breaking news
Kollywood
-
నటుడితో సంబంధం అంటగట్టారు.. సెట్లో ఏడ్చేశా.. హీరో విజయ్..: వనిత
చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు వనిత (Vanitha Vijayakumar). తల్లిదండ్రులు మంజుల- విజయ్ కుమార్ల నుంచి నటనను పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో దేవి చిత్రంలో నటించారు. ఆ మధ్య వచ్చిన మళ్లీ పెళ్లి మూవీలోనూ యాక్ట్ చేశారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకురాలిగానూ బాధ్యతలు చేపట్టింది.సెట్లో ఏడ్చేశా..ఈ మూవీతో వనిత కూతురు జోవిక నిర్మాతగా పరిచయం కానుంది. జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో వనితా విజయ్కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రలేఖ సినిమాతో హీరోయిన్గా నా ప్రయాణం మొదలైంది. ఇందులో విజయ్ (Vijay) హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు నా వయసు దాదాపు 15 ఏళ్లుంటాయనుకుంటా.. 40 ఏళ్ల వయసున్న రాజ్కిరణ్తో నాకు ముడిపెట్టి చేసి వార్తలు రాశారు. అవి చూసి తట్టుకోలేకపోయాను. సెట్లోనే ఏడ్చేశాను.మొదట పలకరించలేదుఅప్పుడు విజయ్ నన్ను చూసి పలకరించకుండానే వెళ్లిపోయాడు. తర్వాత కొంతసేపటికి వచ్చి అసలేమైందని అడిగాడు. నేనుం ఏం కాలేదని చెప్పాను. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పు అనేసరికి నా బాధనంతా వెళ్లగక్కాను. ఓ నటుడితో నాకు రిలేషన్ అంటగడుతున్నారని, అందుకు బాధగా ఉందని చెప్పాను. అప్పుడు విజయ్.. నీ గురించి వాళ్లు ఏదీ రాయకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే! నీ గురించి ఏదో ఒకటి రాస్తున్నారంటే నువ్వు ఫేమస్ అయ్యావని అర్థం. ఓదార్చాడుఈ విమర్శలు, పుకార్ల గురించి బాధపడకు. నీ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టు అని సలహా ఇచ్చాడు. విజయ్ ఎప్పుడూ అంతే.. మొదట నేను ఏడుస్తున్నా నా దగ్గరకు కూడా రాలేదు. అసలేమైందని కనుక్కున్న తర్వాతే నా దగ్గరకు వచ్చి పలకరించాడు, నా సమస్యను పరిష్కరించాడు. ఇకపోతే రాజ్కిరణ్ సర్ చాలా మంచివాడు. అలాంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. నాతో సంబంధం అంటగట్టారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
కుబేర తమిళ్ లో ప్లాప్ కు నాగార్జునే కారణమా..?
-
4 సార్లు 100 కోట్లు.. దూసుకుపోతున్న ధనుష్..!
-
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ను చదివించాలనుకున్న లారెన్స్తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని -
తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్
ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్నైట్ హీరోయిన్ మీథా రఘునాథన్ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్ మొదలుపెట్టింది.రెండోసారి..మీరు నన్ను గుడ్నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం తొలిసారి హైదరాబాద్కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్ తెలుగులో డైరెక్ట్గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్నైట్ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తెలంగాణ అల్లుడిని కదా..3 BHK మూవీలో శరత్కుమార్, సిద్దార్థ్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
విజయ్ ఆంటోనీ 'మార్గన్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్తో మెప్పించాడా?
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్' జూన్ 27న విడుదలైంది. చిత్రపరిశ్రమలో విజయ్ ఆటోనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరో మాత్రమే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఎడిటర్గా ఇలా మల్టీ టాలెంట్ను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథనగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు. కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మార్గన్ కథ మనం గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలానే ఉంటుంది. అంతా ఒకే ఫార్మాట్లోనే సాగుతుంది. హత్యల చేస్తున్న వ్యక్తి అందరిముందు శ్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు. కానీ, అతనే హత్య చేశాడని చివరివరకు రివీల్ కాదు. ఇదే పంతాలో మార్గన్ స్టోరీ ఉంది. రమ్య హత్య ఎపిసోడ్తో కథలో ఎంతమేకు సీరియస్నెస్ ఉందో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. యువతి హత్య కేసును చేధించేందుకు వచ్చిన ధృవ వెంటనే అరవింద్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలు అయిందా అనే ఫీలింగ్ వస్తుంది.రెగ్యులర్ ఫార్మాట్లో సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాదని సినిమా ప్రమోషన్స్లో మేకర్స్ చెప్పారు. కానీ, సినిమా చూస్తే మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా పాయింట్లోకి వెళ్లాడు. సోది అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియెన్స్ అనుమాన పడేలా అరవింద్ క్యారెక్టర్ను చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు. అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో అరవింద్కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసే వారికి అనిపిస్తుంది. మళ్లీ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఇంటర్వెల్కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకీ ఇటు ప్రేక్షకులకూ ఓ స్పష్టత వచ్చేస్తుంది. అక్కడి నుంచి సెకండాఫ్ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.సెకండాఫ్లో హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం అందుకుంటుంది. కానీ, కథలో వేగం తగ్గుతుంది. కానీ ఇలాంటి జానర్లో వచ్చే చిత్రాలకు ఓ ఫార్మూలా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానపడతామో.. వాళ్లు అసలు హంతకులు కాదు. ఎవరిని అయితే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్లే చివరకు షాకింగ్గా సర్ ప్రైజ్ ఇస్తారు. అలా ఇందులోనూ ట్విస్ట్ ఇస్తారు. దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియెన్స్ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక సెకండాఫ్లో ఆ పాత్ర చేసే విన్యాసాలు, ఇన్వెస్టిగేషన్లో చేసే సహాయం బాగుంటుంది. క్లైమాక్స్ సమయంలో దర్శకుడు కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినా.. అతను అలా చేయడానికి కారణం ఏమంత కొత్తగా అనిపించదు. అయితే, రెండు గంటల సేపు ఎంగేజింగ్గా తీయడంతో జాన్ పాల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం.ఎవరెలా చేశారంటే..'మార్గన్' సినిమాకు విజయ్ ఆంటోనీ ప్రధాన బలం. ఈ చిత్రానికి తెరపై, తెర వెనుక హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇలా అన్నింటినీ హ్యాండిల్ చేశారు. పోలీస్ పాత్రకు తగ్గట్లు సీరియస్గా ఒకే లుక్లో ఆయన కనిపించారు. ఆర్ఆర్ అయితే ఇంటెన్స్గా అనిపిస్తుంది. అజయ్ దిశాన్ పాత్ర కథకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఆరంభంలో సైకో కిల్లర్లా అదరగొట్టిన ఆయన సెకండాఫ్ వచ్చేసరికి సూపర్ హీరోలా అలరించాడు. తన యాక్టింగ్తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. ఇతను విలనా..? సపోర్టింగ్ యాక్టరా..? హీరోనా..? అన్న రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తాడు. బ్రిగిడ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. వెన్నెల, మేఘ పాత్రధారి నటన బాగుంటుంది. మిగిలిన ఇతర పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో రెగ్యులర్గా ఇలాంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చూసే వాళ్లకి మార్గన్ గొప్ప చిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ మార్గన్ మూవీ ఆడియెన్స్ని నిరాశ పర్చకపోవచ్చు. దర్శకుడు కథను ముగించిన తీరు అందరికీ సంతృప్తినివ్వదని చెప్పవచ్చు. -
హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. గతంలో నానుమ్ రౌడీదాన్, సిందుబాద్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, చక్కని ఎమోషన్తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
'అద్దె ఇంట్లో ఉంటున్నా'.. ప్రియురాలు కావాలంటే తప్పదుగా!
3 BHK.. అద్దె ఇంట్లో ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 3BHK. హీరో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ ఈవెంట్కు తమిళ స్టార్ హీరో రవి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అద్దె ఇంట్లో ఉంటున్నా..రవి మోహన్ (Ravi Mohan) మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో ఉండలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాకు చెందిన ఇళ్లల్లోనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మాత్రం అద్దె ఇంట్లో బతుకుతున్నాను. ఈ సినిమా నా జీవితానికి దగ్గరగా ఉంది. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇది జనాలకు అస్సలు మింగుడుపడలేదు. ప్రియురాలితో ఉండాలంటే..'అద్దె ఇంట్లో ఉండటమంటే లక్షలు రెంటు కట్టడం కాదు.. సొంతిల్లు లేక అగచాట్లు పడటం!', 'అయినా ఎందుకీ చెత్తంతా వాగుతున్నావు.. నువ్వు హీరోవి, కోట్లల్లో సంపాదిస్తున్నావు.. అద్దె ఇంట్లో కష్టాలు పడే కూలీలా మాట్లాడకు..', 'నీకు పెళ్లయి భార్య ఉంది, కానీ ఆమెను పక్కనపెట్టి ప్రియురాలు కావాలనుకున్నావ్, అలాంటప్పుడు అద్దె ఇంట్లోనే కదా ఉండాల్సింది! సింపతీ కార్డు వాడకు', 'అద్దింట్లో ఉంటున్నావ్.. కానీ సినిమాలు నిర్మిస్తున్నావ్' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాకాగా రవి మోహన్- ఆర్తి దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సింగర్ కెనీషాతో ప్రేమాయణమే దంపతుల మధ్య చిచ్చు పెట్టిందన్న రూమర్లున్నాయి. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉండగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. 3 BHK సినిమా విషయానికి వస్తే.. ఆర్ శరత్కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా అనుకోలే: మనోజ్ -
మాది కూడా 3 BHK.. అమ్మానాన్న కష్టపడి..: సిద్ధార్థ్ భావోద్వేగం
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటించిన 40వ సినిమా 3 BHK. హైదరాబాద్లో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకిది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న (సూర్యనారాయణన్) ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది.నాకోసం సంపాదనంతా..ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు థాంక్యూ అంటూ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు.సినిమాసొంతిల్లు అనేది ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
కోర్ట్లో తప్పు ఒప్పుకొన్న నటుడు శ్రీకాంత్
తమిళ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో హాజరు పరచగా.. తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థలు అలవాటు చేశాడని న్యాయస్థానానికి విన్నవించాడు. ప్రసాద్ తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బు అడిగిన ప్రతిసారి ఆయన కొకైన్ ఇచ్చేవాడని, అలా తనకు అది అలవాటు అయిపోయిందని శ్రీకాంత్ అన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)తాను డ్రగ్స్ అమ్మలేదని, కేవలం తీసుకున్నానని శ్రీకాంత్ చెప్పాడు. తీసుకోవడం తప్పని తనకు తెలుసని, బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరాడు. కానీ న్యాయస్థానం శ్రీకాంత్ అభ్యర్థని తిరస్కరించింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసుతో సంబంధమున్న నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. దొరకగానే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నారు.'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శ్రీకాంత్.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ చేశాడు. దళపతి విజయ్ 'స్నేహితుడు' చిత్రంలోనూ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇతడు కాస్త డౌన్ అయ్యాడు. ఈ ఏడాది శ్రీకాంత్ చేసిన రెండు తమిళ మూవీస్, ఓ తెలుగు సినిమా 'ఎర్రచీర' రిలీజైంది. కాకపోతే అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక) -
హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్!
హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్ గురించి శృతిహాసన్ ఇన్స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది. -
అజిత్ కుమార్ న్యూ లుక్.. షాకవుతున్న ఫ్యాన్స్!
ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించింది.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్కు కారు రేసింగ్ అంటే ప్రాణం. ఇప్పటికే తన టీమ్తో కలిసి విదేశాల్లో టైటిల్స్ కూడా సాధించారు. సినిమాలకు కాస్తా విరామం దొరకడంతో కార్ రేసింగ్లో బిజీ అయిపోయారు. అజిత్ కుమార్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీకెండ్లో ఈ కార్ రేసింగ్ జరగనుంది.అయితే తాజాగా అజిత్ కుమార్ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రేసింగ్ ట్రాక్పై సైకిల్ తొక్కుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో అజిత్ కుమార్ గుండు చేయించుకుని కొత్త లుక్తో దర్శనమిచ్చారు. తాజా లుక్ను చూసిన అజిత్ కుమార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాది 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో మెప్పించి అజిత్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. AK at Spa Francochamps circuit, Belgium preparing for the 3rd round of GT4 European series coming weekend#ajithkumar #ajithkumarracing #akracing #GT4 #europeanseries #weekendracing #racing pic.twitter.com/nXksEJZUdc— Ajithkumar Racing (@Akracingoffl) June 24, 2025 -
థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం
లెజెండరీ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోనూ బ్లాక్బస్టర్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన నాయకన్ (తెలుగులో నాయకుడు) ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమాయే థగ్ లైఫ్ (Thug Life Movie).క్షమించండిబోలెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ రిజల్ట్పై మణిరత్నం (Mani Ratnam) స్పందిస్తూ సారీ చెప్పారు. మా నుంచి నాయకన్లాంటి సినిమా వస్తుందని ఎదురుచూసినవారికి నేనొక్కటే చెప్పగలను. మమ్మల్ని క్షమించండి. మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. కానీ మీరు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఊహించని ఫలితాల్సి అందుకున్నాం. ప్రేక్షకులు.. మేము ఇచ్చినదానికంటే పూర్తి భిన్నమైనదేదో ఎక్స్పెక్ట్ చేశారు అని పేర్కొన్నారు. జూన్ 5న విడుదలైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చదవండి: జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే? -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన సంయుక్త
-
త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?
తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn— Trish (@trishtrashers) June 22, 2025 -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు) -
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే.. ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్.శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు దాదాపు చాలా నేచురల్గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. -
ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోడు. సింపుల్గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు.నాలుగేళ్ల గ్యాప్తో మూవీఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అల్లుకున్నాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.వీడియో వైరల్జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్, ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్ అయితే.. డంపింగ్ యార్డ్లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏pic.twitter.com/rYl2BQSBUV— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025Whistles, applause and what not 🔥🔥It’s a BLOCKBUSTER WAVE that’s set @dhanushkraja & @sekharkammula’s hearts ablaze ❤️🔥This is the kind of cinema that demands to be experienced on the big screens 💥💥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa… pic.twitter.com/yJTmUKtuhQ— Kuberaa Movie (@KuberaaTheMovie) June 20, 2025 చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి' -
ఈ దశాబ్దంలో నాకు నచ్చిన సినిమా అదే: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఇటీవలే హిట్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో మోస్ట్ వయొలెంట్గా కనిపించి అభిమానులను మెప్పించారు. హిట్ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలో తనకు నచ్చిన చిత్రాల్లో మెయిజగన్(తెలుగులో సత్యం సుందరం) ఒకటని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల మధ్య వచ్చిన ఈ చిత్రం భావోద్వేగం, వ్యక్తిగత జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇటీవల వ్యక్తిగతంగా తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిన చిత్రమిదేనని వెల్లడించారు. తన సినిమా హిట్-3 ప్రమోషన్ల సందర్భంగా ఈ సినిమా గురించి విన్నానని ఓ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వేల కోట్లతో నిర్మించిన చిత్రాలకు ప్రశంసలు రావొచ్చు..కానీ ఇలాంటి కథలు రావడం చాలా అరుదైన విషయమన్నారు.కాగా.. తమిళంలో మెయిజగన్ అనే పేరుతో ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. -
సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆకస్మిక దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.ఆర్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు. ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. -
త్వరలో యాక్టింగ్ కు గుడ్ బై చెప్పనున్న ధనుష్?
-
గుడ్నైట్ దర్శకుడికి శివకార్తికేయన్ ఛాన్స్.. తండ్రి పాత్రలో స్టార్ హీరో
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)కు ఇప్పుడు మంచి కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న శివకార్తికేయన్ కూడా చాలా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు నటించిన అమరన్ చిత్రం ఘనం విజయం సాధించింది. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మదరాసి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. రవిమోహన్, అధర్వ, ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటిస్తున్నారు. ఈచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది శివకార్తికేయన్ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈయన తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. దీనికి గుడ్నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలలైనట్లు సమాచారం. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని, శివకార్తికేయన్కు తండ్రిగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ( Mohanlal)ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్ ఆగస్ట్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
సింగర్తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్పై మరోసారి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
బుల్లితెర నటిపై ఫిర్యాదు.. డబ్బు కోసం మొదట భర్త ఉండగానే..
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పి తనను మోసం చేసిందని కోలీవుడ్ బుల్లితెర నటి నిహానాబేగంపై వ్యాపారవేత్త పూందమల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ్లో బాగా పాపులర్ అయిన 'పొన్ని, పాండియన్ స్టోర్స్' వంటి పలు సీరియల్స్లో నిహానాబేగం నటించింది. అయితే, చెన్నై దగ్గరలో ఉన్న కోళపాక్కంకు చెందిన రాజ్కన్నన్ అనే వ్యాపారవేత్త ఆమె తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో ఇద్దరు పిల్లల తల్లి అయిన నిహానాబేగం తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పిందన్నారు. ఆమెతో తన పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిహానాబేగం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని తరువాత తెలిసిందని, తనను మోసం చేసి, రూ.20 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తనను మోసం చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, తన నుంచి తీసుకున్న రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేలా చేయాలని బాధితుడు పిటిషన్లో కోరాడు. పోలీసులు నిహానాబేగంను, రాజ్కన్నన్ను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించడానికి సిద్ధమయ్యారు. -
'రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప'
నటుడు విజయ్ రాజకీయ పార్టీని నెలకొల్పి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవేడుకలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.అప్పు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2026లో విజయ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీకి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 365రోజులు తమ తలైవన్ పుట్టినరోజును వేడుకను జరుపుకునే ఒకే ఒక్క పార్టీ తమిళగ వెట్రి కళగం అని ఆయన అన్నారు.రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప: వేల్మురుగన్ఇదిలా ఉంటే తమిళ వాళ్ ఉరిమై పార్టీకి చెందిన వేల్మురుగన్ విజయ్పై విమర్శల దాడి చేశారు. ఒక వేడుకలో ఆయన మాట్లాడుతూ కరుణానిది పాలనలో పోరాడి, వాదాడి రాష్ట్రంలో 36 మెడికల్ కళాశాలను తీసుకొచ్చింది తానేనన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులు తమిళ సమాజానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఒక నటుడు (విజయ్) 10,12వ తరగతి విద్యార్థులను అభినందించడానికి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సూపర్స్టార్ రజనీకాంత్, విజయకాంత్ల కంటే విజయ్ ఏమైనా గొప్పా అంటూ ఫైర్ అయ్యారు. చిన్న నటుడు బాలా కూడా తాను స్వయంగా సంపాదించిన డబ్బును పేదలకు సాయం చేస్తున్నారని, రాఘవ లార్సెన్ తాను సంపాదించిన మొత్తంలో వృద్ధులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన మాత్రం సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారని ధ్వజం మెత్తారు. -
'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
అల్లు అర్జున్ డైరెక్టర్ చిత్రాలన్నీ కాపీనే?.. దర్శకుడి రియాక్షన్ ఇదే!
జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఏడాది బిగ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. అది కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుగొణె హీరోయిన్గా కనిపించనుంది.అయితే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టరేట్ స్వీకరించిన అట్లీ సినిమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన చిత్రాలన్నీ కాపీ చేశారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సినిమా గురించి కూడా మాట్లాడారు.అట్లీ మాట్లాడుతూ.. "సాధారణంగా ప్రేక్షకులు నా సినిమాలు కాపీ అని అంటారు.కానీ ఈ రోజు నా జీవితం గురించి నేను మీకు చెప్తా. ఈ రోజు నిజం చెబుతున్నా నేను తీసే సినిమాలన్నీ నా జీవితం నుంచి ప్రేరణ పొందా. ఇవాళ మీకు కనెక్ట్ అయ్యే ఒక ఉదాహరణ చెప్తా. విజయ్ నటించిన బిగిల్ సినిమా.. గ్యాంగ్స్టర్ నుంచి ఫుట్బాల్ కోచ్గా మారిన మైఖేల్ రాయప్పన్ పాత్రను జేపీఆర్ సార్ జీవితం నుంచి ప్రేరణ పొందా. రాయప్పన్ ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ కూడా. ఈ రోజు మీరు నాకు డాక్టరేట్ ఇచ్చారు. నేను ఈ దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాను కళానిధి మారన్ సర్ (సన్ పిక్చర్స్) నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీ కోసం అంతా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం కోసం నేను పెద్ద కలలు కంటున్నా. ఈ మూవీ బడ్జెట్ ఇంకా లాక్ కాలేదు. నిర్మాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.' అని పంచుకున్నారు. #Atlee: "Generally Audience says my films are copied, but I'm telling truth today that it's all inspired from my life. For Ex Bigil Raayappan character was inspired from JPR sir. You have given doctorate, i promise that I will make proud for this country. #AA22xA6 la therikka… pic.twitter.com/UQeZdqhJev— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
హిట్ 3 బ్యూటీకి క్రేజీ ఛాన్స్
-
హీరోయిన్గా ఊర్వశి కూతురు 'తేజలక్ష్మి'.. మొదటి సినిమా ఇదే
నటి ఊర్వశి వారసురాలు హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్కు, ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమార్తె 'తేజ లక్ష్మి' సినీ ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే తాజాగా తన మాతృభాష మలయాళీ ఇండస్ట్రీలో తేజ లక్ష్మి అడుగుపెట్టింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది.మలయాళంలో 'సుందరియాయవల్ స్టెల్లా' అనే చిత్రంలో కథానాయికగా తేజ లక్ష్మి నటిస్తుంది. నటుడు మనోజ్ కే.విజయన్ తన కూతురు కథానాయకిగా ఎంట్రీ గురించి ఒక భేటీలో ఇలా మాట్లాడారు. 'తేజలక్ష్మికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు మొదట నా రెండో భార్య నాకు చెప్పింది. దీంతో వెంటనే నా కూతురికి ఒక సలహా ఇచ్చాను. ముందు మీ అమ్మ ఊర్వశికి చెప్పి ఆశీస్సులు తీసుకోమని పంపాను. అలాగే ఊర్వశి కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఊర్వశి సమ్మతించకపోతే తేజలక్ష్మి కథానాయకి అయ్యేదే కాదు. ముందుగా మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన తేజలక్ష్మి తరువాత తమిళం, తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది.' అని ఆయన అన్నారు. View this post on Instagram A post shared by Teja Lakshmi🪬 (@mkt_999) -
ప్రదీప్ రంగనాథన్ బిగ్ ప్లాన్.. మరో హిట్ గ్యారెంటీనా?
కోలీవుడ్లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. -
ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య !
-
కీర్తి సురేశ్ కామెడీ ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'రివాల్వర్ రీటా'. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ డేట్ ప్రకటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ పోస్ట్ర్ను షేర్ చేశారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.ఇక బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్కు జంటగా బేబీజాన్ చిత్రంలో నటించారు. Rita is ready to roll babyyy 💥#RevolverRita from 27th August 🔥Tamil: 🔗https://t.co/hOuJQ0zOUkTelugu: 🔗https://t.co/pGTzJcx1Qz@Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction… pic.twitter.com/TToEIXOLtg— Keerthy Suresh (@KeerthyOfficial) June 11, 2025 -
రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి. -
సుహాసిని అందం గురించి పార్తీబన్ షాకింగ్ కామెంట్స్
మల్టీ టాస్కింగ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్తీబన్ (R. Parthiban). అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఓరోజు ఫోన్ చేసి..కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి పార్తీబన్.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.సినిమావర్డిక్ట్ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్, విద్యుల్లేఖ, ప్రకాశ్ మోహన్దాస్ తదితరులు నటిస్తున్నారు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత యంగ్ హీరోయిన్తో మూవీ ప్లాన్ చేసిన శశికుమార్
వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న 'శశికుమార్' వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన 'అయోద్ధి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్తో కలిసి నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్ హీరోగా నటించిన ఫ్రీడమ్ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్ సిరీస్లో నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్లో తాను శశికుమార్కు జంటగా నటిస్తున్నట్లు నటి 'అపర్ణదాస్'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్కు జంటగా నటించనుంది. ఆమె ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి 'దాదా' (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్ 12న విడుదల కానుంది.కాగా దీని తరువాత శశికుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. -
సిద్ధ వైద్యం వల్లే ప్రముఖ నటుడు మృతి?
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్ చనిపోయాడని ప్రచారం జరిగింది. సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.నిజమెంత?మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్గా చెక్ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.ఎవరీ రాజేశ్?రాజేశ్ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా! చదవండి: అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..! -
తగ్ లైఫ్ డిజాస్టర్ కు.. దుల్కర్ కు సంబంధం ఏంటి?
-
కమల్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ వద్ద థగ్ లైఫ్ కష్టాలు!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. -
పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
టాలీవుడ్పై సూర్య ఫోకస్.. స్టార్ డైరెక్టర్తో సినిమా క్యాన్సిల్?
హీరో సూర్యకు గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేదే లేదు. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ అనే అతిథి పాత్ర తప్పితే చెప్పుకోదగ్గ మూవీస్ రావట్లేదు. గత రెండు చిత్రాల్లో 'కంగువ' అట్టర్ ఫ్లాప్ కాగా, గత నెలలో వచ్చిన 'రెట్రో'.. తమిళంలో మాత్రం కలెక్షన్ సాధించింది. ఇది తప్పితే హిట్ కాదు. ఇలా కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అలానే టాలీవుడ్పైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?)ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సూర్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ క్రమంలో గతంలో కమిట్ అయిన 'వడివాసల్' అనే చిత్రాన్ని పక్కనబెట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో సెట్ కాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.మరోవైపు పాన్ ఇండియా ట్రెండ్లో పలువురు టాలీవుడ్ దర్శకులు ముందు వరసలో ఉన్నారు. దీంతో సూర్య ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పెట్టాడని తెలుస్తోంది. ఈ రూమర్స్ బట్టి చూస్తుంటే త్వరలో సూర్య.. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మరిన్ని చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు సెట్ కావట్లేదు. సూర్యని ప్రస్తుత తరం తమిళ దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇకపై యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని సూర్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
మొదలైన 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'
యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీనటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. 'ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి ఇదే ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.' అని అన్నారు. -
స్టార్ హీరోయిన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముంబైకి చెందిన సిమ్రాన్ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో దీపక్ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో సీరియల్స్తో పాటు పలు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు అధీప్ గ్రాడ్యేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్ పేర్కొన్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
కోలీవుడ్ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరో కాదని, సింగర్ కెనీషా అన్న ప్రచారం మొదలైంది. రవి.. సింగర్ కెనీషా (Keneeshaa)తో ప్రేమలో ఉన్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పూలదండలతో కోలీవుడ్ జంటఇది చూసిన నెటిజన్లు అదేంటి? అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా? అని షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే.. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్ మురుగన్ దేవాలయాన్ని రవి, కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతోనే అతడు జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. 15 ఏళ్ల బంధానికి ఫుల్స్టాప్!ఇకపోతే ఇతడు నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది..: హీరో -
విద్యార్థులకు 'విజయ్' కానుకలు.. రాజకీయాలు వద్దంటూ సూచన
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు. అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు. -
కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..!
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో 1987లో వచ్చిన నాయకన్ (నాయకుడు) మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చిన 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నాయకుడు సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. ఇన్నేళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమా రూపుదిద్దుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కన్నడలో ప్రదర్శితం కాని థగ్ లైఫ్అయితే కమల్ కన్నడ భాషపై చేసిన కామెంట్లతో పెద్ద వివాదం రాజుకుంది. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడంతో కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించారు. అయినప్పటికీ కమల్ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ ప్రజలంటే ఎంతో ప్రేమ అని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు కూడా తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించాడు. కానీ అక్కడి అభిమానులు థగ్ లైఫ్ చూడకుండా ఉండలేకపోయారు.అభిమానంఓ ఫ్రెండ్స్ గ్రూప్ 42 కి.మీ. ప్రయాణించి తమిళనాడులోని హోసూర్లో థగ్ లైఫ్ ప్రదర్శితమవుతున్న థియేటర్కు చేరుకున్నారు. మరో అభిమానైతే.. కమల్కు నేను వీరాభిమానిని. సినిమా చూసేందుకు బైక్పై హోసూర్ రావడం సురక్షితమేనా? లేదంటే అక్కడకు వచ్చాక కర్ణాటకవాసినని నా బైక్ టైర్లు పంక్చర్ చేసి, పాడు చేయరు కదా? అని ప్రశ్నించాడు. అందుకు కొందరు.. అలా ఏం జరగదు. నిరభ్యంతరంగా వచ్చి సినిమా చూడొచ్చు. హోసూర్లో కర్ణాటకలో రిజిస్టర్ అయిన వాహనాలు ఎన్నో తిరుగుతాయి. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు.చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్ -
'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్ను థగ్లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ..
సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయింది. తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు అనిత మీనన్ ఇక లేదన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియా వేదికగా మిత్రురాలి మృతికి సంతాపం ప్రకటించింది. నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాబూ అంకుల్, సూ ఆంటీ, సతీశ్ మీనన్, అవీషా, అనీషా.. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ స్నేహితురాలు అనితతో కలిసున్న చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది.చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్చెన్నైలోని మైలపోర్లో శోభన ఇంటి పక్కనే అనిత మీనన్ కుటుంబం నివాసముండేది. శోభన కంటే అనిత మూడేళ్లు చిన్నది. ఇరుగుపొరుగు కుటుంబాలు కావడంతో వీరిద్దరూ ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్గా కలిసుండేవారు. శోభన హీరోయిన్గా వెండితెరపై బిజీగా ఉన్నప్పటికీ అనితతో తన స్నేహాన్ని కొనసాగించింది. ఇకపోతే శోభన.. ఇటీవలే వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తుడరుం సినిమాలో మోహన్లాల్ భార్యగా నటించింది. 1990లో వీరిద్దరి కాంబినేషన్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమాలు‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంలో మణిచిత్రతారు అనే సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మిత్ర్ - మై ఫ్రెండ్ అనే సినిమాకుగానూ మరోసారి జాతీయ పురస్కారం గెల్చుకుంది. నటిగానే కాకుండా క్లాసికల్ టీచర్గా సేవలందిస్తున్న శోభనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్ -
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. -
కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్ హాసన్ ట్వీట్ వైరల్!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్తో కర్ణాటక వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ అనడంపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్పై ఏకంగా బ్యాన్ విధించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థగ్ లైఫ్ను నిషేధిస్తూ ప్రకటన విడుదల చేసింది. కమల్ క్షమాపణ చెబితేనే రిలీజ్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.అయితే కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన మూవీని కర్ణాటకలో విడుదల చేయడం లేదంటూ వెల్లడించారు. భాషా వివాద నేపథ్యంలో.. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమన్న కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ను ఆదేశించింది.అయితే ఈ వివాదం నేపథ్యంలో కమల్ మరోసారి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. 'ఆయన తన జీవితాంతం తమిళ భాష, తమిళ కళలకు, తమిళనాడు అభివృద్ధికి, తమిళ కళల సంక్షేమానికి అంకితం చేసిన అసమాన నాయకుడు కలైంగర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి నేను సంతోషిస్తున్నా' అంటూ కరుణానిధితో దిగిన ఫోటోను పంచుకున్నారు.(ఇది చదవండి: కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!)థగ్ లైఫ్ వివాదం వేళ కమల్ హాసన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలో థగ్ లైఫ్ నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం కమల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే సరిపోయేది కదా ఆంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్సీసీకి కమల్ లేఖ రాశారు కానీ క్షమాపణ మాత్రం చెప్పకపోవడం విశేషం.தமிழ் மொழிக்கும் தமிழ்க் கலைக்கும் தமிழ்நாட்டின் வளர்ச்சிக்கும் தமிழர்தம் நலனுக்கும் தன் மொத்த வாழ்வையும் அர்ப்பணித்துச் செயலாற்றிய ஒப்பற்ற தலைவர் கலைஞரை அவர்தம் பிறந்த நாளில் போற்றுவதில் மகிழ்கிறேன். pic.twitter.com/wnR0lOhfKS— Kamal Haasan (@ikamalhaasan) June 3, 2025 -
రజనీకాంత్ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్
సోషల్మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. రజనీకాంత్ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025 -
అలాంటి సినిమాలే చేస్తున్నావని నాపై ట్రోల్స్: యంగ్ హీరో
ఇండస్ట్రీలో కొందరు హీరోలు కొన్ని జానర్ సినిమాలతో ఫేమస్ అవుతారు. అలా కొన్నాళ్ల పాటు సదరు హీరో నుంచి ఒకే తరహా మూవీస్ వస్తాయి. విసుగెత్తిపోయిన ప్రేక్షకులు విమర్శించడం లాంటివి చేస్తే రూట్ మారుస్తారు. ఇప్పుడు సేమ్ అలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఓ యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. మిడిల్ క్లాస్ మూవీస్ చేసిచేసి బోర్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి?తమిళ ఇండస్ట్రీలో రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన మణికందన్.. 'విక్రమ్ వేద', 'జై భీమ్' లాంటి హిట్ సినిమాల్లో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. అలా గత మూడేళ్లలో చూసుకుంటే 'గుడ్ నైట్', 'లవర్'తో రీసెంట్గా 'కుడుంబస్థాన్' సినిమాతో వరస హిట్స్ కొట్టేశాడు. అయితే ఇవన్నీ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసినవే. దీంతో ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందించాడు.(ఇదీ చదవండి: తొలిప్రేమ తోపు కాదు.. ఇంట్రెస్టింగ్ 'చెన్నై లవ్ స్టోరీ')తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణికందన్.. మిడిల్ క్లాస్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టేసిందని అన్నాడు. గత మూడు చిత్రాలు హిట్ అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కూడా వచ్చాయనే విషయాన్ని గుర్తుచేశాడు. ఈ ఏడాది ఓ మూడు సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది మరో మూడు చిత్రాల్లో నటిస్తానని.. ఇవన్నీ కూడా తన గత చిత్రాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయని హామీ ఇచ్చాడు.మణికందన్ గత మూడు చిత్రాలు నేరుగా తెలుగులో రిలీజ్ కానప్పటికీ.. ఓటీటీ డబ్బింగ్తో తెలుగు ఆడియెన్స్ని కూడా ఆకట్టుకోవడం విశేషం. 'గుడ్ నైట్' విషయానికొస్తే.. గురక సమస్యతో ఇబ్బందిపడే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. లవర్ విషయానికొస్తే.. ప్రస్తుత సమాజంలోని ప్రేమ, అతిప్రేమ లాంటి అంశాలతో తీసిన సినిమా. కుడుంబస్థాన్ విషయానికొస్తే.. మధ్య తరగతి యువకుడు ఓవైపు జాబ్ చేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనుభవించాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ)"I am bored of doing Middleclass films as it's happening on packed House for Goodnight, Lover & Kudumbasthan. Audience is also criticizing the same🙁. I'll be filming 3 Films this year & 3 Films next year. All those films will be different🫰"- #Manikandanpic.twitter.com/r7HPnbWTFk— AmuthaBharathi (@CinemaWithAB) June 2, 2025 -
కోలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'ఫ్రీడమ్' టీజర్
కోలివుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫ్రీడమ్' (Freedom) నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఇందులో శశికుమార్ (Sasikumar), లిజోమోల్ జోస్ (Lijomol Jose) జోడీగా నటించారు. తాజాగా విడుదలైన తెలుగు టీజర్ ఆసక్తిగానే ఉంది. విజయ గణపతి పిక్చర్స్ బ్యానర్పై పాండియన్ పరశురామన్ దీనిని నిర్మిస్తున్నారు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ దర్శకుడు కన్నుమూత
కోలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు.శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన 'రావణ కొట్టం'తో సూపర్ హిట్ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా 'థెరం బోరం' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. #Rip dearest brother @VikramSugumara3 I’ve learnt so much from you & will always cherish every moment Gone too soonYou will be missed #RIPVikramSugumaran pic.twitter.com/U78l3olCWI— Shanthnu (@imKBRshanthnu) June 1, 2025 -
'అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి'.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈ మూవీ రిలీజ్కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్గా మాట్లాడారు.(ఇది చదవండి: శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!)ధనుష్ మాట్లాడుతూ.. "మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి 'కుబేర' లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 'అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025 -
హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
మళ్లీ సింగం గెటప్ తో సూర్య..
-
ఆ డైరెక్టర్ తో అపరిచితుడు.. ఆనందంలో విక్రమ్ ఫ్యాన్స్..
-
కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?
మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.20 ఏళ్లకు విడాకులుసూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g— Rajinikanth (@rajinikanth) May 31, 2025 చదవండి: ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్ -
కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!) -
ప్రముఖ హీరో మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్
తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్లో రాణించిన నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్ పిలల్లు ఉన్నారు.1974లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్లు పూర్తయ్యాయి. సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు. -
విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'నువ్వు RCB ఫ్యాన్వా.. కెరీర్ మీదా గట్టిగా ఫోకస్ చేయాలి' ('3 రోజెస్' టీజర్)
'3 రోజెస్' సీజన్ 2 (3 Roses Season 2) డైలాగ్స్ సోషల్మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’ నుంచి తాజాగా కమెడియన్ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్ను విడుదల చేశారు. బెట్టింగ్ భోగి పాత్రలో కడుపుబ్బా ఆయన నవ్వించేలా ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్పై పంచ్లు వేస్తూ ఆయన నవ్వించారు.ఆహా (Aha) వేదికగా త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి, సందీప్ బొల్ల ఈ మూవీకి రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎస్కేఎన్ తెరకెక్కిస్తున్నారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
జయం రవి విడాకుల కేసు.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన సింగర్!
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. అయితే ఇటీవలే జయం రవి భార్య ఆర్తి పలు ఆరోపణలు చేసింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోవాల్సి వస్తోందని ఓ లేఖను విడుదల చేసింది. ఎందుకంటే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్లో ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది.అయితే ఇటీవల తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు అలాంటి సందేశాలు పంపుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు ఆమె టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.కెనీషా పరువుకు భంగం కలిగించేలా సందేశాలు పంపినా, బెదిరించినా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన సందేశాల వల్ల ఆమె మానసికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అలాంటి మెసేజ్లు పంపితే ఆ స్క్రీన్షాట్లను ఆధారంగా చేసుకొని నోటీసులు పంపుతామని వెల్లడించింది. ఇలాంటి పనులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పంపే నోటీసులను సింగర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) -
విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి
-
24ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్లో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్కు జంటగా ఆళవందాన్ "అభయ్" చిత్రంలో నటించారు. కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ 1999లో నటించిన శూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
థియేటర్స్లో వాటి ధరలు తగ్గిస్తే బెటర్: ఎస్కేఎన్
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మే 31వ తేదీ నుంచి బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయబడతాయి. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ ఈ అంశంపై స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ వేడుకలో ఆయన పలు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. చిత్రపరిశ్రమ ఐసీయూలో ఉందని, ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.'సినిమా పర్సంటేజీల విధానం కంటే మనం ముందు ప్రేక్షకులను థియేటర్స్ రప్పించాలి. ఈ విషయంలో వారి నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్స్లో దొరికే తినుబండారాల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. సినీ పెద్దలు వీటిపై దృష్టి పెట్టాలి. ఆపై ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. రెండు వారాల్లో ఎటూ ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. ఉదయం ఆటకు వచ్చే ఆడియన్స్ భారీగా తగ్గిపోతున్నారు. కేవలం ఈవెనింగ్ షో, వీకెండ్స్లలో మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్కు బాగా వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మాములు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడం, వీకెండ్స్లో ధరలు పెంచడం వంటి విధానంపై ఆలోచన చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.' అని ఆయన గుర్తుచేశారు.సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. తమకు మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చే ఆదాయంలో పర్సెంటేజీ విధానాన్ని అమలుచేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. అలా చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలా పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతే సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఎస్కేఎన్ అభిప్రాయపడ్డారు. -
సస్పెన్స్ థ్రిల్లర్గా 'ఘటికాచలం' ట్రైలర్
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అందుకుని అందరి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతాయి. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం 'ఘటికాచలం'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్తో సినిమాను తెరకెక్కించినట్లు అర్ధం అవుతుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా రానున్న ఈ మూవీలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
లెజెండ్కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష మెప్పించింది.అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit. | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025 ThalaAjith pays respect to his Idol #AyrtonSenna 👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025 -
జయం రవి విడాకుల కేసు.. ఆయన భార్య ఆర్తి మరో పిటిషన్
కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్ వేయడంతో కోలీవుడ్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది -
నా రేస్ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్
స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్ రేస్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్ రేస్ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్ రేస్ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు. అయితే నువ్వు స్పాన్సర్స్ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్ చెప్పారు. -
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
తమిళ నటి, ప్రముఖ యాంకర్ ఐశ్వర్య రఘుపతి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె దుస్తులను ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఇప్పటికే ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే మరోసారి తాజాగా జరిగిన ఈవెంట్లోనూ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్లీవ్లెస్ దుస్తులపై ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజాగా సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్కు హాజరైన ఐశ్వర్య.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. అయితే దీనికి ప్రతిస్పందనగా.. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు ధరించిన స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని అడిగారు. దీనికి ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ అతన్ని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఐశ్వర్య దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గత వారంలో ఐశ్వర్య రఘుపతి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమని తెలిపింది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఐశ్వర్య తన ప్రకటనలో రాసుకొచ్చింది.ఇలా వేదికలపై తాను ఇలాంటి అసౌకర్య క్షణాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడని.. ఆ సంఘటన తన మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య చెప్పింది. కాగా.. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఐశ్వర్య రఘుపతి కనిపించింది. View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) -
కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది. -
'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి
ప్రేమ.. ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డ వాళ్లు కొందరు సులభంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. మరికొందరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కటవుతుంటారు. అలా ఇప్పుడు నిజంగా జరిగిన ఓ ప్రేమకథని దర్శకుడు అశ్వత్ మారిముత్తు బయటపెట్టాడు. రీసెంట్ గా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా తీసింది ఇతడే.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!)'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్వత్.. దీన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ అశ్వత్ మూవీ తీశాడు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన విక్కీ .. ఇదే మూవీకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన పవిత్ర రుక్మిణి ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన అశ్వత్.. వీళ్లిద్దరి ప్రేమకథ గురించి చెప్పాడు.'నిన్న నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ విక్కీ.. పవిత్రతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 'ఓ మై కడవులే' సినిమా కోసం విక్కీ నా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. 'డ్రాగన్'కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. నాతో పాటే కలిసి ఉండేవాడు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అలా విక్కీ.. 'డ్రాగన్' సెట్ లో మేకప్ ఆర్టిస్ట్ పవిత్రని కలిశాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు''ప్రతి గొప్ప ప్రేమకథ.. నో చెప్పడంతోనే మొదలవుతుంది. వీళ్లది కూడా అంతే. బ్రేకప్ సీన్ తీస్తున్న టైంలో విక్కీ ఏడుస్తూ కనిపించాడు. ఏమైందని అడిగితే.. తను నో చెప్పింది, మాట్లాడొద్దని కూడా చెప్పిందని అన్నాడు. ఓ అన్నగా నేను కొన్ని సలహాలు ఇచ్చా. కానీ పాట తీస్తున్న టైంకల్లా వాళ్ల గాఢమైన ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా నా దగ్గరకొచ్చి.. మేం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో నేను షాకయ్యాను' అని అశ్వత్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
‘భగవంత్ కేసరి’ని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ను జననాయగన్ పేరుతో తమిళ్లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది.విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' కోసం ‘భగవంత్ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్ను జన నాయగన్లో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాది అంతా భగవంత్ కేసరితో జన నాయగన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్ కోసం జగ నాయగన్ టీమ్ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావించాడట. పొలిటికల్గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.#JanaNayagan : Just to use a single episode, the makers have acquired the remake rights of #BhagavanthKesari film. Overall, there is no other connection between Jana Nayagan and Bhagavanth Kesari#JanaNayagan pic.twitter.com/sthnxzv4Q1— 𓃰TVK✘BALA𓃰 (@TvkSouthWing) May 19, 2025 -
కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి
సరిగ్గా ఓ వారం క్రితం తమిళ హీరో విశాల్.. ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లాడు. వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ సడన్ గా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. కానీ శరీరంలో ఫుడ్ లేకపోవడంతో శక్తి లేకనే కళ్లు తిరిగి పడిపోయారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ఇది జరిగి ఎన్ని రోజులూ కాలేదు. తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపించాడు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతితో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు. చాలారోజుల తర్వాత తన డార్లింగ్ ఫ్రెండ్ ని కలిశానని, కాసేపు తనతో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోలో విశాల్ ని చూస్తుంటే బాగానే కనిపించాడు.కొన్నాళ్ల క్రితం కూడా ఇలానే ఓ ఈవెంట్ కి వచ్చిన విశాల్ గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కి కనిపించాడు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆరోగ్యం పర్వాలేదనిపించేలా ఉంది. ప్రస్తుతానికైతే విశాల్ చేతిలో 'తుప్పరివాలన్ 2' తప్పితే మరో ప్రాజెక్ట్ లేదు. ఇది కూడా చాన్నాళ్ల నుంచి తీస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో హీరో, నిర్మాతగా విశాలే చేస్తున్నాడు. మరి దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial) -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ డిజైన్ స్కూల్గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025 -
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
చిరంజీవి- అనిల్ సినిమా.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్
చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్లోకి నయనతార ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు తాజాగా చిత్రయూనిట్ ఒక వీడియోను షేర్ చేస్తూ స్వాగతం పలికింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.Mega157లో నయనతార నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిని ధృవీకరిస్తూ నయనతారతో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి విడుదల చేశారు. జూన్లో ప్రారంభం కానున్న షూటింగ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ చిత్రంతో చాలారోజుల తర్వాత నయనతర హీరోయిన్గా తెలుగులో మళ్లీ అడుగుపెడుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది -
పెళ్లి పాటలో సుహాస్, మాళవికా
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు. పెళ్లి బ్యాక్డ్రాప్లో కొనసాగిన పాటలో సుహాస్, మాళవికా చాలా క్యూట్గా కనిపించారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటను టిప్పు, హరిణి ఆలపించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఇందులో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్తో ఇప్పుడు కోలీవుడ్లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. -
'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్టాపిక్గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్లో మరోసారి హాట్టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) -
రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో
వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా 'విడుదల పార్ట్ 1' మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. 'మామన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.'తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను' అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(ఇదీ చదవండి: సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్) "I stated as a daily Wager in Tiruppur & my wages was ₹20 per day. Weekly I get ₹140, I will spend ₹70 & send back ₹70 to my home. I got to learn about the life lessons there🫶"Growth of #Soori🫡♥️pic.twitter.com/2PflFhYz4o— AmuthaBharathi (@CinemaWithAB) May 14, 2025 -
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కోలీవుడ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ జగన్ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు.‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్, సిమ్రన్ల కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు. ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్ నటుడు కాదు.. ఒక సింగర్. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది.జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్ నటించాడు. ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్ స్టూడెంట్గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్ కొట్టేశాడు.'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'రాచ్చసి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్ సెట్స్లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్ కూడా సెట్స్కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు. -
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
కోలీవుడ్ ఎంట్రీ
రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్–దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కనుంది. రఫ్నోట్ ప్రోడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మే 11 (ఆదివారం) రాజ్ తరుణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.రాజ్ తరుణ్కు ఇదే తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ‘‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ మేకోవర్ అయిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. విభిన్నమైన కథ, బలమైన స్క్రీన్ప్లేతో ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్రేజీ సినిమా.. రూ. 600 కోట్ల కలెక్షన్స్.. ఛాన్స్ వదులుకున్న సాయిపల్లవి
ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్ని కూడా టచ్ చేసింది. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది. -
హీరో భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేసినట్లు ప్రకటించిన ఇతడు.. ప్రసుత్తం సింగిల్ గానే ఉంటున్నాడు. కానీ శుక్రవారం ఉదయం చెన్నైలో నిర్మాత ఇషారీ గణేశ్ కూతురు పెళ్లికి మాత్రం సింగర్ కెనీషాతో కలిసి హాజరయ్యాడు. దీంతో భార్య ఆర్తి తట్టుకోలేకపోయింది.నిన్న సాయంత్రం జయం రవి పేరు నేరుగా ప్రస్తావించనప్పటికీ.. చాలా ఆరోపణలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దీని ప్రతిగా జయం రవితో కలిసి కనిపించిన కెనీషా కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) తన ఇన్ స్టా స్టోరీలో ఆర్తి పేరు ప్రస్తావించకుండా.. 'మగాడు ఎప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నిజమైన బలం' అనే కొటేషన్ ని కెనీషా షేర్ చేసింది.ప్రస్తుతానికి హీరో జయం రవి భార్య ఆర్తి వర్సెస్ రూమర్ ప్రియురాలు కెనీషా మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ విషయంలో ఎవర ఒప్పు? ఎవరిది తప్పు అనేది తెలియాలంటే సదరు హీరో నోరు విప్పాల్సిందే. కోలీవుడ్ మీడియా ప్రకారం.. జయం రవి అత్త ఇతడి డేట్స్, మూవీస్ విషయంలో చాలా జోక్యం చేసుకుందని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్) -
ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు. -
డ్రాగన్ బ్యూటీకి అదృష్టం.. బిగ్ ఛాన్సులతో బిజీ
చిత్రపరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్ వచ్చిందంటే ఆ తరువాత అవకాశాలు వరుసకడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే స్టార్డమ్ వచ్చేస్తుంది. నటి కయదు లోహర్ పరిస్థితి అంతే. గత ఏడేళ్ల క్రితం మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి మంచి అవకాశాల కోసం పోరాడుతునే ఉంది. కాగా ఏడాది క్రితం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్తో డ్రాగన్ చిత్రంలో నటించే లక్కీచాన్స్ వరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో తెరపై వచ్చిన డ్రాగన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్టు అవుతుందని, తనకు క్రేజ్ తెచ్చిపెడుతుందని బహుశా కయదు లోహర్ కూడా ఊహించి ఉండదు. అంతే ఇప్పుడు కోలీవుడ్లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ఈమెను గుర్తించింది. అవకాశాలను అందిస్తోంది. నాని సినిమా "ది ప్యారడైజ్"లో కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆపై కోలీవుడ్లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి చిత్రంలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. అంతేకాదు సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్కుమార్తో జతకట్టే లక్కీచాన్స్ వరించింది. ఈ చిత్రాన్ని మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25 చిత్రం కింగ్స్టన్ చిత్రంతో తెరపైకి వచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్మెయిల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత కయాడులోహర్తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ చిత్రాన్ని చేస్తారో తెలియాల్సి ఉంది. -
బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే
తమిళ ప్రముఖ నిర్మాత ఇషారీ గణేష్ తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ శుభకార్యానికి తమిళ ఇండస్ట్రీ మొత్తం దాదాపు హాజరైంది. రజనీకాంత్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: ‘#సింగిల్’ మూవీ రివ్యూ)వెల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గా అందరికీ తెలిసిన ఇషారీ గణేశ్.. 2016 నుంచి సినిమా నిర్మాతగా మారారు. చిన్నాపెద్దా హీరోలతో మూవీస్ చేశారు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే తన పెద్ద కూతురు ప్రీతా గణేశ్ ని లస్విన్ కుమార్ అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేశారు.గురవారం రాత్రి సంగీత్ జరగ్గా.. హీరో సూర్య హాజరయ్యారు. శుక్రవారం జరిగిన పెళ్లికి మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం-సుహాసిని, ప్రభు, అధిక్ రవిచంద్రన్, దర్శకుడు వాసు, గౌతమ్ మేనన్, హీరో జీవా, జయం రవి, సత్యరాజ్, సుందర్ సి, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
ఆరుణ్ మాదేశ్వరన్తో బిగ్ప్లాన్ వేసిన లోకేశ్ కనకరాజ్
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా అవతారమెత్తనున్నారా..? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. లోకేశ్ కనకరాజ్ ఈ పేరు స్టార్ దర్శకులకు ఒక బ్రాండ్. మానగరం అనే ఒక చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి పెద్ద విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. వీటిలో లియో చిత్రం మినహా అన్నీ సూపర్హిట్ అయ్యాయి. లియో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా వసూళ్ల వర్షం కురిపించింది. కాగా తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈయన తదుపరి ఖైదీ –2, విక్రమ్– 2, రోలెక్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వమించాల్సిన ఉన్నాయన్నది తెలిసిందే. అదేవిధంగా మరో పక్క నిర్మాతగానూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హీరోగా అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఇంతకు ముందు నటుడు ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇటీవల నటి శృతీహాసన్తో కలిసి ఓ వీడియో ఆల్బమ్లో నటించిన విషయం తెలిసిందే. -
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. దివ్యాంగులకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న ఇతడు.. అప్పుడప్పుడు ఆపదలో ఉన్నవాళ్లని కూడ ఆదుకుంటూ ఉంటాడు. తాజాగా అలానే తమిళనాడుకి చెందిన ఓ మహిళకు ఆర్థిక సాయం చేసి మనసులు గెలిచేశాడు. విషయానికొస్తే.. శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, అతని భార్య ముత్తుకరుప్పి కూలీ పనులు చేసి డబ్బుని పొదుపు చేసుకున్నారు. ఆ మొత్తాన్ని హుండీలో దాచి, దానిని గొయ్యి తవ్వి పాతి పెట్టారు. కొన్నిరోజుల ముందు లెక్కించగా రూ.లక్ష ఉన్నట్లు తెలిసింది. తాజాగా మరోసారి తీసి చూడగా డబ్బులన్నీ చెదలు పట్టేశాయి. రూ.500 నోట్లని కొంతమేర తినేశాయి. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు. (ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కొరియోగ్రాఫర్ లారెన్స్.. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. పోగొట్టుకున్న రూ.లక్షని వారికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. లారెన్స్ కి ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ ముత్తుకరుప్పి కుటుంబానికి మాత్రం ఇది చాలా పెద్ద సాయమే.ప్రస్తుతం బెంజ్ అనే సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తనకు తోచిన సాయం చేసిన ఓ కుటుంబానికి అండగా నిలిచాడు.(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు
తమిళంలో పలు సినిమాలని తీసిన నిర్మాత ఇషారీ గణేశ్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయారు. ఎందుకంటే తన పెద్ద కుమార్తె ప్రీతికి భారీగా ఖర్చు చేసి పెళ్లి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పెళ్లెప్పుడు? ఎవరెవరు రాబోతున్నారు?వేల్స్ యూనివర్సిటీ, వేల్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో అటు విద్యా రంగంలో, ఇటు సినిమా నిర్మాణంలో గుర్తింపు తెచ్చుకున్న ఇషారీ గణేశ్.. తన పెద్ద కూతురు ప్రీతికి చెన్నైలో శనివారం (మే 09) వివాహం చేయనున్నారు. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ధనుష్, సూర్య, శివకార్తికేయన్ తదితరులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: మంచు మనోజ్.. 'అత్తరు సాయిబు'?) మరోవైపు గణేశ్ తండ్రికి రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో తమిళ రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు. మొత్తంగా 15 వేల మందికి పైగా అతిథులు ఈ పెళ్లికి వెళ్లనున్నారు. పూర్తిగా తమిళ సినిమాలే నిర్మించిన ఇషారీ గణేశ్ కు టాలీవుడ్ హీరోలతో పరిచయం ఉందో లేదో? లేదంటే తెలుగు హీరోలు కూడా ఈ పెళ్లికి హాజరవుతారేమో చూడాలి?తాజాగా గురువారం.. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో సంగీత్ వేడుక జరుగుతోంది. దీనికి హీరో సూర్య హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. పక్కనే రెట్రో సక్సెస్ మీట్ ముగించుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) -
ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన రజనీకాంత్
-
తమిళ మూవీలో సుహాస్.. ఫస్ట్ లుక్ రిలీజ్
కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న హీరో సుహాస్.. ఇప్పుడు తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టాడు. సూరి హీరోగా నటిస్తున్న ఓ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్) సూరి, మహిమ నంబియార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మండాడీ. ఇందులో తెలుగు నటుడు సుహాస్ కీలక పాత్ర చేస్తున్నాడు. లుంగీ, నెరిసిన జుట్టుతో సునామీ రైడర్స్ అనే జెర్సీతో కనిపించాడు. ప్రతినాయక పాత్రలా అనిపిస్తోంది. మతిమారన్ దర్శకుడు కాగా త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. తెలుగు డైరెక్టర్లు తమిళ, మలయాళ హీరోలతో.. ఆయా భాషల్లోని దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఓ తెలుగు దర్శకుడికి చేతిదాకా వచ్చిన ఓ భారీ ఛాన్స్.. కొద్దిలో మిస్సయింది. తాను టాలీవుడ్ వాడిని కావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) రీసెంట్ గా 'జాట్' మూవీలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని.. అంతకు ముందు బాలయ్యతో 'వీరసింహారెడ్డి' తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత తమిళ హీరో విజయ్ ని కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పించానని, కానీ చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టాడు.'వీరసింహారెడ్డి తర్వాత వెంటనే స్టోరీ రెడీ చేసుకుని తమిళ హీరో విజయ్ ని చెప్పాను. ఆయనకు నచ్చేసింది. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. అనౌన్స్ చేద్దాం అనుకుంటున్న టైంలో తర్వాత నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోతారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ డైరెక్టర్ అయితే బాగుంటుందని లోకల్ వాళ్ల నుంచి ప్రెజర్ ఉంది. దీని ముందు వారిసు (వారసుడు) అని తెలుగు దర్శకుడితో చేశారు. మళ్లీ తెలుగు డైరెక్టర్ తో అంటే తమిళ వాళ్లందరు కూడా తెలుగోళ్లని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదని ఆయనకు చెప్పారేమో. అలా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది' అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని.. విజయ్ తో సినిమా అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ రద్దయింది. రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. కారణమేంటో గానీ దీన్ని పక్కనబెట్టేశారు. ఫైనల్ గా హిందీలో 'జాట్' అనే మూవీ తీశాడు. గత నెలలో రిలీజైన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. త్వరలోనే ఈ దర్శకుడు బాలయ్యతో మరో మూవీ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') -
హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్ సస్పెన్షన్
భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్ అయ్యాడు. తమిళగ వెట్రి కళగం నేత విజయన్ను కలిసిన పోలీసు కానిస్టేబుల్ కదిరవన్ను సస్పెండ్ చేస్తూ మధురై పోలీసు కమిషనర్ లోకనాథన్ ఆదేశాలు జారీ చేశారు. విజయ్ ప్రస్తుతం కొడైకెనాల్లో జన నాయగన్ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్ను కలిసి వచ్చారు. అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్ తన యూనిఫామ్ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. -
టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ'
చిన్న లేదా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలని.. స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా రిలీజ్ చేసేందుకు కాస్త ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఇది మైనస్ అయితే మరికొన్నిసార్లు ప్లస్ అవ్వొచ్చు. తాజాగా తమిళంలో సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజైన ఓ చిన్న మూవీకి ఇలానే ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా? దాని సంగతేంటి?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) తెలుగులో ఈ వారం హిట్ 3 రిలీజైంది. సక్సెస్ అందుకుంది. తమిళంలో సూర్య రెట్రో విడుదలైంది. కానీ పాజిటివ్ టాక్ రాలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ వీకెండ్ దాటితే రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చిత్రానికి పోటీగా తమిళంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా రిలీజైంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ తప్పితే ఇందులో తెలుగువాళ్లకు తెలిసిన ముఖాలేం లేవు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' కథ విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ధర్మదాస్ అనే వ్యక్తి.. కొవిడ్ వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతాడు. దీంతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని చెన్నైకి వలస వస్తాడు. ఆ తర్వాత తను ఉంటున్న కాలనీ వాసులతో ఎలా కలిసిపోయాడు? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) ఈ సినిమాలో సింపుల్ స్టోరీనీ అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి? ఆ జీవితం మిగతావారితో కలిసి ఎలా జీవించాలి? ప్రతి మనిషి మరో మనిషికి తోడుగా ఉంటూ ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే అంశాల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా, చూస్తున్నంతసేపు గుండె బరువెక్కేలా ఈ సినిమాని తీయడం విశేషం.రెట్రో మూవీకి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు గానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ గట్టిగా ఉండొచ్చు. ఈ సినిమాని తీసింది ఓ యూట్యూబర్ కావడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతానికైతే ఇది తమిళంలో మాత్రం రిలీజైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన) -
నేను ఒక యాక్సిడెంటల్ నటుడిని.. అప్పుల కోసమే నటించా: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో అభిమానులను అలరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఏ క్షణంలోనైనా సినిమాలను అర్ధాంతరంగా వదిలేయాల్సి రావొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తాను యాక్సిడెంటల్గా నటనలోకి వచ్చానని వెల్లడించారు. తన జీవితంలో రేసర్ కావాలని కోరుకున్నానని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కుదరలేదని తెలిపారు. నీకిష్టమైన పనినే చేయాలని తన తండ్రి చెప్పేవారని.. కానీ అప్పులు తీర్చడానికి మోడలింగ్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి నటుడిగా మారి ఉన్న అప్పులన్నీ తీర్చానని వెల్లడించారు. -
ఫోటోలో కనిపించిన పాప వివరాలు తెలిపిన 'శ్రీలీల'
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫోటోను తన సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని క్యాప్షన్ పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తత తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ సమయంలో వారిని దత్తత తీసుకుంది. దీంతో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తత తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలోని పాప గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ షేర్ చేసింది.ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల కాస్త విరామం దొరకగానే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది. ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఈ పిన్నిలో మరింత జోష్ నింపింది' అని ఇన్స్టా స్టోరీస్లో తెలిపింది. పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్లో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ సమయంలోనే కార్తిక్ - శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
విరాట్ కోహ్లీ బయోపిక్లో తమిళ హీరో..
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా నిర్వహించి పేరు గడించారు. విరాట్ కోహ్లీకి అశేష అభిమానులు ఉన్నారు. ఇకపోతే సినిమా రంగంలో సంచలన నటుడు శింబు. ఈయనలో మంచి నటుడే కాకుండా, దర్శకుడు, కథకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు ఉన్నారు. అంతేకాకుండా శింబు బహు భాషా నటుడిగా పేరు తెచ్పుకున్నారు. ఇలాంటి నటుడి చిత్రంలోని పాటను క్రీడాకారుడు విరాట్ కోహ్లీ లూప్ మోడ్లో(పదేపదే) వినడం విశేషం. నటుడు శింబు 2023లో కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో 'నీ సింగం దాన్' అనే పాట చోటు చేసుకుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ పోటీల్లో బెంగళూరు జట్టు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలోని నీ సింగం దాన్ అనే పల్లవితో సాగే పాటను పదేపదే విన్నానని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది శింబు దృష్టికి రావడంతో ఆయన కోహ్లీ నుద్దేశించి నీయే ఒరు సింగం దాన్ (నువ్వే ఒక సింహం) అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ అభిమానులు, శింబు అభిమానునలు క్రీడారంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖులైన ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే శింబు, కోహ్లీలో స్వారూప్యం చాలా ఉంది. ఇద్దరూ చార్మింగ్గా ఉంటారు. ఇద్దరూ పొడవైన జుట్టుతో ఉంటారు. దీంతో కోహ్లీ బయోపిక్లో శింబు నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ధోని బయోపిక్తో తెరకెక్కిన ఎంఎస్.ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి విరాట్ కోహ్లి బయోపిక్ తెరకెక్కే అవకాశం లేకపోలేదని, అందులో శింబు నటిస్తే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అవుతుందనే వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు ప్రస్తుతం కమలహాసన్తో కలిసి నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. తాజాగా మరో మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే కోహ్లీ బయోపిక్లో నటించే అవకాశం ఉంటుంది. హీరోయిన్ లైక్పై క్లారిటీఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, వాటిని విరాట్ కోహ్లీ లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు. కొంత సమయం తర్వాత ఆ లైక్ను ఆయన తొలగించారు. ఇంతలోనే కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా ఆ విషయంపై కోహ్లీ ఇలా వివరణ ఇచ్చారు. 'నేను ఇన్స్టాలోని ఫీడ్ను క్లియర్ చేస్తుండగా పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి ఉద్దేశం నాకు లేదు. ఎవరు కూడా అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని కోరుతున్నాను. ఈ పొరపాటును అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని తన ఇన్స్టా స్టోరీలో కోహ్లీ పేర్కొన్నారు. -
బలవంతంగానైనా సినిమాలకు గుడ్బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి -
అమ్మకు మీ అందరి ఆశీస్సులు కావాలి: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025 -
రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి?
సినీ ప్రియులకు నేడు డబుల్ ధమాకా.. అటు నాని హీరోగా నటించిన హిట్ 3 రిలీజవుతుండగా.. ఇటు సూర్య నటించిన రెట్రో (Retro Movie) కూడా సరిగ్గా ఇదే రోజు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్ (ట్విటర్)లో ఎటువంటి సందడి కనిపించడం లేదు.కనిపించని సందడిఈ సినిమాకు ప్రీమియర్స్ వేసినట్లు లేరు. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్ తెలియడానికి మరికాస్త సమయం పట్టేట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకుని కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. దీన్ని అరికట్టేందుకే రెట్రో టీమ్ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల మాత్రం తొలి షో అయిపోయిందని.. సినిమా బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.కంగువా డిజాస్టర్.. ఈసారైనా..అసలే సూర్య (Suriya) చివరి సినిమా కంగువా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అటు పూజా హెగ్డే (Pooja Hegde) సైతం ఈ చిత్ర ప్రమోషన్స్లో తెగ కష్టపడింది. ఎక్కడికి వెళ్లినా 'కనిమా..' అంటూ తన పాటకు స్టెప్పులేసింది. మరి వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో, లేదో చూడాలి! Very worst till now Rohini theater Gate not opened Time 7:30 AM May 01 #RetroFDFS #Retro pic.twitter.com/mg0fn8tN8N— Rolex_07_Rahul (@_Rolex07_) May 1, 2025#RETRO: BLOCKBUSTER 🔥💯🏆— Vinveli Nayagan (@Vinveli_nayaga) May 1, 2025#RETRO negative reviews from overseas 🥺😒— 💙🎊Thala Sudhakar🎊💙 (@Sudhkaar1) May 1, 2025#Retro Premiers leva Reviews levu asalu X Lo— Pavan Prabhas (@Pa1Prabhas_45) May 1, 2025Number of Tickets sold on BookMyShow in last 24 Hours 1. #Thudarum 290.88 🤯2. #HitTheThirdCase 189.96K3. #Retro 138.67K 4. #Raid2 89.82K 5. #KesariChapter2 41.61K6. #Gangers 7.68K7. #UntilDawn 7.42K8. #GroundZero 6.94K9. #Phule 6.91K10. #Sinners 6.50K11. #Jaat 5.58K— Movie Industry Updates (@movies_N_update) May 1, 2025 చదవండి: నాని ‘హిట్ 3’ సినిమాకి ఊహించని టాక్.. అదే మైనస్ అట! -
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?) -
పహల్గామ్ దాడి.. నా పోస్ట్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025 -
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సండే వచ్చిందంటే ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. లేదా జాలీగా ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటారు. కుదిరితే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరో మాత్రం తన ఇల్లు తుడిచే పనిలో పడ్డాడు. తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశాడు. శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్ తుడుస్తున్నాడు. 'సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. జయం సినిమాతో హిట్అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. రవి మోహన్.. బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. జయం (తెలుగు జయం రీమక్) అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు జయం రవిగా స్థిరపడిపోయింది. తమిళంలో హీరోగా..దాస్, ఇదయ తిరుదన్, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్ కాదల్, ఆది భగవాన్, రోమియో జూలియట్, మిరుథన్, బోగన్, టిక్ టిక్ టిక్, భూమి, పొన్నియన్ సెల్వన్, బ్రదర్, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై వంటి పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో కరాటే బాబు, పరాశక్తి, జీని, తని ఒరువన్ చిత్రాలున్నాయి.విడాకులు?ఇదిలా ఉంటే రవి.. నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. తనను రవి అని మాత్రమే పిలవాలని కోరాడు.చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు -
నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు..
యంగ్ డైరెక్టర్ అబిశన్ జీవింత్ తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు, ఎమ్మెస్ భాస్కర్, మిథున్ జే, రమేశ్ తిలక్ తదితరులు నటించారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అబిశన్ (Abishan Jeevinth) తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.నీ వల్లే..ముందుగా స్టేజీ ఎక్కిన అబిశన్.. తన సినిమా గురించి చెప్తూ, అందులో నటించిన యాక్టర్స్కు, సంగీతాన్ని అందించిన షాన్ రోల్డన్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వెంటనే తన స్నేహితురాలు అఖిల ఎలంగోవన్కు సైతం థాంక్స్ చెప్పాడు. అబిశన్ మాట్లాడుతూ.. అఖిల.. నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పదో తరగతి నుంచి మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా అమ్మతో పాటు నీవల్లే జీవితంలో మంచి వ్యక్తిగా ఎదిగాను. ఐ లవ్యూ సోమచ్ అని ప్రశ్నించాడు. దర్శకుడి మాటలతో కంటతడిఇప్పుడు నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. అక్కడే ఉన్న అఖిల అతడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. అఖిల అతడి ప్రపోజల్కు ఒప్పుకోవమ్మా.. సినిమా ప్రపోజల్ కన్నా ఇదే బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️pic.twitter.com/cG3qvN3fF1— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025 చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి -
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్ సిమ్రాన్ (Simran). ఈమె ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్ ఇచ్చింది.లైలా? జ్యోతిక? ఎవరన్నారు?లైలా గురించే సిమ్రాన్ ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్ సిరీస్లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. ఆంటీ అనే పదం ఇష్టంఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్ కాలేరని రుజువైంది. ఫ్రెండ్ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్ వెల్లడించలేదు.చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు -
చెపాక్లో తలా సందడి.. మరో తలా కోసమే వచ్చాడంటున్న నెటిజన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదాముయార్చి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.రెండు రోజుల క్రితమే అజిత్ తన భార్య షాలినితో కలిసి వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. వీరిద్దరి బంధానికి దాదాపు 25 ఏళ్లు పూర్తి కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఐపీఎల్ మ్యాచ్లోనూ సందడి చేశారు. తమ కుమారుడు ఆద్వైక్తో కలిసి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే అజిత్.. మరో తలాగా పిలవబడే ఎంఎస్ ధోని ఆటను ఆస్వాదించేందుకు స్డేడియానికి వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని కొడుకు ఆద్వైక్ను తన ఒడిలో కూర్చొబెట్టుకుని మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు.కాగా.. ఈ మ్యాచ్లో మరో హీరో శివకార్తికేయన్ కూడా స్టేడియంలో కనిపించారు.అంతేకాకుండా ఈ మ్యాచ్లో హీరోయిన్ శృతిహాసన్ సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే సినిమాలతో పాటు రేసింగ్లోనూ అజిత్ కుమార్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన టీమ్ బెల్జియంలో జరిగిన కారు రేస్లో రెండో స్థానంలో నిలిచింది. Seems like Shalini AjithKumar is a big fan of CSK & the way she explains the team players to AK so heartwarming 🥰AK’s Wedding Anniversary Gift 🎁 pic.twitter.com/2jqVtRU6bc— Kolly Corner (@kollycorner) April 25, 2025 -
మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో (Retro Movie). ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో అతడి తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ చిత్రపరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా సూర్య కంటే ముందు ఎవరైనా సిక్స్ ప్యాక్తో రావడం చూశారా? అని ఓ ఈవెంట్లో ప్రశ్నించాడు.సిక్స్ ప్యాక్ ట్రెండ్ఇది విన్న సినీప్రియులు.. అదేంటి? కోలీవుడ్లో అంతకుముందే విశాల్ (Vishal) సిక్స్ ప్యాక్తో వచ్చాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. అసలు సిక్స్ప్యాక్ ట్రెండ్కు కోలీవుడ్లో నాంది పలికింది ఎవరన్న ప్రశ్నకు తాజాగా విశాల్ స్పందించాడు. మొదట్టమొదటిసారి ధనుష్ పొల్లాధవన్ మూవీలో సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత నేను సత్యం, మదగజరాజ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించాను. జనాలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటాను అని చెప్పుకొచ్చాడు.మర్చిపోయారా?వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'పొల్లాధవన్' 2007లో రిలీజైంది. ఇందులో ధనుష్ సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత విశాల్ 'సత్యం' సినిమాలో ఆరుఫలకల దేహంతో కనిపించాడు. ఈ మూవీ 2008 ఆగస్టులో విడుదలైంది. అనంతరం సూర్య.. 2008 నవంబర్లో వచ్చిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో తొలిసారి సిక్స్ప్యాక్ ట్రై చేశాడు. ఇక రెట్రో విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 న విడుదల కానుంది.చదవండి: అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..! -
పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్ తండ్రి
పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్ఏ చంద్రశేఖర్ (S A Chandrasekhar).ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లేఈ కోలీవుడ్ డైరెక్టర్.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్నాథన్, సి.రంగనాథన్, పవిత్రన్, ఎస్.శంకర్, ఎం. రాజేశ్ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్గా పనిచేశారు.BMW కారు గిఫ్ట్చంద్రశేఖర్.. తన కుమారుడు విజయ్ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్ చేశాడు. బీఎమ్డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S A Chandrasekhar (@dir_sac) చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!
పవిత్ర లక్ష్మి (Pavithralakshmi).. ఈ తమిళమ్మాయి ఓ కాదల్ కణ్మని (2015) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో అతడి కొలీగ్గా చిన్న పాత్రలో కనిపించింది. అదే ఏడాది ఈమె మిస్ మద్రాస్ కిరీటాన్ని సైతం గెల్చుకుంది. కూకు విత్ కోమలి అనే కుకింగ్ షోలో పాల్గొని ఎక్కువ ఫేమస్ అయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే నాయి శేఖర్ (తమిళ చిత్రం), ఉల్లాసం (మలయాళం), అదృశ్యం(తమిళ, మలయాళం) అనే సినిమాలు చేసింది. జిగిరీ దోస్తు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది.ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదుఅయితే ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఈ మధ్య పుకార్లు వైరల్గా అయ్యాయి. ఈ రూమర్లపై పవిత్ర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా లుక్ మారడం, బరువు పెరగడంతో నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉన్నాయి.నా భవిష్యత్తు ఆగం చేయొద్దుఅందుకే మీ అందరికీ మరోసారి చెప్తున్నా.. నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా గురించి లేనిపోని వార్తలు రాయొద్దు. నాపై రూమర్లు సృష్టించకండి. నాకంటూ ఓ జీవితం ఉంది.. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. కొంత ప్రేమ, మరికొంత గౌరవం.. మీనుంచి ఈ రెండే కోరుకుంటున్నా.. మీరెప్పుడూ నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని పవిత్ర ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) చదవండి: బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ది అకాలీ'(The Akaali).. ఏడాది క్రితం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలో రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీలో కథ, కథనాలతో పాటు భారీ ట్విస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా నాజర్ పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నాజర్తో పాటు వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మహ్మద్ అసిఫ్ హమీద్ హారర్ థ్రిల్ మూవీగా దీనిని తెరకెక్కించారు.సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. అయితే, ఇప్పటికే తమిళ వర్షన్ ఆహా(AHA) ఓటీటీలో రావడంతో చాలామంది చూసిన తర్వాత మూవీ బాగుందంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే ఓటీటీలో ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. డార్క్ హారర్ థ్రిల్లర్గా ఈ మూవీ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలు చేస్తుంటుంది. అందులో దాగి ఉన్న మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి..? మరి, జానిస్ ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది..? జానిస్ పూజలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతాయి. -
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా నా సినిమాలు ఉంటాయి' అంటున్నాడు దర్శకుడు, నటుడు సుందర్.సి. ఈయన ఇటీవలే మదగజరాజ సినిమాతో హిట్టందుకున్నాడు. నిజానికి ఇది 2012లో రావాల్సిన సినిమా. కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేదు. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 12న విడుదలై విజయం సాధించింది.డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవ్ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుందర్. సి (Sundar C) మాట్లాడుతూ.. నా సినిమా ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని కోరుకుంటాను. అందుకే డబుల్ మీనింగ్ డైలాగులు రాయను. ఒకవేళ ఏవైనా ద్వంద్వార్థాలు ఉండే డైలాగ్స్ కనిపించాయంటే అవి కేవలం ప్రేక్షకులు ఊహించుకుంటున్నవే కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాయలేదు.ఐటం సాంగ్స్ ఉండవ్స్క్రిప్టు రాసే దగ్గరి నుంచి షూటింగ్ వరకు ఎక్కడా డబుల్ మీనింగ్స్కు, అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్తపడతాను. అలా అని నా సినిమాల్లో గ్లామర్ లేకుండా ఉండదు. కాకపోతే ఆ గ్లామర్ను ఎలా చూపిస్తున్నానన్నది ముఖ్యం. ఉదాహరణకు చీరకట్టుకున్న అమ్మాయిని రకరకాల యాంగిల్స్లో ఇంకోలా చూపించొచ్చు. నేను మాత్రం అలాంటి పని చేయను. నేను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా విజువల్స్ ఉండాలని భావిస్తాను. అలాగే నా సినిమాల్లో ఐటం సాంగ్స్ ఉండవు.. నా చిత్రాలు ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.మరి ఇదేంటి సార్?ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అతడు రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ను, కాస్త ఓవర్డోస్గా ఉన్న సన్నివేశాలను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే.. అరణ్మనై మూవీ (Aranmanai Movie)లో స్విమ్మింగ్ పూల్ సీన్ దేనికుందో మరి?, అంబాలా మూవీలో మద్రాస్ టు మధురై ఐటం సాంగ్ ఉందిగా.. అరణ్మనైలో తమన్నా, రాశీలతో డ్యాన్స్ చేయిస్తూ క్లోజ్ షాట్స్లో చిత్రీకరించావుగా.. అంటూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాఇకపోతే సుందర్.. మెట్టుకుడి, అరుణాచలం, అంబే శివం, లండన్, రెండు, అరణ్మనై (నాలుగు భాగాలు), యాక్షన్, కాఫీ విత్ కాదల్, మదగజరాజ వంటి పలు సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు కొన్నింటిలో నటించాడు కూడా! ఈయన ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా గ్యాంగర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్ వడివేలు, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదల కానుంది. 🤣pic.twitter.com/bOWN7aANH1— Prakash Mahadevan (@PrakashMahadev) April 20, 2025 I love Sundar C glamour but I can't digest the fact he is not accepting. He has the most naughtiest frames in Kollywood but carefully escaping— 𝐒𝐔𝐍𝐈𝐋 𝐓𝐇𝐈𝐋𝐀𝐊 (@sunil_thilak) April 20, 2025చదవండి: RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్ -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. గూస్బంప్స్ తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిం. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసింది.తాజాగా ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఓజీ సంభవం పేరిట అజిత్ ఫ్యాన్స్ను ఊపేస్తోన్న పాటను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ వర్షన్ కూడా వచ్చేసింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. The unmatched style and swag ❤️🔥#OGSambavam video song from #GoodBadUgly out now!Tamil - https://t.co/knfimOefHVTelugu - https://t.co/XgRHz7UxHhBook your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#BlockbusterGBU pic.twitter.com/h7wmmbZvbH— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025 -
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
తమిళ నటుడు కాదల్ సుకుమార్ కోలీవుడ్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. శింబు కాదల్ వావ్తిల్లై (కుర్రాడొచ్చాడు), కమల్ హాసన్ విరుమాండి(పోతురాజు) వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుని ఛాన్సులు అందుకున్నాడు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన కాదల్ (ప్రేమిస్తే) చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభించినందున అతన్ని కాదల్ సుకుమార్ అని పిలుస్తారు. ప్రస్తుతం తిరుట్టు విశీల్, షుమ్మవే ఆడువోమ్ అనే 2 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లు కూడా ఆర్ధాంతరంగానే ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాల్లో నటించే ఛాన్స్లతో పాటు కొత్తగా దర్శకత్వం వహించడానికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కాదల్ సుకుమార్ యూట్యూబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలో చైన్నె టీనగర్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఒక నటి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు కాదల్ సుకుమార్ తనను పెళ్లి చేసుకుంటానని, 3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 7 లక్షలు డబ్బుతో పాటు నగలు తీసుకుని మోసం చేశాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సుకుమార్పై కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కాదల్ (ప్రేమిస్తే) సినిమా తెలుగులో కూడా విడుదలైంది. దీనిని దర్శకుడు శంకర్ తన బ్యానర్పై తక్కవ బడ్జెట్తో నిర్మించారు. భరత్, సంధ్యలకు పెళ్లి జరిపించిన స్టీఫెన్ పాత్రలో సుకుమార్ కనిపిస్తాడు. ఈ పాత్రతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచయమేనని చెప్పవచ్చు. -
అలాంటి పాత్రల కంటే ఇది చాలా బెటర్.. సిమ్రాన్ కౌంటర్ 'లైలా' గురించేనా..?
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అతిధి పాత్రతో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ మెప్పించారు. ఆమె నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో, తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సిమ్రాన్ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇందులో సిమ్రాన్ మరో నటి గురించి ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం నాతో పాటు పనిచేసిన ఒక నటికి నేను మెసేజ్ పంపాను. ఆమె నటించిన సినిమా గురించి చెబుతూ ఆ పాత్రలో మిమ్మల్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానన్నాను. ఆపై మీ పాత్ర చాలా బాగుందని కూడా చెప్పాను. దానికి ఆమె నుంచి వెంటనే నాకు తిరిగి సమాధానం వచ్చింది. ఆంటీ రోల్స్లో నటించడం కంటే ఇదే బెటర్ కదా అంటూ ఆమె నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. నేను మంచి ఉద్దేశంతోనే మెసేజ్ చేశాను. కానీ, ఆమె నుంచి నేను అలాంటి సమాధానం ఎప్పుడూ ఊహించలేదు. నేను పంచుకున్నది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు నాకు అనిపించింది. అందుకే ఆమెకు ఇప్పుడు వేదిక మీదుగా సమాధానం చెబుతున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్లో నటించడం కంటే ఆంటీ , అమ్మ పాత్రలలో నటించడం చాలా ఉత్తమం. దేనిని చులకనగా చూడకూడదు' అని సిమ్రాన్ చెప్పుకొచ్చారు. కానీ, ఆమె పెరు వెళ్లడించలేదు.ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించా: సిమ్రాన్2002లోనే తాను 'కన్నతిల్ ముత్తమిట్టల్' (అమృత) సినిమాలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించానని సిమ్రాన్ గుర్తుచేశారు. అప్పుడు తన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే అని ఆమె చెప్పారు. R. మాధవన్కు భార్యగా సిమ్రాన్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.లైలా గురించేనా..?ఈ ఏడాదిలో విడుదలైన శబ్ధం సినిమాలో సిమ్రన్, లైలా ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరో. హారర్ ఎలిమెంట్గా వచ్చిన సినిమాలో డాక్టర్ డయానా పాత్రలో సిమ్రన్ నటించగా.. నాన్సీ డేనియల్గా కీలకమైన పాత్రలో లైలా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ చేసిన కామెంట్లు లైలా గురించే అని కొందరు చెబుతున్నారు.సిమ్రాన్కు సౌత్ ఇండియాలో భారీగానే అభిమానులు ఉన్నారు. 1990, 2000 దశకంలో ఆమె తిరుగులేని హీరోయిన్గా తమిళ, తెలుగు పరిశ్రమలో దుమ్మురేపింది. హీరోల కంటే సిమ్రానే ఫుల్ బిజీగా ఉండేది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన సిమ్రాన్.. కోలీవుడ్లో విజయ్, అజిత్, సూర్య, రజనీకాంత్, కమల్ వంటి స్టార్స్తో మెప్పించారు. Laila ? #Sabdhampic.twitter.com/P8QnoWOEgv— Christopher Kanagaraj (@Chrissuccess) April 20, 2025 -
బాలకృష్ణ కారుకు ఫ్యాన్సీ నంబర్.. ఎన్ని లక్షలో తెలుసా..?
ప్రత్యేక నంబర్లపై తెలంగాణ ఆర్టీఏ నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పోటీ పడ్డారు. రూ.7.75 లక్షలు చెల్లించి ‘టీజీ 09 ఎఫ్0001’ నంబర్ను ఆయన సొంతం చేసుకున్నారు. రీసెంట్గా ఆయన కొన్న బీఎండబ్ల్యూ వాహనం కోసం పోటీపడి ఈ నంబర్ను దక్కించుకున్నారు. రూ.లక్షకు పైబడి పలికిన ఫ్యాన్సీ నంబర్లతో వచ్చిన ఆదాయం వివరాలను జేటీసీ రమేష్ వెల్లడించారు. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో అత్యధిక మొత్తంలో చెల్లించిన వ్యక్తిగా బాలయ్య ప్రథమస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కమలాలయ హిల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పోటీలో రూ.6,70,000 చెల్లించి ‘టీజీ 09ఎఫ్ 0009’ను దక్కించుకుంది. ‘టీజీ09 ఎఫ్ 9999’ నంబర్కు ఎకోడిజైన్ స్టూడియో రూ.99,999 చెల్లించి సొంతం చేసుకుంది. జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’ ‘టీజీ09 ఎఫ్0005’ కోసం రూ.1,49,999 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీజీ09ఎఫ్ 0007’ నంబర్ కోసం కె.శ్రీనివాస్నాయుడు రూ.1,37,779 చెల్లించారు. ‘టీజీ09ఎఫ్ 0019’కు నేత్రావతి బలగప్ప శివాలినిప్ప రూ.60,000 చెల్లించారు. ‘టీజీ 09ఎఫ్ 0099’ కోసం కాన్క్యాప్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.4,75,999 చెల్లించింది. ఖైరతాబాద్ జోన్లో శనివారం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ప్రత్యేక నంబర్లపై రూ.37,15,645 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. కూతురు గిఫ్ట్గా ఇచ్చిన కారుకు కూడా ఇదే నంబర్బాలకృష్ణ వద్ద సుమారు 5కు పైగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. డాకూ మహరాజ్ సినిమా తర్వాత కొన్న కారు కోసమే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్నారు. అయితే, గతేడాదిలో ఆయన కూతురు బ్రాహ్మణి బెంట్లి కాంటినెంటల్ కారుని బాలయ్యకు గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లగ్జరీ కారు ధర రూ.3.30 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం 3.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 329 కి.మీ. ఉంది. ఆయన వద్ద బీఎండబ్ల్యూ 6 సీరిస్ జీటి, మెర్సిడెస్ బెంజ్ GLS 400d, టయోట ఇన్నోవా క్రిస్టా కార్లు ఉన్నాయి. వాటి అన్నింటికి కూడా 0001 ఫ్యాన్సీ నంబర్లే ఉన్నటం విశేషం. -
ప్రముఖ నటుడి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.. 7 వాహనాలు ధ్వంసం
ప్రముఖ తమిళనటుడు బాబిసింహా కారు ఢీకొని ముగ్గురికి గాయాలు కాగా, ఏడు వాహనాలు ధ్వంసం అయిన ఘటన చెన్నై గిండి కత్తిపరా ఫ్లైఓవర్పై కలకలం రేపింది. నటుడు బాబిసింహా వద్ద పెరంబలూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు . శుక్రవారం రాత్రి బాబీ సింహా తండ్రిని ఓ చోట దింపి తిరిగి డ్రైవర్ పుష్పరాజ్ కారులో మనపాక్కంకు వస్తున్నాడు. ఈ క్రమంలో కత్తిపర ఫ్లైఓవర్ నుంచి ఆలందూరు మెట్రో రైల్వే స్టేషన్ వైపు వస్తుండగా లగ్జరీ కారు అదుపు తప్పి వంతెనపై నుంచి మరో రెండు కార్లను, ఆటోను, టూవీలర్ను పిట్టగోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుల్లో ఒకరికి కాలు విరిగగా , మరొకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ యువతి కూడా గాయాలైనట్లు సమాచారం. అలాగే ప్రమాదానికి గురైన కారు, ఆటో నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఆ ఆప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్నసెయింట్ థామస్ మౌంట్ పోలీసులు క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు . కారు డ్రైవర్ పుష్పరాజ్ను ప్రశ్నించగా మద్యం తాగి వాహనం నడిపినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుష్పరాజ్ను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని వారు వెల్లడించారు.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో బాబీ సింహా విలన్గా నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్గా బాబీ మెప్పించారు. -
చెప్పి మరీ నటిని ఇబ్బంది పెడుతున్నారు
సోషల్ మీడియా ఉపయోగించడం ఏమో గానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హ్యాకింగ్ బారిన పడుతుంటారు. నటీనటులు ట్విటర్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు హ్యాక్ అవుతూనే ఉంటాయి. తాజాగా తమిళ నటి ఖుష్బూని హ్యాకర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తరచుగా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఫొటో పోస్ట్ చేయగానే.. సన్నగా మారడానికి ఇంజెక్షన్ తీసుకున్నారా? అని ఓ నెటిజన్ అన్నాడు. దీంతో అతడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.తాజాగా ఖుష్బూ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో ఏమో గానీ యూకేకి చెందిన కొందరు హ్యాకర్స్.. నీ ట్విటర్ ఖాతాని హ్యాక్ చేస్తున్నాం అని ఖుష్బూ వాట్సాప్ కే మెసేజ్ పంపించారు. ఈమె ట్విటర్ ఖాతా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులని ఖుష్బూ ఆశ్రయించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' (Thug Life). మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జింగుచా పాట రిలీజైంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో నటీనటులకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్రిష (Trisha Krishnan) మాట్లాడుతూ.. పెళ్లిపై తనకు నమ్మకం లేదని తెలిపింది. పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా తనకు పర్వాలేదని పేర్కొంది.రెండుసార్లు పెళ్లేంటి?కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం అనుకుంటా.. ఎంపీ బ్రిట్టాస్ నాకు మంచి స్నేహితుడు. చాలామంది కాలేజీ విద్యార్థులు చుట్టూ గుమిగూడినప్పుడు నన్నో ప్రశ్న అడిగాడు. మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నించాడు. మంచి కుటుంబానికి, పెళ్లికి సంబంధం ఏంటి? అని అడిగాను. రాముడి తండ్రిని ఫాలో అవుతా: కమల్అది కాదు.. నువ్వు రాముడిని పూజిస్తావ్.. మరి ఆయనలాగే జీవించాలి కదా అని ప్రశ్నించాడు. దానికి నా సమాధానం ఏంటంటే.. మొదటగా.. నేను ఏ దేవుడినీ ప్రార్థించను. రాముడి అడుగుజాడల్లో అసలే నడవను. అందుకు బదులుగా రాముడి తండ్రి (దశరథుడికి ముగ్గురు భార్యలు) బాటలో నడుస్తాను అని చెప్పుకొచ్చాడు. థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది.కమల్ రెండు పెళ్లిళ్లు- విడాకులుకమల్ హాసన్ 1978లో హీరోయిన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. దశాబ్దకాలం తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి ముందే 1986లో శృతి హాసన్ జన్మించింది. పెళ్లి తర్వాత 1991లో అక్షర హాసన్ పుట్టింది. తర్వాతి కాలంలో కమల్-సారిక బంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. 2002లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2004లొ డివోర్స్ మంజూరయ్యాయి. ఆ మరుసటి ఏడాది నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. 2016లో ఆమెకు బ్రేకప్ చెప్పాడు.చదవండి: సినిమా బాగోలేదని ప్రచారం చేస్తారా?.. విజయశాంతి వార్నింగ్ -
హీరో అజిత్కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్లో అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కారు రేసింగ్లో అజిత్ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్లో జరిగిన రేసింగ్లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అవడంతో అజిత్ సురక్షితంగా బయటకు వచ్చాడు.సినిమాఅజిత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అజిత్ కెరీర్లోనే టాప్ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025 చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
వాళ్లందరూ కేవలం ఫాలోవర్స్ మాత్రమే: పూజా హెగ్డే
సినిమా కళాకారులు సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే. అది వారికి చాలా అవసరం కూడా. అయితే శ్రుతిమించితేనే హాస్యాస్పదంగా మారుతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) ఇలాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా ఆ మధ్య తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్లు ఎదురవడంతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తొలి చిత్రంతోనే అపజయాన్ని మూటకట్టుకున్నారు. అదేవిధంగా పదేళ్ల తరువాత విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం నిరాశ పరిచింది. అలాంటిది మరోసారి ఆయనతో జతకట్టే అవకాశాన్ని అందుకోవడం విశేషం. విజయ్తో జత కడుతున్న జననాయకన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్రం మే 1న తెరపైకి రానుంది. లారెన్స్కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా తమిళంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పూజాహెగ్డేకు ఈ చిత్రాల విజయాలు చాలా అవసరం. అయితే జననాయకన్, రెట్రో చిత్రాలపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో ఒక ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పేర్కొంటూ తనకు ఇన్స్ట్రాగామ్లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని సెల్ఫ్గోల్ కొట్టుకున్నారు. అయితే తన చిత్రాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడు పోతాయన్న నమ్మకం మాత్రం లేదని కూడా చెప్పుకొచ్చింది. కొందరికైతే ఏకంగా 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు.. వారి సినిమాలకు కూడా అంతమంది వెళ్లరని చెప్పింది. వాస్తవంగా పూజాకు కూడా 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కొందరు ప్రముఖులకు 50 లక్షల ఫాలోవర్స్ ఉంటారని, వారి చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందని, సామాజిక మాధ్యమాలు నిజమైన ప్రపంచం కాదని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Shiva Rajkumar), రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమతి ఉమా రమేష్రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్ వెర్షన్ టీజర్ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నిర్మాత రమేష్ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్ జన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్ ,అమితాబచ్చన్లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్ సినిమా అని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి పేర్కొన్నారు. -
సూర్య యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్తా ఎక్కువే!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న తాజా చిత్రం రెట్రో. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుచన్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్లో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కంగువా తర్వాత సూర్య నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెయిన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయితాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. #RETRO CBFC REPORT.Duration: 2hrs 48mins 30secsCertified: U/A #RetroFromMay1 pic.twitter.com/s5T1N6uX8i— Karthik Ravivarma (@Karthikravivarm) April 17, 2025 #Retro (UA) - 2 Hours & 48 Mins 🔥 pic.twitter.com/xK96rp5S7I— Kolly Corner (@kollycorner) April 17, 2025 -
నటుడు ప్రభు పిటీషన్ను కొట్టివేసిన హైకోర్టు
కోలీవుడ్ దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా చైన్నె హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఆయన రెండో కుమారుడు, నటుడు ప్రభు దాఖలు చేసిన పిటీషన్ను తాజాగా కోర్టు కొట్టివేసింది. శివాజీగణేశన్ పెద్ద కొడుకు రామ్కుమార్ వారసుడు దుష్యంత్ నిర్మాతగా మారి 'జగజాల కిల్లాడి' చిత్రాన్ని నిర్మించాడు. అందుకోసం ధన భాగ్యం ఎంటర్ప్రైజెస్ సంస్థ నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా రూ.9.38 కోట్లు చెల్లించాలని నిర్మాత దుష్యంత్కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుష్యంత్ వారి అప్పు చెల్లించలేదు. ఈ కారణంతో శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా కోద్దిరోజుల క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివాజీగణేశన్ ఇంటిపై తనకు ఎలాంటి హక్కులు లేవని దుష్యంత్, తన తండ్రి రామ్కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆ ఇంటి హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని శివాజీగణేశన్ రెండో కుమారుడు, నటుడు ప్రభు కోర్టుకు వెల్లడించారు. ఇంటి జప్తు తీర్పును రద్దు చేయాలని న్యాయస్థానంలో ప్రభు పిటీషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ నటుడు ప్రభు పిటీషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ధనభాగ్యం ఎంటర్ప్రైజస్ సంస్థ తరఫున వాదించిన న్యాయవాది ఇలా చెప్పుకొచ్చారు. చైన్నె వంటి నగరంలో కోట్లు విలువ చేసే ఇంటి హక్కులు శివాజీగణేశన్ పెద్ద కొడుకుకు లేవంటే నమ్మశక్యంగా లేదన్నారు. అసలు ఆ ఇంటి హక్కులు పూర్తిగా నటుడు ప్రభుకే చెందినవా..? అనేది విచారించాలి. అంత వరకు శివాజీగణేశన్ ఇంటి జప్తు తీర్పును రద్దు చేయరాదని ఆయన వాదించారు. దీంతో ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం నటుడు ప్రభు పిటీషన్ను కొట్టి వేసింది. -
అమ్మతోడు.. జైలర్లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్కుమార్
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ (Jailer Movie) వచ్చి రెండేళ్లవుతోంది. అప్పట్లో జైలర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల పర్ఫామెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కుతోంది. జైలర్ 2లో తన ఎంట్రీ ఉందని కన్ఫామ్ చేసేశాడు శివరాజ్కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా కన్నడ చిత్రం 45. వెంటనే ఒప్పేసుకున్నా..ఈ సినిమా ఈవెంట్లో శివరాజ్కుమార్ మాట్లాడుతూ.. జైలర్ సినిమాను రజనీకాంత్ కోసమే చేశాను. చిన్నప్పటినుంచి ఆయన్ను చూస్తూ ఉన్నాను. తను నాకు నా కుటుంబంలోని వ్యక్తిలాగే అనిపిస్తాడు. రజనీకాంత్ సినిమా అనగానే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. ఆయన నాకు తండ్రిలాంటివాడు. అందుకే ఎంత చిన్న పాత్రయినా సరే రెడీ అని చెప్పాను. కథేంటని కూడా అడగలేదు. వాళ్లే పిలిచి మరీ కథంతా చెప్పారు. ఏదేమైనా సరే, నేను యాక్ట్ చేస్తానని భరోసా ఇచ్చాను.అమ్మతోడు.. ఏం చేశానో..కానీ నా లుక్, రోల్ అంత బాగా ఎలా వర్కవుట్ అయిందనేది నాకిప్పటికీ అర్థం కాదు. సినిమా రిలీజయ్యాక దేశవిదేశాల నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అదిరిపోయిందని పొగిడారు. నేను చేసిందే రెండు సీన్లు కదరా అంటుంటే కూడా సూపర్ అని మెచ్చుకున్నారు. అమ్మతోడు.. నేనంత గొప్పగా ఏం చేశానో నాకిప్పటికీ అర్థం కాదు. సిగరెట్ పట్టుకుని నడిచావ్, టిష్యూ డబ్బా తన్నావు.. అంతకుమించి ఏం చేశావ్? అని నా భార్య ఇప్పటికీ దెప్పి పొడుస్తుంది.బహుశా అదే కారణమేమో!బహుశా గుడ్ లుక్స్ వల్ల కావొచ్చు. ఈ విషయంలో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నన్ను బాగా చూపించిన కెమెరామెన్కు థాంక్స్ చెప్తున్నాను. జైలర్ 2లో కూడా నేను కనిపించబోతున్నాను అని పేర్కొన్నాడు. జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ భాగమయ్యారన్న ప్రచారం గురించి తనకేమీ తెలియదన్నాడు.చదవండి: కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్ -
కొత్త లుక్లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
పెరిగిన వయసును పైకి కనిపించకుండా దాచేయాలని చూస్తుంటారు సెలబ్రిటీలు. ఎప్పటికప్పుడు మరింత అందంగా, నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushbu Sundar) కూడా తానింకా పడుచుదాన్నే అంటోంది. కాస్త సన్నబడిపోయి, షిమ్మరీ డ్రెస్తో హెయిర్ లీవ్ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి బ్యాక్ టు ద ఫ్యూచర్ అని రాసుకొచ్చింది.అంతా ఇంజక్షన్ మహిమ!ఇది చూసిన అభిమానులు ఖుష్బూ కొత్త లుక్ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సన్నగా ఎలా అయింది? అయినా ఎంత సన్నబడ్డా నీ ముఖంలో ముసలితనం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఇంకా హద్దులు మీరుతూ.. ఇంజక్షన్ మహిమ వల్లే ఇలా సన్నగా అయిపోయారు. నువ్వేం ఇంజక్షన్ తీసుకున్నావో ఫాలోవర్లకు చెప్పొచ్చుగా! అప్పుడు వాళ్లు కూడా అదే వాడతారు అని విమర్శించాడు.నువ్వో చెండాలం..ఇది చూసిన ఖుష్బూకు ఒళ్లు మండిపోయింది. మీలాంటివాళ్ల బాధేంటో నాకర్థం కాదు. మీరు సోషల్ మీడియాలో కనీసం ముఖాలు కూడా చూపించరు. ఎందుకంటే మీరు ఎంత చెండాలంగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి! పాపం, మీ తల్లిదండ్రుల గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఘాటుగా రియాక్ట్ అయింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఖుష్బూ.. చివరగా వనవాస్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్ చేస్తోంది. అలాగే ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl— KhushbuSundar (@khushsundar) April 15, 2025 చదవండి: ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ సినిమాను అధిగమించింది. డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవనుంది. కాగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీకెండ్ తర్వాత సోమవారం రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసి.. ఐదు రోజుల్లోనే రూ. 101.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్ )కాగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో అలరించదగా.. అర్జున్ దాస్ ప్రతినాయకుడిగా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
కోలీవుడ్లో విషాదం.. ధనుశ్తో సినిమా తీసిన డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్కు చెందిన ఎస్ఎస్ స్టాన్లీ( 57) అనారోగ్య సమస్యలతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 15న వలసరవక్కంలోని విద్యుత్ శ్మశానవాటికలో జరగనున్నాయి.కాగా.. స్టాన్లీ 'ఏప్రిల్ మాధతిల్', 'పుదుకోట్టైయిలిరుండు శరవణ్', 'మెర్క్యురీ పౌక్కల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2000ల దశకంలో పలు కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 'ఏప్రిల్ మాధతిల్' (2002)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ధనుశ్ హీరోగా నటించిన 'పుదుకోట్టైయిలిరుందు శరవణన్' మూవీకి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించడంతో పాటు 'నినైతలే ఇనిక్కుమ్', 'నన్బన్' వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో నటనలోకి అడుగుపెట్టారు. అతను చివరిగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రంలో కనిపించారు. -
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్గా స్టార్ డైరెక్టర్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్ కోసం కూడా వర్క్చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్లో మరింత పాపులర్ అయ్యాడు. అయితే, రీసెంట్గా ఛావా సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్ చాటాడు. అలా వడాపావ్ బండి నుంచి బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది. -
తమిళ భాష కోసం ఏఆర్.రెహ్మాన్ సరికొత్త ప్రయత్నం
ప్రయోగాలకు ప్రసిద్ధి గాంచిన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్(A. R. Rahman ). 1992లో రోజా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ఈయన తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. స్లమ్ డాగ్ మిలీనియం చిత్రానికి గాను ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఈయనకు తమిళ భాషపై అమితమైన ప్రేమ. ఇంతకు ముందే సెంమ్మొళియన్ తమిళ్ మొళి పేరుతో ఆల్బమ్ను రూపొందించి ఖ్యాతి గడించారు. తాజాగా మరో ప్రయోగానికి సిద్దం అయ్యారు. తమిళ భాష కోసం ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించడానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఏఆర్ఆర్ ఇమ్మర్సీవ్ ఎంటర్టెయిన్మెంట్ టీమ్ ముమ్మరంగా పని చేస్తున్నట్లు, డిజిటల్ రూపంలో ఉన్న ఈ తమిళ్ భాషా స్మారక చిహ్నాన్ని త్వరలోనే నిర్మించనున్నట్లు ఏఆర్.రెహ్మాన్ తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
సుందర్ సీ సినిమాలో గ్లామర్తో దుమ్మురేపిన 'కేథరిన్ థ్రెసా'
సినిమా ఏదైనా సరే స్పెషల్ సాంగ్స్ ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంటుంది. ఈ తరహ పాటలకు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ లభించడమే ఇందుకు కారణం. కాగా కోలీవుడ్లో దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే విధంగా ఆయన ఈ తరహా పాటల్లో గ్లామర్ మోతాదును కాస్త పెంచుతారు. ఇటీవల ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అరణ్మణై 4 చిత్రంలో నటి తమన్నా, రాశీఖన్నాలతో అచ్చచ్చో అనే పాటకు వారి గ్లామర్ను బాగా వాడుకున్నారు. ఆ చిత్రం ప్రమోషన్కు ఆ పాట బాగా ఉపయోగపడింది కూడా. తాజాగా ఈ దర్శకుడు మరో హాస్య నటుడు వడివేలుతో కలిసి నటిస్తున్న చిత్రం గ్యాంగర్స్. వీరిది హిట్ కాంబినేషన్ అన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే సుందర్.సీ, వడివేలుల మధ్య మనస్పర్థలు కారణంగా కలిసి నటించి చాలా కాలం అయ్యింది. అలాంటిది 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గ్యాంగర్స్. వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఇందులో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. అదే విధంగా సుందర్.సీ తన భాణిలో ఈ చిత్రంలోనూ ఒక ప్రత్యేక పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటి కేథరిన్ థ్రెసాను(Catherine Tresa) ఆ పాటలో నటింపజేశారు. కోలీవుడ్లో మెడ్రాస్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించారు. అయితే కారణాలేమైనా ఈమె కోలీవుడ్లో నటించి చాలా కాలమే అయ్యింది. అలాంటిది చాలా గ్యాప్ తరువాత గ్యాంగర్స్ చిత్రంలో ఐటమ్ సాంగ్తో సందడి చేశారు. ఈ పాటను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేయగా కుర్రకారు నుంచి విశేష ఆదరణను అందుకుంటోంది. మరి గ్యాంగర్స్ చిత్రానికి ఈ పాట ఏమాత్రం ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది. -
చిన్న కారులో వచ్చి నివాళులు.. విజయ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!
తమిళ హీరో విజయ్ (Vijay) 'జననాయగన్' మూవీతో సినిమాలకు గుడ్బై చెప్పనున్నాడు. ఓ పక్క ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటూనే అటు రాజకీయ నాయకుడిగానూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు. నేడు (ఏప్రిల్ 14) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.సింపుల్గా..ఎటువంటి ఆడంబరం లేకుండా చిన్న కారులో నుంచి దిగి రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. కారు దగ్గరే చెప్పులు వదిలేసి చేతిలో పూలతో నడుచుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని పూలతో అలంకరించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మందీమార్బలం లేకుండా, ఎటువంటి హడావుడి చేయకుండా తన పనేదో తను చేసుకుపోయిన విజయ్ వ్యవహార తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా హీరో అంత సింపుల్గా ఎవరూ ఉండరని కామెంట్లు చేస్తున్నారు.సినిమావిజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా ద గోట్ (The Greatest of All Time)సినిమాలో నటించాడు. ప్రస్తుతం జననాయగన్ మూవీ చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనుంది. ఇది భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్రను తమిళంలో మమిత బైజు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. Exclusive Hd Video Is Here🔥#TheGreatestOfAllTime#JanaNayagan @actorvijay pic.twitter.com/sZnR8VZSQW— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) April 14, 2025 చదవండి: ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్ -
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గత రెండు రోజుల నుంచి తమిళ యంగ్ హీరో శ్రీ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నప్పుడు అందంగా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎముకల గూడులా తయారయ్యాడు. జుత్తుకు రంగేసుకుని అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లోకేశ్ కనగరాజ్ తొలి మూవీ 'మానగరం'లో ఓ హీరోగా నటించిన శ్రీ.. అంతకు ముందు అంటే 2012 నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే చివరగా 'ఇరుగుపట్రు' అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా నిర్మాతలు శ్రీకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని, దీంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఢిల్లీ పారిపోయాడని అంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఇన్ స్టాలో యాక్టివ్ గానే ఉన్న శ్రీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతడిని చూసిన తమిళ ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎందుకంటే అంత దారుణ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఇతడి గురించి తమిళ ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్వీట్ చేశారు.'శ్రీ ఆరోగ్యం కోసం మేం ఆందోళన పడుతున్నాయి. అతడి కుటుంబ సభ్యులతో పాటు మేం కూడా చాలారోజుల నుంచి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయం చుట్టూ చాలా ఊహాగానాలు ఏర్పడటం దురదృష్టకరం. శ్రీని మళ్లీ మామూలు మనిషిని చేయడమే మా తొలి ప్రాధాన్యం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలని నమ్మొద్దు' అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: మోస్ట్ వైలెంట్గా 'హిట్-3' ట్రైలర్) -
లోకేశ్తో సినిమా చేసిన హీరో.. ఇప్పుడిలా అయిపోయాడేంటి?
తమిళ హీరో శ్రీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. శ్రీ అసలు పేరు శ్రీరామ్ నటరాజన్ (Sriram Natarajan). ఫస్ట్ సీరియల్లో నటించాడు. తర్వాత బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్ 18/9 సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ ఘన విజయం సాధించింది. తమిళంలో బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు అందుకుంది. తొలి సినిమాతోనే శ్రీ పెద్ద హిట్ అందుకున్నాడు.ఇలా అయిపోయాడేంటి?తర్వాత ఒనాయుమ్ ఆటకుట్టియుమ్, సోన్ పాపిడి, విల్ అంబు, మా నగరం, ఇరుగపట్రు చిత్రాల్లో నటించాడు. 2023లో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజులకే బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఇతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కచిక్కిపోయి పొడవు జుట్టుతో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నాడు. మానసిక స్థితి?ఇది చూసిన అభిమానులు శ్రీకి ఏమైంది? అని కంగారుపడుతున్నారు. తన మానసిక స్థితి సరిగానే ఉందా? లేదా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడా? అని ఆరా తీస్తున్నారు. కొందరైతే శ్రీతో కలిసి మా నగరం సినిమా తీసిన లోకేశ్ కగనరాజ్ను ట్యాగ్ చేస్తూ శ్రీ గురించి పట్టించుకోమని కోరుతున్నారు. View this post on Instagram A post shared by Shriram Natarajan (@shri_blueticked)చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ థ్రిల్లర్ వఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపపరంగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును చేరుకుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' భారీ అంచనాల థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు మగిజ్ తిరుమేని 'విదాముయార్చి' తర్వాత ఈ ఏడాదిలో అజిత్ కుమార్కి ఇది రెండో మూవీ కావడం విశేషం. ఈ చిత్రం అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, రఘు రామ్, కార్తికేయ కీలక పాత్రలు పోషించారు. -
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv vikram)తో లవ్లో పడిపోయిందని పలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో వారు ముద్దు పెట్టుకున్నట్లు కనిపించడంతో అందరూ నిజమేనని నమ్ముతున్నారు. కొంత కాలంగా డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, అదంతా తప్పుడు ప్రచారం అంటూ మరికొందరు చెబుతున్నారు. అనుపమ, ధ్రువ్ కలిసి ‘బైసన్’ కలిసి మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న బైసన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాలో వారు ప్రేమికులుగా కనిపిస్తారట. ఈ పోటోలు కూడా ఈ చిత్రానికి సంబంధించినవే అంటూ కొందరు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి వారిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఈ కేరళ కుట్టి ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా పరిచయం అయ్యారు. కార్తికేయ 2 వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు పెరిగాయి. దీంతో తమిళం, కన్నడం భాషలో నటిస్తున్నారు. ఇప్పటికీ చేతిలో నాలుగైదు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. రీసెంట్గా నటుడు ప్రదీప్ రంగనాథన్ మూవీ డ్రాగన్లో అనుపమ నటించారు. టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాల ఆరబోతలో శృతిమించారని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. -
సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్.. అమ్మ ఒప్పుకోవట్లే!: ఖుష్బూ కూతురు
కోలీవుడ్ జంట ఖుష్బూ - సుందర్ (Khushbu - Sundar) కూతురు అవంతిక సినిమాల్లోకి రానుందని ప్రచారం ఊపందుకుంది. ఆమె గ్లామరస్గా ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికేసిందని జనాలు ఫీలయ్యారు. తనకు కూడా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆరాటంగా ఉందట.. కానీ ఇంట్లో వాళ్లు తనను లాంచ్ చేసేందుకు సిద్ధంగా లేరంటూ బుంగమూతి పెట్టింది అవంతిక.అమ్మానాన్న రెడీగా లేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అవంతిక సుందర్ (Avantika Sundar) మాట్లాడుతూ.. అమ్మానాన్న నన్ను వెండితెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా లేరు. ఆ మాటకొస్తే వారి చేతులమీదుగా లాంచ్ అవడం నాకూ అంతగా ఇష్టం లేదనుకోండి. కానీ ఎవరో ఒకరు నాకోసం వస్తారు? లేదా నేనే సొంతంగా సినిమాల్లోకి అడుగుపెడతాను అని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారి సహాయసహకారాలు లేకుండా ఇవేవీ సాధ్యపడవు.అమ్మను అడుగుతా..నా పేరెంట్స్ వల్లే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టగలను. వారు నన్ను లాంచ్ చేయడానికి సుముఖత చూపించడం లేదు. నా అంతట నేను ఎదగాలన్నది వారి ఆలోచన. కానీ అందుకు వారి సహాయం కావాలి. కనీసం చిత్రపరిశ్రమకు చెందినవారిని అయినా పరిచయం చేయమని అమ్మను అడుగుతున్నాను. అలా అయినా పరిచయాలు పెంచుకుని నేనేదైనా సాధించగలను. స్టార్ కిడ్గా నాపై ఎక్కువ అంచనాలు, ఒత్తిడి ఉంటాయని పేరెంట్స్ చెప్పారు. నేను వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రిపరేషన్ కోసం లండన్లో డ్రామా స్కూల్కు కూడా వెళ్లొచ్చాను. వాళ్లకంటే ఎక్కువ సక్సెస్?అయితే నా మెదడులో ఒక ఆలోచన ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. నేనేం చేసినా నా పేరెంట్స్తో పోల్చకుండా ఉండలేరు. వాళ్ల కన్నా ఎక్కువ సక్సెస్ అవుతానని నేను చెప్పలేను కానీ నా శక్తి మేర ప్రయత్నిస్తాను. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా.. నాకు ఫెయిల్యూర్స్ అంటే భయం. ఓటమిని తట్టుకోలేను. నా కుటుంబం, ఫ్రెండ్స్ మాత్రం.. ఫలితాన్ని పట్టించుకోకు.. దానికోసం నువ్వెంత కష్టపడ్డావు? అన్నదే ముఖ్యం అని నాకు ధైర్యం చెప్తూ ఉంటారు.చాలాకాలంగా వెయిటింగ్సినిమాల్లోకి రావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా ఎత్తు సమస్యగా మారుతుందేమో అనిపిస్తోంది. నేను 5 అడుగుల 11 అంగుళాల పొడవున్నాను. ఒక నటి ఎలా ఉండాలో అలా లేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడైతే లావుగా కూడా ఉన్నాను. అప్పుడు స్క్రీన్పై హీరోయిన్లను చూసి నేను కథానాయికగా పనికి రాను అనుకున్నాను. కరోనా సమయంలో ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి ఇలా మారిపోయాను అని అవంతిక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by avantika (@avantikasundar)చదవండి: విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు -
నేడు మధ్యాహ్నం ఓటీటీలోకి రానున్న ఫాంటసీ మూవీ
కోలీవుడ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన చిత్రం 'కింగ్స్టన్' నేడు ఓటీటీలోకి రానుంది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.భారతదేశపు మొట్టమొదటి సముద్ర ఫాంటసీ చిత్రంగా 'కింగ్స్టన్' గుర్తింపు తెచ్చుకుంది. మంచి విజువల్ ఎక్సిపీరియన్స్ పొందాలని ఉంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు. నేడు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జీ5 వేదికగా తమిళ్, తెలుగు వర్షన్స్లలో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.కింగ్స్టన్ కథేంటి..?కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే. -
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం. దర్శకుడు అరుణ్ కుమార్ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్ సేతుపతి రమ్య నంబీస్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్ డ్రామా హిట్ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్కుమార్ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్ స్టేటస్గా పోస్ట్ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్ పద్మినియుమ్ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్ కుమార్ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ వైఖరి నిజంగా మెచ్చదగింది. ఒక హిట్ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి. -
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
శివకార్తికేయన్( Sivakarthikeyan).. ఈ పేరు ఇప్పుడు విజయాలకు కేరాఫ్గా మారిందనే చెప్పాలి. అయిలాన్, మావీరన్, అమరన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి మదరాసి. తమిళంలో కొంత గ్యాప్ తరువాత దర్శకుడు ఏఆర్.మురుగదాస్( A.R. Murugadoss) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఇందులో విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజూ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలో దర్శకుడు మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా సికిందర్ చిత్రాన్ని చేసే అవకాశం రావడంతో మదరాసి చిత్ర షూటింగ్లో జాప్యం జరిగిందనే ప్రచారం జరిగింది. కాగా సికిందర్ చిత్రం ఇటీవల తెరపైకి రావడంతో దర్శకుడు మురుగదాస్ మదరాసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సెపె్టంబర్ 5న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన సూపర్హిట్ చిత్రం అమరన్ తరువాత మదరాసి చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.