breaking news
Kollywood
-
మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి' ఇంతలా హిట్ అవ్వడంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ది కూడా కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఓవైపు వరస సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పటికీ మరోవైపు హీరోగానూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలా 'ఇమ్మోర్టల్' అనే తమిళ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడాడు. కూతురి విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: ఇన్నాళ్లు ఫ్యాన్ వార్స్.. ఇప్పుడు యష్ తల్లి కూడా)'సైంధవి(మాజీ భార్య), నేను స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. అయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాం. మా కూతురు అన్విని ఇద్దరం కలిసి కో-పేరెంటింగ్ చేస్తున్నాం. అన్వి నాలో ఒక భాగం. సైంధవి, అన్వి ఇద్దరూ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండటం వల్ల విడిపోయిన తర్వాత కూడా మంచి రిలేషన్ మెంటైన్ చేస్తున్నాం. ఒకరినొకరం గౌరవించుకుంటాం. అందుకే మా కుమార్తెని కలిసి పెంచగలుగుతున్నాం' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.జీవీ ప్రకాశ్ కుమార్కి ఏఆర్ రెహమాన్ మామ అవుతాడు. అలా చిన్నప్పుడే సింగర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తర్వాత సంగీత దర్శకుడిగానూ జీవీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని పలు చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ జీవీ బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత విషయానికొస్తే.. 2013లో సైంధవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2024లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: వేరేలా కష్టపడొచ్చుగా.. హిజ్రాల తీరుపై బిగ్బాస్ అరియానా వీడియో) -
నేను ఈ స్థాయిలో ఉండటానికి వెట్రిమారనే కారణం
తాను ఈ స్థాయిలో ఉండటానికి దర్శకుడు వెట్రిమారనే కారణమని తమిళ హీరో సూరి పేర్కొన్నాడు. 'వెన్నెలా కబడ్డికుళు' సినిమాతో నటుడిగా పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్ తీసిన 'విడుదలై'తో హీరోగా మారాడు. తమిళంలో ఇది హిట్ అయింది. తర్వాత 'విడుదలై 2, మామన్, గరుడన్ తదితర మూవీస్లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇతడు చేసిన 'మండాడి' వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తమిళ హీరో సూరి కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)సముద్ర నేపథ్యంగా తీసిన ఈ భారీ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకుడు. తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్ర చేశాడు. మహిమా నంబియార్ హీరోయిన్. మత్స్యకారుల జీవిత ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు సూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నేనీ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం దర్శకుడు వెట్రిమారనే. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు చెట్టుగా మారింది. బోటు పోటీల్లో బోటులో ఉండే ఆరుగురికి మార్గదర్శి మండాడి. ఈ చిత్రం కోసం రిస్క్ తీసుకోలేదు. రిస్క్నే చిత్రంగా చేశాం. రెండు నెలలు సముద్రంలో షూటింగ్ చేశాం. ఈ కార్యక్రమానికి మా అమ్మ వచ్చారు.ఆమె నాకు దేవతలాంటిది అని సూరి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి: సూరి) -
నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి
సినిమా చూస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఓసారి సదరు చిత్రాల్లో నటించిన వాళ్లు చెబితే తప్పితే ఆ సంగతులు బయటపడవు. ఇప్పుడు అలానే తమిళ హీరో సూరి.. 'మండాడి' చిత్రం విషయంలో తనకెదురైన చిత్రమైన ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఆడియో లాంచ్ సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)'మండాడి సినిమా కమిట్ అయినప్పుడు 80 శాతం చిత్రీకరణ స్విమ్మింగ్ పూల్లో, 20 శాతం నిజమైన సముద్రంలో చేస్తామని దర్శకుడు చెప్పారు. వెట్రిమారన్ కూడా.. టైటానిక్ సహా ఎన్నో సముద్ర నేపథ్య సినిమాలు స్విమ్మింగ్ పూల్లోనే తీశారని చెప్పారు. దీంతో నేను ఓకే అనేశా. కానీ షూటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది''10 రోజులు గడిచాయి. నెలరోజులు గడిచాయి. రెండు నెలలు అయిపోయాయి. అయినా షూటింగ్ మాత్రం నిజమైన సముద్రంలో చేస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించకపోయేసరికి నా భార్య తెగ భయపడిపోయి ప్రతిరోజూ ఫోనే చేసేసేది. కానీ నేను ఎత్తలేకపోయేవాడిని. దీంతో రెండురోజులకు ఓసారి నేనే ఆమెకు ఫోన్ చేసి 'నేను బతికే ఉన్నాను' అని చెప్పేవాడిని' అని సూరి నవ్వుతూ ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు.తెలుగు హీరో సుహాస్ ఈ మూవీలో విలన్గా చేశాడు. వచ్చే నెల 10వ తేదీన తెలుగు, తమిళంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పూర్తిగా సముద్రం బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే సముద్రంలో తీస్తున్న టైంలో ఒకటిరెండుసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి.(ఇదీ చదవండి: 40 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)#Soori's Fun speech 😁:"While committing #Mandaadi director told 80% of the film we will shoot in Swimming pool & 20% only in actual sea. Even VetriMaaran sir told, #Titanic & many other sea films was shoot on Swimming pool😂. 10 days gone...1 month gone...2 months gone shooting… pic.twitter.com/vSeVTged2v— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026 -
తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్
తెలుగు హీరో సుహాస్ ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించాడు. గత రెండేళ్లలో దాదాపు 10కి పైగా సినిమాల్లో కనిపించిన ఇతడు.. ఈ ఏడాది మాత్రం 'హే బల్వంత్' అని ఒకే మూవీతో వచ్చాడు. కామెడీగా ఉన్న ఈ చిత్రం పర్లేదనిపించింది. ఇక ఇదే ఏడాది తమిళంలోకి 'మండాడి'తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబరు 10న ఇది తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో శుక్రవారం జరగ్గా.. ఇందులో సుహాస్.. హీరో సూరి కాళ్లు మొక్కాడు.(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)'మండాడి' సినిమా విషయంలో తనకు అన్ని విధాల సూరి అన్న అండగా నిలిచాడని చెబుతూ సుహాస్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీపైనే అందరి ముందు కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ మూవీని భిన్నమైన స్క్రీన్ ప్లేతో పూర్తిగా సముద్రం బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీగా తెరకెక్కించారు. తమిళం వరకు సూరి హీరో, సుహాస్ విలన్గా కనిపించనుండగా.. తెలుగులోకి వచ్చేసరికి సుహాస్ హీరోగా, సూరి విలన్గా కనిపించనున్నారట. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మతిమారన్ పుళగెంది దర్శకుడిగా వ్యవహరించాడు.(ఇదీ చదవండి: అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా)#Suhas:"Soori Anna is my strength, my backbone & my piller of #Mandaadi. This is from the bottom of my heart. I also came from Junior Artist to Hero. Thank you for inspiring me & many. Love you Anna♥️" pic.twitter.com/aiWTEVhnyj— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026 -
అర్జున్ దాస్ హీరోనా? అయితే వద్దులే!
గుడ్ నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ, అన్బే డయానా తదితర సినిమాలు నిర్మించిన మిలియన్ డాలర్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఒన్స్ మోర్'. అర్జున్ దాస్, అదితి శంకర్ జంటగా నటించగా ప్రముఖ మోడల్ సోనా ఒలిక్కల్ మరో హీరోయిన్గా చేసింది. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయవుతున్నాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 28) తమిళం వరకు థియేటర్లలో రిలీజ్ కానుంది. రెండు రోజుల క్రితం చెన్నైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ టీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ‘రాకా’లో రకరకాల వింతలు చూశా.. మంచు లక్ష్మీ)సినిమాలో 13 పాటలు ఉంటాయని నిర్మాత యువరాజ్ చెప్పారు. అర్జున్ దాస్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసి పలువురు నిర్మాతలకు ఈ కథను వినిపించాను. కానీ వాళ్లంతా ఈ ప్రేమ కథకు అర్జున్ దాస్ హీరోనా? వేరే నటుడితో అయితే చేస్తానని అన్నారని దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఈ చిత్రం తమిళంలోనే రిలీజ్ కానుంది. ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే అవకాశముంది.ఇక అర్జున్ దాస్ విషయానికొస్తే ఖైదీ, మాస్టర్, ఓజీ తదితర సినిమాల్లో విలనీ పాత్రలు చేశాడు. రీసెంట్ టైంలో అయితే హీరోగానూ పలు మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు అలానే 'వన్స్ మోర్' అనే రొమాంటిక్ చిత్రంతో రాబోతున్నాడు. మరి దీనితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షాకింగ్ డెసిషన్
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలకు బ్రేకులు వేసింది. సినిమా రిలీజ్లతో పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్- ఓటీటీల వివాదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని థియేటర్ యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచే సినిమాల రిలీజ్ చేయనివ్వమని స్పష్టం చేశారు. -
రజినీకాంత్ జైలర్-2.. మాస్ సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అలా బోలేలో అంటూ సాగే మాస్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు అరుణ్రాజా కామరాజ్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఈ నెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా సెన్సార్ బోర్డు( CBFC) ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉండనుందట.అనుమతి ఎలా ఇస్తారంటూ..కన్నడ భాషలో కేవలం రెండు నుంచి మూడు పదాలు మాత్రమే మ్యూట్ చేశారట. ఇప్పటికే యాశ్ ఈ సినిమాపై స్పందిస్తూ ఇది పెద్దవాళ్లకి మాత్రమే అని సూచించాడు . అయితే సెన్సార్బోర్డు ఎలాంటి సన్నివేశాలు తొలగించకపోవడంపై సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్లకి మాత్రమే అన్నప్పుడు ఒక్క సీన్ కూడా తొలగించకుండా అనుమతి ఎలా ఇస్తారంటూ సోషల్మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.కాగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నయనతార, కియారా, హుమా ఖురేషి, తదితరులు కీలక పాత్రలు వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదీ చదవండి: ‘మూకుత్తి అమ్మన్2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్ -
వాళ్ల వల్లే ఇప్పుడిలా ఉన్నాను: శ్రీలీల
దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. మాతృభాష అయిన కన్నడ చిత్రాలతో కెరీర్ ప్రొరంభించి తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'పెళ్లి సందడి'తో మొదలుపెట్టి వరసగా సినిమాలు చేసింది. అందం, డ్యాన్స్లతో కురక్రారు మతి పోగొట్టింది. 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది తమిళంలో పరాశక్తి, తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేసింది.ప్రస్తుతం ధనుష్కు జంటగా 'ఓం' సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్. త్వరలో ఈమె నటించిన హిందీ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే తాను ఇలా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అభిమానులే కారణమని చెబుతోంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అభిమానులని ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు చూపించే ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేను డబ్బు సంపాదిస్తున్నప్పుడు, పేరు తెచ్చుకున్నప్పుడు కూడా ఇంత సంతోషపడలేదు. అభిమానులు వల్ల మాత్రమే అంతా సాధ్యం అవుతోంది. ఇంత ప్రేమ పొందడానికి ప్రాప్తి ఉండాలి. అందుకు నటిగా నేను గర్వపడుతున్నాను అని శ్రీలీల పేర్కొంది. -
రూ.70 లక్షలే బడ్జెట్.. 'ఒక్కడై' తీసిన సినిమా
గతంలో వెంగాయం, బయో స్కోప్ లాంటి వైవిధ్యభరిత సినిమాలు తీసిన శంకగిరి రాజ్ కుమార్.. అన్నీ తానై తీసిన తమిళ మూవీ 'వన్ మ్యాన్'. చిత్రంలోని అన్ని పాత్రలు, అన్ని శాఖల్లో ఇతడే పనిచేశాడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. పీవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఇది విడుదల కానుందని శంకగిరి రాజ్ కుమార్ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.దర్శక నిర్మాత, పాత్రధారుడు శంకగిరి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఐదేళ్ల శ్రమ అని పేర్కొన్నాడు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సింగిల్ మెన్గా తానే నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విధంగా ప్రపంచంలోనే రూపొందించిన తొలి చిత్రం ఇదేనని చెప్పాడు.ఇక ఈ మూవీ విడుదల విషయంలో నిర్మాత కలైపులి ఎస్ థాను సలహా కోసం వెళ్తే.. ఆయన పీవీఆర్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పడంతో.. వాళ్లు సినిమా చూసి ఇలాంటి ప్రపంచస్థాయి చిత్ర విడుదలకు తమ సహకారం కచ్చితంగా ఉంటుందని చెప్పారని శంకరగిరి రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు చేరన్ మాట్లాడుతూ శంకరగరి రాజ్ కుమార్ డబ్బు సంపాదించడానికి రాలేదని, ఈయన రూ.70 లక్షలతో బ్రహ్మండ చిత్రం చేయగలరని అన్నారు. -
సందీప్ కిషన్ ‘సిగ్మా’ విడుదల తేదీ ఇదే..
కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్, కామెడీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్రాజ్, శివ్ పండిట్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డా? బిగ్బాస్ అవకాశమా? ధనుష్ స్పందన ఇదే.. -
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?
గత కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నట్లే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ విషయం బయటపడింది. ఇప్పుడు పెళ్లి తేదీతో పాటు వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్కి షాకింగ్ ప్రశ్న)తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగులోనూ దేవర, గ్యాంగ్ లీడర్, జెర్సీ తదితర సినిమాలకు పాటలిచ్చాడు. వచ్చే నెలలో రాబోతున్న 'ప్యారడైజ్'కి సంగీతమందించింది ఇతడే. మరి ఎప్పుడు ఎలా పరిచయమో గానీ సన్ పిక్చర్స్, టీవీ సంస్థల అధినేత కళానిధి మారన్ కూతురు కావ్యతో ఇతడికి చాన్నాళ్లుగా స్నేహం ఉంది. తర్వాత ప్రేమలో కూడా పడ్డారని టాక్.గతంలో పలుమార్లు వీళ్లిద్దరి డేటింగ్పై రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే విదేశాలకు కలిసి ట్రిప్స్ వేశారు. ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా తొలిసారి వెళ్లిన గ్రీస్ దేశానికే కలిసి వెళ్లారు. ఇప్పుడు అదే చోట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. నవంబరు 10న పెళ్లి జరగనుంది. దీనికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇవి రూమర్సే కానీ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.కావ్య మారన్ పేరుకే బిజినెస్ ఉమెన్ అయినప్పటికీ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఓనర్గా తెలుగు నెటిజన్లకు సుపరిచతమే. సన్ పిక్చర్స్ తీసే సినిమా ఈవెంట్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో జరిగే క్రికెట్ లీగుల్లోనూ ఈమెకు జట్లున్నాయి. (ఇదీ చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!) -
విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే అదరగొడుతోంది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. ఫస్ట్ డే కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్టమెంట్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. రెండు రోజుల్లో కలిపి రూ.37.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ.. గ్రాస్ పరంగా సెంచరీ కొట్టేసింది. తొలిరోజుతో పోలిస్తే వసూళ్ల పరంగా రెండో రోజే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. కరుప్పుతో హిట్ కొట్టిన సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుంది. #VishwanathAndSons hits it out of the park and smashes a 100cr+ in just 2 days 💥💥#BlockbusterVAS running successfully in cinemas near you ❤️#BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/fhIpLYvFJb— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2026 -
‘కష్టమొస్తే ఆధారపడేది ఆ స్టార్ హీరోపైనే’
అనుపమ పరమేశ్వరన్ . ఈ పేరు కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళియాలం నుంచి మొదలు తెలుగు ఇండెస్ట్రీలోనూ ఓ ప్రత్యేక ఫాన్బేస్ను సంపాదించుకుంది ఈ బామ. అయితే ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన బ్రేకప్ కోసం, ఆపదలో ఉన్న ఉన్నప్పుడు ఆదుకునే యాక్టర్స్ కోసం తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు వైరలవుతున్నాయి. ‘ కొద్ది రోజుల నుంచి చాలా మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా నేను పూర్తిగా ఆధారపడగలిగే వ్యక్తి దుల్కర్నే. బాధగా ఉన్నప్పుడు విషయం తెలుసుకున్న దుల్కర్ సల్మాన్ తరచూ మెసేజ్లు పంపేవారు. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసేదాన్ని. నా పరిస్థితి బాగోలేదని ఆయన ఎలా గుర్తించేవాడో ఇప్పటి ఆశ్చర్యంగా ఉంటుంది. హీరో రామ్ పోతినేనితో కూడా మంచి బాండింగ్ ఉంది’ అని వెల్లడించింది.ఇదే ఇంటర్వ్యులో తన రిలేషన్షిప్, బ్రేకప్ కోసం కూడా అనుపమ మాట్లాడింది. తన మాజీ ప్రియుడి వల్ల ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్’ ఎదుర్కున్నట్లు తెలిపింది. కాగా, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్ గతంలో ‘జొమొంటే సువిశేషంగళ్’ ( తెలుగులో అందమైన జీవితం) సినిమాలో నటించారు. 2017లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ లక్కీ భాస్కర్, మహానటి, సీతారామమ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదీ చదవండి: రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్పై అనుపమ సంచలన వ్యాఖ్యలు -
'సూర్య హిట్ సినిమా.. నాకు అన్యాయం'.. మన్సూర్ అలీఖాన్ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య మూవీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరుప్పు చిత్రంలో తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేశానని తెలిపారు. అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు యూట్యూబ్లో వస్తాయని నిర్మాత చెప్పారని.. కానీ అది కూడా జరగలేదని అన్నారు. సూర్య, కార్తీ పెద్ద స్టార్స్ అని.. వాళ్లు జీవించాలని కోరుకుంటానని అన్నారు. అయితే తమ లాంటి చిన్ననటులను కూడా బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను చాలా ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్నానని తనకు న్యాయం జరగాలని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఆల్ పాస్ మూవీ ఈవెంట్కు హాజరైన ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పులో తన సన్నివేశాలు తొలగించడంపై మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్యాన్స్ సీన్ కోసం తాను ఎంతో శ్రమించానని.. కానీ అది మూవీలో లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆ పాటకు నేను విలన్లతో కలిసి డ్యాన్స్ చేశానని.. ప్రసాద్ ల్యాబ్స్లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో నా నటనను, కష్టాన్ని నా కొడుకులకు స్వయంగా చూపించా.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించారు. మీరు నటించిన సీన్ ఎందుకు తొలగించారని నా బిడ్డలు అడిగినప్పుడు నా చేతుల్లో ఏం లేదని చెప్పాను. కనీసం ఆ సన్నివేశం యూట్యూబ్లో కూడా లేకపోవడంతో మరింత బాధేసిందని అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్ని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ జనని నాయకిగా నటించిన చిత్రం ఆల్ పాస్. నిరంగళ్ మూండ్రు, తరుణం చిత్రాల ఫేమ్ దుష్యంత్ హీరోగా నటించారు. ఈ సినిమాకు మైదీన్ దర్శకత్వం వహించగా.. వన్ స్టెప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన.ఆర్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్ ,విక్రమన్ ,నటుడు మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సినిమాకు జేమ్స్ వసంతన్ సంగీతం అందించారు. #Suriya மீது கடும் கோபத்தில் கொந்தளித்த Mansoor Ali Khan🤬🤬 உனக்கு ஆண்மை இருந்தா அத போடு 💥😬 என்னைய டம்மியா நிக்க வச்சானுங்க😣😖 நீ விக்ரம் படத்துல 5நிமிசம் தான வந்த 😬 #SuriyaSivakumar #MansoorAliKhan #TamilCinema pic.twitter.com/fGCK1sPMAd— BingooBox (@BingooBox) August 14, 2026 -
అజిత్ కోసం వెంకీమామ ఎంట్రీ.. మోహన్ లాల్ కూడా..!
కొత్తదనం లేకుంటే ఎంత పెద్ద స్టార్ నటించిన ఆ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్దాక్షింగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. దీంతో ప్రముఖ స్టార్స్ కూడా తమ చిత్రాల్లో మంచి ప్యాడింగ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ నటుడు రజనీకాంత్. ఈయన జైలర్ చిత్రం నుంచి తనతో పాటూ ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలను అతిధి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో అజిత్ కూడా ఆయన బాటలోనే పయనించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత అజిత్ తన దష్టిని కార్ రేస్ పోటీలపై మరలించారు. ఆ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలుచుకున్నారు. కాగా ఆ సన్నివేశాలను విజయ్ చిత్రంగా మలిశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గ్లాడియేటర్స్ ఇన్ పర్చూట్ ఆఫ్ ఛాలెంజర్స్ పేరుతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ తన సతీమణి శాలినిని ప్రొడ్యూసర్గా పరిచయం చేస్తూ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి డేర్ డెవిల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు.దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు వెంకటేశ్.. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడుఈ టాపిక్ కోలీవుడ్లో ఆసక్తిగా మారింది. -
వంటల ప్రోగ్రామ్లో సమంత.. ప్రెగ్నెన్సీతో చేస్తుందా?
అప్పట్లో హీరోయిన్గా తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన సమంత.. మధ్యలో అనారోగ్యం కారణంగా సినిమాలు తగ్గించింది. చేసినవి కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత.. నిర్మాతగా మారి 'శుభం' తీసింది. రెండు నెలల క్రితం వచ్చిన 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్ కమ్ నిర్మాతగా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. రూ.100 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)'బంగారం' హిట్ అయ్యేసరికి వరస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో రాబోయే కొన్ని నెలల పాటు సామ్ ఇంటికే పరిమితం కానుంది. అలాంటిది ఉన్నట్టుండి ఈమె ఓ వంటల ప్రోగ్రామ్కి హోస్టింగ్ చేయబోతుందని ప్రకటించారు. ప్రోమో వీడియో కూడా రిలీజ్ చేశారు.గతంలో తెలుగులో హీరోయిన్గా వరస సినిమాలు చేస్తున్న టైంలోనే 'సామ్ జామ్' పేరుతో ఓ టాక్ షోకి హోస్టింగ్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో సోనీ సంస్థ ఛానెల్ ప్రారంభించింది. ఇందులో రెండు నెలల తర్వాత సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దీనికి సమంత హోస్టింగ్ చేయనుంది. ప్రోమో చూస్తుంటే షూటింగ్ ఎప్పుడు జరిగిందా? అనిపిస్తుంది. ఎందుకంటే సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబీ బంప్తో హోస్టింగ్ ఏమైనా చేస్తుందా అనేది చూాడాలి?.(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)The ultimate culinary face-off begins here, with @Samanthaprabhu2 leading the way.Celebrity MasterChef Tamil - Coming soon on Sony விழா and Sony LIV.#CelebrityMasterChefTamil #CMCTamil #Samantha #SonyVizha #SonyLIVTamil pic.twitter.com/sxHubOJ1dp— Sony Vizha (@sony_vizha) August 15, 2026 -
విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!
తమిళ హీరో విశాల్ ఏ సినిమా చేసినా సరే దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అలా నిన్న(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజైన మూవీ 'మకుటం'. ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి దీనితోనే దర్శకుడిగా మారాడు. అలానే తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తీరా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరిస్థితి ఘోరాతిఘోరంగా తయారైంది.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?)విశాల్ 'మకుటం'(తమిళంల మగుడం) సినిమాకు తొలిరోజు తమిళనాడులో కేవలం రూ.38 లక్షలు రాగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20 లక్షలు, కర్ణాటకలో రూ.7 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, దేశంలో మిగతా చోట్ల కలిపి రూ.లక్ష మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.68 లక్షల గ్రాస్ మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో రూ.20 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా రూ.90 లక్షల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఏమైనా ప్లస్ అవుతుందా అనుకుంటే రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. చూస్తుంటే విశాల్కి దర్శకుడిగా ఆరంభమే భారీ డిజాస్టర్ దక్కేలా కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం 'మార్క్ ఆంటోని'తో రూ.100 కోట్ల మార్క్ అందుకున్న విశాల్ పరిస్థితి ఇప్పుడిలా తయారవడం చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.'మకుటం' విషయానికొస్తే.. కృపాకరం (విశాల్) చెన్నైలో మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య జమున (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలతో హ్యాపీగా బతికేస్తుంటాడు. స్థోమత లేకపోవడంతో ఓసారి సెకండ్ హ్యాండ్ కారు కొని తన కుటుంబాన్ని తీసుకుని విహారయాత్రకు వెళ్తాడు. కొందరు దుండగులు కృపాకరం కారుపై కాల్పులు జరుపుతారు. ఈ ఘటనలో ఇతడి భార్య, బిడ్డ చనిపోతారు. ప్రాణాలతో మిగిలిన కొడుకుని పట్టుకుని పారిపోతాడు. ఈ విషయం తన తండ్రి, విశాఖపట్నం అక్కడి పోర్టుని శాసించే లింగ (విశాల్)కు తెలుస్తుంది.బాధలో ఉన్న కొడుకుని చూడటానికి లింగ రాగానే కృపాకరం కోపంతో ఊగిపోతాడు. తన భార్య, బిడ్డల చావుకు లింగానే కారణమని ఆరోపిస్తాడు. అసలు తండ్రీ కొడుకులైన లింగ, కృపాకరం ఎందుకు విడివిడిగా ఉంటున్నారు? కృపాకరం కుటుంబంపై దాడి చేసిందెవరు? వాళ్లకీ లింగాకూ ఉన్న సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ) -
'ఇవీ కేవలం ఫోటోలు మాత్రమే కాదు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం ఇంకా కొనసాగుతోంది. తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. గతేడాది ఏప్రిల్లో విడాకుల వివాదం తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. జయం రవి భరణం చెల్లించాలని ఆర్తి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంతో వార్తల్లో నిలిచిన మరోవైపు కెరీర్లో సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ విడాకుల వివాదం నడుస్తున్న వేళ.. ఆయన భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఖుష్బు కూతురి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. కొన్ని ఫోటోలు మిమ్మల్ని ఒకప్పటి గతాన్ని గుర్తుచేస్తాయని తెలిపింది. మరికొన్ని, జీవితాంతం మనతో ఉన్న వ్యక్తులను గుర్తుకు తెస్తాయని రాసుకొచ్చింది. ఈ ఫోటోలు చూస్తుంటే.. అందులోని వ్యక్తులే నాకు ఎక్కువగా కనబడుతున్నారని పోస్ట్ చేసింది.కాలం గడిచేకొద్దీ కుటుంబంలా మారిపోయిన స్నేహితులు.. మన జీవితంలోని వివిధ దశలను చూసిన వారు.. మనతోనే ఉండాలని నిర్ణయించుకున్న వారే.. మన పక్కన నిలబడతారని ఎమోషనల్గా రాసుకొచ్చింది. ఎందుకంటే జీవితం మారుతుంది.. మనుషులు మారుతారు.. పరిస్థితులు మారుతాయి.. కానీ కష్టకాలంలో నా పక్కన నిలబడిన వారే నిజమైన ఆప్తులవుతారని పోస్ట్ చేసింది.తప్పనిసరి పరిస్థితుల వల్ల కాకుండా.. తమ ఇష్టంతో మాతో నిలిచిపోయే వ్యక్తులలో ఒక అమూల్యమైన విషయం ఉంటుందని ఆర్తి తెలిపింది. ఇవి నాకు కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే కాదు.. జీవితంలో చిన్న, పెద్ద మార్గాల్లో నాకు అండగా నిలిచి.. ఇప్పటికీ నిలుస్తున్న వ్యక్తులను గుర్తు చేసే చిన్న జ్ఞాపకాలని ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Aarti (@aarti.ravi) -
సుహాస్ మండాడి.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్
సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మండాడి. ఈ రా అండ్ రస్టిక్ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుసా నీకే పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కృష్ణ తేజస్వీ, రేష్మా శ్యామ్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘సినిమా అంటే వంద కుటుంబాల సమూహం’
కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాల్ని శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది. జైభార్గవ్, మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు నటించనున్నారు.హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో ఈ సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న నిర్మాత. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు’ అని అన్నారు. -
రజినీకాంత్ సీక్వెల్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో బిగ్ డీల్ కుదుర్చుకుందని సమాచారం. దాదాపు డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు చేజిక్కించుకున్నట్లు ఇన్సైడ్ టాక్. జైలర్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్ముడవ్వగా.. సీక్వెల్ మరింత భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.#Jailer2 sets a new benchmark with the biggest-ever OTT deal in Tamil cinema! 🔥The previous record was held by #Coolie. pic.twitter.com/oSedexMvvR— Ramesh Bala (@rameshlaus) August 13, 2026 -
త్రిష- ఉదయనిధి వివాదం.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్లో ఇప్పుడంతా త్రిష పేరే వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె స్టార్డమ్ మరింత పెరిగిపోయింది. ఆమె పాలిటిక్స్లోకి రానుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేం జరగలేదు.. మరోవైపు ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల ఉదయనిధి త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇది కాస్తా ఉదయనిధి అరెస్ట్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు.తాజాగా ఈ వివాదంపై స్టార్ హీరో, నిర్మాత విశాల్ మరోసారి స్పందించారు. తన క్లాస్మేట్ అయిన ఉదయనిధికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. తాను దర్శకత్వం వహించిన మకుటం మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమ రాజకీయ మార్గాలు వేరైనా సరే.. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు ఉండవని విశాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన కృతిగతో ప్రేమలో ఉన్నప్పుడే తన అభిమానం మొదలైందని విశాల్ వెల్లడించారు. మా మధ్య శత్రుత్వానికి ఆస్కారమే లేదని క్లారిటీ ఇచ్చారు.విశాల్ మాట్లాడుతూ.. "నాకు ఉదయ, కృతిగ అంటే ఎప్పటికీ ఒకటే ప్రేమ. ఏది ఏమైనప్పటికీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. ఉదయనిధి.. కృతిగను ప్రేమిస్తున్న దశలోనే అతనిపై అభిమానం మొదలైంది. మా మధ్య శత్రుత్వానికి ఆస్కారమే లేదు. రేపు నేను రాజకీయాల్లోకి ప్రవేశించినా.. అది కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అవుతుంది. మా మధ్య ఎప్పటికీ విభేదాలు ఉండవు," అని అన్నారు.అంతకుముందు ఉదయనిధి అరెస్ట్పై రాజకీయాల్లో ఇవీ సహజమని విశాల్ ప్రకటించారు. ప్రస్తుతం విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మకుటం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు. -
‘డీసీ’ ఐదో రోజు కలెక్షన్లు ఎంతంటే..
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్,వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీసీ’. తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదో రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్ను దాటింది. ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఇండియాలో రూ.5.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సోమవారం నమోదైన దాదాపు రూ.6 కోట్లతో పోలిస్తే ఇది 10శాతం తక్కువ. గడిచిన ఐదు రోజుల్లో దేశీయంగా రూ.32.35కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. భారత్లో గ్రాస్ కలెక్షన్లు రూ.37.21 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్లో రూ.14.50 కోట్లు రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.51.71 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లుఐదో రోజు భారత్లో ‘డీసీ’ రూ.6.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేరళ నుంచి 1.85 కోట్లు, తమిళనాడు నుంచి 1.75 కోట్లు, ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లు, కర్ణాటక నుంచి రూ.65 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి రూ. 35 లక్షల వసూళ్లు వచ్చాయి. రోజుకలెక్షన్లు (రూ. కోట్లలో)1 4.402 7.0039.5546.0055.40మొత్తం 32.35 -
సూర్య ముందు అద్భుతమైన అవకాశం
హీరో విజయ్.. సీఎం విజయ్ అయిపోయారు. ఈయన చేసిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' గత నెలలోనే రిలీజైపోయింది. మరో వారం ఆగితే ఓటీటీలోకి కూడా వచ్చేయొచ్చు. సరే ఈ విషయం పక్కనబెడితే తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న హీరో విజయ్ మాత్రమే. ఇప్పుడు ఈయన యాక్టింగ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఈ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరు? సూర్యకు ఎంత అవకాశముంది?(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)సూర్య స్టార్ హీరోనే కానీ గత కొన్నేళ్లలో సరైన సినిమాలు పడకపోయేసరికి క్రేజ్ తగ్గిన మాట వాస్తవం. కానీ ఈ ఏడాది 'కరుప్పు'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. 'వీరభద్రుడు' పేరిట ఇది తెలుగులోనూ రిలీజై మంచి వసూళ్లు అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. సూర్య కెరీర్లోనే ఇదే అత్యధికం. ఇదొచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో వచ్చేందుకు సూర్య సిద్ధమయ్యాడు. దీనిపై బజ్ బాగానే ఉంది. కాకపోతే కంటెంట్ క్లిక్ అవ్వాలి.ట్రైలర్, పాటలు లాంటివి చూస్తుంటే ఇదో కుటుంబకథా చిత్రమని అర్థమవుతుంది. 'కరుప్పు' మాస్ కంటెంట్ కావడంతో చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. మరి 'విశ్వనాథ్'లో క్లాస్ టచ్ కనిపిస్తోంది. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి? ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం సూర్య సక్సెస్ ట్రాక్లో పడ్డట్లే. ఇదే జోష్ కొనసాగిస్తూ వరసగా మంచి సినిమాలు చేస్తే మాత్రం విజయ్ వదిలేసిన స్థానాన్ని సూర్య అందుకోవచ్చు.తమిళ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ వయసైపోయింది. అందుకు తగ్గట్లే సినిమాలు చేయడం తగ్గించేశారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేశారు. అజిత్ అయితే యాక్టింగ్ కంటే రేసింగ్పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ధనుష్ ఏడాదికి రెండు మూడు మూవీస్ చేస్తున్నప్పటికీ ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రమే ఇతడికి ఉన్నారు. విక్రమ్, శింబు లాంటి వాళ్లు స్టార్డమ్ ఉన్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే చిత్రాలు చేయలేక బాగా వెనకబడిపోయారు. మిగిలిన వాళ్లలో శివకార్తికేయన్, కార్తీ, విశాల్ తదితరులని మిడ్ రేంజ్ కేటగిరీ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య టాప్లోకి వెళ్లిపోవచ్చు. ఎటొచ్చి అందుకు తగ్గ డైరెక్టర్స్-సినిమాలు సెట్ కావాలంతే.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!) -
ఇన్ స్టా తెచ్చిన తంటా... బుక్ అయిన విక్రమ్
-
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్.. శంకర్కి నెక్స్ట్ హీరో దొరికాడా?
పాన్ ఇండియా ట్రెండ్ లేని టైంలోనే రోబో, శివాజీ, భారతీయుడు తదితర సినిమాలతో హిట్ కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఈయన పరిస్థితి ఏం బాగోలేదు. మెగాహీరో రామ్ చరణ్తో 'గేమ్ ఛేంజర్' తీస్తే ఇది ఘోరంగా డిజాస్టర్ అయింది. దీని తర్వాత శంకర్ ఏం మూవీ చేస్తాడా? అని అంతా అనుకున్నారు. ఇలాంటి టైంలోనే ఓ ప్రాజెక్ట్ సెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి హిట్ తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్న తమిళ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం 'డేర్ డెవిల్' మూవీ చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దీనికి దర్శకుడు. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మంగాత్త 2'(తెలుగులో 'గ్యాంబ్లర్') చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరో.. శంకర్ దర్శకత్వంలోనూ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.వేల్పారి అనే చారిత్రక కథతో భారీ సినిమా తీయాలని శంకర్ అనుకున్నారు. కానీ దీనికి చాలానే డబ్బులు, టైమ్ కావాలి. దీంతో దీనికంటే ముందు ఓ మూవీ తీసి సక్సెస్ అందుకోవాలని శంకర్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అజిత్తో ప్రాజెక్ట్ సెట్ చేసే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదా అనేది చూడాలి? -
కాంబో రిపీట్.. ఆ హీరోతో త్రిష సినిమా?
మణిరత్నం తీసిన భారీ బడ్జెట్ సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. ఇందులో యువరాణి కుందవిగా త్రిష, , వల్లవరాయగా కార్తీ నటించారు. మూవీలో ఈ జంట చూడముచ్చటగా అనిపించింది. రీఎంట్రీలో ఈ చిత్రం త్రిషకు బాగా పనికొచ్చింది కూడా. ఇకపోతే ఇప్పుడు మరోసారి కార్తీ-త్రిష జంటగా నటించేందుకు సిద్ధమయ్యారట.కార్తీ 'సర్దార్ 2' వచ్చే నెల 10న థియేటర్లలోకి రానుంది. ఇతడు చేస్తున్న మరో మూవీ మార్షల్. దీని షూటింగ్ కూడా పూర్తయింది. రీసెంట్గానే మరో రెండు మూడు చిత్రాలని కార్తీ కమిట్ అయ్యాడు. అందులో ఒకటి దర్శకుడు మోహన్ రాజాతో ప్రాజెక్ట్. తనీ ఒరువన్ ,వేలైక్కారన్ లాంటి హిట్ మూవీస్ తీసిన మోహన్ రాజా.. చివరగా చిరంజీవితో 'గాడ్ ఫాదర్' తీశాడు. ఇకపోతే కార్తీ-మోహన్ రాజా మూవీలో తొలుత నయనతార నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమె కాల్ షీట్స్ సర్దుబాటు కాలేదని దీంతో త్రిషని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. -
క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్?
స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి రూ.50 కోట్ల సొంతం చేసుకుంది. ఇదే అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)దీంతో 'డిసి'కి సీక్వెల్ తీయాలనే ఆలోచన మొదలైందని అనుకుంటున్నారు. లోకేశ్ కనకరాజ్, దర్శకుడు అరుణ్ కాంబో రిపీట్ కానుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. అయితే డిసి చిత్రం తరహాలో ఇది కూడా హింసాత్మక ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందా ? లేక వేరే నేపథ్యంలో సాగే కథగా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం లొకేశ్ కనకరాజ్.. అల్లు అర్జున్తో పాన్ ఇండియా మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాతే హీరోగా రెండో మూవీ చేస్తాడా? డైరెక్షన్ చేస్తూ నటన కూడా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) -
కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్
తమిళ స్టార్ హీరో విక్రమ్ చిక్కుల్లో పడ్డారు. ఓ అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి చేసిన వీడియోనే దీనికి కారణం. విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే విక్రమ్ దానిని డిలీట్ చేశాడు. ఇంతకీ అసలేమైంది? ఏంటి వివాదం?(ఇదీ చదవండి: కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు)ఆదివారం హీరో విక్రమ్.. అరుదైన జాతికి చెందిన లార్ గిబ్బన్ కోతితో ఆడుకుంటున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు కోతిని అనుకరిస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కొందరు దీన్ని చూసి లైక్ కొట్టగా మరికొందరు మాత్రం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అరుదైన జాతి కోతి.. విక్రమ్ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిని పెంపుడు జంతువులా పెంచుకోవచ్చా అని పలు సందేహాలు రేకెత్తించారు.దీంతో విక్రమ్ తన వీడియోని డిలీట్ చేశాడు.విక్రమ్ తన వియ్యంకుడు(కూతురి మామ), ప్రముఖ బిజినెస్మ్యాన్ సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ కోతితో కలిసి వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. సదరు కోతిని రంగనాథన్ ఎక్కడ కొనుగోలు చేశారు? వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.విక్రమ్ వీడియోలో కనిపించిన కోతి పేరు లార్ గిబ్బన్ (Lar Gibbon). ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతు జాతుల్లో ఒకటి. ఈ జాతికి సిటెస్(CITES) నిబంధనలతో పాటు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా రక్షణ ఉంది. అవసరమైన అనుమతులు, పత్రాలు లేకుండా లార్ గిబ్బన్ని పెంపుడు జంతువుగా ఉంచడం చట్టబద్ధమేనా? అని ఈ వీడియో వల్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా)நடிகர் விக்ரம் தனது இன்ஸ்டாகிராம் பக்கத்தில் பகிர்ந்த அரிய வகை 'லார் கிப்பன்' (#LarGibbon) குரங்குடன் விளையாடும் வீடியோ வைரலானதை அடுத்து, தமிழ்நாடு வனத்துறை விசாரணைக்கு உத்தரவிட்டுள்ளதால் அந்தப் பதிவு நீக்கப்பட்டுள்ளது.#Actor #vikram pic.twitter.com/YNiXjY1eFw— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) August 11, 2026 -
అక్కకు పూర్తిగా పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా
తమిళ ప్రముఖ హీరోయిన్ దుషారా విజయన్.. తన జీవితంలో చెరిగిపోని విషాదాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. అక్క మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈమె నటించిన లేటెస్ట్ సినిమా 'జీడీఎన్'. దీని ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలు మాట్లాడిన దుషార.. అక్కడతో తన అనుబంధం, పుట్టుకతోనే ఆమెకొచ్చిన పక్షవాతం గురించి చెప్పింది.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)దుషారా విజయన్కు ఇద్దరు అక్కలు ఉండగా వారిలో రెండో అక్క దుర్గా దాదాపు పదేళ్ల క్రితం కన్నుమూసింది. ఈమెకు పుట్టుకతోనే మ్యోపతి అనే వ్యాధి ఉంది. దీని కారణంగా ఆమె మెడ కింది భాగం పూర్తిగా పక్షవాతానికి గురైందని దుషార చెప్పుకొచ్చింది.'మెడ పైభాగం వరకు ఆమెకు ఎలాంటి సమస్య లేదు. మెడ కింది భాగం మాత్రం పూర్తిగా పక్షవాతానికి గురైంది. అందుకే రోజువారీ పనులన్నింటికీ మేమే సహాయం చేయాల్సి వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్పై ఆసక్తి ఏర్పడటానికి అక్కే కారణం. నేను డ్యాన్స్ చేస్తుంటే వీల్ఛైర్లో కూర్చుని ఇలా చెయ్ అలా చెయ్ అని సూచించేది. నేను ఆమెని చాలా మిస్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నేను దేవుడిని మొక్కను. నా అక్క ఫొటో చూసి ప్రార్థిస్తాను' అని దుషారా చెప్పింది.తమ్ముడితో అనుబంధం గురించి మాట్లాడిన దుషారా.. దాదాపు ఏడేళ్ల పాటు తమ్ముడితో కలిసి చెన్నైలో నివసించాను. టెక్నికల్గా చెప్పాలంటే నేను వాడికి తల్లిలాంటిదాన్ని. వాడు నాకు నా బిడ్డ లాంటివాడు అని పేర్కొంది. సార్పట్ట పరంపరై, నచ్చతిరం నగర్గిరదు, రాయన్, వేట్టయాన్ తదితర సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం ఈమె ఓ హీరోయిన్గా చేసిన 'మకుటం' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా':దుషారా విజయన్) -
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?
ఓ సినిమాకు సీక్వెల్ తీయాలా వద్దా అనేది మొదటి భాగం సక్సెస్ బట్టి ఉంటుంది. అలాంటి రీసెంట్ టైంలో వచ్చిన సీక్వెల్ సినిమా 'గట్ట కుస్తీ 2'. చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వీటిని తెరకెక్కించారు. రెండో పార్ట్ అద్భుతమైన హిట్ అయ్యేసరికి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది. దీనికి దర్శకుడు సెల్లా అయ్యావు బదిలిస్తూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే దానికి సీక్వెల్ తీయడానికి కారణం అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)సాధారణంగా పార్ట్ 2 తీస్తున్నప్పుడు దానిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఇదే విషయాన్ని విష్ణు విశాల్తో చెప్పాను. అయితే పేరు కోసం పార్ట్ చేయొద్దని, మంచి కథ కుదిరితేనే చేద్దామని చెప్పారు. దీంతో ఆరు నెలల పాటు కష్టపడి కథ సిద్ధం చేసుకుని అది అందరికీ నచ్చిన తర్వాతే గట్ట కుస్తీ 2 ప్రారంభించాను. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువగా ఆదరణ పొందటం సంతోషం. తదుపరి చిత్రాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన చిత్రాల పేర్లతో మాత్రమే చేయకూడదని భావించాను. అలానే కథకు కొనసాగింపు ఉండాలని భావించాను. అలాంటి కథ సెట్ అయ్యేసరికి గట్ట కుస్తీ చిత్రాన్ని రెండు భాగాలు రూపొందించినట్లు చెప్పారు.మంచి కథ కుదిరితే గట్ట కుస్తీ 3 తీస్తానని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. ప్రస్తుతం కెన్ కరుణాస్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇది ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'గట్ట కుస్తీ 2' ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు) -
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ ప్రయాణిస్తున్న కారు.. సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అమీన్ స్వల్వ గాయాలతో బయటపడటంతో రెహమాన్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల టైంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు వెళ్తున్నారు. వారి వాహనం ఒలింపియా టెక్ పార్క్ దగ్గరకు రాగానే, పక్కనే ఉన్న రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా మెయిన్ రోడ్ మీదకు వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు, క్యాబ్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడితో పాటు క్యాబ్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించి, అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కానీ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. -
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
సర్పట్ట పరంపరై, రాయన్, వేట్టయాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న హీరోయిన్ దుషారా విజయన్.. గతవారం 'జీడీ నాయుడు'తో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్న సంగతి బయటపెట్టింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని.. అయితే తాను ప్రేమలో పడటానికి ఇళయరాజా ఓ కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: కాబోయే భార్య గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)'ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నాను. దాని గురించి ఎక్కువగా చెప్పలేను కానీ రిలేషన్షిప్లో రెండేళ్లుగా ఉన్నాం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలా బాగుంది. పెళ్లెప్పుడు చేసుకోవాలని ఇంకా అనుకోలేదు. నా తల్లిదండ్రులకు కూడా ఈ సంగతి తెలుసు. సినిమాల్లోకి రావడానికి నేను ఎంతలా కష్టపడ్డానని వారికి తెలుసు కాబట్టి వివాహం విషయమై నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు''నా పార్ట్నర్ కూడా నా కెరీర్ని ఎంతో సపోర్ట్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. అతడి దగ్గర నేను చిన్నపిల్లలా ఉంటాను. ప్రతి విషయంలోనూ అతడిపైనే ఆధారపడతాను. నా దగ్గర రూ.1000 ఉంటే, నేను ప్రేమించే వాళ్లకు దాన్ని ఇచ్చేస్తాను. నా ప్రేమ అలాంటిది. నేను ఎదుటివారికి ఇచ్చే గౌరవమే నాకు కూడా తిరిగి రావాలని కోరుకుంటాను. ప్రేమలో నేను చూసేది గౌరవం, నమ్మకం మాత్రమే''మా ఇద్దరికీ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. మా తొలి పరిచయం దుబాయ్లో జరిగింది. మా నాన్న స్నేహితుడి ద్వారా ఆయనతో పరిచయమయ్యాడు. మేమిద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఇళయరాజా పాట ప్లే అయింది. అది నాకు ఇష్టమైన పాట కావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. మా ఇద్దరినీ కలిపిన తొలి అంశం ఇళయరాజానే అని నాకు అనిపిస్తుంది' అని దుషార తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం) -
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. విశాల్కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు: జ్యోతిక)కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్ చేసిన నచ్చావు మచ్చాన్ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
సూర్య, జ్యోతికది హిట్ జోడీ. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లు.. తర్వాత ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. సూర్య తమిళ చిత్రాలతో బిజీగా ఉంటే, జ్యోతిక హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే మళ్లీ కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తుండగా దీనిపై జ్యోతిక స్పందించింది.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మేం మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, కథలు కూడా వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేవీ జరగలేదు. మంచి కథ సెట్ అయితే కలిసి నటించడానికి సిద్దమే. తమకు ఆఫ్ స్క్రీన్లోనూ మంచి ప్రేమ లభిస్తోంది. ఆన్ స్క్రీన్లో తమని చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనుకుంటా అని జ్యోతిక చెప్పుకొచ్చింది.సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. 'రోలెక్స్' గురించి మాట్లాడుతూ లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేసే పనిలో ఉన్నారని, తర్వాత 'విక్రమ్ 2' ఉందని.. అయినా రోలెక్స్ మూవీ ఉంటుందనీ, కథను రెడీ చేస్తున్నట్లు లోకేశ్ కనక రాజ్ చెబుతున్నాడని, అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కాలమే చెప్పాలని సూర్య అన్నాడు. (ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
అప్పుడు కలవనివ్వలేదు.. ఇప్పుడు అదే హీరోతో!
మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘డ్యూడ్’ ‘జన నాయకన్’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ శుక్రవారం(ఆగస్టు 14) ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో శనివారం జరిగింది. ఇందులో మాట్లాడిన మమిత తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంది.‘2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిది, మా అన్నయ్య ఇంటర్ చదువుతున్నాం. సూర్యని చూసేందుకు అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చి వెళ్లాడు. నేనూ వెళ్తానంటే మా తల్లిదండ్రులు పంపించలేదు. అన్నయ్య సూర్యతో ఫొటో దిగి చూపించాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యతో కలిసి ఒకే వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మమిత చెప్పుకొచ్చింది. అభిమానిగా సూర్యని చూడాలనుకున్న తనకు.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదమని పేర్కొంది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. -
ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు
తమిళ హీరో విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. హీరో కూడా ఇతడే. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లు. ఆర్బీ చౌదరి నిర్మించిన 99వ చిత్రమిది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 14) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విశాల్ త్రిపాత్రాభినయం చేశాడు. తాజాగా చైన్నెలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)దర్శకుడుగా నాకు అవకాశమిచ్చిన నిర్మాత ఆర్బీ చౌదరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను. ఆమధ్య 14 నెలలుగా ఖాళీగా ఉన్నప్పుడు నా కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన నా కాబోయే భార్య సాయి ధన్సికకు ధన్యవాదాలు. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే తల పీక్కుని పారిపోయేవారు. నా గురువు అర్జున్కి కృతజ్ఞతలు. నన్ను నటించమని ప్రోత్సహించింది ఆయనే. రాంగోపాల్ వర్మ తీసిన 'శివ' చూసిన తర్వాత దర్శకుడిని అవ్వాలనే కోరిక కలిగింది. అది 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహమే నన్ను స్థాయికి చేర్చింది అని విశాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?: నాగవంశీ) -
యశ్ టాక్సిక్.. ఆ రూల్కు నయనతార బ్రేక్
కన్నడ హీరో యశ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ చూస్తుంటే వయొలెన్స్తో పాటు బోల్డ్ కంటెంట్ను తలపిస్తోంది.అయితే ఈ మూవీ సంగతి పక్కనపెడితే.. నయనతార చేసిన పనికి సినీ ప్రియులు షాకవుతున్నారు. గతంలో ఏ మూవీకి కూడా ప్రమోషన్స్ చేయడం నాకు ఇష్టముండదని ప్రకటించింది. అందుకే తాను ప్రమోషన్స్ ఈవెంట్స్కు దూరంగా ఉంటానని తెలిపింది. అలా చెప్పిన నయన్.. మూవీ ప్రమోషన్స్కు హాజరు కావడం అభిమానులను, నెటిజన్లను షాకింగ్కు గురి చేస్తోంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్కు నయనతార రావడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తాను టాక్సిక్ ఈవెంట్కు హాజరు కావడంపై కోలీవుడ్ భామ క్లారిటీ ఇచ్చింది.నయనతార మాట్లాడుతూ.. 'సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. నాకు వాటిలో అంతగా నైపుణ్యం లేదు. అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ చాలా కొన్ని కారణాల వల్ల ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే యశ్ కారణం. అతను కేవలం ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దీనికి చాలా కారణాలున్నాయి.' అని అన్నారు. కాగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. #Nayanthara’s speech at #Toxic trailer launch!.. pic.twitter.com/utsRVrK9Ku— Gv (@gowtham0725) August 8, 2026 -
టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా?
భార తీయ సినిమాలో కోలీవుడ్ సినిమా ప్రత్యేక స్థానానికి చేరుకుంది. పలు తమిళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వసూ ళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీలు తమిళంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నుంచి ఐశ్వర్యారాయ్, దిశా పటానీ వరకు పలువురు ఉత్తరాది భామలు తమిళ చిత్రాలు చేశారు. తాజాగా మరో టాప్ హీరోయిన్ దృష్టి కోలీవుడ్ పై పడినట్లు సమాచారం. ఆ బ్యూటీ ఎవరో కాదు టాక్సిక్ భామ కియారా అద్వానీ.బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిమణుల్లో ఈమె ఒకరు. 2014లో ఫగ్లీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు భారీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. హిందీ చిత్రాలు నటిస్తూనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ మహేష్ బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్తో జత కట్టారు. తాజాగా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి టాక్సిక్ చిత్రంలో యష్కు జంటగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా దక్షిణాదిలో తెలుగు, కన్నడం ప్రేక్షకులకు దగ్గరైన కియార అద్వానీ దృష్టి ఇప్పుడు కోలీవుడ్పై పడినట్లు సమాచారం. ఒక తమిళ ప్రముఖ నటుడు ఈమెను కోలీవుడుకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కథను కూడా చెప్పినట్లు, అందులో నటించడానికి కియారా అద్వానీ సుముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
కాంతార 3 కోసం లొకేషన్స్ వెతుకుతున్నారా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. ఈ మేరకు వీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను భార్య ప్రగతి శెట్టి సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఫొటోలను చూసిన అభిమానులు రిషబ్ నిజంగానే ఫ్యామిలీ ట్రిప్కు వెళ్లారా..? లేక కాంతార 3 కోసం లొకేషన్స్ వెతుకుతున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు. కాంతార చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు రిషబ్ శెట్టి. 2017లో పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు( రాధ్య, రణ్విత్). సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో ముందు వరుసలో ఉంటారీయన. ప్రస్తుతం ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడుపుతున్న ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాకు పని చెప్తున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు రిషబ్ చేతిలో ఉన్నాయి. ‘జై హనుమాన్’ చిత్రంలో ఆంజనేయుడిగా, ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్- ఛత్రపతి శివాజీ మహారాజ్’లో ఛత్రపతి శివాజీగా సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. వీటితో పాటు ‘కాంతార ఛాప్టర్ 3’ పైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు.. జీవితం మారిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ తమిళ నటుడు మారిముత్తు జీవితం చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని అర్థమవుతుంది. ఒకప్పుడు వెండితెరపై నటుడిగా మెరిసిన ఆయన.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నారు. ఎం. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో అనంతపురం 1980 పేరుతో ఈ సినిమా విడుదలైంది. శశికుమార్, జై, స్వాతి తదితరులు నటించిన ఈ చిత్రంలో మారిముత్తు కూడా కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.మదురైలో జన్మించి..మదురైలో జన్మించిన మారిముత్తు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో తరగతి వరకే చదువుకున్నట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే వివిధ పనులు చేస్తూ జీవనం సాగించారు. రేడియో రిపేర్ షాప్లోనూ పనిచేశారు. అనంతరం సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.అక్కడ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రబృందం మారిముత్తు ఫొటో తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆడిషన్కు పిలవడంతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. అలా సుబ్రమణ్యపురంలో నటించే అవకాశం దక్కింది.అయితే ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలుపెట్టారు. ఇలా ఆటో నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాల్లో నటించిన వ్యక్తి.. జీవనం కోసం ఆటో నడపడం చూసి పలువురు ఆయన పట్టుదలను ప్రశంసిస్తున్నారు. మళ్లీ సుబ్రమణ్యపురం 2 వంటి సినిమాలో మంచి పాత్ర దక్కుతుందని మారిముత్తు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విశాల్ మకుటం.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం మకుటం. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మకుటం తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశాల్ మూడు గెటప్ల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్తో పాటు కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు ట్రైలర్ చూసేయండి. -
Dharman: ధర్మన్ మూవీలో ఛాన్స్.. రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్
స్టార్ హీరో సూపర్స్టార్ రజినీకాంత్తో డ్రాగన్ ఫేం దర్శకుడు అశ్వత్ మారిమత్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధర్మన్’. ఈ సినిమాలో రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రజినీకాంత్తో పనిచేసిన అనుభవం.. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో.. ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నటులు ఖైదీలు..రజినీకాంత్ సూపర్స్టార్ హోదా కంటే.. ఆయనలోని గొప్ప విషయాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే రజినీ సార్ ఒక మాట చెప్పారు. నటులు ఖైదీలు అని అన్నారు. తొలిత నాకు అర్థంకాలేదు. తర్వాత అర్థమైంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత మనలోని స్వేచ్ఛని కొంత భాగాన్ని కోల్పోవల్సి వస్తుందని అతని ఉద్దేశం’ అని తెలిపింది. ఈ సినిమాలో రజినీకాంత్ పోషిస్తున్న ధర్మన్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే పాత్ర నాది’ అని పేర్కొంది.ఈ అవకాశం ఎలా వచ్చిందంటే..‘2025లో విడుదలైన డ్రాగెన్ మూవీ నాకు ఎంతగానో నచ్చింది. ఈ విషయమై అశ్వత్కు మెసేజ్ చేశా. త్వరలోనే మనం కలిసి పనిచేద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. గడిచిన కొద్ది రోజుల్లోనే ‘ద టైం హ్యాజ్ కమ్’ అంటూ అతని నుంచి మరో మెసేజ్ వచ్చింది. ఆయన ధర్మన్ కథ వివరించారు. కథ నచ్చడం, రజినీ సార్తో కలిసి పనిచేసేందుకు అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేశా’ అని తెలిపింది. కాగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సిరులు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో వైద్యుడిగా రజినీ వెండితెరని పలకరించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో సిమ్రాన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
సొంత భాష మలయాళంలో తొలుత నటిగా ఎంట్రీ ఇచ్చి ఆపై కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉంది. రీసెంట్ టైంలో నాని 'ప్యారడైజ్'లో ఐటమ్ సాంగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి. అలానే విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లోనూ హీరోయిన్గా చేస్తోంది. ఇవలా ఉండగానే ఓ తమిళ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసింది.(ఇదీ చదవండి: దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్పై విశాల్)తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమాని ప్రకటించారు. డోరోతీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ టీజర్ రిలీజ్ చేశారు. సనత్, రిషీకాంత్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది. ఇదో పీరియాడిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇళయరాజా సంగీతమందిస్తుండగా ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
శ్రీలీల.. ఈ తార కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డాన్స్కి, యాక్టింగ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటున్నా.. విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. అంతేకాదు.. మధ్యలో తప్పుకున్న లెనిన్ సినిమా బ్లాక్బస్టర్గా నిలవడంతో శ్రీలీలకు ఏదీ కలిసి రావడం లేదని అభిమానులు నిరాశపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీలీలకు ఓ భారీ అవకాశం దక్కిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.టాలీవుడ్, కోలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ బిజీగా మారుతున్న ఈ హీరోయిన్కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో చోటు దక్కిందని టాక్ . ఇంతకీ శ్రీలీలకు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? సూపర్స్టార్ రజనీకాంత్. ఆయన 173వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ధర్మాన్' సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్తో శ్రీలీల మరోసారి విజయాల బాట పడుతుందో లేదో చూడాలి మరి. -
దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్పై విశాల్
మూడు నాలుగు రోజుల క్రితం తమిళ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావేరీ జలాల కోసం చేసిన ఓ నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. హీరోయిన్ త్రిష గురించి ద్వందార్థం వచ్చేలా మాట్లాడటం సంచలనమైంది. దీంతో అధికార టీవీకే పార్టీ ఈయన్ని అరెస్ట్ చేసింది. ఆపై బెయిల్పై ఉదయనిధి విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై ఖుష్బూ, చిన్మయి లాంటి సెలబ్రిటీలు.. ఉదయనిధి తీరుని విమర్శించారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా ఈ సంఘటనపై స్పందించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో')"నేను ఉదయనిధి ప్రసంగాన్ని చూశాను. ఎవరు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని పరిమితులు పాటించడం అవసరం. రాజకీయాల్లో ముందుగానే సిద్ధం చేసిన స్పీచ్ మాట్లాడటం ఒకటి, ఆవేశంలో మాట్లాడటం మరొకటి. లయోలా కాలేజీలో నాకు సీనియర్ అయిన విజయ్ ఒకరోజు నా బ్యాచ్మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారని మేమెప్పుడూ ఊహించలేదు. ఉదయనిధి చాలా విషయాలు చూశారు. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. దీనికంటే ఇంకేం ఆశించగలం. ఇదే రాజకీయాలు' అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.విశాల్ హీరోగా నటించిన 'మకుటం' వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే పై వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావొచ్చని పరోక్షంగా కామెంట్స్ చేశాడు. అందులో భాగంగానే ఉదయనిధి అరెస్ట్పై స్పందించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)LATEST 🔔 : Actor #VISHAL About Udhayanithi's ARREST ! • Loyola College Senior (VIJAY) Enga Batchmate -ta (UDHAY) Arrest Panrathu Ellam Nanga Neenaichukuda Pakkala.. 😅• Udhay Pesunathu Thappu -nala Than Police Arrest Pannanga pic.twitter.com/rSukDwmQLx— Prakash Vijay (@PrakazVijay_Of) August 6, 2026 -
చదివిన పాఠశాల రుణం తీర్చుకున్న ధనుశ్.. విరాళం ఇన్ని కోట్లా..
స్టార్ హీరో ధనుశ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాను చదివిన పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. అక్కడ ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా అందించారు. ఈ వార్త తెలిసిన అభిమానులు సోషల్మీడియాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయి సత్య మెట్రిక్యులేషన్ స్కూల్లో ధనుశ్ పదో తరగతి వరకు చదువుకున్నారు. పాఠశాలలో ఉన్న పాత భవనాన్ని తొలగించి, దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి 'ధనుష్ బ్లాక్' అని పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవానికి ధనుశ్ తన సహ విద్యార్థి, సినిమాటోగ్రాఫర్ కుమరన్తో కలిసి హాజరయ్యారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుమరన్ మాట్లాడుతూ.. ‘కిండర్గార్టెన్ నుంచి పదో తరగతి వరకు మేమిద్దరం ఇదే పాఠశాలలో చదివాం. తర్వాత వేర్వేరు మార్గాల్లో వెళ్లినా మా స్నేహం కొనసాగింది. పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుశ్.. కోట్లు ఖర్చుపెట్టి వెంటనే కొత్త భవనం నిర్మించేందుకు ముందుకురావడంతో పాటు మిగిలిన భవనాలను కూడా పునరుద్ధరించి, ఖాళీ స్థలాల్లో కొత్త నిర్మాణాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఆయన చేసిన సాయం మర్చిపోలేనిది’అని ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నటుడిగా, దర్శకుడిగా రెండు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుశ్ ప్రస్తుతం రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. -
సూర్య కంటే మూడింతలు ఎక్కువ సంపాదించా
సినిమా సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లలో సూర్య-జ్యోతిక జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే బంధాన్ని అలా మెంటైన్ చేస్తుంటారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎవరికివాళ్లు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. జ్యోతిక అయితే అప్పట్లో సూర్య కంటే తానే మూడింతలు ఎక్కువ సంపాదించానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)'సూర్య భర్తగా చాలా గొప్ప వ్యక్తి. సమానత్వం అనేది ఆయన మనసులో మొదట నుంచి ఉంది. అది పుట్టుకతోనే రావాలి. అమ్మాయిలకు వంట చేయడం రాకపోయనా ఏదైనా పని ఇష్టం లేదని చెప్పినా సరే అని వదిలేయడం చాలావరకు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మా ఇంట్లో అలానే జరుగుతుంది. నేను ఫెమినిస్ట్గా మాట్లాడటం లేదు. మా ఇంట్లో మేమిద్దరం సమానమే''సినిమాని నిర్మించడం దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం, సెలవుల్లో తిరగడం వరకు ప్రతిదీ మేం కలిసే నిర్ణయం తీసుకుంటాం. ఒకరి ఎదుగుదలని చూసి మరొకరం ఆనందించడం మాకు చాలా ఇష్టమైనది. ఆ రోజుల్లో సూర్య పారితోషికం కంటే నాది మూడింతలు ఎక్కువ. కానీ ఇప్పుడు 30 రెట్లు తగ్గింది' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.ఇకపోతే ఈ ఏడాది 'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. వచ్చే శుక్రవారం.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాతో రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకుడు కాగా నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్బస్టర్: సూర్య) -
కార్తీ ఇంత స్పీడుగా ఉన్నాడేంటి?
తమిళ హీరో కార్తీ స్పీడ్ పెంచాడు. 'సర్దార్ 2' సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థతోనే కార్తీ మరో ప్రాజెక్ట్ లాక్ చేశాడు. దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తమిళ 'జయం'తో డైరెక్టర్ అయిన ఇతడు.. సంతోష్ సుబ్రహ్మణ్యం(బొమ్మరిల్లు రీమేక్), వేలాయుధం, తనీ ఒరువన్ తదితర మూవీస్ చేశాడు. ఇప్పుడు కార్తీ 25వ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు. చివరగా చిరంజీవితో 2022లో 'గాడ్ ఫాదర్' తీసిన మోహన్ రాజా మళ్లీ ఇన్నాళ్లకు మూవీ ఓకే చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)మరోవైపు కార్తీ అయితే యమస్పీడుగా ఉన్నాడు. సర్దార్ 2 రిలీజ్ కానుండగా మార్షల్, హిట్ 4, తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్తో మూవీ చేయాల్సి ఉంది. అలానే లోకేశ్ కనగరాజ్ ఫ్రీ అయితే 'ఖైదీ 2' కూడా చేయాలి. ఇవి కాకుండా మరికొందరు తెలుగు, తమిళ దర్శకులు.. కార్తీతో మూవీస్ చేయాలని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్) -
భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కి తెలుగులో మోస్తరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో ఆకట్టుకున్నాడు. తర్వాత ఆయన కార్ రేస్ పోటీలపై శ్రద్ధ చూపడంతో ఇప్పటి వరకు కొత్త సినిమా ఏంటనేది క్లారిటీ రాలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తీసిన ఆధిక్ రవిచంద్రన్కే డైరెక్షన్ ఛాన్స్ మళ్లీ ఇచ్చాడు. 'డేర్ డెవిల్' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ సినిమాని అజిత్ భార్య, ఒకప్పటి హీరోయిన్ శాలిని నిర్మించనున్నారు. బ్రేవ్ హార్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించారు.కమర్షియల్ అంశాలతో పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని సమాచారం. అనిరుధ్ సంగీతమందింస్తుండగా షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు టాక్. మొత్తం మీద 16 నెలల తర్వాత అజిత్ తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.అలానే అజిత్తో 2000లో పెళ్లి అయిన తర్వాత శాలిని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 26 ఏళ్ల తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇకపోతే అజిత్ 64వ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ చిత్రంలో ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ సైకలాజికల్ హారర్ సినిమా)34 years of breaking barriers, inspiring millions, and redefining stardom. A journey built on passion, perseverance, and unmatched charisma-💥🎲 #DareDevil 🎲💥 is here , This is going to be very Special❤️🙏🏻 Thank you My Sir🙏🏻 #Ajithkumar sir for the Trust & Support❤️🙏🏻Thank you… pic.twitter.com/rW71vGZmTW— Adhik Ravichandran (@Adhikravi) August 3, 2026 -
త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. నెట్టింట పాత వీడియోలు ట్రెండింగ్..!
కోలీవుడ్లో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఇదే ఇప్పుడు కోలీవుడ్తో పాటు తమిళనాడు షేక్ చేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. రాజకీయాల్లోకి రాకముందు విజయ్, ఉదయ్నిధి స్టాలిన్ పలు వేదికలపై మెరిశారు. పలు సినిమా సక్సెస్ ఈవెంట్లకు హాజరయ్యారు. ఈ వివాదం నేపథ్యంలో గతంలో విజయ్తో ఉన్న స్టాలిన్ ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.2008లో వచ్చిన 'కురువి' చిత్రంలో విజయ్, త్రిష జంటగా నటించారు. ఈ మూవీ ఆడియో రిలీజ్తో పాటు150 రోజుల విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయ్, స్టాలిన్, త్రిష ఓకే వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అప్పట్లో ముగ్గురూ ఒకే వేదికపై ఉన్న వీళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే ట్రెండింగ్ టాపిక్. కాగా.. కురువి చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించారు. ఈ సినిమాలో భాగమైనందుకు విజయ్, త్రిషలకు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు. కథానాయికగా ఎంపికైనందుకు త్రిషకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పట్లో ఓకే వేదికపై విజయ్, త్రిష, ఉదయనిధిల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది.Flop aaana #Kuruvi padathuku 150th day success meet celebrate Pannala unaku aaavanumdaa 😹 #Udhayanithi #ThalapathyVijay pic.twitter.com/K1oi5eCJuI— Ãśhïķ (@the_real_ashik) August 4, 2026 -
నెలకు రూ.40 లక్షల భరణం.. అందుకే మేం కోర్టుకెళ్లాం
తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల వ్యవహారంలో మరో ట్విస్ట్. తనతో పాటు పిల్లల మెంటెయినెన్స్ కోసం తన భర్త నెలకు రూ.40 లక్షల భరణం ఇచ్చే సదుపాయం కల్పించాలని ఆర్తి కోర్టుని ఆశ్రయించింది. సదరు పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.3 లక్షలు ఇస్తే చాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఆర్తి తల్లి సుజాత విజయకుమార్ స్పందించారు. భరణం వార్తలని ఖండించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్)'ఆర్తి తన కోసం నెలకు రూ.40 లక్షలు అడగలేదు. రవిమోహన్ వల్ల మాకు చాలా అప్పులు ఉన్నాయి. ఇంటిపై బ్యాంకు జప్తు నోటీసు కూడా జారీ అయింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్ ఖర్చులు భరించడం మాకు చాలా కష్టంగా మారింది. పిల్లల విద్య, కుటుంబ పోషణకు సంబంధించి ఇప్పటికే కోర్టు రవిమోహన్కు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు చదువుతున్న అమెరికన్ స్కూల్ ఏడాది ఫీజు రూ.86 లక్షలు రవిమోహనే చెల్లించాలని కోర్టు తెలిపింది. ఆర్తికి నెలకు రూ.3 లక్షలు, కొడుకులు ఆరవ్, అయాన్లకు తలో రూ.1 లక్ష చొప్పున ప్రతి నెల చెల్లించాలని స్పష్టం చేసింది. పిల్లల అదనపు విద్య, ఇతర కార్యకలాపాల ఖర్చులని కూడా భరించాలని పేర్కొంది' అని సుజాత చెప్పుకొచ్చారు.రవిమోహన్.. పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుందనే ఆరోపణలని కూడా సుజాత ఖండించారు. 'మేమెప్పుడూ పిల్లలు తండ్రిని కలవొద్దని చెప్పలేదు. గత రెండేళ్లుగా ఇరువర్గాలను కలిపేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు కోర్టు క్రమం తప్పకుండా తండ్రి-పిల్లలు కలుసుకునేలా ఆదేశాలు ఇవ్వడం మాకు ఊరటనిచ్చింది. గతంలో ఈ మీటింగ్స్ ఒక హీలర్ సమక్షంలో జరగాలనే రూల్ ఉండేసరికి పిల్లలు అసౌకర్యానికి గురయ్యారు. అందుకే వారు రాలేదు. ఏ తల్లి కూడా పిల్లలని తండ్రికి దూరం చేయాలని కోరుకోదు. ఈ నెల నుంచి కుటుంబంలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను' అని అన్నారు.2009లో పెళ్లి చేసుకున్న రవి మోహన్.. దాదాపు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024 సెప్టెంబరులో ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ విడాకుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి) -
200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్బస్టర్
తమిళ హీరో సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేవారం థియేటర్లలోకి రానున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ మీడియాకు యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే 'రోలెక్స్' గురించి, అలానే 'కంగువ' డిజాస్టర్ కావడం గురించి మాట్లాడాడు. తన నుంచి ఈ ఏడాది మూడో చిత్రం కూడా రానుందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది.. సూర్య ఎమోషనల్)'రోలెక్స్' సినిమా ఎప్పుడు మొదలవుతుందో, లోకేష్ ఏం చేస్తున్నాడో నాకు తెలీదు.. ఆయన ఇప్పటికే అల్లు అర్జున్ మూవీతో పాటు 'విక్రమ్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూల్లో 'రోలెక్స్' స్టోరీ రాస్తున్నానని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. జీతూ మాధవన్తో చేస్తున్న నా మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం' అని సూర్య చెప్పుకొచ్చాడు.రీసెంట్ టైంలో తన సినిమాలకు వచ్చిన ఫలితాల గురించి మాట్లాడిన సూర్య.. "దాదాపు 200 రోజుల పాటు ఎంతో నమ్మకంతో తీసిన మూవీ(కంగువ) పూర్తిగా ఫెయిలైంది. కేవలం 45 రోజుల్లో పూర్తయిన చిత్రం(కరుప్పు) ఈ ఏడాది పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇండస్ట్రీలో విజయానికి ఎలాంటి ఫార్ములా లేదు. ఈ అనుభవాలే దాన్ని మరోసారి గుర్తుచేశాయి. 30 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత కూడా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది' అని అన్నాడు.సూర్య నటించిన 'కంగువ' 2024లో భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నిరాశపరిచింది. దర్శకుడు శివ తీసిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా భారీ నష్టాలని చవిచూసింది. దీని తర్వాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేసిన 'కరుప్పు' ఊహించని సక్సెస్ అందుకుని ఏకంగా రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి) -
త్రిష.. రాజకీయాల్లోకి రావాలి
స్టార్ హీరోయిన్ త్రిష పేరుతో ఆమె అభిమానులు మధురైలో త్రిష ఛారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయిపోయింది. సోమవారం ఈ ఫౌండేషన్ ఆవిర్భావం సందర్భంగా త్రిష, రాజకీయాల్లోకి రావాలంటూ మధురై నగరమంతా భారీ పోస్టర్స్ కనిపించాయి. తమిళనాడు వీరమంగై వేలు నాచియార్ టైటిల్తో త్రిషని సంభోధించారు. స్వాతంత్య్ర పోరాట యోధురాలు వేలు నాచియర్ ఫొటోతో పాటు త్రిషని ఇందులో ముద్రించారు.(ఇదీ చదవండి: నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు: విజయ్ కొడుకు జేసన్)తమిళనాడు సంఘాల చరిత్రలోనే తొలిసారిగా తమ ప్రియమైన సోదరి త్రిష పేరు మీద ఏర్పాటైన మొదటి గుర్తింపు పొందిన సంఘం ఇదే అని పోస్టర్లలో పేర్కొనడం విశేషం. ఏ రాజకీయ పార్టీ ప్రారంభానికైనా మొదటి స్థానం మధురై నగరానిదే. అది కూడా మధురై మీనాక్షి అమ్మవారి దివ్య ఆశీస్సులతో.. అని నినాదాలతో ఆమెని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు పిలుపునిచ్చారు.ఆధ్యాత్మికమైనా, రాజకీయమైనా మధురైలో వెలిసే భారీ పోస్టర్లు తమిళనాడులో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం త్రిష బహిరంగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం, మధురైలో ఈ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లోకి రావాలని కోరడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రీసెంట్గా 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన త్రిష చేతిలో ప్రస్తుతం విశ్వంభర, రామ్ అనే మలయాళ మూవీ ఉంది. మరి ఇవి పూర్తయినా తర్వాత ఏమైనా రాజకీయాలపై దృష్టి సారిస్తుందా లేదంటే నటిగా కొనసాగుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: త్రిష పేరుతో సీఎం విజయ్పై దారుణమైన కామెంట్స్) -
నాకెలాంటి సమస్యలు లేవు: హీరోయిన్
సినిమా తారల గురించి నిజాలే కాకుండా ఒక్కోసారి అవాస్తవాలు ప్రచారం అవుతుంటాయి. అలా హీరోయిన్ ఆత్మిక గురించి రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. హిప్ హాప్ ఆది 'మిసై మురుక్కు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత కోటియిల్ ఒరువన్ చిత్రంలో విజయ్ ఆంటోనికి జంటగా నటించింది. కాటేరి , నరకాసురన్ తదితర చిత్రాల్లోనూ చేసింది. అనంతరం కారణాలు ఏమైనా గానీ సినిమాలు చేయట్లేదు.ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పుకార్లు రావడంతో వాటిపై స్పందించింది. తనకు కలిగిన అనుభవాల్లో కొన్ని విషయాలను తాను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. అయితే అందులో నా భావాలను చూసిన కొందరు నేను ఏదో సమస్యలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఎవరికైనా ఏదో రకంగా ఉపయోగపడుతుందనే నేను నా అనుభవాలని వ్యక్తం చేస్తుంటాను.ఇకపోతే మనం కోరుకున్న జీవితాన్ని ఎంచుకొని జీవించడం అంత సులభం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలని నటి ఆత్మిక చెప్పుకొచ్చింది. చివరగా ఈమె 2023లో వచ్చిన తిరువిన్ కురళ్ అనే మూవీలో కనిపించింది. -
మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది
తమిళ స్టార్ హీరోల్లో పలువురికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వాళ్లలో సూర్య, కార్తి ముందు వరసలో ఉంటారు. అయితే రాధిక తమ కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక సాయం చేసిందని చెప్పిన సూర్య.. ఆమెని ఎప్పటికీ మర్చిపోలేం అని ఎమోషనల్ అయ్యాడు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆడియో లాంచ్ సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'కార్తీ.. అమెరికాలో చదివేందుకు వెళ్లాల్సిన టైంలో వీసా ప్రక్రియలో భాగంగా బ్యాంక్ అకౌంట్లో సరిపడా డబ్బులు ఉండాలి. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు. ఈ విషయం తెలుసుకున్న రాధిక అక్క.. మరో ఆలోచన లేకుండా అవసరమైన మొత్తాన్ని ఇచ్చింది. కార్తీకి కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు ఈ డబ్బులు అకౌంట్లో ఉంచుకోమని చెప్పింది. ఆమె చేసిన సాయాన్ని మా ఫ్యామిలీ జీవితాంతం మర్చిపోదు' అని సూర్య చెప్పుకొచ్చాడు.అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసిన కార్తీ.. చెన్నైకి తిరిగి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకుడు మణిరత్నం దగ్గర 'ఆయుధ ఎళుత్తు'తో పాటు దాని హిందీ వెర్షన్ 'యువ' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే రాధిక.. సూర్య, కార్తీ సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. కార్తీ 'సర్దార్ 2' సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు 'మార్షల్' అనే తమిళం మూవీ.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' తీసిన కల్యాణ్ శంకర్తో, 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను, దర్శకుడు మోహన్ రాజాతోనూ ఓ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?) -
నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు
తమిళ స్టార్ హీరో విజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. అయితే ఈయన వారసుడు జేసన్ సంజయ్.. తండ్రిలానే హీరో అవుతారని అంతా అనుకుంటే దర్శకుడు అయ్యాడు. అలా 'సిగ్మా' మూవీ తీశాడు. లెక్క ప్రకారం గత నెల చివరలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా వేశారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా బోలెడన్ని విషయాలు పంచుకున్న జేసన్.. ఓసారి తాను చేసిన పని ఎంతలా కుటుంబాన్ని కంగారు పెట్టిందో వెల్లడించాడు.(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)'మా అమ్మ ఓ గూఢచారిలా ఉంటుంది. నేను రహస్యంగా ఏం చేయడానికి ప్రయత్నించినా, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినా సరే దొరికిపోయేవాడిని. గతంలో నేను అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటకెళ్లి, తర్వాత రోజు ఉదయం తిరిగొచ్చాను. అయితే అప్పుడు నా ఫోన్ స్విచ్ఛాప్ ఉండేసరికి ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. ఏకంగా మిస్సింగ్ కేసు పెట్టేందుకు రెడీ అయిపోయారు. సరిగ్గా ఆ టైంకి ఇంటికి చేరుకున్నాను' అని జేసన్ సంజయ్ చెప్పుకొచ్చాడు.ఇక తండ్రి ముఖ్యమంత్రి కావడంపై స్పందించిన జేసన్.. దీనిని 'చారిత్రక విప్లవం' అని అన్నాడు. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
షాకిచ్చిన సూర్య-జ్యోతిక.. ఏఐ కాదు నిజమే
డైట్, గ్లామర్ మెంటైన్ చేయాలంటే సామాన్యులకు కష్టం గానీ సెలబ్రిటీలకు చాలా సింపుల్. ఎందుకంటే కొందరు 50-60 ఏళ్లొచ్చినా సరే యంగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ జంట సూర్య-జ్యోతిక కూడా అలానే షాకిచ్చారు. వీళ్లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గత 30 ఏళ్లుగా నటుడిగా చేస్తున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే వారం ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో ఓ పక్క బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు భార్యతో కలిసి ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొన్నాడు. బ్లాక్ అండ్ వైట్, కలర్ గ్రేడింగ్తో ఉన్న ఈ ఫొటోల్లో డిజైనర్ దుస్తుల్లో వీళ్లిద్దరూ కనువిందు చేశారు. ఇవి చూసిన చాలామంది వీళ్లకు వయసు తగ్గుతోందా? అని మాట్లాడుకుంటున్నారు.సూర్య సినిమాలతో బిజీగా ఉండగా జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హిందీలో మూవీస్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె 'సిస్టమ్' అనే వెబ్ సిరీస్ చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న దీనితో సక్సెస్ అందుకుంది.(ఇదీ చదవండి: మెడలో తాళితో 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ ప్రియాంక) -
భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో
తమిళ హీరో రవిమోహన్ అలియాస్ జయం రవి జీవితంలో ఇటీవల కాలంలో చాలానే సంఘటనలు జరుగుతున్నాయి. మనస్పర్థల కారణంగా భార్య ఆర్తితో విడాకుల వరకు పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. పిల్లల సంరక్షణ, ఇతరత్రా మనోవర్తిగా నెలకు రు. 40 లక్షలు అందించేలా ఆదేశించాలని ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నెలకు రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పిల్లలను చూడటానికి రవికి అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే రవిమోహన్ ఇటీవల దర్శక,నిర్మాతగా మారాడు. రవిమోహన్ స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంగా నటుడు యోగిబాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో 'యాన్ ఆర్డినరీ మ్యాన్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అలానే తాను హీరోగా 'బ్రో కోడ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదలా ఉండగా రవిమోహన్.. 'తల్లిదండ్రుల అభినందనలు ప్రతి పిల్లలకు లభించాలి. ఇటీవల నేను దర్శకత్వం వహిస్తున్న యాన్ ఆర్డినరీ మ్యాన్ చిత్రంలోని కొన్ని సీన్స్, నేపధ్య సంగీతాన్ని మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాను. నా కుటుంబం. ప్రత్యేకంగా మా నాన్న నా కోసం చాలా సంతోషంగా చప్పట్లు కొట్టిన తరుణం ఒక్కో పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి లభించాలి అని నేను మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను' అని ఈయన తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పు డు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. రవిమోహన్ కథానాయకుడిగా జీనీ అనే ఫాంటసీ మూవీతో పాటు రాజకీయ నేపధ్యంలో సాగే కరాటే బాబు, మిరుదన్ 2 త్వరలో రిలీజ్ కానున్నాయి. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) -
సూర్యతో ఉన్న తల్లీకూతుళ్లని గుర్తుపట్టారా? ఇద్దరూ నటులే
అప్పుడప్పుడు నటీనటులు షేర్ చేసుకునే పాత ఫొటోలు చిత్రంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో సరదా కోసం స్టార్ హీరోహీరోయిన్లతో కొందరు పిక్స్ తీసుకుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత మళ్లీ వాళ్లని కలిసేసరికి తెగ ఆనందపడిపోతుంటారు. ఈ నటి అలాంటి అనుభూతి చెందింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)పైన సూర్యతో కలిసున్న తల్లీకూతుళ్లు తమిళ సినిమాల్లో చేస్తున్న నటులే. పెద్దావిడ పేరు శ్రీజ. ఈమె సీనియర్ నటి. తమిళ, మలయాళంలో చాలానే మూవీస్ చేస్తోంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లోనూ నటించింది. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈమె కూతురు, నటి రవీనా కూడా లొకేషన్కి వెళ్లింది. భర్తతో కలిసి సూర్యని కలవడంతో పాటు తన చిన్నప్పుడు కలిసి సందర్భాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా ఈ రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.ఇకపోతే పాప పేరు రవీనా. 'లవ్ టుడే' మూవీలో ప్రదీప్ రంగనాథన్కి అక్కగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నటిగా ఫేమస్ అయింది కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి.. ఓకే బంగారం, ప్రేమమ్(మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది ఈమెనే.ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల నేపథ్య కథతో తీసిన సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఈ ఏడాది మే నెలలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: అలాంటి పాత్రలు చేయడం మానేశా.. కానీ రజనీకాంత్ కోసం) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
అలాంటి పాత్రలు చేయడం మానేశా
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైవిధ్యమైన సినిమాలు, భిన్నమైన పాత్రలు గుర్తొస్తాయి. రీసెంట్ టైంలో రిలీజ్ల పరంగా కాస్త నెమ్మదించినప్పటికీ చేతిలో చాలానే ఉన్నాయి. అందులో పూరీ జగన్నాథ్ తీసిన 'స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్' కూడా ఒకటి. పెద్దగా హడావుడి లేకుండా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇతడు.. అతిథి పాత్రలు మానేయడంపై క్లారిటీ ఇచ్చాడు. అలానే 'జైలర్ 2' విషయంలో ఈ రూల్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)'నేను మిగతా సినిమాల్లో అతిథి పాత్రలు చేయడం ఎప్పుడో మానేశా. రజనీకాంత్ కోసమే ఈ నిబంధన బ్రేక్ చేశాను. ఆయనతో కలిసి పనిచేయాలని 'జైలర్ 2'కి ఓకే చెప్పాను. ఎందుకంటే పోస్టర్పై రజనీ సర్ ఫొటో ఉంటే అందరి దృష్టి ఆయనపై ఉంటుంది. కానీ వేరే చిత్రాల్లో మాత్రం అతిథి పాత్రలు చేసినప్పుడు పోస్టర్పై నన్నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. దీని ప్రభావం నేను హీరోగా చేస్తున్న మిగతా సినిమాలపై పడుతోంది. అందుకే అతిథి పాత్రలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను' అని సేతుపతి చెప్పాడు.గతంలో విలన్, అతిథి పాత్రల పరంగా విక్రమ్, జవాన్, సైరా నరసింహారెడ్డి, మాస్టర్ తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం అయితే అన్ని హీరోగా చేస్తున్న చిత్రాలే. గతంలో రజనీకాంత్ 'పేట'లో విజయ్ సేతుపతి విలన్గా చేయగా.. ఇప్పుడు మాత్రం అతిథి పాత్ర పోషించాడు. దీపావళి కానుకగా 'జైలర్ 2'.. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సినిమా)#Jailer2 లో క్యామియో రోల్ చేసినట్లు ధ్రువీకరించిన #VijaySethupathi. pic.twitter.com/pl2S7Vw7bX— Yagna The Journalist (@yagnamurthy) August 2, 2026 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న హిట్ మూవీ.. నంబర్వన్గా ట్రెండింగ్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ జూలై 31 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇండియావ్యాప్తంగా ట్రెండింగ్ సినిమాల లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. కాగా.. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. -
సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఎలాంటి హడావుడి లేకుండానే రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు పంచుకోవడంతో పాటు కాబోయే భర్తని పరిచయం చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా ప్రేమకథ?(ఇదీ చదవండి: శరీరం మారింది... ఆలోచనలు మారాయి: నటి పునర్నవి)పుదుచ్చేరిలో పుట్టిన మిర్నాళిని రవి.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమైంది. దీని తర్వాత 'గద్దలకొండ గణేశ్' మూవీలో హీరోయిన్ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర మూవీస్ కూడా చేసింది. వీటితో పాటు తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, ఎమ్జీఆర్ మగన్, జంగో, కోబ్రా తదితర మూవీస్ చేసింది. చివరగా 2024లో 'రోమియో' అనే తమిళ చిత్రంలో నటించింది.గత రెండేళ్లుగా యాక్టింగ్కి దూరమైన ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా తనకు నిశ్చితార్థమైన విషయాన్ని బయటపెట్టింది. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. గత ఏడేళ్లుగా స్నేహితులైన వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. చూస్తుంటే నటనకు మిర్నాళిని వీడ్కోలు చెప్పేసినట్లే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) -
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగిన రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఇదంతా జరగడానికి కొన్నాళ్ల ముందు వ్యక్తిగతంగా విషయాల కారణంగా ఈయన వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)భార్యతో విడాకులు, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే కొడుకు జేసన్ ఏం మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం లాంటివి జరిగేసరికి విజయ్, అతడి కొడుకు జేసన్ల మధ్య దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ మాటాలు వింటే అలాంటిదేం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి కావడంపై జేసన్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ రాజకీయ విజయాన్ని 'చారిత్రక విప్లవం'గా అభివర్ణించిన జేసన్.. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.దర్శకుడిని కాకముందు తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు ఉండేవని జేసన్ గుర్తుచేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని, తర్వాత క్రికెటర్ కావాలని బలమైన కోరిక ఉండేది. 'నాకు క్రికెట్ అంటే పిచ్చి. బ్యాటింగ్ చేయడం ఇష్టం. కానీ నా అసలు ప్రతిభ బౌలింగ్లోనే ఉంది. ఇంటర్లో ఉన్నప్పుడు కథలు చెప్పడం, సినిమాలు తీయడంపై ఆసక్తి వచ్చింది. దీంతో ఇదే నా కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాక ఏం చేయాలనుకుంటున్నానో క్లారిటీ వచ్చింది. మా నాన్న విజయ్ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది నా కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను' అని జేసన్ చెప్పుకొచ్చాడు.జేసన్ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో కాగా తమన్ సంగీతమందించాడు. లెక్క ప్రకారం జూలై 31నే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)This is “HISTORIC REVOLUTION” - #JasonSanjay about his father @actorvijay’s Election Victory 🔥 pic.twitter.com/RWF6wkNIvP— Vijay Fans Trends (@VijayFansTrends) August 1, 2026 -
ఓటీటీకి వంద దేవుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ మూవీకి శశి దర్శకత్వం దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బిచ్చగాడు కాంబో రిపీట్ అయిన అంతగా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్ను జీ5 దక్కించుకోగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. An emotional family entertainer is ready to warm your heart...❤️🔥Family blockbuster of the year #NooruSaami premieres on August 7th on Tamil Zee5.❤️@vijayantony #Sasi @vijayantonyfilm @AJDhishan990 #Swasika @karunaasethu @jose_lijomol @Sakthi_Raj7 #BalajiSakthivel @kavyaanil_… pic.twitter.com/WT3yOeUIH9— Zee 5 Tamil (@ZEE5Tamil) July 31, 2026 -
హీరోగా స్టార్ డైరెక్టర్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు.ఇవాళ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. 'తప్పు చేస్తే దండించడానికిపోలీసులు వస్తారు.. కానీ, ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడుగుతారయ్యా' అనే డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వామికా గబ్బీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక కంటెంట్కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ హిట్ కామెడీ సిరీస్ హార్ట్ బీట్ సీజన్-3 స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతంలో రిలీజైన రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో మేకర్స్ మరో సిరీస్ తెరకెక్కించారు. ఈ హార్ట్ బీట్ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సూపర్ హిట్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. గతంలో రిలీజైన ఈ హార్ట్బీట్ సిరీస్కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిపై మాధవన్ ప్రశంసలు
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.. తన సోషల్ మీడియాలో ఓ స్ఫూర్తిదాయక నిజజీవిత కథని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతాప్ మురుగన్ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రతాప్.. జిల్లాలో వేల సంఖ్యలో పాడుబడ్డ బోర్వెల్స్ గమనించారు. ఓవైపు రైతులు నీటి కోసం మరింత లోతుగా బోర్వెల్స్ తవ్వుతుంటే ఫలితం ఉండట్లేదు. మరోవైపు వర్షాకాలంలో భారీగా వర్షపు నీరు కాలువలు, డ్రైనేజీల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోందని కలెక్టర్ గుర్తించారు.(ఇదీ చదవండి: గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి)దీనికి పరిష్కారంగా జిల్లాలోని 1200కు పైగా పాడుబడ్డ బోర్వెల్స్ని వర్షపు నీటి సంరక్షణ యూనిట్లుగా మార్చే ప్లాన్ అమలు చేశారు. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్నే ఉపయోగించి వర్షపు నీటిని భూమిలోకి చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రాజెక్టు అమలు చేయడంలో స్థానిక ప్రజలని కూడా భాగస్వాములని చేయడం విశేషం. ఇలా తక్కువ ఖర్చులోనే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.తొలి వర్షాకాలం తర్వాతే ఈ ప్రాజెక్టు ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టం ఐదు నుంచి పది అడుగుల వరకు పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన బావుల్లో మళ్లీ నీరు చేరింది. పనిచేయని చేతి పంపులు తిరిగి పనిచేయడం మొదలుపెట్టాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.విరుదానగర్ జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ప్రతాప్ మురుగన్.. చిన్నప్పటి నుంచే నీటి విలువను దగ్గర నుంచి తెలుసుకున్నారు. పెరిగి పెద్దయిన తర్వాత ఐఏఎస్గా ఈ కార్యక్రమాన్ని మరింత పక్కాగా అమలు చేయడంలో విజయం సాధించారు. ఇక మాధవన్ ప్రశంసలతో ప్రతాప్ మురుగన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. (ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?) -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
స్టార్ హీరో భార్యకు రూ.40 లక్షల భరణం.. కోర్ట్ షాకింగ్ తీర్పు
తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇతడికి అనుకూలంగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)రవి మోహన్ నుంచి అతడి భార్య ఆర్తి, నెలకు రూ.40 లక్షల భరణం (మెయింటెనెన్స్) కోరింది. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ డిమాండ్ తిరస్కరణకు గురైంది. కేసు తుది తీర్పు వచ్చేవరకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లించాలని రవిమోహన్ని కోర్టు ఆదేశించింది. అలానే ఈ దంపతుల ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్లని తండ్రి రవిమోహన్ కలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేసింది.గత కొన్నాళ్లుగా తన పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుంటోందని రవిమోహన్ బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కొడుకులకు పాఠశాలకు సెక్యూరిటీతో పంపుతున్నారని, వారు కారు ప్రమాదానికి గురైన విషయాన్ని కూడా తనకు చెప్పలేదని రవిమోహన్ గతంలో ఆరోపించారు. ఆ ప్రమాదం గురించి వేరే వాళ్ల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని, పిల్లల గురించి ఆందోళన ఉన్నప్పటికీ వారిని కలిసే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయంలో ఈ హీరోకి ఊరట దక్కింది.2009 జూన్లో రవిమోహన్, ఆర్తి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్లపాటు కొనసాగిన వీళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. 2024 సెప్టెంబరులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు రవిమోహన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆర్తి అప్పట్లో చెప్పింది. అప్పటి నుంచి ఈ విడాకులు కేసు.. భరణం, పిల్లల సంరక్షణ హక్కులు, వ్యక్తిగత ఆరోపణలు తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రవి మోహన్కి అనుకూలంగా వచ్చాయి.(ఇదీ చదవండి: తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత) -
సీఎంగా విజయ్.. తమిళ హీరోలు ఇలా బయటపడుతున్నారేంటి?
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.అయితే విజయ్కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)#Vishal 🔥 pic.twitter.com/L6gFlHmgab— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) July 28, 2026 -
హిట్ హీరో.. హిట్ దర్శకుడు కలిసి!
రీసెంట్ టైంలో వేర్వేరు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ హీరోగా 'గట్ట కుస్తీ' రెండు మూవీస్ తీసి హిట్స్ అందుకున్న దర్శకుడు చెల్లా అయ్యావు. తొలిసారి హీరో కమ్ దర్శకుడిగా చేసి ఘనవిజయాన్ని అందుకున్న కెన్ కరుణాస్. ఇప్పుడు వీళ్లిద్దరే కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.గట్ట కుస్తీ 2 చిత్రంలో కీలకపాత్ర చేసిన నటుడు కరుణాస్కు దర్శకుడు సెల్లా అయ్యావు తో మంచి స్నేహం ఏర్పడిందని, దీంతో ఆయన దర్శకత్వంలో తన కొడుకు కెన్ కరుణాస్ హీరోగా మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే చెన్నైలోని పలు థియేటర్లలో ఈ మూవీ షోలని మధ్యలోనే నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)వయలెన్స్ ఉందనే కారణంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా సరే కొందరు ప్రేక్షకులు తమతోపాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్లకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం చెన్నైలోని పలు మల్టీప్లెక్స్ల్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇది రూల్స్కి విరుద్ధం కావడంతో షోలు ఆపేశారు.ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులని థియేటర్లలో నుంచి బయటకు పంపేందుకు దాదాపు గంట పట్టింది. ఫలితంగా కొన్నిచోట్ల షోలు ఆలస్యమయ్యాయి. మరోసారి నిబంధనలని గుర్తుచేస్తూ మైనర్లతో వచ్చేవాళ్లని మల్టీప్లెక్స్ల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశాయి.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్గా దీన్ని తీశారు. అసలైన పాయింట్ తీసుకుని మిగతాది అంతా యాక్షన్తో నింపేశారని, దీంతో వరస్ట్గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవ్వాలి కానీ సెన్సార్ సమస్యలని దాటుకుని గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.(ఇదీ చదవండి: నా కథ, స్క్రీన్ప్లే దొంగిలించారు) -
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026 -
క్రీస్తు జీవిత చరిత్రతో 'ప్రజాపతి'
యేసుప్రభు జీవిత చరిత్రతో ఇంతకుముందు పలు సినిమాలు వచ్చాయి. తాజాగా 'ప్రజాపతి' పేరుతో మరో మూవీ తెరకెక్కబోతోంది. అల్లేలూయ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ సమర్పణలో బి.రూబెర్ట్ కథ,దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రమిది. ప్రజాపతి పేరుతో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ఈయన గత 25 ఏళ్లుగా నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కాగా ప్రభు ఆదేశాలు మేరకు ఈ నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పూనుకున్నట్లు బి.రూబెర్ట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.చిత్ర నిర్మాణానికి ముందే ట్రైలర్ను రూపొందించడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపతి చిత్ర ట్రైలర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్న రూపేష్ ఆహ్వానించడంతో ఇందులో పాల్గొనడానికి అంగీకరించాను. ఎందుకంటే ఇది ఈ కాలంలో జరగాల్సిన ముఖ్యమైన ప్రయత్నం గా నేను భావించాను. ఇప్పుడు సమాజానికి మంచి విషయాన్ని ప్రకటించడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో అక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకునే విధంగా రూపొందాలని సూచించడంతో పాటూ శుభాకాంక్షలు అందించారు. చిత్ర ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. -
'రాయన్'కి జాతీయ అవార్డ్.. విమర్శలకు ధనుష్ కౌంటర్
2024కి సంబంధించి కొన్నిరోజుల క్రితం జాతీయ సినీ అవార్డులని ప్రకటించారు. అయితే వీటిపై చాలానే విమర్శలు వచ్చాయి. కొన్ని చిత్రాలకు అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శించారు. అలా ట్రోల్స్ బారిన పడ్డ మూవీ 'రాయన్'. ఉత్తమ తమిళ సినిమాగా దీనికి పురస్కారం దక్కింది. ఈ విషయమై హీరో ధనుష్ని పలువురు విమర్శించారు. ఇప్పుడు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇంట విషాదం)చెన్నైలో ఆదివారం, ధనుష్ పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. తన చిత్రానికి జాతీయ అవార్డ్ ప్రకటించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. అప్పట్లో ఒక్కరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు.'మైయిళగన్(సత్యం సుందరం), మహారాజా సినిమాలు 'రాయన్' కంటే బాగున్నాయి. ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకొంటాను. కానీ గతంలో నేను నటించిన పుదుపెట్టై, వడచెన్నై, కర్ణన్, మరియన్, రన్ఝానా తదితర చిత్రాలు విడుదలైన టైంలో జాతీయ అవార్డులకు అర్హమైనవని బలంగా వాదించిన వాళ్లు చాలా తక్కువమంది. ఇప్పుడు నాకు వచ్చిన జాతీయ అవార్డుని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ గతంలో నాకు ఇదే అవార్డులు రాకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నాకు సపోర్ట్గా మాట్లాడలేదు' అని ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్లో 'కర' సినిమాతో వచ్చిన ధనుష్.. ప్రస్తుతం 'ఓం' సినిమా చేస్తున్నాడు. అక్టోబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'అమరన్' తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)Thalaivan #Dhanush Speech about Raayan controversy.. 🤍#DhanushBloodDonationCamp #OM pic.twitter.com/Ty4F9xlQnG— Director vky (@vkycinecrave) July 26, 2026 -
జన నాయగన్.. మూడు రోజులైనా ఆ మార్క్ దాటలే..!
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 23న రిలీజైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కు దాటిన జన నాయగన్.. మూడో రోజు కూడా అదే జోరు కనిపించింది.ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్కుకు చేరువగా వచ్చేసింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా రూ. 171.84 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా కేవలం ఇండియాలోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. అయినప్పటికీ విజయ్ నటించిన 'లియో' (2023), 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (2024) సాధించిన వసూళ్ల కంటే వెనకంజలోనే ఉంది. గతంలో 'లియో' చిత్రం మూడో రోజు ఇండియాలో రూ. 38.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గోట్ మూవీ సైతం రూ. 33.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ ప్రకారం జన నాయగన్' ఇండియాలో మూడో రోజు రూ. 28.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో మరో రూ. 20 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 108.34 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రూ. 92.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. విదేశాల్లో రూ. 63.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా రూ. 171.84 కోట్లకు చేరుకున్నాయి.కాగా.. ఈ చిత్రంలో విజయ్ 'వెట్రి కొండన్' అనే మాజీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఆయన తన దత్తపుత్రికగా 'విజి' పాత్రలో మమితా బైజు కనిపించింది. ఈ మూవీ పూజా హెగ్డే హీరోయిన్గా మెప్పించగా.. బాబీ డియోల్ 'జాన్ హిమ్లర్' అనే విలన్ పాత్రను పోషించారు. -
ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే
సూర్య స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.'గతంలో ధనుష్తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మరో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)#VishwanathAndSons is not a bilingual like #Vaathi. The film was shot in Tamil only and dubbed into Telugu.It made more sense to me as a director and my actors were comfortable.- #VenkyAtluri pic.twitter.com/oF0Q73eCbx— telugucinema.com (@thetelugucinema) July 24, 2026 -
ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)'ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సర్తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. 'జన నాయగన్' విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది' అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది.ఆనంది.. స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుం కాలంగళ్', 'కల్లికట్టు పళ్లికూడం' తదితర సీరియల్స్లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. 'డాన్స్ జోడీ డాన్స్ 3.0', 'జోడి నెం.1' సీజన్ 6, 7, 'మానాడా మయిలాడా' సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య 'కరుప్పు', గట్టకుస్తీ 2 చితాల్లో కనిపించింది.ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలావరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హెచ్.వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 'జన నాయగన్' మూవీకి తొలిరోజు రూ.78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఈ చిత్రం రీమేక్ ఇది.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Actress #Anandhi, who was in tears after watching #Vijay's #JanaNayagan in theatres yesterday, has openly expressed her sadness over the editing of her scenes in the film directed by #HVinoth. pic.twitter.com/RJcEnVfrQX— Chennai Times (@ChennaiTimesTOI) July 24, 2026 -
'చాలా బాధగా ఉంది'.. జన నాయగన్పై త్రిష మదర్ రివ్యూ
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీని హీరోయిన్ త్రిష కూడా వీక్షించారు. చెన్నైలోని రోహిణి థియేటర్కు వెళ్లిన ఆమె జన నాయగన్ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాకుండా ఈ మూవీని త్రిష మదర్ కూడా జన నాయగన్ చూశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.విజయ్ జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించామని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ అన్నారు. ఈ మూవీని ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఇది ఆయన చివరి చిత్రం కావడం నాకు బాధగా ఉందన్నారు. మేము ఆయనను చాలా మిస్ అవుతామని ఉమా కృష్ణన్ నిరాశ వ్యక్తం చేశారు. -
జన నాయగన్.. విజయ్ పారితోషికం అన్ని కోట్లా?
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమా రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాకు దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్కు ఏకంగా రూ. 220 కోట్ల నుంచి రూ. 275 కోట్ల వరకు చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓ ఇండియన్ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.మరోవైపు ఓ నివేదిక ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్కు ఈ సినిమా కోసం రూ. 25 కోట్లు అందుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఆయన కెరీర్లోనే అతిపెద్ద పారితోషికం కానుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏకంగా రూ. 13 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డేకు రూ. 6 కోట్ల వరకు ముట్టజెప్పారని సమాచారం. విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్కు రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య అందుకున్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ మూవీతో ప్రకాష్ రాజ్ రూ. 5 కోట్లు సంపాదించగా.. ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్లకు చెరో రూ. 3 కోట్లు చెల్లించారని టాక్. ఈ మూవీ కోసం నరైన్ రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు. మమితా బైజు రెమ్యునరేషన్ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికాలపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదువ లేకుండా పోయింది. ఏ భాషలో రిలీజైనా సరే డబ్బింగ్ వర్షన్లో ఓటీటీలో చూసేస్తున్నారు. ఓటీటీలతో కొత్త కొత్త కంటెంట్, మరింత ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. తాజాగా మరో లేటేస్ట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈగో రామన్. ఈ మూవీకి గణేషన్ నాచిముత్తు దర్శకత్వం వహించారు. ఒక సివిల్ సర్వీస్ ఆశించే యువకుడికి, అతని మాజీ ఉపాధ్యాయుడికి మధ్య జరిగే మానసిక సంఘర్షణ, అహం (ఈగో) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం జూలై 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది. అమెజాన్తో పాటు ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సిబి చంద్రన్, రోబో శంకర్, కీర్తన శ్రీకుమార్, కవిత రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు.#EgoRaman (Tamil)Streaming from July 24 on Prime Videoand Simply South 🍿!!#OTT_Trackers pic.twitter.com/mFta1yHoNr— OTT Trackers (@OTT_Trackers) July 23, 2026 -
దళపతి విజయ్ కాదు.. సీఎం జోసెఫ్ విజయ్
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.ఈ సందర్భంగా థియేటర్లలో ఆసక్తికర సన్నివేశం కనిపించిది. ఇప్పటి వరకు దళపతి విజయ్ అని పడిన టైటిల్ కార్డు.. ఇప్పుడు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ థియేటర్లలో కనువిందు చేసింది. సీఎం విజయ్ అని స్క్రీన్మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది కూడా విజయ్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ఆయన చేసిన సంజ్ఞతో ఈ టైటిల్కార్డు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి డీఎంకేను విజయ్ ఎద్దేవా చేస్తూ ఓ సైగ చేశారు. ఆ స్టిల్ నెట్టింట తెగ వైరల్ కాగా.. ఇప్పుడదే థియేటర్లో కనిపించడంతో ఆ వీడియోలు అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. #JanaNayagan Santhosa Padratha illa varuththa Padratha theriyala 🥺 any way love you na @actorvijay 🫂 forever ♾️ ni maddum than 🫀 pic.twitter.com/MvZJC0yEqf— Sai Jegadheesh (@saijegadheeshh) July 23, 2026 -
విజయ్ జన నాయగన్.. త్రిష ఏ థియేటర్లో చూశారంటే?
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.జన నాయగన్ రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టైమ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన త్రిష కృష్ణన్ గురించి చర్చ మొదలెట్టారు. ఈ మూవీని చూసేందుకు ఆమె చెన్నైలోని రోహిణి థియేటర్కు విచ్చేశారు. ఈ సందర్భంగా జన నాయగన్ మూవీ ఆమె వీక్షించారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్లో త్రిష పేరు మార్మోగిపోయింది. గతంలో త్రిష, విజయ్ పలుమార్లు కలిసి తెరపై జంటగా కనిపించారు. వీరిద్దరు తొలిసారిగా 2004లో 'గిల్లి' చిత్రంలో నటించారు. ఆ తర్వాత 'తిరుపాచి', 'ఆతి', 'కురువి' చిత్రాల్లో మెప్పించారు. 2023లో విడుదలైన 'లియో' చిత్రంలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి కనిపించారు. విజయ్ నటించిన 'గోట్' చిత్రంలో త్రిష అతిథి పాత్రలో కూడా కనిపించింది. Actress #Trisha watched Chief Minister Joseph Vijay film #Jananayagan at Rohini Theatre in Chennai... pic.twitter.com/Ql9KOKIuIH— Gv (@gowtham0725) July 23, 2026 -
బ్లాస్ట్ దర్శకుడికి లక్కీచాన్స్!
తన తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న తమిళ యువ దర్శకుడు సుభాష్ కె రాజ్.. రెండో సినిమా అగ్ర కథానాయకుడితో చేయనున్నారని సమాచారం. బ్లాస్ట్ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ డైరెక్టర్ భారీ ఆఫర్ అందుకున్నట్టు కోలివుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విలక్షణ నటుడు సియాన్ విక్రమ్ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించున్నాడని తాజా అనధికార సమాచారం. ఆయనకు కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుభాష్ కె రాజ్ చెప్పిన కథ విక్రమ్కు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు చియాన్ ఓకే అన్నారని సమాచారం.దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథం శిష్యుడైన సుభాష్ కే రాజ్ (Subash K. Raj).. బ్లాస్ట్ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు డబ్బింగ్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీలో మిస్.. సెకండ్ చాన్స్!నిజానికి బ్లాస్ట్ సినిమాలో అర్జున్ పోషించిన పాత్రకు ముందుగా విక్రమ్నే అనుకున్నారట దర్శకుడు సుభాష్ కే రాజ్. అనివార్య కారణాలవల్ల తన మొదటి సినిమాలో విక్రమ్ నటించకపోయినా రెండో చిత్రంలో ఆయనను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నాడని కోలివుడ్లో టాక్ నడుస్తోంది. తన రెండో సినిమాకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్.చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!63వ చిత్రంలో విక్రమ్వీరధీర సూరన్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న హీరో విక్రమ్ చిన్న బ్రేక్ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ఇరుముగన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆనంద్ శంకర్ సినిమా తర్వాత సుభాష్ కె రాజ్ డైరెక్షన్లో విక్రమ్ నటిస్తారని సమాచారం. -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్తోనే మరింత హైప్ తీసుకొచ్చింది. -
విజయ్ జన నాయగన్.. అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్..!
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న తొలి సినిమా జన నాయగన్. రాజకీయాల్లో ఎంట్రీకి ముందు ఇదే చివరి సినిమా అని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఇప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో జన నాయగన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే మూడు భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్తో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టికెట్ బుకింగ్ ప్రీ-సేల్స్లో అత్యధిక వాటా తమిళ వెర్షన్ కావడం విశేషం. ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది, అడ్వాన్స్ బుకింగ్లలో రూ. 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో రూ. 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగరాల విషయానికొస్తే బెంగళూరు రూ. 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై (పరిమిత ఓపెనింగ్స్తో) రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరు రూ. 90 లక్షలతో మూడవ స్థానంలో ఉండగా,.. హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తరువాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోట్ సినిమాలతో పోలిస్తే.. జన నాయగన్ కాస్తా వెనకంజలోనే ఉంది.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న విడుదల కానుంది. -
రజిని, కమల్ మూవీ బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?
లేడీ సూపర్స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.సూర్యతో నయన్ ఢీ..అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. -
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
-
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
జాతీయ అవార్డ్ ప్రకటన.. చైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్ ఎమోషనల్
తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2024 ఏడాదిలో రిలీజైన సినిమాలకు గానూ ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు సైతం సత్తాయి చాటాయి. కమిటీ కుర్రోళ్లు మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే కోలీవుడ్లో పలు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. అయితే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మూవీ మహారాజా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైల్ట్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్కు జాతీయ అవార్డ్ దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్లో వీక్షించిన సచనా.. తనపేరు వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడుస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026 -
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్
తెలుగులో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ షర్మిలా మాండ్రే పెళ్లి చేసుకుంది. తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని కాస్త ఆలస్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తోటీ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన షర్మిలా మాండ్రే..2007 నుంచి దక్షిణాదిలోని తెలుగు, కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో 2013లో వచ్చిన అల్లరి నరేశ్ 'కెవ్వు కేక' మూవీలో హీరోయిన్గా చేసింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు చిత్రాల్లో నటించింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్షిప్ మెంటైన్ చేసింది.గత నెల 28న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ నెల 12వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలని వారం రోజులు ఆలస్యంగా షర్మిలా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సుందరం అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం షర్మిలా తమిళంలో ఓ మూవీ చేస్తుండగా, సుధాన్ తన ప్యాషన్ స్టూడియోస్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ సేతుపతితో 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో ప్రిన్స్) -
జన నాయగన్.. కోలీవుడ్లో తగ్గిన క్రేజ్.. అక్కడ మాత్రం రికార్డ్!
విజయ్ హీరోగా వస్తోన్న చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.ఇప్పటికే జన నాయగన్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో జన నాయగన్ దూసుకెళ్తోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 95 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు.కేవలం ఒక్క తమిళనాడులోనే ఒక్క రోజే 12 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. కేరళలో ఏకంగా 83 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. కేరళలో కేవలం 17 నిమిషాల్లో పదివేల టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో కోలీవుడ్ కంటే మలయాళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండడం మరో విశేషం. ఈ డిమాండ్ చూస్తుంటే జన నాయగన్ పట్ల ఉన్న భారీ క్రేజ్ అర్థమవుతోంది. ఇవాల్టి నుంచి మరిన్ని రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవనున్నాయి. GAME ON — 🫰🔥#JanaNayagan sold 12,000+ Tickets at Tamilnadu Box-office from it's very limited shows ( 71** ) ✊💥Real-time Pre-sales 22.43 Lakhs & Counting*** 📈💥More shows will open in coming hours, Stay tuned for Real-time updates 📌#ThalapathyVijay𓃵… pic.twitter.com/kwxzaSgyeM— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 83000+ Tickets sold for #JanaNayagan at Kerala Box-office within just 18 Hours after bookings opened ✊💥Real-time Pre-sales touched 1.40 CRORES Mark as more shows will open in coming days 📈Total Ww opening day advances gone past 13.25 Crores 🙏🔥Just 4 More days to go 🔜… pic.twitter.com/rzClqQv5Oh— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 -
కోలీవుడ్ కు కయాదు ఫీవర్...
-
'మాకు సీఎం కేక్ కావాలి'.. విజయ్ బర్త్ డేకు జాక్పాట్
దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారే సీఎం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే విజయ్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు పండుగలా జరుపుకున్నారు. హీరోయిన్ త్రిష సైతం విజయ్ బర్త్ డే రోజు కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే విజయ్ పుట్టినరోజు ఓ బేకర్ యజమానికి అనూహ్యంగా కలిసొచ్చింది. జూన్ 22న నటి త్రిష పంచుకున్న పుట్టినరోజు ఫోటోలో తమ కేక్ కనిపించిందని యజమాని తన్వి బొకారియా తెలిపారు. ఆ రోజు నుంచే ఆ ఫోటోలోని మామిడి వెనీలా కేక్ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు వారాల్లో అదే కేక్ కోసం సుమారు 300 నుంచి 400 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.బేకర్ యజమాని మాట్లాడుతూ.. "మాకు రాత్రికి రాత్రే గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ కేక్ ఏ సందర్భం కోసమో మాకు అస్సలు తెలియదు. అది చాలా ప్రత్యేకమైనది.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రెండు వారాలుగా అమ్మకాలతో చాలా బిజీగా ఉన్నాం. అందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. నా బృందం సీఎం జోసెఫ్ విజయ్ వీరాభిమానులు" అని అన్నారు. ప్రస్తుతం మామిడి కేక్ బదులు సీఎం కేక్ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారని బొకారియా అన్నారు. కాగా.. విజయ్ సీఎం అయ్యాక త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
దర్శకుడికి జాక్ పాట్.. గిఫ్ట్గా బంగారు గొలుసు, ఖరీదైన కారు
విష్ణు విశాల్ హీరోగా, నిర్మాతగా చేసిన సినిమా 'గట్ట కుస్తీ 2'. రెండు వారాల క్రితం థియేటర్లలో రిలీజైంది. రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. రూ.50 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు చెల్ల అయ్యావుకి విష్ణు విశాల్ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు)'గత 11 ఏళ్లుగా నా జీవితంలో ప్రతి సంతోషంలో, ప్రతి కష్టంలో తోడుగా నిలిచావు. నీ నమ్మకం, స్నేహం, సపోర్ట్ గురించి మాటల్లో చెప్పలేను. ఈ బహుమతి నీకోసం. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి' అని విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమా విడుదలకు ముందే చిత్రం భారీ విజయాన్ని సాధిస్తే కారును బహుమతిగా ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు విష్ణు విశాల్ చెప్పాడు. దర్శకుడు చెల్ల అయ్యావును ఆశ్చర్యపరుస్తూ కొత్త టయోటా హైక్రాస్ కారును అందజేశాడు. దీని ధర మార్కెట్ లో రూ.15-20 లక్షల మధ్య ఉంది.ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఇదే చిత్రానికి సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో మరో నిర్మాత అయిన ఇషారి గణేశ్.. హీరో విష్ణు విశాల్కి బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు చెల్ల అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రేస్లెట్ బహుమతిగా ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు 40 గ్రాముల వెండి నాణేలను అందజేశారు.'గట్ట కుస్తీ 2' విషయానికొస్తే... కీర్తి రెజ్లింగ్ కెరీర్కు అండగా నిలబడతానని ఇచ్చిన మాట ప్రకారం వీరా, ఇంటి బాధ్యతలు స్వీకరించి హౌస్ హస్బెండ్గా మారతాడు. అయితే పిల్లల పెంపకం విషయంలో భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో దాంపత్య జీవితంలో విభేదాలు పెరుగుతాయి. విడాకుల వరకు వెళ్లిన వారి బంధం చివరకు కుటుంబ విలువల ప్రాముఖ్యతని ఎలా గుర్తించిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)This is for you, @ChellaAyyavu ❤️For the last 11 years, you've stood by me through every high, every low, and everything in between.. Your loyalty, belief, and friendship have meant more than words can ever express..Enjoy the ride.. You truly deserve it :) #GattaKusthi2 pic.twitter.com/oqI830W76X— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) July 16, 2026 -
సూర్యతో జక్కన్న మూవీ..! కోలీవుడ్ కి 1000 కోట్లు కన్ఫర్మ్
-
రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్
వరస సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డాన్సర్, మోడల్ అయిన ఈ తిరుచిరాపల్లి బ్యూటీ 'ఓం భీమ్ బుష్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అది ఓకే అనిపించుకుంది. తర్వాత తెలుగులోనూ మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించింది గానీ అందాల ఆరబోత తప్పితే మరేం చేయలేదు. అనంతరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేట్ మారిపోయింది.(ఇదీ చదవండి: తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం)అర్జున్, అభిరామితో కలిసి ఈమె నటించిన 'బ్లాస్ట్' సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్గా 'ఇదయం మురళి'తో వచ్చింది. ప్రస్తుతం 'దశమకన్' అనే తమిళ చిత్రంతో పాటు మలయాళ ఒకటి, హిందీలో 'నాగ్ జిల్లా'మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా రంగప్రవేశం చేసిన రెండేళ్లలోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోలీవుడ్లోనే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.ధనుష్ 56వ చిత్రంలో హీరోయిన్గా చేసే అవకాశం ప్రీతిని వరించినట్లు తెలుస్తోంది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో తొలుత రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆమె తెలుగులో ఎన్టీఆర్ 'డ్రాగన్'తో బిజీగా ఉన్న కారణంగా ధనుష్తో నటించలేని పరిస్థితి. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్ను వరించినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ధనుష్ ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం'లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!) -
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. -
'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్
ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.శ్వేతా మోహన్ తన ఇన్స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్లో నేను లండన్లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.ఈ పోస్ట్కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు. View this post on Instagram A post shared by Shweta Mohan (@_shwetamohan_) -
జరిగిన విషయాన్ని ఎవరూ మార్చలేరు: హన్సిక
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగతంగా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇంతకుముందు ఓ హీరోని ప్రేమించిన వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తర్వాత కొన్నాళ్లకు సొహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. కొన్నాళ్ల క్రితం హన్సిక తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకుంది. తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టి గుళ్లు, గోపురాలు తిరిగింది. విదేశాలు చుట్టొస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇలా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వస్తున్న విమర్శలు, వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలోని రూమర్స్ గురించి హన్సిక ఘాటుగా స్పందించింది. 'సాధారణంగా సెలబ్రిటీస్ అనగానే వారి వ్యక్తిగత విషయాల గురించి ఎవరైనా విమర్శించొచ్చు అనే భావన పలువురిలో ఉంటుంది. ప్రముఖులకు మనసు అనేది ఒకటి ఉంటుందని అలాంటి వారు గ్రహించాలి. జీవితంలో కష్టకాలాన్ని అధిగమించే సమయంలో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. జరిగిన విషయాలను ఎవరు మార్చలేరు. ఇకపై సాగే జీవితం ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గత కాలాన్ని తలుచుకుంటూ కూర్చోవడం పూలిష్నెస్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎదగడమే ముఖ్యం' అని హన్సిక చెప్పుకొచ్చింది.ఇకపోతే హీరోయిన్గా 50 సినిమాలు చేసిన హన్సిక.. నిర్మాతగా మారి ఓ మూవీ తీసింది. కానీ భారీ నష్టాలతో చేతులు కాల్చుకుంది. మళ్లీ ఈ అమ్మడిని తెరపై ఎప్పుడు చూస్తామో ఏంటో?(ఇదీ చదవండి: శరత్ని లాగి చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక) -
మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక
సీనియర్ నటుడు శరత్ కుమార్ చేయని పాత్రంటూ లేదు. తెలుగు, తమిళంలో హీరో, విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మంగళవారం తన 62వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కాగా ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్ కుమార్ గురించి ఆయన భార్య, నటి రాధిక శరత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో శరత్ కుమార్ జోక్స్ గురించి రాధిక మాట్లాడిన విధానం అందరినీ నవ్వించింది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)శరత్ కుమార్ని నేను తొలిసారిగా కలిసినప్పుడు లాగి చెంప పగలగొట్టాలనిపించింది. దానికి కారణం ఆయన ఓ జోక్ చెప్పి తనే నవ్వుకుంటున్నారు. నాకు అస్సలు నవ్వే రాలేదు. అంతకంటే మంచి జోక్ మీకు తెలియదా? అని అడిగాను. అప్పటి నుంచి ఆయన ఆ అలవాటు ఇప్పటికీ మార్చుకోలేదు. అలాంటి చెత్త జోక్స్కి శరత్ కుమార్ ఓ యూనివర్సిటీ లాంటివారు' అని రాధిక చెప్పుకొచ్చింది.అలానే ఒక తండ్రిగా శరత్ కుమార్ ఎలా ఉంటారు అనే దానికి కూడా రాధిక సమాధానమిచ్చింది. నా కూతురు రాయన్ని నేను సింగిల్ పేరెంట్గానే పెంచాను. మంచి, చెడు అంటూ జీవిత అనుభవాన్ని నేనే నేర్పించాను. మా కొడుకు విషయంలో అలా కాదు. అతనికి నేను ఏదైనా చెప్పే ప్రయత్నం చేయగానే వదిలేయ్ నేను చెబుతాను అంటూ శరత్ కుమార్ వచ్చేస్తారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు. అందుకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మా అబ్బాయి పెద్దయిన తర్వాతే తెలుస్తుంది' అని రాధిక పేర్కొంది. (ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా) -
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు) -
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?) -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ శుభవార్త చెప్పేసింది. చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ పాల్గొంది. ఈ క్రమంలోనే అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)గతేడాది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. ముంబైలోని శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోని ఫరా.. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఆ ఇంటిని శ్రుతి హాసన్ తన అభిరుచులకు అనుగణంగా డెకరేట్ చేసుకుంది. ఇప్పుడు చెన్నైలోని ఇంటిని కొనుగోలు/కట్టించుకుని మరోసారి తన సొంతిటి కల నెరవేర్చుకుంది.శ్రుతి హాసన్ కెరీర్ విషయానికొస్తే గతేడాది 'కూలీ'లో నటించింది. రీసెంట్గా వచ్చిన 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న తెలుగు మూవీ 'ఆకాశంలో ఒక తార', విజయ్ సేతుపతి 'ట్రైన్' చిత్రాల్లో శ్రుతి హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
బికినీ వేసుకోవడంపై కాజల్ రియాక్షన్
సినిమా ఒక ఎంటర్టైన్మెంట్. అది ఒక అట్రాక్షన్. ఎలాంటి చిత్రానికైన బీజం ప్రేమే. ఆ ప్రేమలో అనేక అంశాలు దాగి ఉంటాయి. అందులో అందాలు ఆరబోసే గ్లామర్ ఉంటుంది. బికినీ అందాలతో కవ్వించే సీన్స్ ఉంటాయి. నయనతార, అనుష్క లాంటి టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు తమ అందాలను బికినీ దుస్తుల్లో ఆరబోస్తుంటారు. తద్వారా పాపులర్ అవుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం తాను బికినీ దుస్తులకు పూర్తి వ్యతిరేకిని అని చెప్పింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)నిజం చెప్పాలంటే కాజల్ కూడా గ్లామరస్ నటనతోనే స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు ,తమిళ, హిందీ తదితర భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి తర్వాత నటనకు చిన్న బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత కొన్నేళ్లుగా మళ్లీ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన 'ది ఇండియా స్టోరీ' అనే పాన్ ఇండియా చిత్ర విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బికినీ దుస్తుల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది.అంతేకాదు సినిమాల్లో హద్దులు మీరిన రొమాంటిక్ సీన్స్లోనూ నటించనని కాజల్ చెప్పుకొచ్చింది. తనకు తాను కొన్ని హద్దులు విధించుకున్నానని పేర్కొంది. కాదు కూడదు అంటే అలాంటి చిత్రాల్లో నటించలేనని స్పష్టంగా చెప్పింది. అది ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా, ఎంత ముఖ్యమైన పాత్ర అయినా తనకు చింత లేదని స్పష్టం చేసింది. నటన విషయంలో తనకంటూ ఒక పరిమితిని పెట్టుకున్నట్లు , దాన్ని తాను కచ్చితంగా పాటిస్తానని నటి కాజల్ పేర్కొంది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో సింగర్ పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది) -
ప్రియుడితో పెదకాపు హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా.. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. -
'బిగ్బాస్' ఫేమ్ వాటర్మెలన్ స్టార్ అరెస్ట్
తమిళనాట 'వాటర్మెలన్' స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దివాకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది జరిగిన తమిళ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొన్న ఇతడు.. రీసెంట్ టైంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)తన వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్కి చాలా ఆదాయం వస్తున్నందున, రూ.లక్ష డిమాండ్ చేస్తూ దివాకర్ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ సంధర్భంగా జరిగిన గొడవలో దివాకర్.. ఖరీదైన కెమెరాని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ తరఫున సంబంధిత ఆధారాలతో కిల్పాక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా పోలీసులు, దివాకర్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగులు తనని అక్రమంగా ఓ గదిలో బంధించి, దాడి చేశారని చెబుతూ వీడియోలని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దివాకర్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివాకర్ కోరాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) -
ఇది నా నిజ జీవిత పాత్రలానే ఉంది
పారి ఇళవళగన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'అన్బే డయానా'. మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాస్టిల్ క్రిమేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్య నారాయణన్ హీరోయిన్. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నటి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మా ఇంటి బంగారం'.. అధికారిక ప్రకటన)'సుమారు 11 ఏళ్ల తరువాత నేను నటించిన సినిమా 'లెనిన్ పాండియన్'. దాని తర్వాత ఇదే. దర్శకుడు పారి ఇళవళగన్ నన్ను కలిసి కథ చెప్పినప్పుడే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనిపించింది. నేను ఇందులో ఆంధ్రా నుంచి చైన్నెకి వచ్చి సెటిల్ అయిన అమ్మాయిగా నటించాను. ఇది నా నిజజీవిత పాత్రలానే ఉంది. మూవీ కోసం అందరూ బాగా పనిచేశారు' అని రోజా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల) -
'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్కుమార్ ఆగ్రహం
టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026 -
మీ పేరు శాశ్వతం.. మాట లేకపోయినా పాట ఉంటుంది.. జానకమ్మకు అశ్రు నివాళులు
-
అర్జున్ దాస్ లేటేస్ట్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కేఎస్ సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై సమర్పణలో 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ దాస్కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓజీ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. Super Hero Babu.. Title & Poster 👌 @sinish_s presents #SUPERHERO BABUA commercial family entertainer.@iam_arjundas @iamSandy_Off #SuperHeroBabu pic.twitter.com/XPkx6Rp4kW— H A N U (@HanuNews) July 10, 2026 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. జాతీయ అవార్డ్ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ చెజియాన్(57) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చెన్నైలోని తారామణిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు డైరెక్టర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు.. సినిమాటోగ్రాఫర్గా రాణించారని కొనియాడుతున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాని పోస్టులు పెడుతున్నారు.కాగా.. తమిళనాడులోని శివగంగైలో జన్మించిన చెజియాన్.. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తనకున్న అభిరుచితో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ వద్ద సహాయకుడిగా కెరీర్ మొదలెట్టారు. ఆ తర్వాత 2007లో 'కల్లూరి' చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా అరంగేట్రం చేశారు. అనంతరం 'రెట్టైసుళి', 'తెన్మెర్కు పరువకాట్రు', 'మగిళ్చి', 'పరదేశి', 'జోకర్' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'పరదేశి' సినిమాకు గానూ 2013లో లండన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది.ఆ తర్వాత ఆయన 'టు లెట్' అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రం జాతీయ సీనీ పురస్కారాన్ని గెలుచుకోవడంతో పాటు.. పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. ఆయన సినిమాలతో పాటు రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు పాఠకులకు ప్రపంచ సినిమాను పరిచయం చేయగా.. ఆయన చిత్రాలు వాస్తవికత, భావోద్వేగం, కళాత్మక నిజాయితీ పట్ల నిబద్ధతను ప్రతిబింబించాయి.His work behind the camera will continue to inspire! His contribution to cinema will always be remembered! Rest in peace, Chezhiyan. 🤍#RIPChezhiyan #AGSCinemas pic.twitter.com/GSGcjgza8A— AGS Cinemas (@agscinemas) July 10, 2026 -
కాయదు.. ఆ హీరోతో సినిమా సెట్ అవ్వట్లేదు!
సినిమా రంగంలో ఎవరిని ,ఎప్పుడు అదష్టం వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు వరస అవకాశాలు తలుపుతడతాయి. హీరోయిన్ కాయదు లోహర్ విషయంలోనూ ఇదే జరిగింది. కన్నడం, తెలుగు చిత్రాలతో తొలుత ఉనికి చాటుకున్న ఈ అమ్మడు.. తమిళంలో చేసిన 'డ్రాగన్' మూవీతో సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాయదుకు సడన్ క్రేజ్ వచ్చేసింది. అదేచిత్రంలో నటించిన అనుపమకు రాని క్రేజ్ కాయదుని వరించింది. నిజం చెప్పాలంటే 'డ్రాగన్' తర్వాత ఈమెకు హిట్ పడలేదు. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అవకాశాలు వరుస కడుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ప్రస్తుతం ఈమె తమిళంలో 'ఇమ్మోర్టల్', మారి సెల్వరాజ్ 'మంజనది', మలయాళంలో 'ఐ యామ్ గేమ్', తెలుగులో 'ది ప్యారడైజ్' మూవీస్ చేస్తోంది. తాజాగా సూర్య చిత్రంలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా బిజీగా ఉన్న కాయదు లోహార్ని ఇంతకుముందే శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో అందులో నుంచి కాయదు డ్రాప్ అయిందని టాక్ నడిచింది.ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాయదు మాట్లాడుతూ.. శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణంతో ఆ చిత్రం ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. దీంతో తాను ఆయనతో కలిసి నటించిన చిత్రం కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని నమ్ముతున్నానని పేర్కొంది. ఆ చిత్రం విధి చేతిలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిమానులు మాత్రం త్వరలోనే శింబుతో జోడీకడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ) -
హీరోకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్.. దర్శకుడికి గోల్డ్ చెయిన్
తమిళ హీరో విష్ణు విశాల్ లేటెస్ట్ సినిమా 'గట్ట కుస్తీ 2'. ఐసరి గణేష్తో పాటు విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని కోట్ల కొద్ది కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం మధ్యాహ్నం చైన్నెలోని థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఐసరి గణేష్ మాట్లాడుతూ తాను ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఆడియో విడుదల కార్యక్రమానికి, ఇప్పుడు సక్సెస్ మీట్ మాత్రమే హాజరయ్యానన్నారు. మిగతాదంతా విష్ణు విశాల్నే చూసుకున్నాడు. విష్ణు విశాల్ మాట్లాడుతూ ఐసరి గణేష్ తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన స్వేచ్ఛనే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని అన్నాడు. తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు దక్కిన తొలి సక్సెస్ క్రెడిట్ ఈ చిత్రమేనని విష్ణు విశాల్ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత గణేష్.. యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరికి 40 గ్రాముల వెండి పలకాన్ని బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకుడు సెల్లా అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రాస్లెట్ని అందించారు, విష్ణు విశాల్కు ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' మూవీ ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by M VIGNESH (@wikkitalks_official) View this post on Instagram A post shared by Rahul 😉 (@_sm_rahul) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ఆల్ క్లియర్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి చిత్రమిదే. విజయ్ సీఎం అయినా కూడా ఇంకా విడుదల కాలేదు.తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్టైమ్ 183 నిమిషాలుగా నిర్ణయించింది. గతంలో సెన్సార్ సమస్యల వల్లే ఆ మూవీ రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఆ సమస్య క్లియర్ కావడంతో ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. OFFICIAL: #JanaNayagan Censored "🅰️"DURATION : 3 Hours 3 Minutes 11 Seconds📌LINK: https://t.co/M7W87PlkKV pic.twitter.com/ar4JpmMQQ8— Actor Vijay Team (@ActorVijayTeam) July 9, 2026 -
జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం జన నాయగన్. సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. జన నాయగన్ రిలీజ్ డేట్పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ జన నాయగన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో జన నాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేసింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాతనైనా జన నాయగన్ థియేటర్లలో సందడి చేయనుంది.పాలిటిక్స్లో ఎంట్రీకి ముందు ఇదే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు. 🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥🇨🇦 Canada Release by York Cinemas🎬 Igniting screens from July 24.Get ready for the ultimate theatrical celebration. Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp— York Cinemas (@yorkcinemas) July 8, 2026 -
సక్సెస్ ఫార్ములా.. 100 కోట్ల క్లబ్ లోకి సూర్య.!
-
ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది
పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటుడు ధనుష్. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్ ప్రస్తుతం 'ఓమ్' అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. ఇదలా ఉండగానే మరొకటి ప్రాజెక్ట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్)ఇందులో డీ,వీ అనే ఇంగ్లీష్ అక్షరాలు, 10–07–26 అనే తేదీ మాత్రమే ఉన్నాయి. ధనుష్ తదుపరి మూవీ సత్యజ్యోతి సంస్థలో చేయబోతున్నట్లు చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ పోస్టర్లో వీ అనే అక్షరానికి దర్శకుడు వెంకట్ ప్రభు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అని, విలన్ ఎస్జే సూర్య అని ప్రచారం సాగుతోంది. మరోవైపు '12th ఫెయిల్'తో ఆకట్టుకున్న విదు వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. మరి ధనుష్తో పనిచేసే ఆ దర్శకుడు ఎవరు?(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి) -
ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు
ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ప్రేమ ఉంటుంది. కొందరు దాన్ని బయటకు చెప్పుకొంటారు. కొందరు మనసులోనే రహస్యంగా ఉంచుకుంటారు. సినిమా వాళ్లు దీనికి అతీతం కాదు. చాలామంది హీరోయిన్లు తన చిన్నప్పటి ప్రేమ సంగతుల్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. హీరోయిన్ అంజలికి అలాంటి చిన్న లవ్ స్టొరీ ఉందట.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)2006లో 'కట్రదు తమిళ్' సినిమాతో కథానాయికిగా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. తెలుగులోనూ పలు మూవీస్ చేసి హిట్స్ అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్లో' మకుటం'లో నటించింది. విశాల్ హీరోగా నటించి తొలి సారిగా దర్శకత్వం వహించిన చిత్రమిది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి.. టీనేజీలో తన జీవితంలో జరిగిన ప్రేమ సంఘటన గురించి చెప్పింది. నా క్లాస్ మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దానికి ఫుల్స్టాప్ పెట్టాలని భావించి, నువ్వు అంటే ప్రేమ లేదని చెప్పా. దాంతో అతను నీకు ధైర్యం ఉంటే నాకు రాఖీ కట్టు అని అన్నాడు. వెంటనే నేను రాఖీ కట్టేసరికి షాక్ అయినా అతడు.. వెంటనే దాన్ని తీసిపారేసి వెళ్లిపోయాడు. తర్వాత మేం ఎప్పటికీ కలుసుకోలేదు అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్) -
సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్కి కాస్ట్లీ కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే హీరోలకు లేదా దర్శకులకు నిర్మాత.. కారు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి టాలీవుడ్లో చూస్తూనే ఉంటాం. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేస్తుంటాడు. అలా ఈ ఏడాది ఓ మూవీ నిర్మించగా అది ఊహించని సక్సెస్ అందుకుంది. ఇప్పడా చిత్ర దర్శకుడికే ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)రాధిక ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన సినిమా 'థాయ్ కిళవి'. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్గానే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తి చేసుకుని మొత్తంగా రూ.80 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాత శివకార్తికేయన్.. దర్శకుడు శివకుమార్కి రూ.20 లక్షలు విలువ చేసే మహీంద్రా బీఈ6 కారుని బహుకరించాడు.ఇకపోతే శివకుమార్ మురుగేశ్ ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా 'సెయాన్' అనే సినిమాని తీస్తున్నాడు. కుమారస్వామి నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Sivakarthikeyan Productions (@skprodoffl) -
20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా వస్తోన్న చిత్రం హృదయం మురళి. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ సీన్స్ చూస్తుంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కథగా కనిపిస్తోంది. ఈ మూవీకి తమనే సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. 20 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో తమన్ నటించిన సంగతి తెలిసిందే. -
ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది
ఏ భాషలో చూసుకున్నా సరే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లేకపోతే ఏ సినిమాలు కూడా నిలబడవు. అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మహా అయితే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వస్తాయి. అదే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే లెక్క వేరే ఉంటుంది. రీసెంట్ టైంలో తెలుగులో అలా 'మా ఇంటి బంగారం' కనెక్ట్ అయింది. హిట్ అయింది. ఇప్పుడు దీనిలా తమిళంలో ఓ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)తమిళ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు. దీనికంటే తెలుగు షట్లర్ గుత్తా జ్వాల భర్తగానే చాలామందికి తెలుసు. ఇతడు హీరోగా నటించిన 'మట్టీ కుస్తీ' అనే సినిమా 2022లో రిలీజైంది. హీరో రవితేజ దీని నిర్మాణంలో భాగమయ్యాడు. కానీ ఇదేమంత సక్సెస్ కాలేదు. ఇలాంటి చిత్రానికి సీక్వెల్ తీస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ విష్ణు విశాల్ తీశాడు. అదే 'గట్ట కుస్తీ 2'. ఈసారి తమిళం వరకు మాత్రమే విడుదల చేశారు.గత వీకెండ్ థియేటర్లలో రిలీజ్ చేయగా యావరేజ్, పర్లేదు అనే రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కానీ కుటుంబ ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయిపోయింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విష్ణు విశాల్ మార్కెట్కి ఇది చాలా ఎక్కువ. అసలు ఇది హిట్ అవుతుందని కూడా ఊహించి ఉండరు. అలాంటిది చూస్తుంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ వసూళ్లు తెచ్చుకునేలా కనిపిస్తోంది.ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటే యావరేజ్ సినిమాకు వసూళ్లు ఎంతలా వస్తాయనేది 'గట్ట కుస్తీ 2' నిరూపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కుస్తీ ఫైట్, మూవీలోని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీనిని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా? లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు
తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అకస్మాత్తుగా కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకు నివాళి అర్పించారు. ఇకపోతే ఈయన ఎప్పటినుంచో కోరుకున్న విషయాన్ని ప్రముఖ రచయిత వైరముత్తు నెరవేర్చారు.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్.. గతంలో తన స్వీయచరిత్రాన్ని పుస్తకంగా రాశారు. దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తుని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ భాగ్యరాజ్ బతికుండగా అది జరగలేదని, ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికని నెరవేర్చినట్లు వైరముత్తు చెప్పారు. ఆయన భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ కి సదరు ప్రతిని అందించినట్లు వెల్లడించారు.భాగ్యరాజ్ చనిపోయిన తర్వాత ఆయన చివరి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచండి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను' అని ఈయన రాసినట్లు అందులో ఉంది.(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో ధనుష్.. ఎంట్రీ ఫిక్స్ అయిందా?) -
అప్పుడు విలన్ ఇప్పుడు హీరోయిన్
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈయన లీడ్ రోల్ చేసిన 'డీసీ' ఈ నెల చివరలోనే రిలీజ్ రానుంది. జీ స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లతో పలు చిత్రాల్ని తీస్తున్నాడు. ఈయన నిర్మిస్తున్న 'బెంజ్', 'ఫైట్ క్లబ్' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకుడు.విశాల్ వెంకట్ ఇంతకు ముందు సిరి నేరంగలిల్ సిల మనిదర్గళ్, బాంబ్ వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన ఇప్పుడు మహిళా నేపథ్య కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రెజీనాని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో తమిళంలో అజిత్ 'విడాముయర్చి'లో రెజీనా విలన్గా చేసింది. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో నటించనుంది.విశేషం ఏమిటంటే లోకేష్ కనకరాజ్ తొలి మూవీ 'మానగరం'లో రెజీనానే హీరోయినే. తాజాగా రూపొందనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్నాడు. -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కమల్ హాసన్ లాంటి స్టార్స్కు సాధ్యం కానీ ఫీట్ సాధించారు.ఇక విజయ్ గెలుపుతో ద్రవిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సినీ స్టార్స్ వరుసగా రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుశ్ సైతం ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన అభిమాన సంఘం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ధనుశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.దళపతి విజయ్ లాగే ధనుశ్ సైతం రాజకీయాల్లో అడుగు పెడతారనే చర్చ కోలీవుడ్లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల కల్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్కో ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల వేళ.. ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. -
దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో
కోలీవుడ్లో మరో వారసుడి అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దివంగత మ్యూజిక్ కంపోజర్ ఆర్డి.భాస్కర్ వారసుడు జైయన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఆర్డి భాస్కర్ ఒకరు. మ్యూజిక్ కంపోజర్గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడు జైయన్.జైయన్ హీరోగా చేస్తున్న సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని ఇళయరాజాని గుర్తుచేసేలా టైటిల్ పెట్టారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్ బాలగంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్ ఎన్.సుబ్రమణియమ్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు.జైయన్కు జంటగా సోనా ఒలికల్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. షూటింగ్ చైన్నెలో ఆదివారం జరిగిన పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు
లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
రజనీకాంత్ రీల్ కోడలికి హీరోయిన్గా మరో ఛాన్స్
తమిళ నటుడు అరుణ్ విజయ్.. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1995లో 'మురై మాప్పిళై' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా మూడు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 'బ్రూస్ లీ', సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తడం, కుట్రం 23 ,మాఫియా , సెక్క సివంద వానం వణంగాన్ వంటి పలు చిత్రాలను కథానాయకుడుగా తన నటనా ప్రతిభకు ప్రదర్శించిన ఈయన రీసెంట్ టైంలో 'రెట్ట తల' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన 'పార్టనర్' అనివార్య కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈయన ముత్తయ్య దర్శకత్వంలో హీరోగా చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కుట్టి పులి, కొంబన్, మరుదు, విరుమన్ వంటి చిత్రాలతో ముత్తయ్య ఫేమస్. ఇందులో నటుడు అరుణ్ విజయ్ జంటగా 'జైలర్' ఫేమ్ మిర్నా మీనన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన మిర్నా.. హీరోయిన్గా ఇది మంచి అవకాశమే అవుతుంది.ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళంలో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన ప్రస్తుతానికైతే 'జైలర్ 2'లో రజనీకాంత్ కోడలి పాత్రలో, డాన్ బాస్కో అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత తమిళంలో హీరోయిన్గా అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్
జీవితం అంటే కేవలం సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు మంచి రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, తమిళ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు రాజకీయాలు నేర్పిన వారు, తన లాంటి వారు, తందై పెరియార్ చేసిన రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. అందుకే రాజకీయమే తన వృత్తిగా మార్చుకున్నానని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు)తాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాటకాలు ఆడాలనుకోవడం లేదని అన్నారు. సమాజంలో అవినీతి ఉందని చెబితే సరిపోదని, ఎవరైనా లంచాలు తీసుకుంటుంటే, అందులో ఇచ్చే వారి ప్రమేయం కూడా ఉంటుందన్నారు. లంచం ఇస్తే, తీసుకునే చేయి మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్గానో, దర్శకుడిగానో రాలేదన్నారు. తన కష్టార్జితం, అర్హతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాను నేరుగా ముఖ్యమంత్రిగా రాలేదని, దానికి కావలసిన అర్హతలు తనకు వచ్చినప్పుడు, ప్రజలు తనకు ఆ పదవిని ఇస్తారని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి, చెడు రెండూ ఉన్నాయని కమల్ హాసన్ వివరించారు. సాంకేతికతను నేర్చుకున్న వారు దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేంత వరకు నేర్చుకుంటున్నారని చెప్పారు. యువత వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి రాజకీయ నాయకుడు ఎవరో గుర్తించే వయసుకు తమరు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్) -
స్టార్ కమెడియన్ సాహసం.. కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్..!
గతంలో దివంగత నటుడు శివాజీ గణేషన్ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటిస్తే.. కమలహాసన్ ఏకంగా దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ రికార్డ్ను ప్రముఖ స్టార్ కమెడియన్ యోగిబాబు బ్రేక్ చేయనున్నారు. ఆయన ఏకంగా 11 పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్ కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్ రాజా శిష్యుడు కాగా.. ఈ చిత్రాన్ని 9 లైట్స్ పతాకంపై సురేష్ ముత్తు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేస్తుంది. ఈ మూవీలో మలయాళ నటి అతిథి రవి హీరోయిన్గా నటిస్తున్నారు.యోగి బాబు 11 పాత్రలు నటిస్తున్న కామెడీ యాక్టర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో హీరో,విలన్, కమెడియన్ పాత్రల్లో యోగిబాబు నటిస్తున్నట్లు చెప్పారు .అదే విధంగా ఇందులో కవల పిల్లల పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు. ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని అందులోని బ్లాక్ బాక్స్ కనుగొనే ప్రయత్నం అన్నారు. ఈ ప్రమాదానికి కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొని సవాళ్లను వినోదం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ఇంగ్లాండ్, కెన్యా దేశాల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్ లీ,వీటీవీ గణేశ్, పంజు సుబ్బు, ఏ.వెంకటేశ్ ముఖ్యపాత్రులు పోషిస్తున్నారు. -
వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?) -
హీరోయిన్గా మాజీ డీజీపీ కూతురు.. సినిమా రెడీ
తమిళ ప్రముఖ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ కరాటే బాబు. 'డాడా' ఫేమ్ గణేష్ కె బాబు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అయితే ఈ మూవీతో తమిళనాడు మాజీ డీజీపీ శంకర్ జివాల్ కూతురు హీరోయిన్గా పరిచయమవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్)మాజీ డీజీపీ కుమార్తె పేరు దౌదీ జివాల్. ఇకపోతే ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, వీటివీ. గణేష్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. సుందర్ ఆరుముగం నిర్మాత. ఇంతకుముందు ఈయన రవి మోహన్తో అఖిలన్, బ్రదర్ లాంటి మూవీస్ తీశారు. ఇది మాత్రం రాజకీయ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించారు.ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయని అయితే వాటికి పూర్తి భిన్నంగా 'కరాటే బాబు' ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం, బంధాలు, అనుబంధాలను ఆవిష్కరించే కథ చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా శాసనసభ్యుడిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే రాజకీయ థ్రిల్లర్గా తెరకెక్కించారట.శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఎళిల్ అరసు.కె ఛాయాగ్రహణం అందించారు.(ఇదీ చదవండి: సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్) -
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో మలయాళీ బ్యూటీ చేరేందుకు రెడీ అయింది. ఆమెనే రియా షిబు.మొదట నటిగా ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా మారి తమిళంలో విక్రమ్తో 'వీర ధీర సూరన్' సినిమాని నిర్మించింది. తర్వాత కథానాయకగా అవతారమెత్తి 'సర్వం మాయ' అనే మలయాళ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్న రియా.. కోలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త మూవీలో హీరోయిన్గా అవకాశం వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అలా ఉండగానే ఇప్పుడు మరో అవకాశం తలుపు తట్టిందని సమాచారం.విజయ్ సేతుపతితో రియా కలిసి నటించడానికి సిద్ధమవుతోందని తెలిసింది. క్రితిక ఉదయనిది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళ దర్శకురాలు ఈసారి కుటుంబ అనుబంధాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణను జరుపుకొంటున్నట్లు, మరో వారంలో తొలి షెడ్యూల్ పూర్తికాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
జైలర్-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. విశ్వంభరకు పోటీ తప్పదా?
తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్గా నిలిచిన జైలర్ మూవీ సీక్వెల్గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విశ్వంభరతో పోటీ?అయితే మెగాస్టార్ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సమ్మర్లో రిలీజవుతుందని ఆశించినప్పటికీ అలా ఏం జరగలేదు. ఈ దసరాకే విశ్వంభర రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న మెగాస్టార్ మూవీని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారని టాలీవుడ్ టాక్. తాజాగా అక్టోబర్ 15న జైలర్-2 తేదీని ఫిక్స్ చేయడంతో విశ్వంభర రిలీజ్కు సాహసం చేస్తారా? మరోసారి వాయిదా వేయకతప్పదా? రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. జైలర్-2తో మెగాస్టార్ పోటీకి దిగుతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. Alappara Kelappurom! #Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @kabilanchelliah @RIAZtheboss pic.twitter.com/mY50qNOSQh— Sun Pictures (@sunpictures) July 2, 2026 -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక కంటెంట్కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.తాజాగా మరో సక్సెస్ఫుల్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్బీట్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి.అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.One world became two. But the heartbeat remains one. ❤️Hotstar Specials #HeartBeatSeason3 streaming from July 30 only on #JioHotstar #HBS3 #HBS3OnJHS #HeartBeatS3OnJioHotstar #HeartBeat3OnJioHotstar #HeartBeat3StreamingFromJuly30 #HeartBeatS3FirstLook #JioHotstarTamil… pic.twitter.com/RQFWVdi5uP— JioHotstar Tamil (@JioHotstartam) July 1, 2026 -
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందులో తన కళ్లు దానం చేయాలనే చివరి కోరికతోపాటు తన కొడుకు శాంతనుకి అండగా నిలవాలని అభిమానులని ఆయన వేడుకుంటున్నట్లు ఉంది.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)లెటర్ లో ఏముందంటే?'మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సాహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి'కొడుకు, నటుడు శాంతను భాగ్యరాజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నా కోసం కొట్టిన చప్పట్లే నా కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నా. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను' అని లెటర్లో రాసుకొచ్చారు.తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనకు భార్య పూర్ణిమ, కొడుకు శాంతను, కుమార్తె శరణ్య ఉన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ సినిమాల ఫేమ్ అభిషేక్ జీవంత్ హీరోగా గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో ఓ మూవీ రూదుతోంది. డ్రామా కంపెనీ సమర్పణలో ఎ. బాలమురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగారం, యోగలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అభిషేక్ , శివరాజ్ కుమార్, శివానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తమిళంలో నేను నటిస్తున్న తొలి సినిమా ఇది. నాకు కొంచెం తమిళ భాష వస్తుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. శివ రాజ్కుమార్ సార్తో కలిసి నటిస్తున్నాను. అభిషేక్ చాలా ప్రతిభావంతుడు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శివానీ నాగారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. -
పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా
రీసెంట్ టైంలో ట్రెండింగ్ హీరోయిన్ అంటే కచ్చితంగా వినిపించే పేరు కాయదు లోహర్. 'ముఖిల్ పేట్టై' అనే కన్నడ మూవీతో హీరోయిన్ అయిన ఈ అస్సామీ బ్యూటీ.. 'అల్లూరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే తమిళంలో 'డ్రాగన్' చేసింది ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి చిత్రాలతో వచ్చింది. ఇప్పుడు సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది. రెండురోజుల క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 16 ఏళ్లున్నప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)'పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్కు వెళ్తుండేదాన్ని . ఒకరోజు ఒక కుర్రాడు నన్ను ఫాలో అవుతూ ఈవ్ టీజింగ్ చేశాడు. పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ నా వెంట పడుతూ హద్దులు మీరడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే పక్కనే ఉన్న పెద్ద రాయి తీసి అతడి తల మీద కొట్టా. రక్తం కారడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని కాయాదు లోహర్ గుర్తుచేసుకుంది.చూడటానికి నేను చాలా సాఫ్ట్గా కనిపించినా.. ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుందని, దానికి ఎదురు వెళ్తాను. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని కాయదు చెప్పుకొచ్చింది. ఈమె నాని 'ప్యారడైజ్' మూవీలోనూ నటిస్తోంది. వచ్చే నెల చివరలో ఆ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత) -
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది.సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి) -
రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఇతడు రాజకీయాల్లోకి రానున్నాడని.. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో నిలబడతాడనే రూమర్స్ చాలా వినిపించాయి. మూడు వారాల క్రితం దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. చెప్పి చెప్పకుండానే మాట్లాడాడు. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)రెండు వారాల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. నేను రాజకీయాల్లోకి రావడం పట్ల మీ సలహాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే మాత్రం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని అన్నారు.తాజాగా మంగళవారం మధ్యాహ్నం దాదాపు 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. చాలా విషయాలు మాట్లాడాడు. నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయను. కానీ రాజకీయాల్లోకి రానని మాత్రం అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే లారెన్స్ ఊపు చూసి పక్కాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావించారు. మరి ఏమైందో ఏమో గానీ సడన్ యూటర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
కుమారస్వామి ఎక్కడివాడు? సోషల్ మీడియాలో వింత చర్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరిని ట్రోల్ చేసుకుంటారో అస్సలు అర్థం కాదు. రీసెంట్గా 'ఇడుపు కాయితం' అనే పదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవడో ఓ ఆకతాయి పెట్టిన కామెంట్ కారణంగా ఒకరి భాష, యాసపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇందులోకి రాజకీయాలు కూడా ఎంటరయ్యాయి. సరే ఈ గోల ఎప్పుడు ఆగుతుంది అనుకుంటే కొత్తది మొదలైంది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)నిన్నటివరకు ఆంధ్రా vs తెలంగాణ నెటిజన్ల మధ్య రచ్చ నడవగా.. ఇప్పుడు తెలుగు vs తమిళ నెటిజన్ల మధ్య ట్రోల్స్ హంగామా నడుస్తోంది. దీనంతటికీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కొత్త పోస్టరే కారణం. చాన్నాళ్లుగా కుమారస్వామి కథతో తీసే సినిమాలో తారక్ నటిస్తాడనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు. త్రిశూలం, డీఎన్ఏ, యుద్ధాలు తదితర అంశాలు ఈ పోస్టర్లో చూపించారు.అయితే ఈ చిత్ర నిర్మాతలు నాగవంశీ, కల్యాణ్ రామ్.. పోస్టర్ షేర్ చేస్తూ 'ఉత్తరంలో జననం.. మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం.. దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం!' అని కుమారస్వామి గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని తమిళ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు కుమారస్వామి ఎక్కడివాడు? అనే వింత చర్చ మొదలైంది. మరి ఇదెప్పుడు ఆగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)Original name of Murugan is Ceyon ( சேயோன் ) , he was red in colour , he was the warrior god and he is the origin of all of us tamils , and his mother’s name is Kottravai - the original form of Tirupathi Venkateswara swamy .Do not ready made up history and convince yourself… https://t.co/to9yfeMLSm— Prashanth Rangaswamy (@itisprashanth) June 29, 2026 -
ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్
పవి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి బ్రిగిడా సాగా.. సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరల అయిపోయిన బ్రిగిడా సాగా.. 2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. తర్వాత అంతా మర్చిపోయారు.అలాంటిది ఇప్పుడు బ్రిగిడా సాగా తన ప్రేమ విషయం రివీల్ చేసి ప్రియుడి గురించి చెప్పడంతో తోటీ నటీనటులు విషెస్ చెబుతున్నారు. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.బ్రిగిడా సాగా తన ఇన్ స్టాలో ఆనంద్ గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి అందమైన ప్రేమకథలు సినిమాల్లో ఉంటాయని అనుకునే దాన్ని, కానీ జీవితం నాకోసం మరో అందమైన కథ రాసింది. సినిమా ప్రయాణంలో నా లాంటి డ్రీమ్స్, ఇష్టాలు కలిగిన ఆనంద్ రామ్ని కలుసుకున్నాను. స్నేహంతో మొదలైన బంధం ఇప్పుడు ప్రేమవరకు వచ్చింది. అలానే మేం 'ఐ లవ్ యూ' చెప్పుకొనే జోడీ కాదు' అని బ్రిగిడా సాగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ
నటుడు సూర్య స్టార్ హీరోగా రాణిస్తూ తన అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈయన కూడా హీరో విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిలా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిచ్చేలా ఆదివారం చెన్నైలో జరిగిన సూర్య అఖిల ఇండియా అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్.వీరమణి.. నటుడు సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహకులు స్పందించారు. ఆర్.వీరమణి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.సూర్య కెరీర్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేదు. గత నెలలో విడుదలైన 'వీరభద్రుడు' మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో మాత్రం అద్భుతమైన హిట్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో రాబోతున్న సూర్య.. మరోవైపు దర్శకుడు జీతూ మాధవన్ తీస్తున్న ఓ మూవీలో పోలీస్గా చేస్తున్నారు. నిన్ననే 'సలార్' నిర్మాతలతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్న సూర్య.. రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం.(ఇదీ చదవండి: అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం) -
మరో హిట్ కాంబో.. ఈ సారి భారీ ప్రాజెక్ట్..!
ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.అంతలోనే మరో భారీ ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో. భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్తో జతకట్టారు. ఈ సందర్భంగా సూర్యకు ఆహ్వానం పలుకుతూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జూన్ 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. The next chapter... #SuriyaXHombaleHe built it.Frame by frame. Film by film. Fight by fight.Roles that bled truth.Characters that carried the weight of real lives.A journey defined by courage, conviction, and craft.Three decades of truth on screen.Countless hearts… pic.twitter.com/HoZOgQRbC7— Hombale Films (@hombalefilms) June 29, 2026 -
అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం
రెండు రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకుని భాగ్యరాజ్కు నివాళి అర్పించేందుకు వచ్చిన సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టారు. నటి రాధిక కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆరోజే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది. ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన అసహనాన్ని బయటపెట్టింది.'అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. హంగామా చేసేందుకు వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల టైంలో మీడియాని నిషేధించాల్సిందే' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీన్ని రీట్వీట్ చేసిన రాధిక.. కచ్చితంగా నిషేధం విధించాలి అని రాసుకొచ్చింది. ఇక భాగ్యరాజ్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది.50 ఏళ్ల స్నేహానికి వీడ్కోలు. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచారు. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన ప్రదేశం ఓ సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడూ మారిపోయాం? ప్రభుత్వం, ఇండస్ట్రీ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల టైంలో ప్రోటొకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు, ఆత్మకు గౌరవం ఇవ్వాలి' అని రాధిక తన ఆవేదన వ్యక్తం చేసింది.pic.twitter.com/dE4PWoyHRG— Radikaa Sarathkumar (@realradikaa) June 29, 2026கையெடுத்து கும்பிடறன், TRP வேணாம்னு சினிமால நடிச்சி தரோம் , கொஞ்சம் பிரைவேசி கொடுங்க #Bhagyaraj #Radhika pic.twitter.com/PdbuKivcW1— Behind Talkies (@BehindTalkies) June 27, 2026 -
'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి
సినిమా ప్రాంతీయ భాషలని దాటి చాలా కాలమైపోయింది. హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా భారతీయ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది హిందీ యాక్టర్స్.. దక్షిణాదిలో నటించేందుకు గత కొన్నాళ్ల నుంచి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్ల నుంచి ప్రియాంక చోప్రా, కియారా అడ్వాణీ వరకు సౌత్లో నటించిన వాళ్లే. రీసెంట్ టైంలో అయితే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో 'దేవర', 'పెద్ది' చేసింది.(ఇదీ చదవండి: బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?)తెలుగు సినిమాల్లో యాక్టింగ్ కంటే తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. చాలామంది దర్శకనిర్మాతలు ఈమె కోసం ప్రయత్నించగా చివరకు డైరెక్టర్ సర్గుణం కోలీవుడ్లోకి జాన్వీని పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలవాణి, వాగై చుడవా తదితర మూవీస్ తీసిన ఈయన ఈ మధ్యే 'ఎగ్జామ్' వెబ్ సిరీస్ తీశారు. ఇప్పుడు మరొకటి తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోనే జాన్వీ కపూర్ కీలక పాత్ర చేయనుందట.ఈ వెబ్ సిరీస్ని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్కి చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మించనుందట. కురత్తి అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. మరి తెలుగులో గుర్తింపు కంటే విమర్శలు ఎక్కువగా అందుకున్న జాన్వీ.. తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా?)


