-
ముగిసిన హోం ఓటింగ్
కామారెడ్డి క్రైం: జిల్లాలో రెండు రోజుల పాటు కొనసాగిన హోం ఓటింగ్ ఆదివారం ముగిసింది. 85 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దే వినియోగించుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ కానిస్టేబుల్తో కూడిన బృందం ఓటర్ల ఇంటికి వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేయించారు. కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులు పలువురు ఆదివారం రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాకు చెందిన 4,546 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలీస్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వీరికోసం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంతోపాటు మద్నూరు, ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. శని, ఆదివారాలలో పీవోలు, ఏపీవోలు, పోలీసు అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇతర పోలింగ్ సిబ్బంది సోమ, మంగళ వారాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. -
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
సాక్షి, కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సత్తా చాటింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 2014 పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలను కై వసం చేసుకుంది. 2019లో నిజామాబాద్ను కోల్పోయినా జహీరాబాద్లో మాత్రం గులాబీ జెండానే ఎగిరింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు కారుదిగినా.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయాక గయారాంలు ఎక్కువయ్యారు. పదవులు అనుభవించినవారూ పార్టీని వీడుతుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో గెలవడం ద్వారా సత్తా చాటాలని, పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం ఆరాటపడుతోంది. అయితే ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం నిజామాబాద్లో, మంగళవారం కామారెడ్డిలో జరిగే కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్షోలపై ఆ పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. బీబీ పాటిల్ టార్గెట్గా.. రెండుసార్లు కారు గుర్తుమీద పోటీ చేసి విజయం సాధించిన బీబీ పాటిల్.. బీజేపీ గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ఎంపీగా గెలిపించుకుంటే కష్టకాలంలో పార్టీని వీడివెళ్లడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం బీబీ పాటిల్ను టార్గెట్గా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధేలు బీబీ పాటిల్పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న పాటిల్ చేసిందేమీ లేదని, కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపిస్తున్నారు. బీబీ పాటిల్ ఓటమే లక్ష్యంగా చెమటోడుస్తున్నారు. జన సమీకరణకు కసరత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించే రోడ్షోలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు మంగళవారం కామారెడ్డిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ఏ గ్రామం, ఏ పట్టణం నుంచి ఎంత మందిని తరలించాలన్న దానిపై నేతలకు టార్గెట్లు ఇచ్చారు. జన సమీకరణకు ఆయా గ్రామాలు, వార్డులకు ఇన్చార్జీలను నియమించారు. జిల్లా కేంద్రంలో భారీ జన సమీకరణతో క్యాడర్లో జోష్ తేవడంతో పాటు ఓటర్లలోనూ ఆలోచన తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారు.కామారెడ్డి జిల్లా రద్దవుతుందన్న అంశంపై బీఆర్ఎస్ నేతలు ఫోకస్ చేస్తున్నారు. జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో జిల్లా రద్దవుతుందన్న అంశాన్ని ఫోకస్ చేయడం ద్వారా జనం మద్దుతు పొందడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. బస్సు యాత్రలో స్థానిక అంశాలపై కేసీఆర్తో మాట్లాడించడం ద్వారా శ్రేణుల్లో జోష్ తీసుకురావాలని ఆ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. నేడు నిజామాబాద్లో.. రేపు కామారెడ్డిలో బస్సు యాత్ర రోడ్ షోలకు ప్లాన్ చేసిన బీఆర్ఎస్ నేతలు భారీ జన సమీకరణతో శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం -
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
కామారెడ్డి అర్బన్: అన్ని గ్రామాల్లో నిత్యం యజ్ఞ సహిత యోగా కార్యక్రమాలను నిర్వహించడాన్ని ప్రోత్సహించాలని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావు సూచించారు. జిల్లా యోగా భవన్లో ఆదివారం ద్విశత కుండీయ మహావేద యజ్ఞం నిర్వహించారు. జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. అనంతరం శ్రీధర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశం కోసం ఓటు వేయాలని సూచించారు. దీనిని బాబా రాందేవ్ పిలుపుగా భావించాలన్నారు. సహస్ర కుండీయ యజ్ఞం లక్ష్యంగా సంకల్పం చేయాలని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా యోగా స్ట్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రాంరెడ్డి, యోగాచార్యులు జి.అంజయ్య గుప్తా, కిషోర్, శ్రీమతి, యోగా అసోసియేషన్ ప్రతినిధులు బి.రఘుకుమార్, పి.అంజయ్య, అనిల్రెడ్డి, రామ ముని, రాజారెడ్డి, ఆర్యసమాజ్ ప్రతినిధులు సత్యమిత్ర ఆర్య, ఇప్పకాయల నర్సయ్య, అర్వపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావు -
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతంలో నిర్మల్ జిల్లా నేరడిగొండవాసి హత్యకు గురయ్యాడు. ఆదివారం నేరడిగొండ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన గంగయ్య (35) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ఫోన్ రికార్డులను పరిశీలించారు. మిస్సింగ్ అయిన తర్వాత చివరగా ఎవరితో మాట్లాడారో తెలుసుకొని నిజామాబాద్ నగరంలోని ఐదోటౌన్ పీఎస్ పరిధిలోని నివాసిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు నేరడిగొండ వాసి మల్లారం ప్రాంతంలో చనిపోయాడని తెలుపడంతో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తిని కాల్చివేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవడంతో కాల్చివేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తెలిపాడు. ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు కాల్చివేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నేరడిగొండ వాసికి నిజామాబాద్ వాసికి సోషల్ మీడియాలోని ఓ ఆన్లైన్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కాగా నేరడిగొండ వాసి హత్యకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. -
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
తెయూ(డిచ్పల్లి) : వార్షిక అనుబంధ గుర్తింపు తనిఖీ సందర్భంగా సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ అధికారులు వివరణ కోరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. తెయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల గుర్తింపు తనిఖీలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 7న విడుదల చేశారు. తనిఖీల సందర్భంగా ఆయా కళాశాలలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ల్యాబ్ పరికరాలు, లైబ్రరీ కోసం కొనుగోలు చేసిన పుస్తకాల బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపుల రికార్డులు సిద్ధంగా ఉంచాలని వర్సిటీ అధికారులు పలుమార్లు కాలేజీలకు సూచించారు. సమాచారం ఇచ్చినా.. తనిఖీలు ఏప్రిల్ 25 నుంచి మొదలవుతాయని ఏప్రిల్ 2న మరోసారి వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలకు ఆడిట్ సెల్ అధికారులు సమాచారాన్ని అందించారు. శనివారం (మే 4న) ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తనిఖీలకు వచ్చిన వర్సిటీ అధికారులకు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అసంపూర్తిగా సమాచారాన్ని ఇవ్వడంతో వారు అసహనానికి గురయ్యారు. తమకు శనివారం ఉదయం వరకు తనిఖీల సమాచారం లేదని, ప్రిన్సిపాల్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిబ్బంది చెప్పడంతో వర్సిటీ అధికారులు అవాక్కయ్యారు. అయితే అప్పటికప్పుడు కనీసం ఎవరికై న ఇన్చార్జి ఇవ్వాలని కోరినా ప్రిన్సిపాల్ నుంచి స్పందన కరువైంది. సుమారు రెండు గంటల తర్వాత ప్రిన్సిపాల్ చెప్పారని ఆడిట్ సెల్ డైరెక్టర్కు కాకుండా తనిఖీ బృందంలోని మరో అధికారికి కాలేజీ పార్ట్ టైం ఉద్యోగి లేఖ ఇవ్వగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. అధికారుల ఆగ్రహం అడ్మిషన్ రిజిస్టర్ అసంపూర్తిగా ఉందని, లైబ్రేరియ న్ అందుబాటులో లేడని, ఉన్న సిబ్బంది వర్సిటీ అధికారులు అడిగిన వాటికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్సిటీ అధికారులు ప్రిన్సిపాల్ను వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రిన్సిపాల్ వైఖరి ఎప్పుడూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటుందని తనిఖీ బృందం సభ్యులు ఒకరు చెప్పారు. ప్రిన్సిపాల్ గైర్హాజరు, నిర్లక్ష్య వైఖరిపై కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్యసంకేతాలు..
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
వాహనాల తనిఖీ
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
శిల్ప సంపద అద్భుతం
పోలింగ్ సమయం గంట పెంపు
గ్రామాల్లో హోం ఓటింగ్
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement