకాశం ఈమెని వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ మూవీలో నటించలేకపోయింది. తాజాగా ధనుష్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపోతే రీసెంట్గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె.. జీవితంలో నిజమైన ఆనందం గురించి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుందని అనుకున్నా. అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుందని తెలుసుకున్నా. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానిలో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అనేదాని గురించి ఎదురుచూడను. చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్ ఠాకుర్ చెప్పింది.(ఇదీ చదవండి: వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు.. కమెడియన్ మృతి) -
విజయ్ ఆంటోని.. ఏ స్టార్ ఊహించని నిర్ణయం
చాలామంది నటీనటులు, తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాం, తమ జీవితం కళామతల్లికే అంకితం లాంటి మాటలు చెబుతూ ఉంటారు. కొందరు మాత్రమే కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ లిస్టులోకి తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని చేరేలా కనిపిస్తున్నాడు. తన భవిష్యత్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. అంతకు ముందు సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతానికైతే హీరోగా అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'నూరు సామి'. తెలుగులో 'వంద దేవుళ్లు' పేరుతో రిలీజ్ కానుంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో చెన్నై వదిలేసి, పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఏ స్టార్ కూడా తీసుకోడు.'నాకు ఎప్పటినుంచి సాధారణంగా బతకడంపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కారణంగా చెన్నైలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు.. టెంకాశీలో స్థిరపడినట్లు నేను పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో నివసించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఏదైనా గ్రామంలో భూమి కొనేందుకు చూస్తున్నాను. గ్రామ జీవితం నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య అనుబంధం లాంటి మంచి విషయాలు గ్రామాల్లో ఉన్నాయి' అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.ఇకపోతే విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ.. మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. సినిమాలు కూడా చాలా తగ్గించేశాడు. చూస్తుంటే రాబోయే రెండేళ్లలో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి ఏదైనా పల్లెటూరిలో స్థిరపడిపోతాడేమో?(ఇదీ చదవండి: రామ్ చరణ్ని సర్ప్రైజ్ చేసిన కూతురు) -
'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన చివరి సినిమాకు మోక్షం కలగట్లేదు. 'జన నాయగణ్' ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 19న థియేటర్లలో విడుదల పక్కా అని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన 'జన నాయగణ్'.. లెక్క ప్రకారం ఈ ఏడాది జనవరి 9నే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా అప్పటినుంచి అలా ఉండిపోయింది. మధ్యలో నిర్మాతలు కోర్టుకెళ్లారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. మూవీ కూడా లీక్ అయింది. విజయ్ ముఖ్యమంత్రి కావడంతోనే ఇక సినిమా సాఫీగా రిలీజ్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమస్యలు తప్పట్లేదు.ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ రద్దవగా.. తాజాగా థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా రద్దు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ తిరిగిచ్చేయమని నిర్మాతకు హీరో విజయ్ సూచించారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోమని నిర్మాతకు సలహా ఇచ్చారట. ఇప్పుడీ విషయం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త) -
రాఘవ లారెన్స్కి కూతురుందా? ఇప్పుడామె కూడా ఇండస్ట్రీలోకి
రాఘవ లారెన్స్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది డాన్స్. డ్యాన్సర్గా కెరీర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్స్తో స్టెప్పులు వేయించారు. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చే మరో విషయం హారర్ థ్రిల్లర్ సినిమాలు. ముని నుంచి కాంచన 3 వరకు హారర్ థ్రిల్లర్ చిత్రాలతో సెపరేట్ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడీయన వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)లారెన్స్ ప్రస్తుతం 'కాంచన 4' చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో 'బెంజ్' అనే యాక్షన్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇలా కొరియోగ్రాఫర్, హీరో, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న లారెన్స్.. త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వైరల్ అవుతోంది. లారెన్స్.. రాఘవేంద్రస్వామి భక్తుడు అని తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే పేరు పెట్టారు. అయితే ఈమె ఉందనే సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు.ఇకపోతే రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తున్నారు. త్వరలోనే చైన్నెకి తిరిగి వచ్చి, దర్శకురాలిగా కెరీర్ ప్రారంభిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి ఈమె తండ్రిలా హారర్ సినిమాలు తీస్తుందా? లేదంటే వేరే జానర్ ట్రై చేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: త్రిషతో వివాదం.. సీఎం విజయ్కి పార్తీబన్ కానుక!) -
అల్లు అర్జున్- లోకేశ్ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. -
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
సినీ నటి ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి త్వరలో జరగనుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని అతడి స్వగృహంలోనే కలిసి పెళ్లి కార్డ్ అందజేశారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'ఇది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ఆయన నివాసంలోనే కలిసి శ్రీ శ్రవణ్ శ్రీనివాసన్తో జరగనున్న నా కుమార్తె పెళ్లికి ఆహ్వానించాం. విజయ్ను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నా కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్లోనూ విజయ్ ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతో మమ్మల్ని ఆత్మీయంగా పలకరించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!
విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్ను పరామర్శించారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్షాట్లు, ఆమె పెంపుడు కుక్క చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. -
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. -
కమెడియన్ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు
దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.ఆయనలా నటించా..ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.చదువు లేదుఅందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్ నేర్చుకుందామని క్లాసెస్కు వెళ్లాను. అక్కడ ఇన్స్ట్రక్టర్ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. అప్పుడే డిసైడయ్యా..ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్ చేశావ్ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.చదవండి: డోలారే సాంగ్ షూటింగ్లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్? -
నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్కు ఎంత కష్టమొచ్చింది? -
300 కోట్ల క్లబ్ లో కరుప్పు
-
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
వరుస బ్లాక్బస్టర్స్తో స్పీడుమీదున్న ప్రదీప్ రంగనాథన్కు ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) పెద్ద షాకే ఇచ్చింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా అతడి భార్య, హీరోయిన్ నయనతార నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఊహించని ఈ ఫలితానికి విఘ్నేశ్ విస్తుపోయాడు. కనీసం రూ.200-300 కోట్లు వసూలు చేస్తుందనుకున్నానని బాధపడ్డాడు.నెగెటివ్ టాక్థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎల్ఐకేపై ఎందుకు నెగెటివిటీ ప్రచారం చేశారో తెలియడం లేదు కానీ సినిమా అదిరిపోయిందని పలువురు అతడికి మెసేజ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విక్కీ. 'ఆన్లైన్లో ఎల్ఐకే మూవీపై వచ్చిన నెగెటివిటీ చూసి దీన్ని థియేటర్లలో చూడటం మిస్ అయ్యాం అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు.కలలు నాశనంపెద్ద తలకాయల అండదండలు లేని చిన్న సినిమాలపై కొందరు విశ్లేషకులు తమ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని సినిమా చూడనివ్వకుండా నిరాశపరుస్తున్నారు. దర్శకుల కలల్ని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ బలంగానే ఉన్నప్పటికీ ఈ నెగెటివ్ ప్రచారం సినిమాను దెబ్బకొట్టింది. సినిమా ఫలితాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎల్ఐకే అనేది ఒక విభిన్నమైన తమిళ చిత్రం. ఆ కష్టం ఎవరికీ కనపడదుదీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ రావాల్సింది. ఇలాంటి సినిమా తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సినిమాను రూపొందించి, రిలీజ్ చేయడం వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి థియేటర్లవరకు తీసుకొచ్చాను. కానీ, దానికి చివరకు ఇలాంటి ముగింపు రావడం కలిచివేసింది. అయినా కొన్ని గొప్ప సినిమాలు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆదరణకు నోచుకోవు.. కానీ, తర్వాతి కాలంలో అవే క్లాసిక్ చిత్రాలుగా పరిగణించబడతాయి. భవిష్యత్తులో నా సినిమాకు కూడా అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను' అని విఘ్నేశ్ ఎమోషనల్ లేఖను పంచుకున్నాడు.చదవండి: ప్రముఖ సింగర్ ఇక లేరు -
అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఇళయరాజా
సంగీత రంగంలో రారాజుగా వెలుగుతున్న సంగీతదర్శకుడు ఇళయరాజా. తమిళం, తెలుగు మొదలగు భాషల్లో తన ఖ్యాతిని చాటిన ఈయన సంగీత పయనం 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం, ఆదివారం.. రెండు రోజులపాటు చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సంగీత కచేరి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘‘నేను అవార్డుల కోసం వేచి చూసే వ్యక్తిని కాదు. నేను నడిచినా, మాట్లాడినా సాధననే’’ అని ఇళయరాజా పేర్కొన్నారు. సంగీత కచేరిఈ వేదికపై తన ఇద్దరు మనవళ్ల మధ్య కూర్చుని ఇళయరాజా సంతోషంగా కనిపించారు. ముందుగా విదేశీ సంగీత కళాకారులు సింపోనిని వాయించారు. అనంతరం ఇళయరాజా గతంలో సంగీతం అందించిన పాటలను శ్రోతల కోసం వాయించారు. ఇళయరాజా 'పుదియ వార్పుగళ్' చిత్రంలోని 'ఇదయం పోగుదే..' అనే పాటను రూపొందించిన విధానం గురించి, దానికి వాడిన సింపోని గురించి వివరించారు. అతిథులుఈ కార్యక్రమంలో ఇళయరాజా వారసులు యువన్ శంకర్రాజా, కార్తీక్రాజాలతో పాటు దర్శకుడు మిష్కిన్, కార్తీక్ సుబ్బరాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, మారి సెల్వరాజ్, విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్ధ్, పార్తీబన్, సంతానభారతి, ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది సంగీత ప్రియులు ఆనందంతో తరించారు. -
ఎల్సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్కమ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్ డీసీ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. Welcome to the universe @iam_RaviMohan sir 🤗🤗❤️❤️ #Benz @offl_Lawrence @nivinofficial @iamsamyuktha_ @Dir_Lokesh @PassionStudios_ @TheRoute @GSquadOffl @Sudhans2017 @Jagadishbliss @bakkiyaraj_k @SaiAbhyankkar pic.twitter.com/kxF51Vtb9Z— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 31, 2026 -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
అజిత్ కు పరామర్శ.. ఒకే వాహనంలో సీఎం విజయ్, త్రిష
-
కోలీవుడ్లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు
నటి ఐశ్వర్యరాజేశ్ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలును అందుకున్నారు. అక్కడ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అలా తెలుగులో చిత్రాలు చేయడంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ వచ్చింది. కాగా ఇప్పుడు ఇక్కడ మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్–18 అనే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు కిచ్చా సుదీప్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు కార్తీక్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఆర్ ప్రొడక్షన్న్స్ పతాకంపై బి.జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసినందుకు దక్కిన అవకాశం ఈ చిత్రం అని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
హీరో అజిత్ తల్లి కన్నుమూత
చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి మోహిణి మణి (84) చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న అజిత్.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్ తల్లి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అజిత్ కుమార్ తల్లి మోహిని ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయిన అజిత్కు ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.- కమల్ హాసన్ சகோதரர் திரு. அஜித்குமார் அவர்களின் தாயார் திருமதி. மோகினி மணி அவர்கள் மறைந்த செய்தி அறிந்து வருத்தமடைந்தேன். அன்புத் தாயை இழந்து தவிக்கும் அஜித்குமாருக்கும் அவரது குடும்பத்தாருக்கும் எனது மனமார்ந்த ஆறுதல்களைத் தெரிவித்துக்கொள்கிறேன்.— Kamal Haasan (@ikamalhaasan) May 30, 2026 డియర్ అజిత్.. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకర సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను- రాధికా శరత్కుమార్Dear #ajith so sorry to hear of the passing of your mother. Condolences to the family and pray for strength in this sad phase of your life.🙏🙏may she be in peace.— Radikaa Sarathkumar (@realradikaa) May 30, 2026 చదవండి: జూన్లో విడుదలయ్యే సినిమాల జాబితా -
'కూతురి పెళ్లికి తప్పక రండి'.. మోదీకి ఖుష్బూ ఆహ్వానం
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కూతురు అవంతిక పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఖుష్బూ కుటుంబం శుక్రవారం ఢిల్లీలో కలిసింది. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఖుష్బూ- సుందర్ దంపతులు మోదీకి శుభలేఖ అందించారు. ఖుష్బూ దంపతుల వెంట కూతురు అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ సైతం ఉన్నారు. ఈ ఫోటోను ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మోదీకి రుణపడి ఉంటాం'నా కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. శ్రవణ్ శ్రీనివాసన్తో జరగబోయే నా కూతురి పెళ్లికి తప్పక హాజరవాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించాను. కాబోయే దంపతులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ మోదీ మాకు సమయం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ ప్రధానమంత్రిగారు' అని ఖుష్బూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. ఫ్యామిలీఇది చూసిన అభిమానులు ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుర్లు సంతానం. ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అవంతిక యాక్టింగ్పై దృష్టి సారించింది. మలయాళంలో ఆరంభం అనే సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అభిమానిని పట్టించుకోని పూజా.. ఆమె సమాధానమిదే!
సౌత్లోని స్టార్ హీరోయిన్స్లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిందీ బ్యూటీ. తెలుగులోనే ఆమెకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ నిరాశపర్చినా మంచి గుర్తింపయితే తీసుకొచ్చింది. విజయ్తో రెండోసారి జతకట్టిన జననాయకన్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజవనేలేదు. ఎలాగైనా సరే జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీడియో వైరల్ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఓ యువకుడు పూజాతో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటే ఆమె పట్టించుకోలేదని ఓ వీడియో వైరలయింది. దానిపై తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు జీవితాన్నిస్తోంది ప్రేక్షకులేనంది. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో అభిమానులను పట్టించుకోకపోవచ్చని, అలాగని తామేదో పొగరు చూపిస్తున్నట్లు అర్థం కాదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే అభిమానులే తమ దేవుళ్లు అని పేర్కొంది. View this post on Instagram A post shared by STARGAZE 🧿 (@stargazeoffiical) -
స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)#CMJosephVijay at #Jagadish's New Home Function ✨️#ThalapathyVijaypic.twitter.com/14gsYE41FA— Movie Verse (@_MovieVerse) May 29, 2026 -
సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్
గత కొన్నాళ్ల నుంచి సనాతన ధర్మం అనే టాపిక్ ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతెందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగానూ ఇదే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై నటుడు అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు జీవన విధానం. అది తల్లిదండ్రులని దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. మీరు మీ సొంత తల్లిదండ్రులని తిరస్కరించగలరా? లేదు కదా.. అధే విధంగా సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు' అని అర్జున్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన 'బ్లాస్ట్' మూవీ నిన్న(మే 28) తెలుగు, తమిళంలో రిలీజైంది. దీని సక్సెస్ మీట్ చెన్నైలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డీఎంకే నేత ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అర్జున్ విషయానికొస్తే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మైసూరుకి చెందిన ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 180కి పైగా సినిమాల్లో నటించారు. హీరో అనే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్గానూ పలు బాధ్యతల్ని నిర్వహించారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలపై తన అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు అలానే సనాతన ధర్మం గురించి మట్లాడారు.(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Hero #Arjun Counter To #UdayStalin 👌💥"సనాతన ధర్మం అనేది ఒక మ* త0 కాదు జీవన విధానం, అది తల్లిదండ్రులను దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుందిని. మీరు మీ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా?” “లేదు కదా” “అదేవిధంగా, సనాతన ధర్మాన్ని ఎన్నటికీ తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు."💥💥 pic.twitter.com/ke5vYibc9i— Anil U (@UAnil07) May 29, 2026 -
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్.సిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీళ్ల కుమార్తెలు గురించి మాత్రం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఖుష్బూ.. ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసింది. చిన్న కుమార్తె ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పుడు పెద్ద కూతురు ఆనందిక నిర్మాతగా మారిపోయింది.ఖుష్బూకి చెందిన అవ్నీ మూవీస్ సంస్థ, బెంజ్ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన తమిళ మూవీ 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్, సంయుక్త విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాకు ఖుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. చైన్నెలో రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ఇందులో నటించిన సంతోష్, నా కూతురు ఆనందిత.. స్కూల్ నుంచే ఫ్రెండ్స్. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటిది వారిద్దరే ఈ మూవీ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆనందిత ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం అవుతోంది. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదు. వారి నుంచే ఏమి నేర్చుకోవాలనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు) -
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
డ్యూడ్ హీరోయిన్తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్!
ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.హీరోగానూ సక్సెస్ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా..ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే! -
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం) -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
త్రిష ఏ హీరోతో నటించినా.. సినిమా బ్లాక్ బస్టర్ !
-
ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా విజయ్, నేను చనిపోయేవాళ్లం!
సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.కేరళలో ఫైట్ సీన్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు. కదిలే రైలుపై..ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.గుండె ఆగిపోయినంత పని!70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం. ఆయన భయం లేకుండా..కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్ -
మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్!
ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను విడుదల చేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి (2012) మంచి విజయాన్ని సాధించింది. అదే చివరి సినిమాఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ వచ్చిన ఈయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. ఉదయనిది స్టాలిన్ చివరిగా నటించిన చిత్రం మామన్నన్. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. రీఎంట్రీ?ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్ జెయింట్ మూవీస్ మూవీస్ సంస్థ నిర్వహణ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బనిధి స్టాలిన్ చేపట్టిన విషయం తెలిసిందే. -
సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?
స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి చాలారోజులు అయింది. కానీ ఈయన చివరి సినిమాకు మాత్రం మోక్షం దొరకట్లేదు. స్వయంగా నిర్మాతే రీసెంట్గా ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని చెబుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? 'జన నాయగణ్' విడుదల ఎప్పుడు?(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)తమిళ స్టార్ హీరో అయిన విజయ్.. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోతే తిరిగి మూవీస్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో ఇక సినిమాలు చేయడం కష్టమే. అందుకే 'జన నాయగణ్' ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.అయితే సెన్సార్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో 'జన నాయగణ్' అసలు ఎప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్న టైంలో జూన్ 19న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుందని టాక్ బయటకొచ్చింది. డిస్ట్రిక్ట్ టికెట్ బుకింగ్ సైట్లో ఈ తేదీనే ఉండటంతో ఇదే ఫైనల్ అని అనుకుంటున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు రిలీజ్ అయితే తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం థియేటర్ల దగ్గర సందడి వాతావరణం గ్యారంటీ. మరి ఇదెంత వరకు నిజమవుతుందనేది చూడాలి?విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో చేసిన 'జన నాయగణ్'.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. తొలుత ఇది నిజమా కాదా అని అంతా అనుకున్నారు గానీ తమిళనాడు ఎన్నికల రిలీజ్ టైంలో మూవీ పైరసీ ప్రింట్ లీక్ కావడంతో రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆస్కార్లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ) -
త్రిష రాజకీయాల్లోకి రావాలి.. తనకు ఆ అర్హత ఉంది: నటి
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు రుచి చూశారు దళపతి విజయ్. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు. అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓపక్క భార్యకు విడాకులు ఇస్తూనే.. మరోపక్క హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా మెదులుతున్నారు.తప్పేముంది?ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నటి వనితా విజయకుమార్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించింది. పాలిటిక్స్లో అడుగుపెట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని త్రిషను వెనకేసుకొచ్చింది. పైగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత చదివిన స్కూల్లోనే త్రిష కూడా చదువుకుందని గుర్తు చేసింది. రాజకీయాల్లోకి రావాలితను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుందని, జనంతో ఎలా మమేకం అవాలి? ఎదుటివారితో ఎంత గౌరవంగా మెదలాలనే విషయాలు తనకు బాగా తెలుసని పేర్కొంది. త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడింది. మరి నిజంగా త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తుందా? కేవలం సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో చూడాలి!చదవండి: అందుకే 20 ఏళ్లుగా ఆయనతో నటించలేదు: ఊర్వశి -
ఆ కారణం వల్లే ఆయనతో 20 ఏళ్లుగా నటించలేదు!
తలైవా తలైవి (తెలుగులో సార్ మేడమ్) వంటి హిట్ చిత్రం తర్వాత పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం వహించిన సినిమా పరిమళ అండ్ కో. జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్స్ మాస్టర్ శాండి, దర్శకుడు మిస్కిన్, యోగిబాబు, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక, జీకేఎం తమిళ్ కమరన్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోషించా..తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో కథే హీరో అనే నమ్మకం కలుగుతుందన్నారు. పరిమళ అండ్ కో సినిమా కథ మొదట వినగానే అలాంటి భావనే కలిగిందన్నారు. ఇందులో జయరాం నటిస్తున్నారని తెలియగానే సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. తామిద్దరం ఇంతకుముందు 20కి పైగా చిత్రాల్లో కలిసి నటించామన్నారు. కానీ తర్వాత ఇద్దరి ఆసక్తులు వేరవడంతో చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.అదే కారణం..పలు అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన కథ జయరాంకు నచ్చకపోవడం, ఆయనకు నచ్చింది తనకు నచ్చకపోవడం జరిగిందన్నారు. దాంతో తామిద్దరం కలిసి నటించి దాదాపు 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సినిమాను పాండిరాజ్ చాలా వేగంగా పూర్తి చేశారని ఊర్వశి తెలిపారు. -
కోలీవుడ్ కాలింగ్?
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను అను కుంటున్నారట.మరి... ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్–జాన్వీల జోడీ కన్ఫార్మ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణీ వసంత్ని అనుకున్నారట. కాల్షీట్స్ సర్దుబాటు చేయడంలో రుక్మిణీకి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకుంటున్నారని చెన్నై టాక్. -
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్టైమ్ రికార్డ్ -
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు -
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా..అవ్నీ మూవీస్ అధినేత కుష్బూ సుందర్, బెంజ్ మీడియా అధినేత సీసీఎస్ అరుణ్కుమార్ కలిసి నిర్మిస్తున్న డబుల్ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథ్, వీనోద్ కిషన్, వీటీవీ.గణేశ్, భగవత పేరుమాళ్, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రెండు సినిమాలు..చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్ ఫుల్ ఎంటర్టెయినర్గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్కుమార్ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్.. మీసయ్య మురుక్కు సీక్వెల్ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. View this post on Instagram A post shared by anandita (@anisundar_) -
రామ్కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో చై మూవీ!
ఆనందం, రన్, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్ (సికిందర్) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్కు సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న గ్యాప్ తర్వాత..ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్పోతినేని కథానాయకుడిగా ది వారియర్ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాఇది మంచి యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి! -
CM విజయ్ VS కోలీవుడ్
-
కోలీవుడ్లో త్రిష మరో సంచలనం.
-
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది. -
ఇకపై ఇతను పూర్తిగా మీకే సొంతం.. జయం రవితో రిలేషన్ కి కెనీషా గుడ్ బై..
-
సూర్య 'కరుప్పు' మూవీకి బాక్సాఫీస్ షేక్.. ఊహించని కలెక్షన్స్!
-
హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే?
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా, విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్ ఫాజిల్ తాజాగా తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్తో షూటింగ్కు రెడీ అవడం ఈయన విధానం. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్కుమార్ల రేర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చెన్నైలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, నటీనటులు ,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
85 ఏళ్ల నిర్మాత.. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్లు, మూవీ ఈవెంట్స్లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా) -
పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..!
సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..పేరెంట్స్ విడాకులుశరత్కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పుఅయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.మళ్లీ పెళ్లి చేయాలని..అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరినీ దగ్గరకు రానివ్వనుఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. శరత్కుమార్ రెండో పెళ్లివరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్రౌండర్గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి -
బోరున ఏడ్చిన హీరో జయం రవి
-
అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్న్యూస్ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.కూతురి నామకరణంమీర్, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.టాప్ డైరెక్టర్గా..అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్ అయ్యాడు. విజయ్కు తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో సూపర్ హిట్లు అందించాడు. షారూఖ్ ఖాన్కు జవాన్తో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. Our art of love now has a name 💕🧿MIYOU — beauty, gentleness & loveWith luv , MEER , PRIYA & ATLEE 💕🧿 pic.twitter.com/hoUi9D5Fw9— atlee (@Atlee_dir) May 17, 2026చదవండి: చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్ -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
విజయ్ కి నేను చెప్తాలే.. ఫ్యాన్ కోరిక తీర్చిన త్రిష


