breaking news
Kollywood
-
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
బెస్ట్ఫ్రెండ్ని పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ (Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. నూతన జంట వెడ్డింగ్ స్టిల్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సీరియల్స్ నుంచి సినిమాలుజీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన దర్శన్ జంటకు బుల్లితెర తారలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శన్.. తమిళంలో 'కట్రుకెన్న వేలి' సీరియల్లో సూర్య మహదేవన్ పాత్రతో ఫేమసయ్యాడు. అవను మాతే శ్రావణి, అరణ్మనై కిలి వంటి పలు సీరియల్స్ చేశాడు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలోనూ హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Darshanraju_ExpressionKing (@darshanraju_expressionking)చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు -
వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.రెండు వివాదాల మధ్య హన్సికభర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.ఈ ఏడాది పూర్తయ్యేసరికి..దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం -
పదేళ్ల తర్వాత ధనుష్తో పనిచేయనున్న స్టార్ సంగీత దర్శకుడు
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.షూటింగ్కు ముందు ప్రిపరేషన్ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. జీవితం విలువ తెలిసొచ్చిందికొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్ను కోరారు.వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025 -
ర్యాప్ సింగర్ జీవిత ఇతివృత్తంతో బాటిల్
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆరు పాటలుదర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్ -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్తో సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు పొందుతుంది. -
అందాల బ్యూటీ రాశి ఖన్నా.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
తన పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. హీరోయిన్గానూ తన రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా తన జీవితంలో పెద్ద కల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు -
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ (Sonia Agarwal) అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 10న) రిలీజైంది. ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ.. ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిన్న, పెద్ద అన్న బేధాలు చూడనుసోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.చదవండి: అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి -
నటికి క్షమాపణలు.. ఎట్టకేలకు ముగిసిన వివాదం
పరస్పరం బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవడంతో సీమాన్, నటి విజయలక్ష్మిల వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత సీమాన్.. తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా నటి విజయలక్ష్మి పోరాటం చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదం పోలీసు స్టేషన్లు చుట్టూ తిరిగింది. చివరకు హైకోర్ట్ వరకు చేరింది. ఈ కేసును రద్దు చేయాలని సీమాన్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.అయితే ఈ ఇద్దరిమధ్య వివాదాన్ని కొలిక్కి తెచ్చే విధంగా పంచాయితీలు సాగాయి. అదే సమయంలో సుప్రీంకోర్టును సీమాన్ ఆశ్రయించారు. ఈ సమయంలో సీమాన్పై తాను ఇచ్చిన కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు లిఖిత పూర్వకంగా విజయలక్ష్మి పోలీసులకు సమర్పించారు. పెద్దల పంచాయితీతో వివాదం సద్దుమణిగినా, వ్యవహారం కోర్టులో ఉండటంతో విచారణ ఎదుర్కోక తప్పలేదు.ఎట్టకేలకు సీమాన్, విజయలక్ష్మి పరస్పరం క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదం కోర్టులోనూ సమసినట్లయ్యింది. బుధవారం విచారణ సమయంలో ఈ క్షమాపణల ప్రస్తావన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు వచ్చింది. ఇరువురి వాదనల అనంతరం క్షమాపణలను పరస్పరం అంగీకరించిన నేపథ్యంలో కేసును ముగించారు. ఇక మీదట అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు. -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
తమిళంలో ఇచ్చేది అంతే.. తెలుగులో ఎందుకింత డిమాండ్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్ (Jailer Movie) బ్లాక్బస్టర్ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.హిమాలయాల్లో ప్రత్యక్షందీంతో జైలర్ 2 విషయంలో చిత్రయూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా జైలర్ 2కి షూటింగ్కు బ్రేక్ ఇస్తూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.జైలర్ 2రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్ రిలీజ్కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ పార్ట్కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది. నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్లో ఉన్న నయనతార పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Vels Film International (@velsfilmintl) చదవండి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్ -
నాకు డిజార్డర్ ఉంది.. నాలుగు గంటలు కూడా కష్టమే: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. సినిమాలతో పాటు రేసింగ్లో దూసుకెళ్తోన్న స్టార్ హీరో.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఓ డిజార్డర్ ఉందని తెలిపారు. తనకు అస్సలు నిద్ర పట్టదని అజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ డిజార్డర్ వల్ల రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. ఇది అధిగమించేందుకు ప్రయాణం చేసేటప్పుడు నిద్రించేందుకు ట్రై చేస్తానని అజిత్ అన్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనంగా మారిందన్నారు. సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. రేసింగ్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని విషయమన్నారు. అయితే కార్లను ప్రత్యేకంగా.. డ్రైవర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారని వెల్లడించారు. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు చాలా చాలా తక్కువని చెప్పారు. -
విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి
ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar), సింగర్ సైంధవికి విడాకులు మంజూరయ్యాయి. ఈమేరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జీవీ ప్రకాశ్ తన స్కూల్ ఫ్రెండ్ సైంధవిని 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2020వ సంవత్సరంలో కూతురు అన్వి జన్మించింది. 11 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ప్రకాశ్ దంపతులు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులు మంజూరుఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగారు. మలేషియాలో జరిగిన జీవీ ప్రకాశ్ సంగీత కచేరీలో సైంధవి పాట పాడారు. ఓపక్క స్నేహాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు విడాకుల కోసం వీరిద్దరూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కూతురు అన్విని సైంధవి వద్దే ఉంచేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ కోర్టుకు తెలిపాడు. దీంతో న్యాయస్థానం మంగళవారం నాడు ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.చదవండి: ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్ -
రెండో బ్యానర్ స్టార్ట్ చేయనున్న హీరో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.నగరం స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను -
కాంతార మేకర్స్ ప్రకటన.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.(ఇది చదవండి: కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్)అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. Due to the recent unfortunate incident, we are cancelling the #KantaraChapter1 promotional event in Chennai tomorrow.Our thoughts and prayers are with those affected. Thank you for your understanding, we look forward to meeting our audience in Tamil Nadu at a more appropriate… pic.twitter.com/ROhmiu6glR— Hombale Films (@hombalefilms) September 29, 2025 -
పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్
గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన 'మీట్ ది పీపుల్' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.విజయ్ను అరెస్ట్ చేయాలిఇంతటి విషాదానికి కారణమైన విజయ్ను అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ ఓవియా (Oviya) డిమాండ్ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్ విజయ్' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనిపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె తన పోస్ట్ను గంటల వ్యవధిలోనే డిలీట్ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.బిగ్బాస్, సినిమాకేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్ చేసింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్గా రియాక్టైంది.చదవండి: నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' -
వరలక్ష్మీ కొత్త జర్నీ.. ఒకేసారి మూడు బాధ్యతలు
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్.. రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా, నిర్మాతగా మారిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!)తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష్మీ.. 13 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలోని అన్ని బాషల్లోనూ నటించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఇప్పుడు సడన్గా 'సరస్వతి' అనే మూవీని ప్రకటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వరలక్ష్మీ వ్యవహరించనుంది.థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష్మీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ సంగీతమందిస్తున్నాడు. చెల్లి పూజతో కలిసి వరలక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకనిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి) -
అలాంటి సినిమా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అదితి శంకర్
సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్ దర్శకుడు శంకర్ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్ చిత్రంతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో బోర్లాపడ్డ బ్యూటీఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్గా పరిచయమైన అదితి శంకర్ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్ మోర్ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది.మోడ్రన్ లుక్లో..అదితి శంకర్ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.అలాంటి సినిమా చేయాలనుందితన ఆశను త్రండి శంకర్కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ -
8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్!
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు. ట్రోలింగ్పై స్పందించిన ధనుష్ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.అన్న దొంగచిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.బయోపిక్ కాదుఅలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
తమిళ దర్శకుడు నారాయణమూర్తి కన్నుమూత
సినీ దర్శకుడు నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి 'మనదై తిరిడి విట్టాయ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 'ఒరు పొన్ను ఆరు పయ్యా' చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అంత్యక్రియలుఅక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చైన్నెకి రానున్నారు. అదేరోజు పంబల్లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: నేనూ సెలవు తీసుకుంటా! -
స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి
కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి)కి సంబంధించిన కారు, ఇల్లును వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఈఎంఐలు ఆయన చెల్లించికపోవడంతో తన ఇల్లు, ఆఫీస్ వద్ద నోటీసులు అంటించారు. అందుకు సంబంధించిన వార్త కోలీవుడ్లో వైరల్ అవుతుంది. భార్య ఆర్తితో జయం రవి (Jayam Ravi) విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటంచిన విషయం తెలిసిందే. సుమారు ఏడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ వీరిద్దరూ కలిసే కనిపిస్తున్నారు.రవి మోహన్ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై తూర్పు తీర రోడ్డులో ఒక బంగ్లా కొన్నారు. కొంత కాలం పాటు తన భార్య ఆర్తి, పిల్లలతోనే అక్కడ నివశించాడు. అయితే, కుటుంబ విభేదాల వల్ల ఆ ఇంటి నుంచి రవి మోహన్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో పిల్లలతో ఆర్తి మాత్రమే నివశిస్తుంది. ఈ పరిస్థితిలో, రవి మోహన్ గత 10 నెలలుగా తన ఇంటి కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన EMI మొత్తాన్ని చెల్లించలేదని తెలుస్తోంది. రూ. 7.64 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. తేనాంపేటలోని సెమేయర్స్ రోడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని రవి మోహన్ స్టూడియోలో కూడా నోటీసులు అతికించారు. రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నారు.తదనంతరం, తేనాంపేటలోని కెమియర్స్ రోడ్డులోని రవి మోహన్ స్టూడియోస్ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు అతికించిన నోటీసును కార్యాలయ సిబ్బంది వెంటనే చించివేయడంతో గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించి నటుడు రవి మోహన్ సరైన వివరణ ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. బ్యాంకు అధికారులు ఇల్లు వేలం వేస్తే ఆర్తి తన పిల్లలతో ఎక్కడ ఉంటుందనేది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆడపిల్లకు సొంతంగా ఇల్లు లేదు తెలుసా..? అంటూ ఒక యంగ్ రచయిత చెప్పిన మాటలను కోట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లకు ఇలాంటి సందర్భం ఎదురైతే ఆమె చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. తాళి కట్టిన భార్యకు ఇల్లు లేకుండా రోడ్డు మీదకు తెచ్చేలా జయం రవి చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. -
సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. రూ.2 కోట్ల మేర మోసంఅప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
అవకాశాల వేట.. ఈ మూడు చిత్రాలపైనే కృతిశెట్టి కెరీర్
సినిమా ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో తెలియదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు. అలా ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లోకి వచ్చిన నటి కృతిశెట్టి(Krithi Shetty). ఈ కన్నడ భామ వాస్తవానికి 17 ఏళ్ల వయసులోనే నటిగా రంగప్రవేశం చేశారు. అలా తొలుత సూపర్ 30 అనే హిందీ చిత్రంలో నటించారు. తరువాత తెలుగులోకి ఉప్పెన చిత్రంతో దిగుమతి అయ్యారు. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో మరో ధ్రువతార వచ్చిందని అందరూ అనుకున్నారు. అన్నట్లుగానే తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను అందుకున్నారు.ఆ తరువాతనే కథ అడ్డం తిరిగింది. తెలుగులో తను నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో మలయాళం, కన్నడం, తమిళం భాషలపై దృష్టి సారించారు. అలా మలయాళంలో నటించిన ఏఆర్ఎం అనే చిత్రం ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే ద్విభాషా చిత్రం పేరుతో ది వారియర్, కస్టడీ చిత్రాలతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఎంత ఉప్పెనలా ఎట్రీ ఇచ్చారో ఇప్పుడు అంత చప్పగా ఈమె కెరీర్ సాగుతోంది. కృతిశెట్టికి ప్రస్తుతం మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో ఒక్క చిత్రం కూడా లేదు. తమిళంలో మాత్రం మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. రవిమోహన్కు జంటగా నటించిన జీనీ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. అదేవిధంగా కార్తీకు జంటగా నటించిన వా వాద్ధియార్ చిత్రం నిర్మాణాంతర కార్యమాల్లో ఉంది. కాగా ప్రదీప్ రంగనాథ్తో జత కట్టిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ మూడు చిత్రాలపైనే నటి కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. దీంతో ఈ అమ్మడు అవకాశాల వేటలో పడ్డారు. అందుకు అందరు హీరోయిన్ల బాటలోనే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాల సంగతి ఏమోగానీ, ఇప్పుడు ఆమె గ్లామరస్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (సెప్టెంబర్ 21న) రాత్రి మరణించారు. గీత మృతితో రాధిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలునేడు సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ నటుడు మద్రాస్ రాజగోపాల్ రాధాకృష్ణన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడి ముగ్గురు భార్యలు సరస్వతి, ధనలక్ష్మి, గీత ద్వారా మొత్తం 12 మంది సంతానం జన్మించారు. వారిలో హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, నిరోషా ఉన్నారు.చదవండి: 25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్ -
రాజమౌళి కంటే ధనుష్తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్
తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఫామ్లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్ డైరెక్షన్లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!) -
ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య
ప్రముఖ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమా సెట్లో స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. రోబో శంకర్ (Robo Shankar) మృతి పట్ల కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.అంత్యక్రియల్లో చివరిసారిగా..రోబో శంకర్ మృతితో అతడి భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. శుక్రవారం నటుడి అంత్యక్రియలు జరగ్గా.. చివరిసారి భర్తకు డ్యాన్స్తో వీడ్కోలు పలికింది. మనసులో విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం లాంటి బాధను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రియ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందో? ఏంటో? అని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ రోబో శంకర్?కాగా శంకర్.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు రోబో శంకర్గా స్థిరపడిపోయింది. మారి, ఇరుంబు తిరై, విశ్వాసం, చక్ర, కోబ్రా, కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు 80కి పైగా సినిమాలు చేశారు. ఈయన భార్య ప్రియాంక కూడా కన్ని మేడమ్ సినిమాలో నటించింది. వీరి కుమార్తె ఇంద్రజ.. విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) మూవీలో గుండమ్మగా నటించింది. చదవండి: మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ -
చిన్న సినిమాతో సూపర్ హిట్.. ఏకంగా స్టార్ హీరోతో ఛాన్స్!
లబ్బర్ పందు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలు, నిర్మాతల దృష్టిలో పడ్డారాయన. దీంతో తన రెండో సినిమాకే స్టార్ హీరో ధనుష్తో జతకట్టారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నటుడు ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడై ఆడియో లాంఛ్ కార్యక్రమంలో డైరెక్టర్ తమిళరసన్ పచ్చ ముత్తు పాల్గొన్నారు.తన తర్వాత చిత్రాన్ని ధనుశ్తోన చేయనున్నానని.. ఆయనకు క్లాప్ కొట్టి యాక్షన్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నట్లు పచ్చముత్తు పేర్కొన్నారు. ధనుశ్ సార్ తన కథను ఒపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఆయన చిత్రానికి తాను దర్శకత్వం వహించవచ్చని.. దాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించవచ్చని.. ఇవన్నీ వదంతులు కావచ్చు అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అయితే మొత్తం మీద ధనుశ్- తమిళరసన్ పచ్చముత్తు కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించనుందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో మాత్రం వెల్లడించలేదు. ఈ మూవికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్లామరస్గా ఉంటే క్యారెక్టర్నే తప్పుపడతారా?: హీరోయిన్ ఫైర్
కొందరు నటీమణులను చూస్తే వీరికి వయసు పెరగదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో వేదిక (Actress Vedhika) ఒకరు. ఈ మహారాష్ట్ర బ్యూటీ వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతూనే ఉంది. హీరోయిన్స్ అంటే చాలు..తమిళంలో ముని, సక్కరకట్టి, కాళై, పరదేశీ, కావియ తలైవన్, కాంచన–3 వంటి చిత్రాల్లో నటించిన వేదిక ఇప్పటికీ తన సొగసులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని విమర్శలు ఈ బ్యూటీకి కోపం తెప్పించాయి. గ్లామరస్గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారని ఆగ్రహించింది. సాధారణంగానే హీరోయిన్లు అంటే విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం రెడీగా ఉంటుందని, అందులోనూ కాస్త గ్లామరస్ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్నే తప్పుపడుతున్నారని మండిపడింది.నేను లెక్క చేయనుదుస్తుల గురించి విమర్శించే దుస్థితి మారాలంది. తానూ బికినీ ధరించి కూడా నటిస్తానని, ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పింది. తానేమిటో తనకు బాగా తెలుసని, తప్పుడు బుద్ధి కలవారు మారితే మంచిదని వేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది.చదవండి: ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్ -
60% షూటింగ్ పూర్తి.. ఆ హీరోను తీసేశా: దర్శకుడు
దర్శకుడు బాలాజీ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ది డార్క్ హెవెన్'. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో నటుడు నకుల్ హీరోగా నటించడానికి ఎంపికయ్యారు. అయితే కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ చిత్రం నుంచి నకుల్ వైదొలిగారు. దీంతో రాజారాణి–2 చిత్రం ఫేమ్ సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత బాలాజీ మాట్లాడుతూ.. కథకు కరెక్ట్గా సూటవుతుందనే ఇంగ్లీష్ టైటిల్ను నిర్ణయించాం.60% షూటింగ్ అయ్యాక..ఒక గ్రామంలో జరిగే వరుస హత్యల గురించి దర్యాప్తు చేయడానికి పోలీస్ అధికారి రంగంలోకి దిగుతారు. ఆయన ఈ హత్యల మిస్టరీని ఎలా చేధించాడు? అన్నదే చిత్రకథ. ఈ చిత్రంలో ముందుగా హీరోగా నకుల్ను ఎంపిక చేశాం, ఆయనతో 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సినిమా నుంచి తప్పించి సిద్ధును కథానాయకుడిగా ఎంపిక చేశాం. నా స్పీడ్ను నకుల్ అందుకోలేకపోయారు.షూటింగ్లో కథానాయకుడు కట్ చెప్పడం సరికాదు. నకుల్ మాత్రం సీన్లు చేస్తుండగా కట్ చెప్పేవారు. నాకు సంబంధించినంత వరకు హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ అన్నదే ముఖ్యమని భావించాను. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ దర్శిక కథానాయికగా, రితిక, అరుల్జ్యోతి, ప్రదీప్, జయకుమార్ జానకిరామన్,అజిత్ జోషి, చాప్లిన్ బాలు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు అని చెప్పారు. పీకే చాయాగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
ఆ హీరోను ఇష్టపడ్డా.. చెల్లి అని పిలిచాడు: హీరోయిన్
హీరోయిన్ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్ కుమార్ అంటే నాకు క్రష్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ చివరి రోజు..ఓ మూవీ షూటింగ్ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.సినిమామహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.చదవండి: ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి -
లోకేశ్ కనగరాజ్ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2'
లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్. ఇతడితో సినిమా చేసేందుకు ఇతర భాషల హీరోలు కూడా రెడీ అంటున్నారు. కానీ 'కూలీ' దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ'పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త విఫలమైంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ని సైడ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)అయితే లోకేశ్ ఈ ప్రాజెక్ట్కి దర్శకుడు కాదని తెలిసి కొందరు తమిళ ఫ్యాన్స్ బాధపడుతుండగా.. మరికొందరు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోకేశ్ తీసిన వాటిలో చాలా గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'ఖైదీ'. దీని సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఒకవేళ లోకేశ్ గనక.. కమల్-రజినీ మూవీ తీస్తే ఈ సీక్వెల్ రావడం లేటు అయిపోతుంది. మరోవైపు లోకేశ్ కాకుండా ఈ మల్టీస్టారర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్.. హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ అనే డైరెక్టర్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఖైదీ 2'ని లోకేశ్ మొదలుపెట్టే అవకాశముంది. మరి 'కూలీ' రిజల్ట్ చూసి.. కమల్-రజినీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ని పక్కనబెట్టేశారా? లేదంటే నిజంగానే లోకేశ్ పేరుని పరిగణలోకి తీసుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)Director is Not Confirmed Yet 👀So There is an Option other than #Lokeshkanagaraj 💥pic.twitter.com/pGN4okSvJP— SillakiMovies (@sillakimovies) September 17, 2025 -
ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్మీట్కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.ఒక్క డైలాగ్తో పాపులర్ఈ మూవీ ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈజీగా తప్పించుకుంటారునాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్తోనూ అలరించాడు.చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్' -
అందం.. అభినయం.. రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా
అందం అపురూపం. అభినయం స్ఫూర్తి దీపం.. దక్షిణాది ఎవర్గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్య కృష్ణన్... మన రమ్యకృష్ణ... భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక. ఎంత మందికి తెలుసో గానీ... ఇప్పటికీ అంటే దాదాపు 55 ఏళ్ల వయసులో కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి రూ. 3-4 కోట్లు వరకూ వసూలు చేస్తుందని సమాచారం. గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు. సినిమా సినిమాకీ గ్లామర్తో పాటు స్టార్ డమ్ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. 13ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం...రమ్య సెప్టెంబర్ 15, 1970న మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణ నటనా ప్రయాణం 13 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళ చిత్రం నేరం పూలరంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర (1993)చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది. సుభాష్ ఘై 'ఖల్ నాయక్'(1993), మహేష్ భట్ 'చాహత్'(1996) , డేవిడ్ ధావన్ 'బనారసి బాబు' (1997), అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్ (1998)లో గోవిందాతో కలిసి శపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది.నాలుగు దశాబ్ధాల నటనా ప్రస్థానం..ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగానూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే. దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్ లోనే రాణిస్తున్నారామె. ఐదు భాషలలో 200 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కంటె కూతుర్నే కను, స్వీటీ నాన్న జోడి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పడయప్ప(నరసింహ), సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే. నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం.. నభూతో అంటారు సినీ విమర్శకులు. అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, బిహైండ్వుడ్స్ గోల్డ్ మెడల్.. ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది. కాలక్రమంలో తన కెరీర్ను చిన్నితెరకూ విస్తరించి సన్ టీవీ కోసం కలసం, తంగం వంటి టీవీ సీరియల్లలో కనిపించింది. థంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్ లో జడ్జిగా కనిపించింది. వివాదాలూ...ఎక్కువే...ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడు కె.ఎస్. రవికుమార్తో వివాహేతర సంబంధం. 1999లో రమ్య కె.ఎస్.రవికుమార్తో పడయప్ప, పాటాలి (1999), పంచతంతిరం (2002) చిత్రాలలో కలిసి పనిచేసింది. తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ, కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రమ్య కెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం రూ. 75 లక్షలు తీసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి, అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కుని తిరిగి కెరీర్ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య. ఆ తర్వాత, ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని 2003 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగే సమయానికి, రమ్య వయసు 33, కృష్ణ వంశీ వయసు 41. 2005 ఫిబ్రవరి 13నఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పిల్లాడి పేరు రిత్విక్ వంశీ.అందానికి తెరరూపంగా...–అల్లుడుగారు–అల్లరిమొగుడు–అల్లరి ప్రియుడు–హలో బ్రదర్–మేజర్ చంద్రకాంత్అభినయానికి ప్రతిరూపంగా..–సూత్రధారులు–అమ్మోరు–నరసింహ–బాహుబలి ది బిగినింగ్–అన్నమయ్య–కంటే కూతుర్నే కనుచలనచిత్ర రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం... చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం. -
ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు. రోజూ తినాలనిపించేదిఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి. హ్యాపీగా ఉందిమనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ!
కోలీవుడ్లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.. మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, అలాగే స్టేజీ ఆర్టిస్ట్ కూడా! ఐదేళ్లపాటు నాటకాల్లో నటించిన తృప్తి రవీంద్ర పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. డాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం అందించారు.సంతోషంగా ఉందితాజాగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. శక్తి తిరుమగన్ మూవీ ద్వారా కథానాయక పరిచయం అవుతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నానంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. ఇలాంటి అర్థవంతమైన కథాపాత్రల్లో, ఇతర భాషల్లోనూ నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Trupti Ravindra (@trupti_ravindra_) -
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..
వైరల్ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్ మీ ఇడియట్' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. కన్నడలో కిస్ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కథేంటంటే?మాతృకకు పనిచేసిన డైరెక్టర్ అర్జున్ తమిళ వర్షన్కూ పని చేస్తున్నారు. కిస్ మీ ఇడియట్ చిత్రం సెప్టెంబర్ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటో ఉన్న బ్యానర్పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. తప్పని స్థితిలో..దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్ మీ ఇడియట్ రూపొందింది అని దర్శకుడు చెప్పారు. -
ప్రముఖ దర్శకుడికి డాక్టరేట్ ప్రదానం
ప్రముఖ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ గౌరవ డాక్టరేటు పొందారు. చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ వేల్స్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్కు గౌరవ డాక్టరేట్లను వారు ప్రదానం చేశారు. వడచెన్నై, అసురన్, విడుదలై, ఆడుకాలమ్,కాక్క ముట్టై వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం క్రికెట్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్కు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేశ్, రిజిస్ట్రారర్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గతంలొ ఇదే యూనివర్సిటీ నుంచి మెగా హీరో రామ్ చరణ్ కూడా గౌరవ డాక్టరేట్ పొందారు. -
డిప్రెషన్.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. డిప్రెషన్లో..నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. దాన్నుంచి బయటపడ్డా..మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
చాలా బాధపడ్డాను.. సోషల్మీడియాకు గుడ్బై చెప్పిన ఐశ్వర్య
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. ఈ క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. ఈ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది. ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ సినిమాలు మాత్రమే కాదు.. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేద రైతులకు, విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు రాఘవ లారెన్స్. చెన్నైలో లోకల్ ట్రైన్స్లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ వార్త పలు మీడియా ఛానెల్స్లో ఈ న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు.వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు. మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. కాగా.. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు.Today, A post reached me through social media about an 80 year old man and his wife in Chennai who make sweets and polis, selling them on trains to survive. Their resilience moved me deeply. 🙏I am ready to contribute ₹1,00,000 to support their journey, hoping it brings them… pic.twitter.com/yRYZj677Ze— Raghava Lawrence (@offl_Lawrence) September 10, 2025 -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్బాస్ ఫేమ్ విక్రమన్ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్గా కలర్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. -
15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. అందుకే ఇల్లు మారాంప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. పర్సనల్ లైఫ్రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్కుమార్కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.చదవండి: మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా -
అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశామా? దక్షిణాదితో పాటు హిందీలోనే రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. రూ.1000 కోట్ల కలెక్షన్ అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మార్క్ని తెలుగు చిత్రాలు ఇదివరకే అందుకోగా, 'కేజీఎఫ్'తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ ఫీట్ సాధించేసింది. కానీ తమిళ పరిశ్రమకు మాత్రం అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.గత నెలలో వచ్చిన 'కూలీ' కూడా ఈ మార్క్ అందుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్కి ముందు ఆ రేంజ్ హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి రూ.400-500 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే తమిళ మూవీస్ అసలు రూ.1000 కోట్ల మార్క్ ఎందుకు చేరుకోలేకపోతున్నాయ్ అనే విషయమై హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మాట్లాడాడు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అల్లు కుటుంబానికి GHMC షాక్)'తమిళ సినిమా ఆ నంబర్కి చేరువలో ఉంది. మరికొన్నేళ్లలో రూ.1000 కోట్ల కలెక్షన్ ఫీట్ సాధిస్తుందని నమ్మతున్నాను. చాలా తమిళ సినిమాలు ఈ మార్క్ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో సత్తా లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనే దీనికి కారణం. మూవీ క్వాలిటీ సంగతి పక్కనబెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువ. బెంగళూరు, ముంబైలో ఉన్నట్లు ఇక్కడా ఉంటే 'జైలర్'కి రూ.800-1000 కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు.. ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముంది' అని శివకార్తికేయన్ అన్నాడు.ఇతడు చెప్పిన దానిలో కొంత నిజముంది. బెంగళూరు, ముంబై సంగతి పక్కనబెడితే హైదరాబాద్లో ఓ మల్టీప్లెక్స్లో టికెట్ రేటు రూ.250-300 ఉంటే.. అదే సంస్థకు చెందిన చెన్నై మల్టీప్లెక్స్లో టికెట్ ధర రూ.180 మాత్రమే. అలానే తమిళ సినిమాల్లో ఎక్కువగా ప్రాంతీయత అనే అంశం కనిపిస్తుంది. అందుకే కొన్ని చిత్రాలు తమిళనాడులో తప్పితే మరో చోట ఆడవు. ఓవరాల్ అప్పీల్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు బహుశా తమిళ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవచ్చేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయింది.'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్' అంటూ ఆమె పోస్ట్ చేసింది.కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. 😄By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well ❤️I kindly request…— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 8, 2025 -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
లారెన్స్ మనసు బంగారం.. దివ్యాంగురాలి కోసం..
స్టార్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఎవరి పరిస్థితైనా బాగోలేదని తెలిస్తే క్షణం ఆలోచించకుండా సాయం చేస్తుంటాడు. ఈమధ్యే కూతురి చదువు కోసం చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిన ఓ తండ్రి కథ విని చలించిపోయాడు. భార్య జ్ఞాపకంగా మిగిలున్న మంగళసూత్రాన్ని విడిపించి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చాడు.అప్పుడు స్కూటీ గిఫ్ట్తాజాగా పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిజానికి ఆ దివ్యాంగురాలు నడవలేని స్థితిలో ఉంటే ఆమె కాలికి సపోర్ట్గా ఉండే పరికరాన్ని కొనిచ్చి ఆమె నడిచేలా చేశాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలుగా స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. అయినా ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. ఆమెను పూరి గుడిసె నుంచి మంచి ఇంటికి మార్చాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇంటి బాధ్యతమంచి ఇంటికి మారితేనే తన జీవితం కూడా బాగుంటుందని భావించాడు. ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. లారెన్స్ మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు. Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025 చదవండి: Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్ -
లోకేష్ ని చావు దెబ్బకొట్టిన కూలీ..
-
లక్కీఛాన్స్.. స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి
సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చివరిగా ఈమె తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాలేదు. ఇక తమిళంలోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత సింగపూర్ సెలూన్, విజయ్కు జంటగా ది గోట్ చిత్రాల్లో నటించారు. విజయ్కు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడు బాగా ప్రచారం పొందారు. కానీ, చిత్రంలో ఆమె పాత్ర మాత్రం పరిమితమే అయ్యింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు అడుగంటాయి. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ వరించిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. దీని తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ధనుష్కు జంటగా నటి మీనాక్షిచౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా ఒక హిందీ చిత్రంలోనూ మీనాక్షిచౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తుంటారు. కొందరు పూర్తిగా చేసుకోకుండా కూడా ఉండిపోతుంటారు. అయితే తమిళ స్టార్ కమెడియన్ ప్రేమ్ జీ మాత్రం 45 ఏళ్ల వయసులో గతేడాది సింపుల్గా వివాహం చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఏడాది పూర్తయిందో లేదో శుభవార్త చెప్పేశాడు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)గతేడాది జూన్లో ఇందుని పెళ్లి చేసుకున్న కమెడియన్ ప్రేమ్ జీ.. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఇందుకి సీమంతం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఇందు-ప్రేమ్ జీ దంపతులకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రేమ్జీ విషయానికొస్తే.. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారుడు. తండ్రిలానే తొలుత సంగీత రంగంలోకి వచ్చాడు. యువన్ శంకర్ రాజా దగ్గర కెరీర్ మొదలుపెట్టాడు. ప్లే బ్యాక్ సింగర్గా ర్యాప్ సాంగ్స్ పాడాడు. కానీ 2006లో వల్లవన్ మూవీతో నటుడిగా మారాడు. ఇతడి సోదరుడు, డైరెక్టర్ వెంకట్ ప్రభు తీసిన 'చెన్నై 600028' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కమెడియన్గా ప్రేమ్జీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ) -
500 ఎకరాల నుంచి అంతా పోగొట్టుకుని.. సైలెన్సర్ స్టోరీ ఇదే!
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని పాత్రలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా పెదవులపై చిరునవ్వు వస్తుంటుంది. అలాంటి పాత్రలో నటించి సినిమా విజయంలో భాగమయ్యాడు సత్యన్ (Tamil Actor Sathyan). ఇతడు స్నేహితుడు (తమిళంలో నంబన్) మూవీలో సైలెన్సర్గా నటించాడు. క్లాస్ ఫస్ట్ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుంటారు.500 ఎకరాల ఆసామిఇదే కాదు, రాజా రాణి, తుపాకి, గజిని, పులి, రాధే శ్యామ్, జిగర్తాండ డబుల్ ఎక్స్.. ఇలా 70కిపైగా సినిమాల్లో నటించాడు. నిర్మాత మదంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడే సత్యన్. శివకుమార్కు 500 ఎకరాల పొలం, ఐదు ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగ్లా ఉండేవి. విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ పైకి కలర్ఫుల్గా కనిపించే సినిమా ప్రపంచం ఆ ఆస్తిని కర్పూరంలా కరిగించేసింది. శివకుమార్ నిర్మాతగా మారడంతోనే కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు, భారీ నష్టాలు మూటగట్టుకున్నాడు. దాన్నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులు కూడా అమ్ముకున్నాడు.హీరోగా అట్టర్ ఫ్లాప్నిజానికి సత్యన్ కమెడియన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. 2000వ సంవత్సరంలో ఇలయవన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాల్ని ఎదుర్కొంది. కొడుకును హీరోగా పెట్టి 'కన్న ఉన్నై తెడుకిరెన్' అని మరో సినిమా చేయగా అది కూడా ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు ఫ్లాపులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీశాయి. తండ్రి మరణం తర్వాత పరిస్థితి మరింత అధ్వాణ్నంగా మారడంతో సత్యన్.. బంగ్లాను కూడా అమ్మక తప్పలేదు.టాప్ కమెడియన్.. అయినా!హీరోగా కలిసొచ్చేలా లేదని సత్యన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే స్థిరపడిపోయాడు. కమెడియన్గా, హీరో ఫ్రెండ్ పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. స్నేహితుడు, రాజా రాణి వంటి చిత్రాలు అతడిని టాప్ కమెడియన్గా నిలబడెట్టాయి. కానీ పోగొట్టుకున్న ఆస్తులు మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇతడికి దగ్గరి బంధువు అవుతాడు. సత్యరాజ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సత్యన్ తండ్రే పాకెట్మనీ ఇచ్చేవాడు!చదవండి: అంత భయం దేనికి? విజయ్ దేవరకొండకు కౌంటర్! -
జెర్సీ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ప్రియులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. బాలయ్య హీరోగా వచ్చిన డాకు మహారాజ్ చిత్రంతో అభిమానులను ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్. ఈ సిరీస్కు రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించారు.తాజాగా ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్గా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గేమ్ డెవలపర్ జీవితంలో ఇది క్లిష్టమైన సమయం అంటూ శ్రద్ధా శ్రీనాథ్ పోస్టర్ను పంచుకుంది. అయితే ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్తో రూపొందిన సిరీస్ను రూపొందించారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సిరీస్లో సంతోశ్ ప్రతాప్, చాందిని కీలక పాత్రలు పోషించారు.Oru game developer oda life la hardest level idhuva thaan irukum. Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix@NetflixIndia @ApplauseSocial @nairsameer @SegalDeepak @CheruvalathP #AmalgaCreationsMedias @RajeshMSelva @ShraddhaSrinath @ActorSanthosh pic.twitter.com/hKFzPxFMIU— Shraddha Srinath (@ShraddhaSrinath) September 4, 2025Oru game developer oda life la hardest level idhuva thaan irukumWatch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix pic.twitter.com/Op3JfnSWWv— Netflix India South (@Netflix_INSouth) September 4, 2025 -
తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ హీరో
నటుడు అదిత్ అరుణ్ (త్రిగుణ్) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య సీమంతం వీడియోను తాజాగా పంచుకున్నాడు. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా సరే టాలెంట్ను నమ్ముకుని వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. మొదట కథ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. రీసెంట్గా లైన్ మ్యాన్, ఉద్వేగం వంటి చిత్రాలతో మెప్పించారు.త్రిగుణ్ 2023 సెప్టెంబర్లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వారి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. దీనికంటే ముందు నివేదిత సీమంతం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన పంచుకున్నారు.చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Adith Eswaran (@adith_officiall) -
'ఆ ప్రాజెక్ట్ వల్లే ఐదేళ్ల గ్యాప్'.. మదరాసి డైరెక్టర్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం మదరాసి. ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్పై విడుదల చేస్తున్నారు.. సెప్టెంబర్ 5న మదరాసి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథలో హీరో పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారుని మురుగదాస్ వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుందని పేర్కొన్నారు.అయితే గత ఐదేళ్లలో నేనెప్పుడూ ఖాళీగా ఉండలేదని ఏఆర్ మురుగదాస్ తెలిపారు. కానీ మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేసినట్లు వెల్లడించారు. దాని వల్లే చాలా సమయం వృథా అయిందని.. అందువల్లే ఐదేళ్ల గ్యాప్ వచ్చిందన్నారు. -
గెస్ట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్.. :శివకార్తికేయన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి (Madarasi Movie). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్కు హాజరయ్యాడు.గెస్ట్ రోల్ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అని బదులిచ్చాడు. మీపై వచ్చిన రూమర్స్ గురించి చెప్పండి అని సుమ అడిగింది. అందుకు హీరో.. అమరన్ మూవీ టైంలో నేను 8 ప్యాక్ బాడీ చేసినట్లుగా ఫోటో సృష్టించారు. అందులో నా ముఖాన్ని సాగదీశారు. స్టెరాయిడ్స్ వాడానని రూమర్నేను స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని రాశారు. అది చూసి లైట్ తీసుకున్నా అని తెలిపాడు. తెలుగు హీరోతో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం వస్తే నానితో కలిసి నటించాలనుందన్నాడు. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని అప్డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్తో మదరాసి హీరోయిన్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.చదవండి: మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి వార్నింగ్ -
ఆస్కార్ రేసులో పా. రంజిత్ సినిమా.. ట్రైలర్ చూశారా..?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు 'పాపా బుకా' చిత్రం రేసులో ఉంది. కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు ఎంట్రీ ఇచ్చింది. పా. రంజిత్ ట్వీట్ తర్వాత ఈ చిత్రం ట్రైలర్ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. పపువా న్యూ గినీ ద్వీపానికి చెందిన నోయెలెన్ తౌలా, పా. రంజిత్ (Pa. Ranjith), అక్షయ్ కుమార్ పరిజా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.మూడు జాతీయ అవార్డులతో రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ దర్శకుడు బిజుకుమార్ దమోదరన్ 'పాపా బుకా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న పపువా న్యూ గినియా దేశంలోని థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్లో ప్రదర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పీఎన్జీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి ఈ చిత్రం చూపుతుంది. ఈ సినిమా గురించి పా రంజిత్ ఏం చెప్పారంటే..పా రంజిత్ తన ట్వీట్లో రాస్తూ.. 'అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా..రెండు దేశాల సహ-నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి మద్దతుగా, అలాగే ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమిది. ఈ సినిమా ద్వారా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకు గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు. -
పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
పార్వతీ మెల్టన్.. ఒకప్పుడు టాలీవుడ్లో పాపులర్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పెళ్లై సుమారు 13ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు కొన్ని ఫోటోలను ఆమె పంచుకుంది. పలు సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె ఒక ఇండో అమెరికన్ సినీ నటి. అయితే, 2005లో వెన్నెల సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. జల్సా, దూకుడు, గేమ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయింది. 2012లో శ్రీమన్నారాయణ చిత్రంతో తన నటనకు గుడ్బై చెప్పేసింది.అమెరికాకు చెందిన వ్యాపారావేత్త 'షంసు లాలానీ'తో పార్వతీ మెల్టన్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సినిమాలకు గుడ్బై చెప్పి 2012లో వివాహం చేసుకుంది. అయితే, సుమారు 13ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలను షోషల్మీడియాలో పంచుకుంది.పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ సినిమా 'జల్సా' చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్లో అలరించింది. ఆ తర్వాత ఆమె చేసిన చివరి చిత్రం శ్రీమన్నారాయణ.. దీంతో సినిమా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టేసింది. తన సినీ కెరీర్ పాడవడానికి కారణం ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ వారి పేర్లు మాత్రం చెప్పలేదు. View this post on Instagram A post shared by Parvati Melton (@parvatim) -
'ఇదే చివరి సినిమా..'.. స్టార్ డైెరెక్టర్ షాకింగ్ నిర్ణయం
కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్. అసురన్, పొల్లధవన్, వడ చెన్నై, విడుదలై లాంటి చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకవైపు డైరెక్టర్గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ గ్రాస్ రూట్ ఫిల్మ్ బ్యానర్లో పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో బ్యాడ్ గర్ల్ అనే మూవీని నిర్మించారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు వెట్రిమారన్ ప్రకటించారు.. సినిమా నిర్మాణం సవాల్తో కూడుకున్నదని అన్నారు. మూవీ తీయడానికి డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. బ్యాడ్ గర్ల్ మూవీ మా నిర్మాణ సంస్థ చివరి చిత్రం అవుతుందని వెట్రిమారన్ వెల్లడించారు. నిర్మాత చేయడం టాక్సింగ్గా ఉందని కామెంట్స్ చేశారు.కాగా.. వర్ష భారత్ దర్శకత్వం వహించిన 'బ్యాడ్ గర్ల్' చిత్రంలో అంజలి శివరామన్, శాంతి ప్రియ నటించారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. వివాదం తలెత్తింది. దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపగా.. చివరికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.దర్శకుడు వెట్రి మారన్ మాట్లాడుతూ.. "నిర్మాతగా ఉండటం అనేది ఒక టాక్సింగ్ జాబ్ లాంటిది. దర్శకుడిగా ఉండటం అనేది సృజనాత్మకమైన పని. ఆ ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. మన పని మనం చేసుకోవాలి. కానీ, మీరు నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్ కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక నిర్మాతగా అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. దర్శకుడు మిస్కిన్తో కొన్ని రోజుల క్రితం దీని గురించి మాట్లాడా" అని అన్నారు. తన నిర్మాణ సంస్థలో వస్తోన్న మానుషి చిత్రం రివైజింగ్ కమిటీ వద్ద ఉందని పేర్కొన్నారు. కాగా.. బ్యాడ్ గర్ల్ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. -
తను లేకుండా ఇకపై ఏ సినిమా చేయను: కూలీ డైరెక్టర్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. మానగరం, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో వరుస బ్లాక్బస్టర్స్ కొట్టి ఇతడు ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించాడు. రజనీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది.ఆయన లేకుండా సినిమా చేయనుతాజాగా ఈయన కోయంబత్తూరులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పాడు.అది జరగకుండానే డైరెక్టర్ అయిపోయాఇదే సదస్సులో లోకేశ్ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్పిలిం చేశా. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్, ల్యాప్టాప్ ఉన్నవాడే ఎడిటర్. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాగా లోకేశ్ తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించాడు. Director #LokeshKanagaraj drops a BIG STATEMENT! 😮"In future as well, I wouldn't do any films without @anirudhofficial" pic.twitter.com/nTicUPOWCZ— Anirudh FP (@Anirudh_FP) September 1, 2025చదవండి: బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్పై మృణాల్ ఠాకూర్ -
అదితి శంకర్కు మరో ఛాన్స్
స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్ అనే విషయం తెలిసిందే. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకిగా, గాయనిగా ఒకేసారి పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్కి జంటగా మావీరన్ చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆకాష్ మురళి హీరోగా పరిచయమైన తమిళ చిత్రం నేశిప్పాయాలో అదితిశంకర్ నాయకిగా నటించారు. ఆ చిత్రం నిరాశపరిచింది. అదేవిధంగా తెలుగులో ఈమె ఎంట్రీ ఇచ్చిన భైరవం చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కాస్త వెనకపడ్డ అదితి ప్రస్తుతం అర్జున్దాస్కు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే తాజాగా మరో అవకాశం ఆమెకు తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈరం, కుట్రం 23 వంటి థ్రిల్లర్ కథా చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అరివళగన్. తాజాగా తెరకెక్కించనున్న చిత్రంలో అదితిశంకర్ను కథానాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. అరివళగన్ దర్శకుడు శంకర్ శిష్యుడు అన్నది గమనార్హం. దీంతో ఈయన తన గురువుగారి వారసురాలుని తెరపై ఏ విధంగా ఆవిష్కరించనున్నారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే నెలకొంటోంది. ఎందుకంటే అదితిశంకర్ ఇప్పటివరకు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించలేదు. -
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా
టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ప్రేమలో ఉంది. వినాయక చవితి సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ రజిత్ ఇబ్రాన్తో రిలేషన్లో ఉన్నాననే విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది. అయితే అసలు ఈ ప్రేమకథ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? తదితర విషయాల్ని ఇప్పుడు స్వయంగా నివేతా రివీల్ చేసింది.మధురైలో పుట్టి పెరిగిన నివేతా.. 2016లో ఓ తమిళ సినిమాతో నటిగా మారింది. 'మెంటల్ మదిలో' అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చిత్రలహరి, బ్రోచేవారెవరా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా దమ్కీ తదితర మూవీస్ కూడా చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అయితే ఓవైపు నటిస్తూనే దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!)స్వతహాగా హీరోయిన్ అయినప్పటికీ రేసింగ్, బ్యాడ్మింటన్లోనూ నివేతాకు ప్రతిభ ఉంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం దుబాయిలో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్తో తనకు పరిచయమైందని నివేతా చెప్పింది. తొలుత స్నేహితులుగానే ఉన్నామని, కొన్నాళ్లకు ఇద్దరం అనుకుని ప్రేమికులు అయ్యామని చెప్పింది. తన సర్కిల్లో చాలా తక్కువమందికి మాత్రమే తన ప్రేమ గురించి తెలుసని, ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయం తెలియదని పేర్కొంది. తన ప్రేమ గురించి బయటపెట్టడం తన మేనేజర్తో సహా అందరికీ షాక్ అని తెలిపింది.ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశామని చెప్పిన నివేతా.. అక్టోబరులో నిశ్చితార్థం చేసుకుంటామని రాబోయే జనవరిలో పెళ్లి ఉంటుందని పేర్కొంది. తేదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి కుటుంబాలు దుబాయిలో ఉంటున్నాయని, అలానే తమ వివాహాన్ని సింపుల్గా సన్నిహితుల సమక్షంలో చేసుకుంటామని నివేతా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
కుమారుడి పెళ్లి.. ఎంతో స్పెషల్ అంటూ నటుడి భావోద్వేగం
తమిళ నటుడు ప్రేమ్ కుమార్ (Tamil Actor Prem Kumar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ప్రేమ్కుమార్ తనయుడు కౌశిక్ సుందరం.. పూజిత మెడలో తాళికట్టాడు. వీరిద్దరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. రెక్కలు విప్పుకుని ఎదిగే కొడుకుని చూస్తుంటే తండ్రికి ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకం..ఆగస్టు 28 మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా కొడుకు పెళ్లి అనే బంధంతో జీవితంలో ముందడుగు వేశాడు. అది చూసి తండ్రిగా నా మనసు ఉప్పొంగిపోతోంది. నూతన వధూవరులు కౌశిక్- పూజిత జంట సుఖసంతోషాలతో కలకాలం కలిసుండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరిద్దరూ గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించినవారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాఈ పెళ్లి వేడుకకు హీరో శివకార్తికేయన్ హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమానికి హీరో కార్తీ అటెండయ్యాడు. ప్రేమ్ కుమార్.. ధనం, గురుసామి, బిర్యానీ, ఖిలాడీ, సర్కార్, కాపన్, విక్రమ్ వేద, హీరో, మాస్టర్, తునివు(తెగింపు), కంగువా, రెట్రో.. వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఈనాడు (2009) సినిమాలో ఫ్రాన్సిస్గా యాక్ట్ చేశాడు. ఓటీటీలో సుడల్: ద వోర్టెక్స్ వెబ్ సిరీస్లో మెరిశాడు. As a parent, nothing rivals the feeling of pure pride in watching your kid grow and spread their wings in their life with style. In that regard, 28th of August will always be a very special day for our family.My boy took a very big step yesterday, and as a father, my heart is… pic.twitter.com/POfWmAljRw— Prem Kumar (@premkumaractor) August 29, 2025 చదవండి: స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ -
ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్
'నడిగర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్ హీరో విశాల్ (Vishal). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్ 48వ బర్త్డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.చివరి బ్యాచిలర్ బర్త్డే..నిశ్చితార్థం తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్ బర్త్డే. ఎంగేజ్మెంట్ విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. అలాంటి సీన్లు చేయనుబిల్డింగ్ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతుంది. నా బ్యాచిలర్ లైఫ్ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్ ప్రస్తుతం 'మకుటం' మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్బీ చౌదరి కెరీర్లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial)చదవండి: ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు! -
మొన్న భర్త కన్నీళ్లు.. గుడ్న్యూస్తో సర్ప్రైజ్ చేసిన 'పూర్ణ'
టాలీవుడ్లో 'పూర్ణ'గా గుర్తింపు తెచ్చుకున్న 'షమ్నా కాసిమ్' మరోసారి అమ్మ కాబోతుంది. తను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్మీడియా ద్వారా ప్రకటించింది. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణకు టాలీవుడ్లో మంచి గుర్తింపుతో పాటు భారీ ఛాన్సులు దక్కాయి.దుబాయ్కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు ఆమె ప్రకటిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా కుటుంబంలోకి మరోకరు రానున్నారు. మనం ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని జీవించడం అనే కల నా లైఫ్లో నిజమైంది. కానీ, తల్లిదండ్రులు కావడం అన్నింటికంటే అందమైన అధ్యాయం. మేము మా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నాం. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల కోసం మేము వేచి ఉండలేము. కొత్త నవ్వులు, చిన్ని అడుగుజాడలు మా జీవితాల్లోకి రానున్నాయి.' అంటూ పూర్ణ పంచుకుంది. 2026లో తను రెండో బిడ్డకు జన్మనిస్తానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తన మొదటి కుమారుడితో పలు ఫోటోలు పంచుకుని తెలిపింది. పూర్ణ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించి మెప్పించింది. పూర్ణ గురించి ఆమె భర్త ఇలా పోస్ట్ చేశారుసరిగ్గా రెండురోజుల క్రితం పూర్ణ గురించి ఆమె భర్త ఇలా చెప్పాడు. తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగానే పూర్ణ గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. 'ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని. ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
8 ఏళ్లుగా భార్య సంపాదనతో బతుకుతున్నా..: డైరెక్టర్
భార్య, నటి శ్రీవిద్య సంపాదనతోనే బతుకుతున్నానంటున్నాడు తమిళ దర్శకుడు రాహుల్ రామచంద్రన్ (Rahul Ramachandran). 8 ఏళ్లుగా తన ఖర్చులన్నీ శ్రీవిద్యే చూసుకుందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా భార్య చిన్ను (శ్రీవిద్య) ఎనిమిదేళ్లుగా నన్ను బంగారంలా చూసుకుంటోంది. ఎటువంటి లోటుపాట్లు రానివ్వలేదు. అంతకుముందు మా అమ్మ నన్ను చూసుకునేది. ఆరేళ్లుగా ఏ సినిమా చేయని డైరెక్టర్కు సంపాదన ఎక్కడినుంచి వస్తుంది?అమ్మ ఇచ్చే డబ్బుతో గిఫ్ట్ఇలాంటి సమయంలో చిన్ను నాకోసం నిలబడింది. ఇప్పుడు నావంతు వచ్చింది. చిన్న బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల కొంత డబ్బు సంపాదించగలిగాను. దానితోనే ఈ మధ్య తనకు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇలా బహుమతిచ్చి చాలాకాలమే అవుతోంది. తన పుట్టినరోజు వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర కొంత డబ్బు తీసుకుని ఏదో ఒక గిఫ్ట్ కొనిస్తుంటాను.భార్య సంపాదనతో బతుకుతున్నా.. తర్వాతి పుట్టినరోజువరకల్లానైనా నా సొంత డబ్బుతోనే తనకు బహుమతి కొనివ్వాలని కోరుకుంటున్నాను. భార్య సంపాదనతో సంతోషంగా బతుకుతున్నానని చెప్పడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఏదో ఒకరోజు నేనూ నిలబడి తనకు అండగా నిలబడతాను. అదే నమ్మకంతో ఉన్నాను. ఎప్పుడైనా తినడానికి బయటకు వెళ్లినప్పుడు కూడా తన ఫోన్ నాకిచ్చేసి పేమెంట్ చేయమంటుంది అని చెప్పుకొచ్చాడు. శ్రీవిద్య క్యాంపస్ డైరీ, ఒరు కట్టనందన్ బ్లాగ్, నైట్ డ్రైవ్.. సహా పలు చిత్రాల్లో నటించింది. సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిసింది. రాహుల్.. జీబూంబా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత మరే సినిమా చేయలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన రాహుల్- శ్రీవిద్య.. 2024 సెప్టెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నప్పటినుంచే రాహుల్ ఆలనాపాలనా చూస్తున్న శ్రీవిద్య నిజంగా గ్రేట్ అని అభిమానులు కొనియాడుతున్నారు.చదవండి: శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు -
సింపుల్గా నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్
తమిళ హీరో విశాల్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయిధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తమిళం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. హీరోయిన్గా చేస్తున్న ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం ఆగస్టు 29నలో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్.. ఆ సంఘ(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్గా ఈ వేడుక జరిగింది.(ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి)సాయి ధన్సిక.. తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో 'మనతోడు మజైకాలం' అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో 'కెంప' మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 'షికారు' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'అంతిమ తీర్పు', 'దక్షిణ' లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసింది.విశాల్-ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారేమో? (ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)Thank u all u darlings from every nook and corner of this universe for wishing and blessing me on my special birthday. Happy to share the good news of my #engagement that happend today with @SaiDhanshika amidst our families.feeling positive and blessed. Seeking your blessings and… pic.twitter.com/N417OT11Um— Vishal (@VishalKOfficial) August 29, 2025 -
శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు
రజనీకాంత్ (Rajinikanth) నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో శివాజీ (Sivaji Movie) ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్గా నటించమని మొదట సత్యరాజ్ను సంప్రదించారట! రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట! నేనెంత కష్టపడ్డా సరే.. రజనీకాంత్ వచ్చి స్టైల్గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట! శివాజీలో విలన్గా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలన్గా నటిస్తాడా? అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది. విలన్గా ముద్ర వేస్తారని..రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్ (Sathyaraj). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు నేను హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్ సృష్టించుకునే పనిలో పడ్డాను. సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా ఆఫర్ చేశాడు. ఒక్కసారి విలన్గా చేస్తే ఇక అన్నీ ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు.39 ఏళ్లు పట్టింది!కాగా సత్యరాజ్.. విలన్ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్ మొదలుపెట్టాడు. నూరవత్తు నాల్ (1984) చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత మెయిన్ విలన్గా మారాడు. ఓపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు. రజనీకాంత్తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. వీరిద్దరూ చివరగా నటించింది 1986లో వచ్చిన మిస్టర్ భరత్ మూవీలో! ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది. శివాజీ, ఎంతిరన్ (రోబో) సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు.చదవండి: ఆ టాలీవుడ్ హీరో అంటే ఫుల్ క్రష్.. సురేఖవాణి కూతురు సుప్రీత -
ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్
సరిగ్గా నెల క్రితం తమిళ నటుడు, చెఫ్ మదంపట్టి రంగరాజ్.. రెండో పెళ్లితో వార్తల్లో నిలిచాడు. నటీనటులు మరో పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఇక్కడ రంగరాజ్ పెళ్లి చేసుకున్న మహిళ సెలబ్రిటీ స్టైలిష్ట్.. అప్పటికే ఆమె ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే అనుకుంటే ఇప్పుడో ఈ స్టోరీలో మరో ట్విస్ట్.(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా)జూలై 26న తమిళ నటుడు రంగరాజ్.. స్టైలిష్ట్ జాయ్ క్రిసిల్డాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రోజే తాను ఆరు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నానని జాయ్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. రీసెంట్గా పదిరోజుల క్రితం కూడా భర్తతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ రీల్ పోస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు భర్తపై జాయ్.. పోలీస్ కేసు పెట్టింది. గర్భం దాల్చిన తర్వాత పెళ్లయితే చేసుకున్నాడు గానీ తనని పట్టించుకోవట్లేదని, మోసం చేశాడని చెప్పి చెన్నై పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది.రంగరాజ్ స్వతహాగా చెఫ్. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమిళంలో మెహందీ సర్కస్, పెంగ్విన్ సినిమాల్లో నటుడిగానూ చేశాడు. ఇదివరకే ఇతడికి పెళ్లయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నెల క్రితం స్టైలిష్ట్ జాయ్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈమెతో పాటు కాకుండా తొలి భార్యతోనే ఉంటున్నాడు. రీసెంట్గా మొదటి భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఈ విషయం గురించే అడిగితే రంగరాజ్ తనపై దాడి చేశాడని జాయ్ అంటోంది. పెళ్లి తర్వాత నుంచి తనతో కలిసి ఉండేందుకు రంగరాజ్ ఇష్టపడట్లేదని చెబుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి) View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) -
హీరోయిన్ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు. అరె ఇలా అయిపోయామేంటి? వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి, సన్నగా అవ్వాలని అనుకుంటాం. కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటాం. కానీ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఫిట్నెస్పై దృష్టి పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు ఈమె కుటుంబాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ దర్శకుడు సుందర్ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత కూడా ఉన్నారు. గతంలో ఖుష్బూతో పాటు కూతుళ్లు కూడా కాస్త లావుగా కనిపించేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చేవి. బరువుపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసేవాళ్లు. మరి ఈ విషయాన్ని ఖుష్బూ చాలా సీరియస్గా తీసుకున్నట్లుంది.(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)ఏడాది తిరిగేలోపు ఖుష్బూ కుటుంబంలోని అందరూ లుక్ మార్చేశారు. పైన కనిపిస్తున్న ఫొటోల్లో ఒకటి గతేడాది సెప్టెంబరులో తీసుకున్నది. ఇందులో అందరూ కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అందరూ సన్నగా మారిపోయి కనిపించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేసింది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతలోనే ఇంత మార్పు అని మాట్లాడుకుంటున్నారు.చాన్నాళ్ల క్రితమే యాక్టింగ్ పక్కనబెట్టిన ఖుష్బూ.. ఓవైపు రాజకీయాల్లోనూ ఉంటూనే మరోవైపు 'జబర్దస్త్' లాంటి రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తోంది. ఈమె కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహుశా అందుకే అందరూ ఒకేసారి ఇలా లుక్ మార్చి కనిపించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్లో చిక్కుకుపోయిన హీరో మాధవన్!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల జనజీవనం స్థంభించిపోయింది. కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల తాను జమ్మూ కశ్మీర్లో చిక్కుకుపోయానంటున్నాడు తమిళ హీరో ఆర్.మాధవన్ (R Madhavan). ప్రస్తుతం ఇతడు లెహ్లో ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత మరోసారి..తన హోటల్ రూమ్ బయట పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆగస్టు నెలాఖరుకే లద్దాఖ్లో మంచు కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను. అదేంటోకానీ లద్దాఖ్కు షూటింగ్కు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. 2008 ఆగస్టులో 3 ఇడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇలాగే..పాన్గాంగ్ సరస్సు వద్ద ఆ మూవీ షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా సడన్గా మంచు కురవడంతో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఈ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంది. దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. కనీసం ఈరోజైనా వాతావరణం కాస్త కుదుటపడితే నేను ఇంటికెళ్లిపోతాను అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్కు 17 ఏళ్ల తర్వాత వర్షం అన్న క్యాప్షన్ను జత చేశాడు. ఆర్ మాధవన్.. చివరగా ఆప్ జైసా కోయ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ధురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: సింగర్తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి -
దాడి కేసులో హీరోయిన్కు ముందస్తు బెయిల్
మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. సోషల్మీడియాలో లక్ష్మీ మేనన్ పేరు హాట్టాపిక్గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిపై తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయడమే కాకుండా అతడిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా నటి లక్ష్మీ మేనన్ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.లక్ష్మీ మేనన్పై కేసు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కేరళ కోర్టును సంప్రదించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆమెకు సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెను అరెస్ట్ చేయకండి అంటూ పోలీసులను సూచించింది. అయితే, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.అసలు కారణం ఏంటి..?లక్ష్మీ మేనన్ వివాదంలో పోలీసులు ఇలా చెప్పారు. 'ఓ బార్ వద్ద లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగి టీమ్ మధ్య మొదట వివాదం వచ్చింది. ఇరు గ్రూపుల మధ్య మాటకుమాట పెరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్తో పాటు ఆమె స్నేహితులు వెంబడించారు. ఆపై అతడిని దాడిచేశారు. కేరళ కొచ్చికి చెందిన లక్ష్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.ஐ.டி ஊழியர் கடத்தல் வழக்கில் விசாரணைக்கு அழைக்கப்பட்ட நடிகை லட்சுமிமேனன் தலைமறைவான நிலையில் காரை வழிமறித்து தகராறு செய்வது போன்ற வீடியோ வெளியாகி வைரல்..#Polimer | #Police | #Kerala | #LakshmiMenon | #Arrest pic.twitter.com/zipPD6H8PN— Polimer News (@polimernews) August 27, 2025 -
దారుణంగా మోసపోయా.. నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు.. సింగర్
సుచీ లీక్స్తో కోలీవుడ్లో వైరలైన వివాదాస్పద సింగర్ సుచిత్ర. గతంలో ఆమె పలువురు స్టార్స్పై తీవ్రమైన ఆరోపణలు చేసి కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. ఈ వివాదంలోకి హీరో ధనుష్ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సింగర్ సుచిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు కాబోయే భర్త షణ్ముగరాజ్ మోసం చేశాడంటూ ఆరోపించింది. అంతేకాకుండా తన ఇంటితో పాటు డబ్బులను లాక్కున్నాడని వీడియోను రిలీజ్ చేసింది. అతనితో తనకు నిశ్చితార్థం అయిందని.. ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహ హింసకు అనుభవించానని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. షణ్ముగరాజ్ పెద్ద మోసగాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.గతంలో తనను చెన్నై నుంచి వెళ్లగొట్టారని సింగర్ సుచిత్ర పోస్ట్ చేసింది. అందుకే ముంబైకి వెళ్లి ఉద్యోగం దొరికిన తర్వాత అక్కడే స్థిరపడినట్లు తెలిపింది. సుచీ లీక్స్ వివాదం తర్వాత.. నా జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రావని అనుకున్నా.. కానీ మళ్లీ నా లైఫ్లో అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నేను 48 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాను.. నా జీవితంలో ఎప్పుడూ జరగకూడదనుకున్నవన్నీ జరిగాయని బాధను వ్యక్తం చేసింది. ఈ వయసులో గృహ హింసను ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అతను ఒక రెజ్లర్ లాగా కొట్టేవాడని.. నన్ను బూట్లతో తన్నేవాడని.. ఒక రోజంతా ఏడుస్తూ మూలన కూర్చున్నేదాన్ని అని వాపోయింది.అతను తన మొదటి భార్య కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనేవారని సింగర్ తెలిపింది. కానీ అతను విడాకులు తీసుకోలేదని నాకు తరువాత తెలిసిందని.. ఈ విషయంలో తనతో అబద్ధం చెప్పాడని వెల్లడించింది. ఒక రోజు అతని మొదటి భార్య వచ్చి అతన్ని విడిచి పెట్టాలని నన్ను వేడుకుందని వీడియోలో మాట్లాడింది. నేను నిజంగా ప్రేమలో పడడం వల్లే డబ్బులు ఇచ్చానని.. లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేదాన్నికాదని.. నా ప్రతి పైసా తిరిగి చెల్లించే వరకు పోరాడతానని అంటోంది సుచిత్ర. మరో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అతని ఫోటో, ఆధార్ కార్డుతో సహా వివరాలను పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suchi (@suchislife_official) -
ఆమె నాకు దేవుడిచ్చిన వరం.. భార్యను వదిలేసి ప్రియురాలిపై ప్రశంసలు!
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్తో రిలేషన్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.పార్ట్నర్షిప్గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్లో ఆమెను పార్ట్నర్గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. కెనీషా ఎమోషనల్జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్ -
బరువు తగ్గిన కాజల్.. మెచ్చుకున్న వారిపై ఫైర్
నిజాలు చేదుగా ఉంటాయన్న సామెత ఉండనే ఉంది. అలా కొందరు వాస్తవాలను అంగీకరించలేరు కదా ప్రశంసలను కూడా స్వాగతించలేరు. నటి కాజల్ అగర్వాల్ ప్రవర్తన కూడా ఇలానే ఉంది. ఈ భామ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే. కొన్ని ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా పెద్దగా ఫలితం దక్కలేదు. అదే సమయంలో మార్కెట్ కూడా పడిపోయింది. దీంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అలా 2020లో 'గౌతమ్ కిచ్లూ' అనే వ్యక్తిని వివాహమాడారు. వీరికి 'నీల్ కిచ్లూ' అనే కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొద్ది కాలమే నటనను కొనసాగించిన కాజల్ అగర్వాల్కు సరైన హిట్స్ అవకాశాలు రాకపోవడంతో ఖాళీగానే ఉన్నారు. అదే సమయంలో కాస్త బరువు కూడా పెరిగారు. ఈమెకు కథానాయిక అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాజల్ అగర్వాల్ కమలహాసన్తో కలిసి నటించిన ఇండియన్ – 3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 40 ఏళ్ల ఈ పరువాల భామ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం గట్టిగా కసరత్తు చేసి, బరువు తగ్గి అందంగా తయారయ్యారు. దీంతో పలువురు నాలుగు పదులు వయసు దాటినా మళ్లీ సినిమాలో నటించడానికి సిద్ధమైన కాజల్ అగర్వాల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడే ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం విశేషం. ఆమె రీఎంట్రీకి అందుతున్న శుభాకాంక్షలకు సంతోషపడకుండా 40 అని తన వయసును ప్రస్తావించడం జీర్ణించుకోలేకుంది. దీంతో 40 ఏళ్లు నిండితే అంతా ముగిసిపోయిందని అర్థం కాదనీ, అయినా ప్రతిభకు వయసు ఆటంకం కాదనీ, ఇకపై వయసు గురించి ఎవరు మాట్లాడవద్దు అని నటి కాజల్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిజాలను అంగీకరించడానికి కాజల్ అగర్వాల్ ఎందుకింత అసహనం అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. -
రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ
కొందరు హీరోలు.. కేవలం నటన అనే కాకుండా మిగతా విభాగాల్లోనూ తమ ప్రతిభ చూపిస్తుంటారు. హీరోగా చేస్తూనే నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్.. ఇలా పలు డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. కొందరు మాత్రం యాక్టింగ్ తప్పితే మరో పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. అయితే వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు తమిళ హీరో కార్తీ కూడా అలాంటి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. రజనీకాంత్ తనకు ఇచ్చిన సలహా గురించి కూడా చెప్పుకొచ్చాడు.తమిళ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్.. గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో విడాకులు, కుటుంబ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆ గొడవ అంతా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే రవి మోహన్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో సంస్థని ప్రారంభించాడు. చెన్నైలో ఈ రోజు(ఆగస్టు 26) రెండు కొత్త చిత్రాలతో ఈ సంస్థ ప్రారంభమైంది.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్)ఈ వేడుకకు తమిళ హీరోలైన కార్తీ, శివకార్తికేయన్, ఎస్జే సూర్యతో పాటు పలువురు దర్శకనిర్మాతలు కూడా వచ్చారు. ఇందులోనే మాట్లాడిన కార్తీ.. తాను ఎప్పటికీ నిర్మాణ రంగంలోకి రానని తేల్చి చెప్పాడు. ఈ విషయమై రజనీకాంత్ తనకు ఎప్పుడో సలహా ఇచ్చారని అన్నాడు. చాన్నాళ్ల క్రితం రవి.. తనకు ఓ స్టోరీ చెప్పాడని, అందులో తాను-రవి హీరోలు ఉంటామని చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ చెబుతున్న టైంలోనే నటిస్తూ నెరేషన్ ఇవ్వడం చాలా నచ్చేసిందని కార్తీ చెప్పాడు. కార్తి-జయం రవి.. గతంలో 'పొన్నియిన్ సెల్వన్' రెండు చిత్రాల్లో కలిసి నటించారు.నిర్మాతగా అసలు ఎప్పటికీ మారనని కార్తి చెప్పాడు కదా.. అయితే ఇతడి అన్నయ్య సూర్య మాత్రం ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు 2డీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాతగా హిట్స్ కొడుతుండటం విశేషం. మరి కార్తీ ఎందుకు వద్దనుకుంటున్నాడో ఏమో?(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)I am always scared of producing movies, and I strongly go by the advice of #SuperstarRajinikanth sir not to enter production - #Karthipic.twitter.com/HYGseiV2SK— Trendswood (@Trendswoodcom) August 26, 2025 -
తెలుగు బిగ్ డైరెక్టర్తో రజనీకాంత్ సినిమా
మహానటి, కల్కి 2898 ఏడీ తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగ్ అశ్విన్(Nag Ashwin) బిగ్ ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, నటుడు కమలహాసన్ కీలక పాత్రను పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. అయితే, ప్రస్తుతం ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో కల్కి 2898ఏడీ సీక్వెల్ నిర్మాణం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నాగ్ అశ్విన్ తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్తో ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ కోలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోది. ఇప్పటికే రజనీకాంత్ను ఆయన కలిసినట్లు సమాచారం. ఒక మంచి కథను ఆయనకు వినిపించారని టాక్ ఉంది. ఆ కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుని రమ్మన్నట్లు అశ్విన్కు రజనీకాంత్ చెప్పారట. ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. ఇటీవల తమిళ హీరోలు తెలుగు దర్శక, నిర్మాతలతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారనే చెప్పాలి. ఇటీవల బింబిసార చిత్ర దర్శకుడు విశిష్ట, వివేక్ ఆత్రేయ తదితరులు కూడా నటుడు రజనీకాంత్ను కలిసి కథలను వినిపించారు. అయితే వారి ప్రయత్నం ఫలించినట్లు లేదు. కూలీ చిత్రంతో కమర్షియల్ విజయం అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్తో కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాతనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది. -
సింగర్తో తిరుమలకు జయం రవి.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు. తాజాగా తిరుమలలో సందడి చేశారు.జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. జయం రవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్ను చెన్నైలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన 'కరాటే బాబు', సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతో రూమర్స్ మరింత ఊహందుకున్నాయి.ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో తమిళ హీరో జయం రవి (రవి మోహన్), సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. @iam_RaviMohan @kenishaafrancis #tirumala #tirupatiupdates #Tirupati #TTD #jayamravi #RaviMohan #KenishaaFrancis #tamilhero pic.twitter.com/k5K8tLXKLZ— Tirupati Updates (@TirupatiUpdates) August 25, 2025 -
ఖైదీ -2 చేయవద్దని చెప్పిన కమల్..!
-
ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంచరీ క్లబ్లో మూవీబాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.సినిమాసార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ! Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025 చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే.. -
బాలకృష్ణకు దక్కిన అరుదైన గౌరవం
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. హీరోగా 50 ఏళ్లకుపైగా నటిస్తున్నందుకు ఆయనకు గుర్తింపు అందింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య చేరారు. గోల్డ్ ఎడిషన్లో ఆయన పేరును యూకే సంస్థ చేర్చింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ అవార్డ్కు ఎంపికైన తొలి నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. 1974లో తాతమ్మకల చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే ఏడాది బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య చేరడంతో హైదరాబాద్లో ఈ నెల 30న ఆయన్ను సత్కరించనున్నారు. -
కూలీ పాత్ర అన్యాయంగా అనిపించలేదా?.. శృతిహాసన్ రిప్లై ఇదే!
కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో శృతిహాసన్ నటించింది. ఈ మూవీలో టాలీవడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రల్లో మెప్పించారు.అయితే తాజాగా ఓ నెటిజన్ శృతి హాసన్ పాత్రపై ఆమెను ప్రశ్నించాడు. ఆస్క్ మీ సమ్థింగ్ అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో చాట్ నిర్వహించింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ఆపదలో ఉన్న అమ్మాయిగా ప్రీతి పాత్రను అలా చిత్రీకరించడం మీకు అన్యాయంగా అనిపించలేదా? అని అడిగాడు. దీనికి శృతిహాసన్ కూడా రిప్లై ఇచ్చారు.ఇక్కడ ఆమె బాధలో ఉంది.. కానీ అది మరొకరి విజన్.. ఇక్కడ మీరు చూడాల్సింది న్యాయమా? అన్యాయమా కాదు?.. ఆ పాత్రను మాత్రమే అంటూ సమాధానమిచ్చింది. ఇదంతా దర్శకుడి దృష్టి కోణానికి సంబంధించినది అని అన్నారు. గత ఇంటర్వ్యూలో ప్రీతి పాత్ర గురించి శృతిహాసన్ మాట్లాడింది. తన పాత్ర చాలా భిన్నంగా ఉండడంతో పాటు లోతుగా సంబంధం కలిగి ఉందని అభివర్ణించింది. ప్రీతి పాత్ర మహిళలందరికీ నచ్చుతుందని.. ఆ పాత్ర గురించి నాకు నిజంగా నచ్చింది అదేనని తెలిపింది. ఆమె పాత్రలోని కొన్ని అంశాలతో తాను కనెక్ట్ అయ్యానని వెల్లడించింది. ప్రీతి చాలా బాధ్యతాయుతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొంది.కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
ఫస్ట్ స్నేహం.. తర్వాతే ప్రేమ.. ప్యాకప్ అవగనే కిచెన్లో దూరేస్తా!: హీరోయిన్
తెరపై క్యూట్గా, స్టయిలిష్గా కనిపించే రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon)కు పండుగలంటే ప్రత్యేకమైన మమకారం. ముఖ్యంగా వినాయక చవితి ఆమె చిన్ననాటి నుంచే గుండె నిండా ముద్ర వేసుకున్న పండుగ. ఆ జ్ఞాపకాలే మీ కోసం..👉 నేను లండన్లో పుట్టినా, నా బాల్యం గోవా వీధుల్లో గడిచింది. అక్కడ వినాయక చవితి అంటే ఊరంతా పండుగ మూడ్లో ఉంటుంది. ప్రతి వీధిలో గణపయ్య విగ్రహాలు, రంగురంగుల అలంకారాలు, పూల సువాసనలు ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. 👉 పండుగ రోజున మోదక్ల సువాసన వంటింట్లో నిండిపోతే, స్వర్గం కంటే మిన్నగా అనిపించేది. నైవేద్యం పెట్టాక గణపయ్యకి ఇచ్చిన మొదటి మోదక్ తప్పనిసరిగా నేనే తింటాను. ఇది నా చిన్ననాటి నుంచి కొనసాగుతున్న రొటీన్. ఈసారి వినాయక చవితి కోసం నేను ప్రత్యేకంగా గణపయ్య విగ్రహం ఆర్డర్ చేశాను. పూలతో, దీపాలతో, మోదక్లతో ఇంట్లోనే శ్రద్ధగా పూజ చేస్తాను. పండుగ రోజు చీర కట్టుకోవడం మాత్రం కచ్చితంగా చేస్తాను.👉 గణపయ్య విజయాన్ని మాత్రమే కాదు, కష్టాల నుంచి బయటపడే శక్తినీ ఇస్తాడు. అందుకే ఆయన పూజ నా జీవితంలో మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే క్రిస్మస్ కూడా నాకు ప్రత్యేకమే. మా అమ్మ క్రైస్తవురాలు. క్రిస్మస్ రోజు ఎర్రని గౌను వేసుకుని, ఫొటోలు తీసి ఫ్యాన్స్తో పంచుకోవడం నాకు చాలా ఇష్టం.👉 ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. కానీ కెమెరా ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆనందం వేరే. అందుకే సినిమాల్లోనే కొనసాగుతున్నాను. నా మొదటి సినిమా కన్నడలో వచ్చింది. తర్వాత తెలుగు తెరపై నానితో కలిసి ‘కృష్ణార్జున యుద్ధం’ చేశాను. ఆ సినిమాకు వచ్చిన స్పందన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.👉 ఫుడ్ లవర్ అయినా, ఫిట్నెస్లో కాంప్రమైజ్ అవను. ఉదయం యోగా, సాయంత్రం స్విమ్మింగ్ తప్పనిసరి. చర్మం, జుట్టు కోసం పెద్దగా ఏమీ చేయను. వారంలో రెండుసార్లు కొబ్బరి నూనె మసాజ్, రాత్రిళ్లు అలోవెరా అంతే.👉 సినిమాలు ఎంచుకోవడంలో నేను చాలా సెలెక్టివ్. చిన్న పాత్రయినా గుర్తుండిపోయేలా ఉంటేనే చేస్తాను. ఒక ఈవెంట్లో ఫొటోలు తీస్తూ అసౌకర్యం కలిగించడంతో అక్కడికక్కడే ‘ఇలా చేయొద్దు’ అని ఫొటోగ్రాఫర్స్కి చెప్పాను. గౌరవం ఉన్న చోటే నేను సౌకర్యంగా ఉంటాను.👉 సెట్లో ‘ప్యాక్ అప్’ అంటే చాలు– నేను కిచెన్లో ‘యాక్షన్’ మొదలెడతాను. గోవా ఫిష్ కర్రీ నా స్పెషాలిటీ. పాన్లో కర్రీ ఉడుకుతుంటే వచ్చే వాసనతో మా వాళ్లు కిచెన్ డోర్ దగ్గర క్యూ కడతారు.👉 ప్రేమలో నా ఆలోచన సింపుల్. ముందు స్నేహం, తర్వాతే ప్రేమ. ఏదైనా టాక్సిక్ అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆగను. లైఫ్ను మళ్లీ రీస్టార్ట్ చేస్తాను.👉 ప్రయాణాలు అంటే ప్రాణం. గోవా బీచ్ గాలి తాకితే నా మనసు పొంగిపోతుంది. కేరళ బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం, మసూరీ హిల్ స్టేషన్ ప్రదేశాలు అన్నీ ఫొటోల్లో కాదు, నా మదిలో ఫ్రేమ్ అయిపోతాయి.చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
ఓటీటీకి మరో హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 18న విడుదలైన కోలీవుడ్ సోషల్ డ్రామా గెవి డిజిటల్ ప్రీమియర్కు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ దయాలన్ దర్శకత్వం వహించారు. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చే బుధవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాటం అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆధవన్, చార్లెస్ వినోద్, జీవా సుబ్రమణియన్, గాయత్రి, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీనా కీలక పాత్రలు పోషించారు.Landslides may bury lives, but not courage.Gevi streams Aug 27 on SunNXT.#Gevi #SunNXT #StreamingFromAug27 #PoliticalDrama #MustWatch #FightForJustice pic.twitter.com/1HhqtYWDhJ— SUN NXT (@sunnxt) August 22, 2025 -
తెరపైకి మరోసారి స్టార్ హీరో విడాకుల వివాదం
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై కొన్ని నెలలుగా విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా స్పందించారు. వారిద్దరి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. వినాయకచవితి పండగనాడు వారిద్దరినీ జంటగా చూడొచ్చని లాయర్ లలిత్ చెప్పారు. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.నటుడు గోవింద మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే సునీతా అహుజా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించినట్టు పలు కథనాలు వచ్చాయి. 30 ఏళ్ల ఓ మరాఠీ నటితో గోవిందా దగ్గరగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వల్లనే సునీతతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. -
ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)ఓసారి షూటింగ్లో విజయ్ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.(ఇదీ చదవండి: చిరంజీవి లుక్లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి) -
మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. -
కోలీవుడ్ మూవీలో విలన్ గా సుహాస్.. లుక్ అదిరింది!
-
నాగార్జున వందో సినిమా.. ఆ డైరెక్టర్తోనే ఫిక్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. అంతకుముందే కుబేర మూవీతో హిట్ కొట్టిన నాగ్.. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలవనుంది. తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది. ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా జగపతిబాబు టాక్ షోకు హాజరైన డైరెక్టర్ పేరును కూడా రివీల్ చేశాడు. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు. ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది.. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు. ఈ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 నాటౌట్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా.. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం, నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు."#Nagarjuna100 film will be with Ra.Karthik (NithamOruVaanam) who is Tamil Director🤝. It's a very grand film, we are starting this film now, as #Coolie released💥. It's a nice action, Family, Drama film & I'm the protagonist in that😂"- #Nagarjuna pic.twitter.com/Jz0k9EwXQr— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2025 -
ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్
మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్.. తమకు రూ.50 కోట్ల తిరిగొచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలకు కలెక్షన్స్తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. 'రాధేశ్యామ్' మూవీకిగానూ ప్రభాస్.. రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి రూ.50 కోట్లు నిర్మాతకు ఇచ్చాడని, ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?)మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు గానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో చాలామంది హీరోలు.. పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు గానీ ఫ్లాప్ అయిన నష్టాలొస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లతో పోలిస్తే ప్రభాస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'రాజాసాబ్' చివరిదశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావొచ్చని అంటున్నారు. వీటితోపాటు సెప్టెంబరు చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)-#Prabhas remuneration for #Radheshyam was 100 Cr he returned 50 Cr to the producer to compensate for the loss incurred to the distributors as it underperformed. That's the level of integrity Prabhas holds ❤️ pic.twitter.com/XbrMcU4AR4— Ace in Frame-Prabhas (@pubzudarlingye) August 18, 2025 -
రెమ్యునరేషన్ లేకుండానే స్టార్ హీరో కొత్త సినిమా!
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. దళపతి విజయ్, రజినీకాంత్, సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలావరకు తమిళానికే పరిమితం. అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్తోనే.. అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్. దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకొందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి.. ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఇవన్నీ కూడా రీసెంట్గా ఫైనల్ అయ్యాయని.. 'AK64' పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
రజినీకాంత్ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.ఇండియాలో నెట్ కలెక్షన్స్..1వ రోజు: రూ.65 కోట్లు2వ రోజు: రూ.54.75 కోట్లు3వ రోజు: రూ.39.5 కోట్లు4వ రోజు: రూ.35 కోట్లుమొత్తం: రూ.194.25 కోట్లు #Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs.. This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025 -
తమిళ దర్శకులు ఎడ్యుకేటర్స్: మురుగదాస్
తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది. అయితే ఆ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరకపోవడం గురించి సీనియర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒక వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల వరుసగా అపజయాలను చవిచూస్తూ వచ్చారు.. కాగా తాజాగా ఈయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం మదరాసీ. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెపె్టంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విచిత్ర ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక వ్యక్తి రోడ్లో వేగంగా వెళ్తున్నారంటే అది ఇంతకుముందే చేయబడిన బాట అని, అదే ప్రత్యేక బాటలో వెళ్లాలంటే అంత సులభం కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ ,మణిరత్నం వంటి వారు ప్రత్యేక బాటను వేస్తే అందులో ఎత్తు పల్లాలే ఎదురవుతాయన్నారు. ఇతర భాషా చిత్రాలు రూ.1000 కోట్ల పైగా వసూలు చేస్తున్నాయని చెబుతున్నారని, ఇతర దర్శకులు ఎంటర్టైనింగ్ మాత్రమే చేస్తున్నారని, తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తమిళ దర్శకులు ఎడ్యుకేషన్ చేస్తున్నారని అన్నారు. అందువల్లే ఇతర చిత్ర పరిశ్రమలకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. -
బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్
తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్పై స్పందించిన కీర్తిసురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్కి వింత అనుభవం
సెలబ్రిటీలకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వెంటనే అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏమైంది? శ్రుతి హాసన్ ఎందుకు బతిమాలాడుకోవాల్సి వచ్చింది.తమిళ బ్యూటీ అయిన శ్రుతి హాసన్.. రీసెంట్ టైంలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రిలీజ్ నాడే మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్కి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఈమె ఉన్న కారుని ఆపేశాడు. దీంతో శ్రుతి హాసన్ అవాక్కయింది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)దీంతో సదరు సెక్యూరిటీ గార్డ్తో.. 'నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్ సార్' అని శ్రుతి హాసన్ బతిమలాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.'కూలీ' విషయానికొస్తే.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ తొలిఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రం ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు. రూ.85 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఇప్పటివరకు రూ.240 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్)#ShrutiHaasan 😂😂#Cooliepic.twitter.com/LIB7LlfhBc— Prakash Mahadevan (@PrakashMahadev) August 15, 2025 -
రజినీకాంత్ కూలీ తొలి రోజు కలెక్షన్స్.. ఆ సినిమా కంటే తక్కువే!
రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో కోలీవుడ్ హిస్టరీలోనే రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూలీ నిలిచింది. కూలీ కంటే ముందుగా విజయ్ నటించిన లియో మొదటి రోజే రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఇండియాలోనూ కూలీ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తొలి రోజే దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రూ. 30 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ దాదాపు రూ.75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ వసూళ్ల పరంగా చూస్తే విజయ్ నటించిన 'లియో'ను అధిగమించలేకపోయింది. ఇండియావ్యాప్తంగా దళపతి విజయ్ నటించిన లియో దేశవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు రూ. 76 కోట్లు వసూలు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో కూలీ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
కిడ్నీలు ఫెయిల్.. ఆయనే పునర్జన్మనిచ్చారు: పొన్నాంబళం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో.. వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు పొన్నాంబళం. చిరంజీవి 'ఘరానా మొగుడు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవరైతే లక్ష రూపాయలిస్తారో వాళ్లతోనే సోలో ఫైట్ చేస్తానని సవాల్ విసిరాడు. ఫైట్ బాగా వస్తేనే డబ్బులివ్వమన్నాడు. ఘరానా మొగుడు షూటింగ్లో అతడి పర్ఫామెన్స్ మెచ్చి రూ.1 లక్ష ఇచ్చారు. నాలుగేళ్లుగా నరకంఅంతేకాదు, చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించి మరీ అతడికి రూ.5 లక్షలు బహుమతిగా ఇచ్చారు. అలా అప్పటినుంచే చిరంజీవి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. తమ్ముడు విషప్రయోగం వల్ల పొన్నాంబళం రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో ఉన్నప్పుడు చిరంజీవి సాయం చేశారు. దాదాపు రూ.40 లక్షలదాకా ఖర్చు భరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొన్నాంబళం మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 750కి పైగా ఇంజక్షన్లు ఇచ్చారని, రెండు రోజులకోసారి ఒంట్లో రక్తాన్ని తీసి డయాలసిస్ చేశారన్నాడు. తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదన్నాడు.సాయం అడగ్గానే..తాజాగా మరో ఇంటర్వ్యూలో పొన్నాంబళం మాట్లాడుతూ.. కిడ్నీ సమస్య రాగానే ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూశా.. చిరంజీవికి మెసేజ్ పెఇడతే అన్నయ్య వెంటనే ఫోన్ చేశారు. హైదరాబాద్కు రమ్మంటే కష్టమని చెప్పడంతో చెన్నై అపోలోలో అడ్మిట్ అవమన్నారు. ఎంట్రీ ఫీజు లేకుండానే నన్ను అడ్మిట్ చేసుకున్నారు. నా ట్రీట్మెంట్కు రూ.40 లక్షలు అన్నయ్యే భరించారు. లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకున్నా.. కానీ, అంతకుమించి సాయం చేశారు. ఇప్పటివరకు నాకు కోటి రూపాయల దాకా సాయం చేశారు అని చెప్పుకొచ్చారు.చదవండి: అర్ధరాత్రి బస్టాండ్లో నిద్ర.. ఆ హీరో నా నెంబర్ తీసుకుని.. జబర్దస్త్ సౌమ్య -
రజనీకాంత్ 50 ఏళ్ల జర్నీ: విలన్ నుంచి సూపర్స్టార్గా..
రజనీకాంత్ (Rajinikanth) తొలిసారిగా 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో వెండితెరపై కనిపించారు. అది ఆగస్టు 15న విడుదలైంది. అప్పట్లో ఆయన ఇంత పెద్ద హీరో అవుతారని ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఐదు దశాబ్దాల తర్వాత, తలైవా అనేది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక నినాదమైపోయింది. సన్ గ్లాసెస్, ఆ సిగరెట్ స్టైల్స్... ఇంకా పంచ్ డైలాగ్లతో పాటు రజనీకాంత్ కెరీర్.. నిర్భయమైన పాత్రల ఎంపికల మీద కూడా నిర్మితమైంది. విలన్గా ఎంట్రీ..దీని కోసం తన సొంత ఇమేజ్ను దెబ్బతీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సమకాలీకుల్లో చాలా మందికి భిన్నంగా.. ఇమేజ్కు తోడ్పడే సురక్షితమైన పాత్రలు మాత్రమే పోషించడానికి ఆయన మొదటి నుంచీ నిరాకరిస్తూనే ఉన్నాడు. తన తరంలోని చాలా మంది తారలు రొమాంటిక్ హీరోలుగా అరంగేట్రం చేస్తున్న పరిస్థితుల్లో, రజనీ విలన్గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మూండ్రు ముడిచ్చు (1976) వంటి ప్రారంభ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించాడు. నిజానికి ప్రేక్షకులు తమ హీరోలను విపరీతంగా ఆరాధించే యుగంలో అది అంత సులభమేం కాదు. అయినా సరే రజనీకాంత్ విలన్గా తన బ్రాండ్ను సరికొత్తగా నిర్మించుకున్నాడు. నాటి 70's చివర్లో, 80's ప్రారంభంలో రజనీ విలన్, చిన్న చిన్న పాత్రల నుంచి ప్రధాన పాత్రల్లోకి మారారు. అలాగని తెరపై వీరోచిత పాత్రలకే ఆయన పరిమితం కాలేదు. ఆరిలిరుంతు అరుబతు వారై (1979) వంటి చిత్రాలలో ఆయన కౌమారదశ నుంచి వృధ్ధాప్యం వరకు కష్టపడుతున్న వ్యక్తిగా నటించారు. ఇది ఒక అన్నదాత త్యాగాల గాధను చూపిస్తుంది. ఇది ఇప్పటికీ అతని అత్యంత అద్భుతమైన నటనల్లో ఒకటిగా పరిగణన పొందుతోంది. తమిళ సినిమాలో అతిపెద్ద స్టార్ అయిన తర్వాత కూడా, రజనీ తన ప్రయోగాత్మక పంథాను వదులుకోలేదు. అవర్గల్ (1977) ముల్లుమ్ మలరుమ్ (1978)లలో, ఆయన తన ఇమేజ్కు భిన్నమైన పలు పాత్రలు పోషించారు. స్టార్డమ్ కు కట్టుబడే హీరోల ఆలోచనలకు భిన్నంగా కొనసాగారు.కమర్షియల్ సినిమాతో మలుపు...‘మాస్ హీరో‘ గా రజనీని ఎవరికీ అందనంత ఎత్తులో అమాంతం కూర్చోబెట్టిన సినిమాలు బిల్లా (1980), బాషా (1995), శివాజీ (2007)లు. ఇవి మొత్తంగా భారతీయ వాణిజ్య సినిమాలో మైలురాళ్ళు. కానీ ఈ బ్లాక్బస్టర్లలో కూడా, ఆయన పాత్రపరమైన తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. మనసున్న డాన్ పాత్రలో మనస్సాక్షికి లోబడే టెక్ మొగల్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2000ల తర్వాత, రజనీ ఎంథిరన్/రోబో (2010) కాలా (2018) చిత్రాలతో సాహసోపేత పాత్రలకు సై అంటూనే ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లవుతున్నా.. అభిమానులను అలరించేందుకు మరిన్ని సినిమాలతో ముందుకు వస్తానంటున్నాడు రజనీకాంత్.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
లగ్జరీ సూపర్ కారు కొన్న అజిత్ కుమార్.. ధర కోట్ల పైమాటే!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలతో పాటు కార్ రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు. అటు సినిమాలు.. ఇటు రేసింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమంటే కూడా ప్రాణం. ఇప్పటికే ఆయన గ్యారేజ్లో ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో హై ఎండ్ లగ్జరీ కారును తన గ్యారేజీకి జతచేశారు. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన కార్వెట్ సీ8-జడ్06ని కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే ఈ ఆధునాతన సౌకర్యాలు కలిగిన కారు ధర దాదాపు రూ.1.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా... ఈ సూపర్కారును దుబాయ్లోని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ కుమార్ ప్రస్తుతం షూటింగ్స్కు కాస్తా గ్యాప్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ తర్వాత వేకేషన్కు వెళ్లారు. తన భార్యతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. కొత్త ఏడాదిలో విదాముయార్చి మూవీతో అభిమానులను అలరించిన అజిత్.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. View this post on Instagram A post shared by Ajith Kumar (@ajithkumar.0fficial) -
రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!
రజినీకాంత్ నటించిన కూలీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో విపరీతమైన క్రేజ్ వస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ కొద్ది నిమిషాల్లోనే బుక్కైపోతున్నాయి. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇవాళ తెలంగాణలోనూ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అదే దాదాపు అదే పరిస్థితే. రిలీజైన నిమిషాల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ కోసం ఎగబడ్డారు. బుక్మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లోనూ కూలీ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175కు, మల్టీప్లెక్స్ల్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కంటే ముందుగా అదనంగా ఒక్క షోకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సైతం అదే రోజు విడుదలవుతోంది.Telangana Bookings Open Now!💥🍿🌟Book your tickets now: https://t.co/vFx0Jf1W9g#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/cT2jrHZv9c— Sun Pictures (@sunpictures) August 12, 2025 -
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. దీంతో ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన గుడ్ డే (Good Day) మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. ఓ తాగుబోతు క్రైమ్ ఇన్స్టిగేషన్లో ఎలా సాయపడ్డాడనే కోణంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. సన్ నెక్ట్స్లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూన్ 27న గుడ్ డే థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోర్ణా జేఎస్ మైఖేల్ కథ అందించగా.. ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాల్, వేళ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోవింద్ వసంత గుడ్ డేకు సంగీతం అందించారు.Freedom to binge exactly what you want – Good Day, Gamblers, Akkenam. Why choose one when Ungal Screen, Ungal Choice on Ungal Sun NXT!! #UngalScreenUngaChoice #SunNXT #GoodDay #Gamblers #Akkenam #WeekendBinge #MovieDrop #IndependenceDayWeekend #FreedomToBinge,… pic.twitter.com/JEieC1LhJv— SUN NXT (@sunnxt) August 10, 2025 -
35 ఏళ్లు.. ఎన్నో హార్ట్ బ్రేక్స్.. నొప్పితో బాధపడుతుంటే ఆ డైరెక్టర్..
పైలట్ కావాలని కలలు కని, అనుకోకుండా కెమెరా ముందు ల్యాండ్ అయింది! సినిమాల్లో గ్లామర్ కంటే టాలెంట్తో స్క్రీన్పై మెరుస్తోంది హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). ఆ విషయాలే మీ కోసం...అలా కెరీర్లో..తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైన నటి నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’, అల్లు అర్జున్తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, పవన్ కల్యాణ్తో ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు చేసినా, గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్గా కాకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఉత్తమ నటిగా జాతీయ అవార్డుమలయాళీ అయినా, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. పైలట్ కావాలనేది చిన్ననాటి కల. అయితే ఏవియేషన్ ఫీల్డ్ ఆకర్షణీయంగా లేదని భావించి, మనసు సినిమాలవైపు మళ్లింది. పూణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసింది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిచయంతో హీరోయిన్ అయింది. గత ఏడాది ధనుష్తో నటించిన ‘తిరు’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది.ఐదు భాషలు మాట్లాడగలదునిత్యా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ‘సినిమా రంగంలో నటీనటుల, యూనిట్ సభ్యుల అనారోగ్యాలపై చాలామంది పట్టించుకోరు, కాల్షీట్స్ ప్రకారం పనిని పూర్తి చేయాలనుకుంటారు. కానీ, నేను మాత్రం సహచర నటులు, సహవాసుల పట్ల కొద్దిగా అయినా మానవత్వం చూపించాలని నమ్ముతాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పీరియడ్స్ టైంలో అలా..మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించేటప్పుడు, షూటింగ్ మొదటి రోజే తాను పీరియడ్స్లో ఉన్నానని, నొప్పితో బాధపడుతూ మిస్కిన్ దగ్గరకు వెళ్లి చెప్పిందట! ‘మిస్కిన్ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అతను అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు మరచిపోలేను’ అని తెలిపింది. దాదాపు ముఫ్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. ఎన్నోసార్లు హార్ట్బ్రేక్దీనికి నిత్యా స్పందిస్తూ – ‘చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే నాకు ఇంకా కొంత టైం కావాలి‘ అని చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – చిన్నతనంలోనే ‘హనుమాన్’ అనే సినిమాలో బాల నటిగా నటించింది. ఆ సినిమాలో టబు చెల్లెలుగా కనిపిస్తుంది.చదవండి: అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీతో..రమ్యకృష్ణ స్పీచ్ -
అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీ వల్లే..
34 ఏళ్లుగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ (Captain Prabhakaran Movie). దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం ఇది. ఆర్కే సెల్వమణి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా రావుత్తర్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. రూపిని, రమ్యకష్ణ (Ramya Krishna), శరత్ కుమార్ ,లివింగ్స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. 1991 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. రీరిలీజ్సుమారు 34 ఏళ్ల తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ 4 కే వర్షన్లో ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. స్పారో సినిమాస్ సంస్థ అధినేత కార్తీక్ వెంకటేషన్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నె, వడపళనిలోని కమల థియేటర్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటూ దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్, విక్రమన్, నిర్మాత కలైపులి ఎస్. థాను, టీ.శివ, ఆర్వీ. ఉదయ్ కుమార్, పేరరసు, లింగుస్వామి, లియాకత్ అలీఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. విజయకాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీరంగంలో వాళ్లే తల్లిదండ్రులుఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఈ సమాజంపై, రాజకీయాలపై ఉన్న కోపాన్ని సినిమాల ద్వారా చూపించడానికి ఒక నటుడు అవసరం అయ్యారన్నారు. ఆయనే విజయకాంత్ అని పేర్కొన్నారు. విజయ్ కాంత్ హీరోగా తాను 18 చిత్రాలు చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. సినీ రంగంలో తన తల్లిదండ్రులు అంటే విజయకాంత్, నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ మాత్రమేనని తెలిపారు. విజయ కాంత్ నూరు జన్మలకు చేరవలసిన పుణ్యాలను తన వారసుల కోసం సంపాదించి వెళ్లిపోయారన్నారన్నారు. ఇక్కడ సక్సెస్ లేక తెలుగులో..నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తనకు తమిళంలో సరైన సక్సెస్ రాకపోవడంతో తెలుగు చిత్రాల్లో నటించానని అలాంటి సమయంలో కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్ర విజయం తనకు మరో 10 ఏళ్లపాటు వరుసగా అవకాశాలు వచ్చేలా చేసిందని చెప్పారు. విజయ్ కాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. తనకు విజయకాంత్ కొడుకు అనే పేరు మాత్రమే చాలు అన్నారు. కాగా ఇకపై తన తండ్రి నటించిన చిత్రాలను ఏడాదికి ఒకటి రీ రిలీజ్ చేస్తామని చెప్పారు.చదవండి: పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే! -
మృణాల్ అయితే బాగుంటుందన్న స్టార్ హీరో!
సాధారణంగా హీరోయిన్లు పలానా హీరో సరసన నటించాలని కోరుకుంటుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోనే తనకు జంటగా పలానా హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్ (Sivakarthikeyan). వరుస విజయాలతో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్ట్ చేస్తున్న మదరాశి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలుసుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. రవి మోహన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో అధర్వ మురళి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తర్వాత శివకార్తికేయన్ వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.గతంలో మిస్..ఇది టైమ్ ట్రావెలింగ్తో కూడిన సైన్స్ ఫిక్షన్ జానర్లో సాగే కథా చిత్రమని భోగట్టా! ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శివకార్తికేయన్ వ్యక్తం చేశాడట! దీంతో ఆమెను ఒప్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందే మదరాశి చిత్రంలో శివకార్తికేయన్తో జత కట్టాల్సి ఉంది. పలు కారణాల రీత్యా ఆ అవకాశాన్ని మృణాల్ జార విడుచుకుందని ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా శివ కార్తికేయన్ సరసన నటిస్తుందో? లేదో? వేచి చూడాలి.చదవండి: ప్రముఖుల ‘బయోపిక్స్’ -
పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!
టైటిల్: పరంతు పో..నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులుడైరెక్టర్: రాముఓటీటీ: జియో హాట్స్టార్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.స్కూల్కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్కు ట్రిప్లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్. ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్టైనింగ్తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. -
నటి సోదరుడిపై కత్తులతో దాడి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు ఆసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురైయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను (పీటీఐ) షేర్ చేసింది. ఇద్దరు యువకులు ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేయడంతో గొడవ మొదలైంది. దీంతో ఆయుధాలతో అతనిపై ఆ యువకులు తెగబడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. నటి హుమా ఖురేషికి మృతుడు ఆసిఫ్ సోదరుడు వరస అవుతాడు.ఘటన జరిగిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. ఆసిఫ్, అతని పొరుగువారి మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. చాలా ధారుణంగా అతనిపై తెగబడ్డారు. బలంగా కొట్టడంతో పాటు పదునైనా ఆయుధాలతో దాడి చేసినట్లు వీడియోతో అర్థం అవుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 103(1) హత్య, 3(5) సాధారణ ఉద్దేశ్యం కింద ఉజ్వల్ (19) మరియు గౌతమ్ (18)పై నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకులు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం.VIDEO | Actor Huma Qureshi's cousin, Asif Qureshi, was stabbed to death following a dispute over parking in southeast Delhi's Bhogal area on Thursday. Two teenagers have been apprehended in connection with the incident. CCTV visuals of the incident.#DelhiNews(Viewers… pic.twitter.com/DJrXqd3vwX— Press Trust of India (@PTI_News) August 8, 2025 -
'కింగ్డమ్'ను ఎవరూ ఆడ్డుకోలేరు: కోర్టు
నటుడు విజయ్దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం కింగ్డమ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై తమిళనాడులో కొన్ని రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో కింగ్డమ్ తమిళనాడు విడుదల హక్కులను పొందిన ఎస్ఎస్ఐ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. కింగ్డ్మ్ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ న్యాయమూర్తి భరత చక్రవర్తి ముందుకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ కింగ్డమ్ చిత్రం కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని, ఇందులో సమాజంలోని ఏ వర్గాన్ని కించపరచే సన్నివేశాలు లేవని, ఏ వర్గాన్నీ ప్రతి కూలంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు లేదని వాదించారు. నామ్ తమిళర్ పార్టీ తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను వినిపిస్తూ చిత్రంలో శ్రీలంక తమిళులను వలస దారులు, అక్రమ రవాణాదారులంటూ తప్పుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నామని, చిత్ర ప్రదర్శనలను నిషేధించాలని నామ్ తమిళర్ పార్టీ కోరడం లేదని పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం కింగ్డమ్ చిత్రం జూలై 31 నుంచి ప్రదర్శింపబడుతోందని, ఎక్కడా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నామని, థియేటర్ల యాజమాన్యానికి ఎక్కడా బెదిరింపులు రావడం లేదని పేర్కొన్నారు. అలాంటివి జరిగితే పోలీసుల భద్రత కల్పిస్తామని న్యాయస్ధానానికి తెలియజేశారు. ఇరువర్గాల వాదలను విన్న న్యాయమూర్తి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. సెన్సార్బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన చిత్రాలను ఎవరూ ఆపలేరన్నారు. మీకు సినిమా నచ్చకపోతే చూడడం మానేయాలన్నారు. అదేవిధంగా నామ్ తమిళర్ పార్టీకి చెందిన వారికి కూడా శాంతియుతంగా తమ నిరసనలను వ్యక్తం చేసే హక్కు కూడా ఉందన్నారు. అయితే దాన్ని కేటాయించిన ప్రాంతంలోనే నిర్వహించాలన్నారు. నిరసనలను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. కింగ్డమ్ చిత్రానికి అంతరాయం కలిగిస్తే తగిన భద్రత కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశించారు. -
రజిని ఫ్యాన్స్ ని భయపెడుతున్న Coolie
-
ప్రముఖ నటి 'హుమా ఖురేషి' సోదరుడు హత్య
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు దారుణ హత్యకు గురైయ్యారు. ఆమెకు సోదరుడి వరుస అయ్యే ఆసిఫ్ ఖురేషీని ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం వద్ద పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు అతనిపై గొడవకు దిగారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'ఆసిఫ్ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశారు. దీంతో వాహనాలను తొలగించాలని ఆసిఫ్ కోరడంతో వారిద్దరూ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.' అని పేర్కొన్నారు.ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఇదే పార్కింగ్ విషయంలో వారిద్దరు తనతో గొడవ పడ్డారని ఆమె చెప్పింది. గురువారం రాత్రి ఆఫీస్ నుంచి తన భర్త ఇంటికి వచ్చాడని ఆ సమయంవలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని కోరినందుకు గొడవకు దిగారని ఆమె తెలపింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.హుమా ఖురేషి నటిగా, నిర్మాతగా, రచయితగా కూడా రాణిస్తున్నారు. కాలా, వలిమై,జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలతో పాటు మహారాణి వెబ్ సిరీస్లలో నటించి తెలుగువారికి కూడా బాగా పరిచయం అయింది. -
పాన్ ఇండియా దర్శకుడి కుమారుడు హీరోగా ఎంట్రీ
సినీ వారసులు ఎలాంటి విద్యను అభ్యసించినా వారి దృష్టి మాత్రం సినిమాపైనే ఉంటుందని చెప్పవచ్చు. అందరూ కాదుకానీ, ఎక్కువ భాగం ఇంతే. ఇంతకుముందు చాలా మంది సినీ సెలబ్రిటీల వారసులు హీరో, హీరోయిన్లుగానూ, దర్శకులు, నిర్మాతలుగానూ మారి రాణిస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ వారసుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్–2, గేమ్చేంజర్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈయన ఇండియన్–3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వేల్పారి అనే చారిత్రక నవలను సినిమాగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే దర్శకుడు శంకర్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అందులో అదితి శంకర్ ఇప్పటికే కథానాయకిగా రంగప్రవేశం చేసి వరుసగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు కూడా. తాజాగా శంకర్ వారసుడు అర్జిత్ హీరోగా పరిచయానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మదరాసి చిత్రం కోసం అర్జిత్ పనిచేస్తున్నారు. త్వరలో ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. దర్శకుడు అట్లీకి ఇష్టమైన తన శిష్యుడి దర్శకత్వంలో అర్జిత్ హీరోగా పరిచయమయ్యేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అర్జిత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
అరుణాచలం శివున్ని దర్శించుకున్న లోకేశ్ కనగరాజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూలీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.కూలీ రిలీజ్కు ముందు దర్శకుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆలయంలో లోకేశ్ను చూసిన పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.రజినీకాంత్ హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్గా కనిపిచనున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2తో పోటీ పడనుంది. திருவண்ணாமலை அண்ணாமலையார் கோயிலில் சாமி தரிசனம் செய்த #lokeshkanagaraj #coolie #coolieunleashed #rajinikanth #thiruvannamalai #nagarjuna #aamirkhan #soubinshahir #upendra #anirudhravichander #anirudh #kalanithimaran #sathyaraj #shruthihaasan #powerhouse #monica #disco… pic.twitter.com/Sj9rN7YRIh— Cineulagam (@cineulagam) August 7, 2025 -
విలన్గా అడిగారు.. ఆ హీరో రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేశా: లోకేశ్
కూలీ సినిమా కోసం విలన్ రోల్ చేజార్చుకున్నానంటున్నాడు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.విలన్గా ఛాన్స్ వస్తే..సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు లోకేశ్. ఈ సందర్భంగా ఓ చిట్చాట్లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమాలో విలన్గా ఛాన్స్ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. దర్శకురాలు సుధా కొంగరతో పలుమార్లు సమావేశమయ్యానని తెలిపాడు. కానీ కూలీ చిత్రీకరిస్తున్న సమయంలోనే పరాశక్తి కూడా సెట్స్పైకి వెళ్లిందన్నాడు.రిజెక్ట్ చేశావిలన్గా నటించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ క్లాష్ అవుతున్నందున పరాశక్తి మూవీ ఆఫర్ను తిరస్కరించానని పేర్కొన్నాడు. శివకార్తికేయన్ సైతం జోక్యం చేసుకుని తనను విలన్గా చేయమని సూచించారన్నాడు. కానీ కూలీ సినిమాను చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నందున దాన్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలోనే హీరోగా..పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. శివకార్తికేయన్, రవిమోహన్, శ్రీలీల, అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఇకపోతే లోకేశ్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో ఓ గ్యాంగ్స్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది.చదవండి: భార్యకు వండి పెడ్తా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్ -
'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.నా జీవితం ఓ సినిమా కథఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు. పూరి గుడిసెలో జీవితంఅతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.నెక్స్ట్ ఏంటి?కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.గోల్డ్ మెడల్మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను. గర్వంగా చెప్తున్నాఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.చదవండి: నీ సినిమాలు ఆడవ్ అని ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు -
అగరం .. పేదలకోసం అహరహం.. విద్యతోనే వికాసం
హీరో అంటే సినిమాల్లో ఒక్క దెబ్బకు పదిమంది రౌడీలను గాల్లోకి ఎగిరేలా కొట్టడమేనా.. హీరో అంటే హీరోయిన్తో రొమాన్స్ చేయడమేనా.. హీరో అంటే ఖర్చులేని కబుర్లు చెప్పడమేనా.. పైసా ఖర్చులేకుండా రక్తదానం.. అవయవదానం.. ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేనా.. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టేసి .. రాజకీయ నాయకులతో అంటకాగుతూ సొంత లాభాలు చూసుకోవడం కాదు.. ఎక్కడికక్కడ చిల్లర పాలిటిక్స్ చేస్తూ తమకు నచ్చనివాళ్లను తొక్కేసి నచ్చేవాళ్లకు మాత్రమే సినిమా ఛాన్సులు వచ్చేలా ఇండస్ట్రీ పాలిటిక్స్ చూడడం కూడా కాదు.. అభిమాన సంఘాలను రెచ్చగొట్టి తమ ఇమేజి కాపాడుకుంటూ హీరోయిజం వెలగబెట్టడం అసలే కాదు.మరి హీరో అంటే ఏమిటి ? తాను సంపాదించిన రూపాయితో పదిపైసలు ఈ సమాజం కోసం తిరిగి ఇచ్చేవాడు హీరో.. ఒక సాధారణమైన తనను హీరోలా నిలబెట్టి గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న అభిమానులకు .. సమాజానికి తనవంతుగా తిరిగి ఇస్తున్నవాడు అసలైన హీరో.. అలాంటి హీరో తమిళ సూపర్ స్టార్ సూర్య..వందల్లో డాక్టర్లు... వేలల్లో ఇంజినీర్లుఅగరం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు.అగరం ఫౌండేషన్ – విద్య ద్వారా జీవన మార్పుచెన్నైలో 2006లో మొగ్గ తొడిగిన ఈ అగరం అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను బడివైపు నడిపించే బాధ్యత ఈ సంస్థ చేపట్టింది. దాదాపు పదోహేనేళ్ళుగా ఈ మహాయజ్ఞంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికి దాదాపు ఏడువేల మంది వరకు పేద విద్యార్థులను బడివైపు నడిపించింది. ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు .. మరో 51 మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లు అయ్యారు. గతంలో సంస్థ వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్ధి మాట్లాడుతూ తన ఆశను కళలను నెరవేర్చింది సూర్య సార్ అని చెబుతూ.. తన కలలకు సూర్య సార్ రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న సూర్య కళ్ళలోంచి కూడా కన్నీరు ధారాపాతంగా కారడం .. ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే. ఉంది. ఇంకా వీరే కాకుండా వందలమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఇంకొన్ని వేలమంది వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.ప్రాధమిక విద్య అందించడమే కాకుండా ఉన్నత విద్య.. సాంకేతిక విద్య ఆర్జించాలనుకునే విద్యార్థులకు ఈ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. పేదింటి పిల్లల ఆశల సౌధం నిర్మించుకునేందుకు అగరం ఒక్కో ఇటుకనూ పేరుస్తూ వస్తోంది. దీంతోబాటు దాదాపు 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది ఈ సంస్థ . కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్యపరికరాలు అందించారు. దీంతోబాటు అంతర్యుద్ధం.. ఆకలి పేదరికంతో పోరాడుతూ పొట్టచేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్నా శరణార్ధుల పిల్లలకు సైతం స్కాలర్షిప్ అందిస్తున్నారు.మనలో ఒకడిని సమాజం ఉన్నతంగా చూస్తుంటే సహించలేదు ఈ సమాజం.. అయన సేవల్లోని గొప్పతనానికి బదులుగా అందులో లోపాలు వెతికే రోజులివి.. కానీ సూర్య సేవలను కమల్ హాసన్ వంటి నటులు ఇది ఒక మౌనవిప్లవం.. నిశ్శబ్దంగా సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు అంటూ సూర్య చేపట్టిన ఈ దీక్షను కొనియాడారు. ఇంకో చిత్రం ఏమంటే ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన ఇంజినీర్లు.. డాక్టర్లు తాము కూడా సామాజిక బాధ్యతల్లో తలా ఓ చేయి వేస్తున్నారు. తమ వంతుగా వారు కూడా మరి కొందరు పేద పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్ వేసిన ఈ చిన్న మొక్కను ఇప్పుడు సూర్య, కార్తీ మహా వృక్షంగా మలిచారు. ఆ వృక్షం కింద వేలమంది అందండంగా చదువుకుంటూ తమ జీవితాలను వెలుగులవైపు నడిపిస్తున్నారు.Suriya Karthi Kamal #Karthi #Kamal #Suriya #Agaram pic.twitter.com/UvznU8OXPM— 𝙰𝚛𝚓𝚞𝚗 (@GaneshC32674824) August 5, 2025 -
మూడేళ్లుగా పరారీలో హీరోయిన్.. అరెస్ట్ చేయాలని కోర్టు నోటీసులు
సినిమాలకంటే వివాదాలతో పాపులర్ అయిపోయింది తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గతంలో వైరల్ అయ్యేది.. అయితే, ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల క్రితం దళితుల గురించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ సమయంలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి 2022లోనే అరెస్టు చేశారు. అయితే, బెయిల్పై వారిద్దరూ బయటకు వచ్చేశారు. కేసు విచారణకు వారు సహకరించకపోవడంతో అరెస్ట్ వారెంట్ ఆ సమయంలోనే జారీ అయింది. ఇప్పటికే మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలోనే ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు.ఢిల్లీ వీధుల్లో మీరా మిథున్ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న తన కూతురు మీరా మిథున్ను కాపాడాలని ఆమె తల్లి ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆమె గురించి తెలిసింది. మీరా తల్లి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మీరాను రక్షించాలని పోలీసులను సూచించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెను గుర్తించి అక్కడున్న హోంకి తరలించారు. అయితే, ఆమెను ఈనెల 11న చెన్నై న్యాయస్థానంలో హజరుపరచాలని కోర్టు తెలిపింది. మీరా మిథున్ అనునిత్యం వివాదాలతోనే ఉంటుంది. ఆమె బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. విశాల్, త్రిష, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్స్పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. -
AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం
చాలాపనులను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిటికెలో చేసేస్తుంది. అందుకే ఇప్పుడందరూ దీనిపై పడ్డారు. ఏఐతో సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. వారితో వ్యాపారాలు చేయిస్తున్నారు. ఆఖరికి కొత్త హీరోహీరోయిన్లను సృష్టించి సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ సరేకానీ, ఎప్పుడో రిలీజైన సినిమాను ఏఐను ఉపయోగించి క్లైమాక్స్ మార్చేయడమే చాలామందికి మింగుడుపడలేదు. ఏఐతో క్లైమాక్స్ మార్చేశారుధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన చిత్రం రాంఝనా (Raanjhanaa Movie). ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఆగస్టు 1న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేశారు. కాకపోతే అందులో ఒరిజినల్ క్లైమాక్స్ లేదు. ఏఐ సాయంతో రూపొందిన క్లైమాక్స్ జత చేశారు. నిజానికి సినిమా చివర్లో హీరో చనిపోతాడు. కానీ ఏఐ సాయంతో ధనుష్ను చంపకుండా బతికించి కథ సుఖాంతం చేశారు. ఆత్మను చంపేశారుదీనిపై ధనుష్ (Dhanush) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏఐ క్లైమాక్స్తో రీరిలీజ్ అయిన రాంఝన సినిమా చూసి కలత చెందాను. క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయింది. నేను అభ్యంతరం చెప్పినప్పటికీ సంబంధిత పార్టీలు లెక్కచేయకుండా ఏఐ క్లైమాక్స్ ఉపయోగించాయి. ఇది నేను 12 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా కానే కాదు.ఆందోళన కలిగించే విషయంసినిమాలో కంటెంట్ను మార్చడానికి ఏఐను ఉపయోగించడమనేది కళకు, కళాకారులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానానికి, సినీవారసత్వానికే ప్రమాదకరం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ లేఖ షేర్ చేశాడు. For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM— Dhanush (@dhanushkraja) August 3, 2025చదవండి: విలన్గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్ -
రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఎప్పుడంటే?ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే! Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025 చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ కన్నుమూత
ఇండస్ట్రీలో మర విషాదం. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు మరోసారి విషాదం నెలకొంది. తమిళ ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబ్(71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన.. శనివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)మదన్ బాబ్ అసలు పేరు ఎస్.కృష్ణమూర్తి. ముఖంలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా టీవీ ఇండస్ట్రీలోకి తొలుత వచ్చారు. విచిత్రమైన హావభావాలు చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలు దక్కించుకున్నారు. కొన్నాళ్లకు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'బంగారం' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్) -
కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్
సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంతకాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడవుట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్టాప్గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతినిండా సంపాదించిన తారలు చేతులు చాచి సాయం కోసం అర్థించే దీన పరిస్థితులూ ఎదురు కావొచ్చు. పైన కనిపిస్తున్న హీరో ఇప్పుడలాంటి స్థితిలోనే ఉన్నాడు. తనకు సాయం చేయమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు.సినిమాఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అభినయ్ కింగర్ (Abhinay Kinger). మలయాళ ప్రముఖ నటి టి.పి. రాధామణి కుమారుడే అభినయ్. తళుల్లువదో ఇళమై సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. జంక్షన్ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. సక్సెస్, దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేవిద్యుత్ జమ్వాల్, మిలింద్ సోమన్, బాబు ఆంటోని వంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన గొంతు అరువిచ్చాడు. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. అయితే అభినయ్.. దాదాపు దశాబ్దకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి తోడు అతడి ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ప్రభుత్వం నడిపే క్యాంటీన్లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇతడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడా వ్యాధి ముదిరిందని, తాను కొంతకాలం మాత్రమే బతుకుతానని దీనంగా చెప్తున్నాడు.కొన్నాళ్లే బతుకుతా..తాజాగా ఈ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న తమిళ కమెడియన్ కేపీవై బాలా.. అభినయ్ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్.. నేను ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారని తెలిపాడు. ఆ మాటతో భావోద్వేగానికి లోనైన బాలా.. నీకు తప్పకుండా నయమవుతుంది, మళ్లీ సినిమాలు చేస్తావు అని ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. అభినయ్ బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని అంటున్నారు. అభినయ్కు సాయం చేసినందుకు బాలాను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే? -
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇతడి మేనకోడలు ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ వేడుక జరగ్గా.. కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. విశాల్ కూడా వచ్చాడు. ఎనర్జిటిక్గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ పెళ్లి సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)విశాల్ తెలుగు మూలాలున్న కుర్రాడే. కానీ తండ్రి తమిళనాడులో స్థిరపడటంతో ఆ ఇండస్ట్రీలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ టైంలో ఇతడి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏంరాలేదు. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా విశాల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటి నుంచి ఈ మధ్యే కోలుకున్న విశాల్.. పూర్తి ఆరోగ్యంగా పలుమార్లు కనిపించాడు. అలానే తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న నటి ధన్సికని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్ల ముందు విశాల్ బయటపెట్టాడు. అయితే ఈ శుభకార్యం ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సంగతి అలా పక్కనబెడితే ఇప్పుడు తన మేనకోడలు వివాహ వేడుకలో విశాల్ పాల్గొన్నాడు. ఈమె ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే నూతన వధూవరుల్ని విశాల్ ఆశీర్వదించాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్) View this post on Instagram A post shared by Karthikeyan Ravikumar (@karthikeyan_youtuber) -
ప్రముఖ సింగర్పై వైద్యురాలి ఫిర్యాదు.. ఇన్స్టాతో పరిచయం ఆపై..
మలయాళంలో ప్రముఖ ర్యాపర్ వేదన్ (Vedan)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ వైద్యురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదుచేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు వివిధ ప్రదేశాలలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు వేదన్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది. త్రిక్కకర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో మాదకద్రవ్యాల కేసులో వేదన్ అరెస్టు అయి, బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. అతని అపార్ట్మెంట్లో గంజాయి, రూ.9 లక్షల నగదును గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై చిరుత దంతాలతో తయారైన గొలుసు కూడా అతని వద్ద ఉండటంతో అటవీ శాఖ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఇన్ని కేసులు ఉండగా ఒక వైద్యురాలు అతని ట్రాప్లో ఎలా చిక్కుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019లో “Voice of the Voiceless” అనే ఆల్బమ్తో కేరళలో బాగా ప్రాచుర్యం పొందాడు. సామాజిక అంశాలపై గళమెత్తిన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. -
బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఆయన తరచూ సాయం చేస్తుంటారనే విషయం తెలిసిందే. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' పేరుతో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు ఆయన చేస్తుంటారు. రైతులు, విద్యార్థులు, వైద్యం, దుస్తులు, ఆహారం ఇలా ఒక్కటేంటి లెక్కలేనన్ని సామాజిక సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అయితే, తాజాగా వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సోనూ గొప్ప మనసు చాటుకున్నారు.జులై 30న సోనూసూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలని ఆయన ముందుకు వచ్చారు. 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టకున్నట్లు ప్రకటించారు. వృద్ధులు ఒంటరిగా ఉండకుండా, ప్రేమతో, గౌరవంతో జీవించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆశ్రమాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు మంచి ఆహారం ఆపై చివరి రోజుల్లో వారికి మానసిక శాంతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అయితే, ఎక్కడ నిర్మించనున్నారనేది ఆయన తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు గతంలో ఆయన ఒకసారి ప్రకటించారు. -
క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi)పై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు. తను నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్(CASTING COUCH) ఆరోపణల గురించి ఆయన్ను ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమెపై సైబర్క్రైమ్లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్ ఆరోపణల గురించి విజయ్ ఇలా అన్నాడు.. 'చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు. కానీ, ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుంది. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది. ఆపై పేరు వస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి.' అంటూ విజయ్ చెప్పారు.తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీమ్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు.విజయ్పై వచ్చిన ఆరోపణ ఇదేకోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి (జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఇలా ఆరోపించింది. ‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. విజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది. -
'పెళ్లికి ముందే హద్దులు దాటితే'.. ఓటీటీకి సూపర్ హిట్ సినిమా
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
పృథ్వీరాజ్ సుకుమారన్ సతీమణికి వేధింపులు
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సతీమణి, నిర్మాత సుప్రియ మేనన్ వేధింపులకు గురౌతున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లుగా తనను ఒక మహిళ వేధిస్తున్నట్లు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసుకొని తనను టార్గెట్ చేస్తూ నిత్యం అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్లు సుప్రియ తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వేధింపుల గురించి సుప్రియ మీనన్ ఇలా చెప్పారు. '2018 నుంచి ఆన్లైన్ ట్రోల్స్, వేధింపులను ఎదుర్కొంటున్నాను. నన్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో చాలా ఖాతాలను క్రియేట్ చేసుకున్న ఒక మహిళ పదేపదే నన్ను ట్యాగ్ చేస్తూ వేధిస్తుంది. ఆమె పేరు క్రిస్టినాల్డో. ఆమె నా గురించి చేసిన ప్రతి పోస్టు చాలా అసహ్యకరమైన రీతిలో ఉంటుంది. ఆమె ఖాతను నేను పదేపదే బ్లాక్ చేస్తున్నప్పటికీ మరో కొత్త నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంది. ఆమె ఎవరనేది నాకు చాలా సంవత్సరాల క్రితమే తెలిసింది. కానీ ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు కాబట్టి వదిలేశాను. ఇదే అదునుగా తీసుకున్న ఆమె నాపై విషం చిమ్ముతూనే ఉంది. చివరకు మరణించిన నా తండ్రిని లక్ష్యంగా చేసుకుని నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించింది. అందుకే ఆమె గురించి బయటకు చెప్పాల్సి వచ్చింది.' అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఒక నర్సు అని తెలుస్తోంది. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సుప్రియ ఉన్నట్లు సమాచారం.సుప్రియా మేనన్ ఒకప్పుడు ఆమె జర్నలిస్టుగా పనిచేసేవారు. పృథ్వీరాజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే, తన సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చాలాసార్లు పృథ్వీరాజ్ చెప్పారు. వీరికో పాప (అలంకృతా మేనన్) ఉంది. పృథ్వీరాజ్ తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే.. అందుకే మలయాళంలో వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. పవర్హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్.. స్టార్ హీరోపై యువతి ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.అందుకే డిలీట్ చేశావిజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025 -
అత్యాచారం చేస్తామంటూ నటి రమ్యకు హీరో ఫ్యాన్స్ హెచ్చరిక
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య)పై దర్శన్ అభిమానులు ట్రోలింగ్కు దిగారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ బూతులతో విరుచుకపడుతున్నారు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ మెసేజులు చేస్తున్నారు. రేణుకస్వామికి బదులుగా నిన్ను (రమ్య) హత్య చేసి ఉంటే బాగుండేదని మరికొందరు దర్శన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించనున్నారు.ఈ అంశంపై ఇండియా టుడేతో ప్రత్యేకంగా రమ్య ఇలా మాట్లాడింది. 'బెంగళూరు కమిషనర్ ఈ రోజు నాకు సమయం ఇస్తున్నారు, కాబట్టి నేను వెళ్లి ఆయన్ను కలుస్తాను. నేను నా న్యాయవాదులను కూడా ఇప్పటికే సంప్రదించాను. ఎవరైతే నా కుటుంబంపై ట్రోల్ చేస్తున్నారో వారందరిని గుర్తించాము. నన్ను అసభ్యంగా బూతులు తిట్టేవారి సోషల్ మీడియా ఖాతాలను క్రోడీకరించాం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాము' అని ఆమె వివరించారు.మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో కొందరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నటి రమ్య చెప్పారు. సమాజంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరమన్నారు. మహిళలను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాంటి వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పింది. ఒక బలమైన మహిళను ఎదుర్కొవాలంటే మొదట ఆమె క్యారెక్టర్ను దెబ్బకొట్టేలనే పన్నాగంతో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని రమ్య పేర్కొంది.గతంలో దర్శన్పై చేసిన కామెంట్ వల్లనే..లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. తన ప్రియురాలిని సోషల్మీడియాలో తిట్టాడని రేణుకస్వామిని హత్య చేసి దర్శన్ పెద్ద తప్పు చేశాడని ఆమె చెప్పింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు..? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదంటూ పలుమార్లు దర్శన్ను రమ్య తప్పుబట్టింది. -
హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
తమిళగ వెట్రి కళగం నేత, సినీ నటుడు విజయ్ నివాసంతో పాటు సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపై చెన్నై విమానాశ్రయంలో కూడా బాంబులు ఉన్నట్టుగా బెదిరింపుల కాల్స్ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.విజయ్ నివాసం పరిసరాలలో, సీఎం నివాసం పరిసరాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో సోదాల అనంతరం భద్రతను పెంచారు. ఇప్పటికే విమానాశ్రయానికి పలుమార్లు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. హీరో విజయ్కు ఇప్పటికే రెండుసార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అజిత్, రజనీకాంత్ వంటి స్టార్స్ కూడా గతంలో ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నేపంథ్యంలో వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
దుర్గాదేవిగా నటి కస్తూరి.. 32 ఏళ్ల తర్వాత..
దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో రూపొందిన చిత్రాలు రాలేదని.. ఆ లోటును రాహుకేతు తీర్చనుందని చెప్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని మహాశివుడిగా, నటి కస్తూరి దుర్గాదేవిగా, విగ్నేష్ శ్రీమహావిష్ణువుగా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం థియేటర్స్ పతాకంపై శాంతి బాలచందర్ నిర్మించారు. ఎస్ ఆనంద్, వి. ఉమాపతి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ మాటలు పాటలను కలయిమామని కేపీ అరివానందన్ సమకూర్చగా తమిళమణి దురై బాలచందర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న విధులకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తమిళమణి దురై బాలచందర్ మాట్లాడుతూ.. ఇది రాహు కేతువుల జన్మ వృత్తాంతం.. అలాగే ప్రజలపై వారి ప్రభావం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. దీనికి భరణి కుమార్ నేపథ్య సంగీతాన్ని అందించగా గిటారిస్ట్ సదానందం మూడు పాటలకు సంగీతాన్ని అందించారని చెప్పారు.చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్ -
డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ!
మదంపట్టి రంగరాజ్ (Madhampatty Rangaraj).. తమిళనాడులో ఫేమస్ చెఫ్. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు 'మెహందీ సర్కస్' సినిమాతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మరే సినిమా చేయలేదు. ఇకపోతే రంగరాజ్.. భార్య శృతికి విడాకులిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. భార్యతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై రంగరాజన్ ఇంతవరకు స్పందించలేదు. పైగా అది తన వ్యక్తిగత విషయం అని మౌనంగా ఉన్నాడు.రెండో పెళ్లిమరోవైపు సెలబ్రిటీ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో రంగరాజన్ ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. సదరు డిజైనర్.. ఇతడిని నా మనిషి అని సంబోధించడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. చివరకు అదే నిజమైంది. రంగరాజ్ ఆమెను రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే పెళ్లిపీటలెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.పెళ్లికి ముందే ప్రెగ్నెంట్గుడిలో సింపుల్గా జరిగిన పెళ్లి ఫోటోలను జాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం తను ఆరో నెల గర్భవతిని అని తెలిపింది. ప్రియురాలు గర్భం దాల్చడంతో రంగరాజ్ ఉన్నపళంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడన్నమాట! మరి ఈ వ్యవహారంపై అతడి మొదటి భార్య శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి!రెండో భార్య ఎవరు?జాయ్.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 24 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్గా పని చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా నాలుగు అవార్డులు కూడా అందుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. విజయ్, శివకార్తికేయన్, విష్ణు విశాల్, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రభుదేవా, అనిరుధ్ రవించందర్, రెజీనా, కేథరిన్, జీవీ ప్రకాశ్.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్గా పని చేసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa)చదవండి: భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్ -
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
తమిళ నటుడు పొన్నాంబళం.. తెలుగులో ఘరానా మొగుడు (1992)లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పాందారు. ముఖ్యంగా ప్రతి నాయకుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. తమిళంలో రజనీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ,నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించాడు. అలాంటి నటుడు ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు పొందుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యను ఎదుర్కొన్న పొన్నాంబళం వైద్య చికిత్సలకు కూడా డబ్బు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. దీంతో సహాయం కోసం అభ్యర్థించడంతో పలువురు నటులు ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు. ముఖ్యంగా చిరంజీవి, రాధిక శరత్ కుమార్, ధనుష్ , రజనీకాంత్ వంటి స్టార్స్ పొన్నాంబళం వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. కాగా పొన్నాంబళం ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నాలుగేళ్లలో 750కి పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి తన ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని చెప్పారు. తనకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తను ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్పారన్నారు. అయితే, చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం ఆపేశానన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్ని వాపోయారు. అయితే మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ఆ సమయంలో చాలా బాధ అనుభవించానని పొన్నంబళం పేర్కొన్నారు. మద్యం ఎప్పటికీ హనికరం అంటూ జీవితంలో తాను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఆయన అభ్యర్థించారు. -
హీరోను వదిలేసి నన్ను మాత్రమే 'ఐరన్ లెగ్' అన్నారు: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్కు తొలి విజయం దక్కింది టాలీవుడ్లోనే. తెలుగులో తన మూడో చిత్రంగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమాకు ముందు అమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఛాన్సులు రావేమో అనుకుంటున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి పిలుపు రావడం ఆపై భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వారందరూ ఆ సమయంలో ఒక విషయాన్ని గుర్తించలేదని శ్రుతిహాసన్ చెప్పారు.'తెలుగు పరిశ్రమలో నేను నటించిన మొదటి రెండు చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో నాపై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ, ఆ రెండు చిత్రాల్లో నేను నటించింది ఒకే హీరోతోనే అనే విషయాన్ని అప్పుడు ప్రజలు గుర్తించలేదు. నన్ను మాత్రం ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటప్పుడు ఐరన్ లెగ్ అని హెళన చేయడం ఎందుకు..? నావి ఐరన్ లెగ్స్, గోల్డెన్ లెగ్స్ కాదు... నా కాళ్లు నాకు వదిలేయండి. అలా ఎవరినీ హెళన చేస్తూ విమర్శలు చేయకండి' అంటూ శ్రుతిహాసన్ పేర్కొంది.శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా 'సిద్ధార్థ్'తో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు. అయితే, అవి భారీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఆ తర్వాతి ఏడాదిలోనే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ సినిమా 'కూలీ'లో శ్రుతిహాసన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. -
'సోలో లైఫే సో బెటర్'.. పెళ్లిపై నిత్యా మీనన్ కామెంట్
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్(Nithya Menen) ఒకరు. రీసెంట్గా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు.. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్ చేస్తారన్నమాట. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం (తిరు) చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా విజయ్సేతుపతికి జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా.. జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. -
గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
కొండంత ఆశ పెట్టుకున్న సినిమా ఆడకపోతే ఎంతో బాధగా ఉంటుంది. ఓ సినిమా విషయంలో తనూ అలాగే బాధపడ్డానంటోంది శృతి హాసన్ (Shruti Haasan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు నాకెంతో స్పెషల్. వాటికోసం చాలా కష్టపడ్డాను. అవి బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడనప్పుడు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది.హృదయం ముక్కలైందిచాలామంది ఆ సినిమాను నమ్మి పని చేస్తారు. తీరా అది విజయం సాధించకపోయేసరికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 3 సినిమా కమర్షియల్గా విజయం సాధించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ ఉంది. ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడవన్నీ లేవు. 3 సినిమా హిందీలోకి డబ్ చేశాం. కానీ, ఓటీటీలు లేవు. ఆ మూవీ ఇప్పుడు రిలీజయ్యుంటే కొలవెరి సాంగ్ కంటే కూడా 3 చిత్రమే పెద్ద హిట్టయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేస్తే బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందేవి అని చెప్పుకొచ్చింది.3 మూవీలో ధనుష్, శృతిహాసన్సినిమాకాగా శృతిహాసన్ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. లోకేశ్ కగనరాజ్ దర్శకత్వం వహించగా అనిరుధ్ సంగీతం అందించాడు. 3 సినిమా విషయానికి వస్తే.. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (ధనుష్ మాజీ భార్య) దర్శకత్వం వహించింది. ఈ సినిమా విషాదకరమైన క్లైమాక్స్తో ముగుస్తుంది. గుండెల్ని పిండేసే ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా రీరిలీజ్ అయినప్పుడు మాత్రం హిట్టుగా నిలవడం విశేషం. చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
ధనుష్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?
ఎవరైనా, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే దాని వెనుక వారి శ్రమ, కృషి, అంకితభావం ఉంటుంది. అలా సినీ రంగంలో నిరంతర శ్రమ, పట్టుదలతో శ్రమించి సాధించిన వారు ఎందరో ఉన్నారు. అయితే, అలాంటి వారు తమ రంగంలో సాధించిన తరువాత అక్కడితో ఆగకుండా, ఇతర రంగాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఆవిధంగా సాధించిన వారూ ఉన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినిమా రంగంలో అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని ,రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులుగానూ ప్రజాదరణ పొందారు. ఆ తరువాత కమలహాసన్, విజయకాంత్ వంటి వారు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్ ఆ ప్రయత్నం చేసినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో రాణించడానికి రంగంలోకి దిగారు. ధనుష్ కూడా అదే దారిలో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, విజయ్ వంటి నటుల బాటలో ధనుష్ పయనించనున్నారు. అవును తన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరచడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా గత వారమే ధనుష్ తన అభిమానులను కలుసుకోవలసి ఉంది. అందుకు స్థానిక సాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు వారానికి ఒక్క రోజు(ఆదివారాల్లో మాత్రమే ) అభిమానులను కలుసుకునే విధంగా బుక్ చేసినట్లు తెలిసింది. నిజానికి గత వారమే ధనుష్ అభిమానులను కలుసుకోవలసి ఉందనీ, అయితే ఆయన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇలా అభిమానులను కలవాలన్న ధనుష్ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. గతంలో రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గరయ్యాకనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
నిద్రలేని రాత్రులు.. అయినా గర్వంగానే ఉంది: విజిల్ నటి
ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కూతురు, హాస్య నటి ఇంద్రజ (Indraja Shankar) ఈ ఏడాది ప్రారంభంలో తల్లిగా ప్రమోషన్ పొందింది. 2024 మార్చిలో తన స్నేహితుడు, డైరెక్టర్ కార్తీక్తో ఇంద్రజ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే! అదే ఏడాది ఆగస్టులో గర్భం దాల్చానంటూ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు ఏడో నెలలో అడుగుపెట్టడంతో నటి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వంగా భావిస్తున్నా..నా సంబరాల మూటకు ఆరు నెలలు నిండాయి. ఇప్పుడు ఏడో నెలలోకి వచ్చాడు. ఏడు నెలల క్రితం నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. నీ చిరునవ్వులకు, నీ కౌగిలింతలకు.. ఆఖరికి నాకు అందించిన నిద్రలేని రాత్రులను కూడా నేనెంతో గర్వంగా భావిస్తున్నాను నక్షత్రన్ అని రాసుకొచ్చింది. ఈ మేరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ నుంచి బాబును ఎత్తుకునే క్షణాల వరకు సంబంధించిన ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ను జత చేసింది.సినిమాకాగా ఇంద్రజ తండ్రి.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అవడంతో రోబో శంకర్గా పాపులర్ అయిపోయాడు. ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రం అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. దాదపు తమిళ స్టార్ హీరోలందరితోనూ పని చేశాడు. ఇంద్రజ విషయానికి వస్తే దళపతి విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్), విశ్వక్సేన్ పాగల్, కార్తీ విరుమాన్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్ -
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్తో పాటు మాస్ సీన్స్ బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)