-
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం!
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు కౌన్సిలర్లు శనివారం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరడంతో 11 మంది కౌన్సిలర్లు గత నెల 24న అవిశ్వాసం నోటీసును కలెక్టర్కు అందించారు. దీంతో శనివారం అవిశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆర్డీవో ప్రభాకర్ను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అవిశ్వాస పరీక్షను నిర్వహించారు. అవిశ్వాస తీర్మాన నోటీసులను అందించిన 11 మంది కౌన్సిలర్లు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈనెల 13న రాత్రి క్యాంపునకు తరలివెళ్లారు. క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి వచ్చిన వారు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. వీరిలో 9మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. కాగా అవిశ్వాస తీర్మానం ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు సూచించడంతో అధికారులు వివరాలు తెలుపలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ చాంబర్కు అధికారులు తాళం వేశారు. అవిశ్వాసం నెగ్గడంతో కార్యకర్తలు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. తీర్మానానికి మద్దతు తెలిపిన 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించని అధికారులు -
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : ఇంటర్, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్, జూన్ 3 నుంచి 13 పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 29 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించామన్నారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు కామారెడ్డి, బాన్సువాడ మండల కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచించారు. ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, సభ్యులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య, డీఈవో రాజు, ఇన్చార్జి డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, ఆర్టీసీ డీఎం ఇందిర పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలివర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. త్వరితగతిన ధాన్యం మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ప్రతిరోజు మాట్లాడాలన్నారు. లారీలు ఏర్పాటు చేసి మిల్లులకు ధాన్యం తరలించాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఇన్చార్జి సూపరింటెండెంట్గా కల్యాణి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయ ఇన్చార్జి సూపరింటెండెంట్గా అమరేష్ కల్యాణిని నియమిస్తూ ఇన్చార్జి డీఎంహెచ్వో చంద్రశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్నాయక్పై పలు ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జిని నియమించారు. ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు. ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చాలి కామారెడ్డి క్రైం : కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను రవాణా శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు సమకూర్చాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. ధాన్యం రవాణాపై కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే లారీలు ఏర్పాటు చేసి మిల్లులలో అన్లోడ్ అయ్యేలా సహకరించాలని కోరారు. డీఎస్వో మల్లికార్జున్ బాబు, సివిల్ సప్లయ్ ఇన్చార్జ్ డీఎం నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. ఈఏపీసెట్లో ప్రతిభ కామారెడ్డి టౌన్ : ఈఏసీసెట్ ఫలితాల్లో జి ల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటా రు. జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాల లో చదివిన అమూల్యరెడ్డి 817వ ర్యాంకును సాధించింది. మాచారెడ్డి మండలం అన్నా రం గ్రామానికి చెందిన అమూల్యరెడ్డి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవడమే తన లక్ష్యం అన్నారు. పట్టణానికి చెందిన పందిరి శరత్చంద్ర 4,175 ర్యాంకు సాధించాడు. ఇంజినీర్ కావడమే తన లక్ష్యం అని తెలిపా డు. విద్యార్థులను కళాశాల యజమాన్యం అభినందించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు కామారెడ్డి టౌన్ : వ్యాపారులు ప్రజల ప్రా ణాలతో చెలగాటం ఆడొద్దని కామారెడ్డి ఆ హార భద్రతా అధికారి సునిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హోటళ్లు, స్వీట్ దు కాణాలను ఆమె తనిఖీ చేశారు. వంట గదు లు అపరిశుభ్రంగా, కాలం చెల్లిన తినుబండారాలు, కుళ్లిన ఆహార పదార్థాలు ఉండటంతో యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసి, జరిమానాలు విధించారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపారు. తనిఖీల్లో ఫు డ్ ఇన్స్పెక్టర్ శిరీష, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం బీబీపేట : వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొ నుగోలు చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లారీల కొరత, మిలర్ల తీరుతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని పేర్కొ న్నారు. అయినా రైతులకు ఇబ్బందులు కల్గకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నామ ని తెలిపారు. మరో వారం రోజుల్లో కొనుగో లు ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన అ న్నారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు అందుబాటులో ఉండి ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డైరెక్టర్ మల్లేశం, రైతు లు రాజ మల్లయ్య, కిషన్రావు పాల్గొన్నారు. -
ఇల వైకుంఠపురంలో..
● ఎక్కడ స్థిరపడ్డా సొంతూరిలో ఇల్లు ● రూ.లక్షలు ఖర్చు చేసి ఆధునిక హంగులతో నిర్మాణం ● రాజ భవనాలను తలపిస్తున్న గృహాలు సకల సౌకర్యాలతో..వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఎండ తీవ్రత కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. ప్రిలిమ్స్కు ఏర్పాట్లు చేయండిగ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. – 9లో uఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024– 8లో uపశువైద్యాధికారి విజయ్కుమార్ మద్నూర్లో నిర్మించిన డూప్లెక్స్ ఇల్లుజర్మనీలో ఉంటున్న అడిపేవార్ ప్రవీణ్ మద్నూర్లో కట్టిన ఇల్లుసాక్షి, కామారెడ్డి : బతుకు దెరువు కోసం ఊరు వదిలి వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారు స్వగ్రామంపై మమకారం మరవడం లేదు. పల్లెను వదిలివెళ్లినా వారి మనసులు పుట్టి పెరిగిన ఊరి వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. పట్టణాలు, నగరాలే గాక విదేశాల్లో స్థిరపడిన వారు సైతం సొంతూరిలో మనకంటూ ఓ ఇల్లు ఉండాలి అనుకుంటున్నారు.. దీంతో సకల హంగులతో రాజభవనాల్లంటి ఇళ్లను గ్రామాల్లో నిర్మించుకుంటున్నారు. సకల సౌకర్యాలతో మెట్రో సిటీలకు ధీటుగా భవనాలు కట్టుకుంటున్నారు. అమెరికా, ఆ స్ట్రేలియా, జర్మనీ, యూకే తదితర దేశాల్లో సాఫ్ట్వేర్, వైద్య రంగం, వ్యాపార రంగాల్లో జిల్లాకు చెందిన ఎంతో మంది స్థిరపడ్డారు. అక్కడ ఉన్నత స్థాయికి ఎదిగిన వారున్నారు. కొందరు సొంతూరిపై మమకారంతో తమవంతుగా ఊరి అభివృద్ధికి సాయం అందిస్తున్నారు. పేద పిల్లల చదువులకు చేయూతనిస్తున్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారు కూడా సొంతూరికి ఎంతో కొంత చేస్తున్నారు. అయితే ఎప్పుడో తాతల నాడు కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరిపోవడం, అప్పట్లో అవసరాల కోసం ఇళ్లు అమ్ముకోవడం.. ఇలా సొంతూరిలో ఇల్లు లేని ఎంతో మంది ఇటీవలి కాలంలో కొత్తగా భవనాలు నిర్మించుకుంటున్నారు. పండగలకు.. సొంతూరిలో ఇల్లు నిర్మించుకున్నవారు పండుగలు, పబ్బాలకు అక్కడికి వస్తున్నారు. వారం రోజులు సెలవులు దొరికితే చాలు వచ్చి వాలుతున్నారు. సొంతూరి వాళ్లతో స్నేహసంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు విదేశాల్లో ఉంటుండగా తమ తల్లిదండ్రులు ఊళ్లోనే ఉంటామని అంటే అక్కడే ఉంచేస్తున్నారు. వాళ్ల కోసమైనే ఏడాదికోసారైనా ఊరికి వస్తున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లకు ముందు స్వగ్రామానికి వచ్చి గ్రామ దేవతలకు పండగలు చేస్తున్నారు. ఊరితో తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి బలోపేతం చేసుకుంటున్నారు. ఊరిలో ఆధునిక వ్యవసాయం చేయడం, వ్యాపారంలో రాణించడం ద్వారా ఆర్థికంగా ఎదిగివారు సైతం ఆధునిక హంగులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు.మద్నూర్లో వేదప్రకాశ్ పటేల్ డూప్లెక్స్ ఇల్లు లింగంపేటలో హైకోర్టు న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రీ ఇల్లు న్యూస్రీల్విదేశాలు, వివిధ నగరాలతో పాటు ఊరికి స మీపాన ఉన్న పట్టణాల్లో స్థిరపడినవారు సైతం సొంతూరిలో పాత ఇల్లు ఉంటే కూల్చి కొత్తది కడుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మితమైన ఆధునిక సౌధాల గురించి ‘సాక్షి’ పరిశీలించగా చాలా మంది ఇతర ప్రాంతా ల్లో స్థిరపడ్డవారు సొంతూరిలో రూ. లక్షలు ఖర్చు చేసి భవంతులు నిర్మించుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్, ఆధునిక కిచెన్, గార్డెన్, ఫర్నీచ ర్, ఎలివేషన్, కాంపౌండ్ వాల్, గీజర్లు, సోలార్ పవర్... ఇలా అన్ని సమకూరుస్తున్నారు. కొందరైతే రూ. 50 లక్షల నుంచి రూ. కోటికిపైగా ఖర్చు చేసి ఇల్లు కట్టు కుంటున్నారు. కొన్ని ఇళ్లు రాజభవనాలను తలపిస్తున్నాయి. -
అమ్మకానికి అవస్థలే..
దోమకొండ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. లారీల కొరతతో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు అకాల వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 350 కొనుగొలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. అయితే కొనుగోళ్లు ప్రారంభం అయిన నాటినుంచే వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసి పోవడంతో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. పగలు ధాన్యాన్ని ఆరబెట్టగానే వాన వస్తుంది. దీంతో వడ్లు పూర్తిగా ఎండక మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా వేగంగా వడ్లు కొనాలని కోరుతున్నారు. తూకంలో మోసాలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకంలో సైతం మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తరుగు పేరిట బస్తాకు రెండు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరో వైపు మిల్లుల్లో సైతం కోతలు పెడుతున్నారని రైతులు అంటున్నారు. సంఘమేశ్వర్లో ధాన్యం కుప్పల చుట్టూ చేరిన నీరు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలుఇబ్బందులు లేకుండా చూస్తాం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి కొనుగొలు కేంద్రానికి రెండు లారీల చొప్పున అందుబాటులో ఉంచాం. ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లుల కు తరలించడానికి ఏర్పాట్లు చేశాం. – మల్లికార్జున్బాబు, సివిల్సప్లయ్ అధికారి 20 రోజులైనా కొంటలేరు కొనుగొలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు అవుతుంది. తరచూ వర్షం పడటంతో వడ్లు ఎండటం లేదు. లారీలు రావ డం లేదని కాంటా చేయడం లేదు. వర్షానికి వడ్లు నాని మొలకలు వస్తున్నాయి. – లక్ష్మి, రైతు, సంఘమేశ్వర్ -
వేధింపుల కేసులో డీఎంహెచ్వో అరెస్ట్
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ను దేవునిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయనపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఆయనను గురువారం కోర్టు లో హాజరుపరిచామని కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు తెలిపారు. న్యాయమూర్తి షరతు లతో కూడిన బెయిల్ ఇచ్చారన్నారు. డీఎంహెచ్ వో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్పైనా కేసు నమోదయ్యింది. అయితే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదు.హైదరాబాద్కు బాధితులు.. డీఎంహెచ్వో వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ జిల్లాలోని పీహెచ్సీలలో పనిచే స్తున్న మహిళా వైద్యులు ఇటీవల కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితోపాటు ఎస్పీకి ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ బుధవారం కా మారెడ్డికి వచ్చి విచారణ జరిపారు. వైద్యుల నుంచి వివరాలను నమోదు చేసుకుని వెళ్లిపోయారు. విచారణ జరిగిన మరుసటి రోజే వై ద్యులు ఉన్నతాధికారులను కలిసేందుకు హై దరాబాద్కు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూతో పా టు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ రవీందర్ నాయక్లను కలిసి సమస్యను వివరించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అందుబాటులో లేరని తెలిసింది. డీఎంహెచ్వో లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మ హిళా హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసును నీరు గా ర్చడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన మహిళా వైద్యులతోపాటు వారి భర్తలకు ఫోన్ చేసి రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటు న్న వైద్యాధికారిపై చర్యల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ డీఎంహెచ్వో లైంగిక వేధింపుల వ్యవహారంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురైతే ఈ కమిటీ విచారణ జరుపుతుంది. జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఐసీడీఎస్ పీడీతో పాటు మరో ఇద్దరు మహిళా అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్ర లేదా శనివారాల్లో బాధిత మహిళా వైద్యులతో పాటు, డీఎంహెచ్వో, సూపరింటెండెంట్లను వేరువేరుగా విచారించనుంది. అనంతరం విచారణ నివేదికను కలెక్టర్కు అందిస్తారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధిత వైద్యులు జిల్లాలో కలకలం రేపిన వైద్యాధికారి వ్యవహారం -
‘కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలి’
కామారెడ్డి క్రైం: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం రెవె న్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు రోజు ల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం రాశుల ను ఎప్పటికప్పుడు తూకం వేసి మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అవస రమైన టార్పాలిన్లను రైతులకు అందించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. లారీలను 24 గంటలలోగా అన్లోడ్ చేసుకోవాలని రైస్మిల్లులకు సూచించారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 42,142 మంది రైతుల నుంచి రూ.526 కోట్ల విలువైన 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో రూ. 441 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మల్లికార్జున బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వడ్లకు బోనస్ ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ప్రకటించాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై గురువారం కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత హామీని మర్చిపోయిందన్నారు. ఇప్పుడు సన్న రకం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ మాట మారుస్తోందని ఆరోపించారు. రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. వెంటనే దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వడ్లకు బోనస్ ఇచ్చేంతవరకు పోరాడుతామన్నారు. ఆందోళనలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేంకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, కుంబాల రవి యాదవ్, గెరిగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ -
పేరుకే మండలం!
సొంత భవనాలేవి?తహసీల్ ఆఫీసులు మాత్రమే..సాక్షి, కామారెడ్డి : పరిపాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు కోసం అధికారిక ప్రక్రియ అంతా పూర్తి చేసి గెజిట్ కూడా విడుదల చేశారు. మంజూరైన మండలాల్లో తహసీల్ కార్యాలయాలను ప్రారంభించారు. ఆ తర్వాత అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు. మండల పరిషత్ కార్యాలయాలు గానీ, పోలీసు స్టేషన్లు గానీ, మండల విద్యాశాఖ కార్యాలయాలు గానీ ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఆయా సేవల కోసం పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. అప్పుడు ఏర్పాటు చేసిన మండలాలు, డివిజన్లు, జిల్లాల్లో అన్ని విభాగాలకు సంబంధించి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు నిర్మాణాలు మొదలుపెట్టినా మెజారిటీ మండలాలు, డివిజన్లలో ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలోనూ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి డిమాండ్లు రావడంతో అప్పటి ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త మండలాలను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో డోంగ్లీ, పల్వంచ, ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, పొతంగల్, మహ్మద్నగర్ మండలాలు ఏర్పాటయ్యాయి. డోంగ్లీ రైతు వేదికలో ఏర్పాటు చేసిన తహసీల్ కార్యాలయం ఉమ్మడి జిల్లాలో ఏడు కొత్త మండలాల ఏర్పాటు రెవెన్యూ సేవలు మాత్రమే అందుబాటులో.. ఇప్పటికీ ఏర్పాటు కాని పోలీసు స్టేషన్, మండల పరిషత్లు పూర్తి స్థాయి సేవలు అందేదెప్పుడో? ప్రభుత్వం పాలనను ప్రజలకు చేరువ చేయడానికి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో బీబీపేట, రామారెడ్డి, రాజంపేట, పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, ఎర్గట్ల, మెండోరా, ముప్కాల్, ఇందల్వాయి, మోపాల్, రుద్రూర్, మోస్రా, చందూర్ తదితర మండలాలను ఏర్పాటు చేశారు. ఒకటి రెండుచోట్ల ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. మిగతా మండలాల్లో ఎలాంటి నిధులు రాలేదు. దీంతో మండలాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన భవనాల్లో కార్యాలయాలను నడిపిస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. ఇటీవలి కా లంలో ఏర్పా టు చేసిన కొ త్త మండలా ల్లో తహసీల్దార్ కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చే శారు. ఆ కార్యాలయాల లో భూములు రిజిస్ట్రేషన్లు చేప ట్టడం, అవసరమైన కుల, ఆదాయ, నివా స ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వంటి పను లు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఉపాధి వంటి పనులకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడంతో కొత్త మండలాల ప్రజలు పాత మండల కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. కొత్త మండలం ఏర్పాటుతో పాల న తమకు దగ్గరైందని మురిసిపోయిన ప్రజలు.. మండల పరిషత్ కార్యాలయం గానీ, పోలీసు స్టేషన్ కానీ ఏర్పాటు కాకపోవడంతో పాత మండల కేంద్రానికే వెళ్తున్నారు. విద్యాశాఖ కార్యాలయం కూడా ఏర్పాటు కాలేదు. మండల వ్యవస్థలో రెవెన్యూకు సంబంధించి తహసీల్ కార్యాలయం, అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలకు సంబంధించి మండల పరిషత్ కార్యాల యం, శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు స్టే షన్, పాఠశాలలకు సంబంధించి విద్యా వనరుల కేంద్రాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా మండ ల వ్యవసాయ అధికారి, మండల విద్యుత్ అధికారి (ఏఈ), మండల వ్యవసాయ అధికారి, నీటి పారుదల, పంచాయతీరాజ్, తాగునీటి పర్యవేక్షణకు సంబంధించి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉంటా యి. కానీ కొత్త మండలాల్లో ఒక్క రెవెన్యూ సేవలు మాత్రమే అందుతున్నాయి. మిగతా సేవలకోసం పాత మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆయా శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘దోస్త్’లో తొలి ప్రాధాన్యత ఇవ్వండి
కామారెడ్డి అర్బన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశకోసం వె బ్ ఆప్షన్లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రిన్సిపాల్ కే.విజయ్కుమార్ విద్యార్థులను కోరారు. గురువారం ఆయన క ళాశాల 60 సంవత్సరాలుగా అందిస్తున్న బహుము ఖ విద్యాసేవలను వివరించే బ్రోచర్ను విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కా మారెడ్డి డిగ్రీ కళాశాలలో చదివినవారు ఐఏఎస్, ఐ పీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ వన్ అధికారు లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఆర్మీ అధికారులు, డాక్టర్లు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, టీచర్లు, పా రిశ్రామికవేత్తలు, నాయకులు, వృత్తి నిపుణులు, ఉ పాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. న్యాక్ ఏ గ్రే డ్ గుర్తింపుతో పాటు అటానమస్ కలిగి అనేక ప్రత్యే క కోర్సులున్నందున విద్యార్థులు ఈ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్ దోమకొండ/బీబీపేట: కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలన్నారు. అవసరమైనన్ని లారీలను కేంద్రాలకు పంపాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసుకోవాలని రైస్మిల్లర్లకు సూచించారు. తహసీల్దార్లు, ఆర్ఐలు, సూపర్వైజరీ అధికారులు దగ్గరుండి కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్చార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, తహసీల్దార్ సంజయ్రావ్, సివిల్సప్లయ్ అధికారి కిష్టయ్య తదితరులున్నారు. -
ఆటో, బైక్ ఢీ : ఒకరికి గాయాలు
రెంజల్: మండలంలోని కిసాన్తండా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ సాయికుమార్ ద్విచక్ర వాహనంపై నవీపేట్ నుంచి కూనేపల్లి గ్రామానికి వస్తుండగా కూనేపల్లి నుంచి నవీపేట్కు వెళ్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో సాయికుమార్కు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు ఢీకొని ఒకరికి..మోపాల్: మండలంలోని మంచిప్ప శివారులో గల గండి మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో సింగంపల్లికి చెందిన రషీద్కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రషీద్ గ్రామాలు తిరుగుతూ పాత సామగ్రిని సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో బుధ వారం శ్రీరాం నగర్ తండాలో తిరిగి మంచిప్ప రో డ్డు పైకి వస్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో రషీద్కు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.రషీద్ బావ షేక్ గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ నందిపేట్: మండలంలోని సీహెచ్ కొండూర్ ఎత్తిపోతల పథకం మొదటి పంప్హౌస్ వద్ద గల సబ్స్టేషన్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎత్తిపోతల కమిటీ సభ్యులు పంపుహౌజ్లోని మోటార్లను పరిశీలించేందుకు మొదటి పంపుహౌజ్ వద్దకు వెళ్లారు. ప క్కనే గల సబ్స్టేషన్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వ్య ర్థ సామగ్రి పడడంతో అనుమానం వచ్చి చూడగా ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపరు వైరు, ఆయిల్ గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గమనించారు. సబ్స్టేషన్ బయట కాపర్ వైరు ఉండే సామగ్రి పడేశారు. తల్వేద ఎత్తిపోతల కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై రాహుల్ను సంప్రదించగాస్పందించలేదు. బోధన్లో మృతదేహం లభ్యంబోధన్టౌన్: బోధన్ శివారులోని బాబా గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి మృతదేహం లభిందని పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. వివరాలు.. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన శంకర్(45) ఈ నెల 8న ఇంట్లో నుంచి వెళ్లాడు. మంగళవారం రాత్రి పట్టణ శివారులో కుళ్లిన స్థితిలో శంకర్ మృతదేహం లభించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్ ఫిట్స్ వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శంకర్ కొద్దిరోజుల క్రితం బాబా గార్డెన్ వద్దగల హోటల్లో పనిచేశాడని చెప్పారు. మృతుడికి భార్య అమిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
భార్యపై దాడి చేసిన భర్తపై కేసు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన ఉబ్బి పూజితపై దాడి చేసిన ఆమె భర్త సాయిబాబాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. వివరాలు.. ఈ నెల 2న పూజిత, సాయిబాబా మధ్య గొడవ జరిగింది. దీంతో సాయిబాబా తన భార్య పూజితపై పైపుతో దాడి చేసి గాయపర్చాడు. పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి వద్ద పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న దాదాపు పది క్విటాంళ్లు బియ్యం పట్టుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఆటో డ్రైవర్, క్లీనర్ను ఆదుపులోకి తీసుకుని విచారణ జరుతున్నట్లు పేర్కొన్నారు. -
డెంగీ నివారణకు కదులుదాం
నిజామాబాద్నాగారం: డెంగీతో ఎంతో మంది మంచాన పడుతున్నారు.. మరికొంతమంది భయంతో చనిపోతున్నారు. జిల్లాలో డెంగీ కేసులు జనవరి నుంచి ఇప్పటి వరకు 115 నమోదయ్యాయి. గతేడాది 356 కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నివారణకు జాగ్రత్తలు అవసరం. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా కథనం.. వ్యాధి లక్షణాలు ● డెంగీ వ్యాధి ఎడిస్ దోమ కుట్టడంతో వ్యాప్తి చెందుతుంది. ● తీవ్రమైన జ్వరం రావడం, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ● కళ్ల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు రావడం, వికారం, వాంతులు. ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎలీసా’ పద్ధతిలో జరిపే రక్త పరీక్ష ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారించవచ్చు. ● ఏడిస్ దోమలు ఎక్కువగా పగలు కుడతాయి. ఈ దోమలు ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ● నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలి. ● ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తోట్ల మీద మూతలు పెట్టాలి. ● ఇళ్లలోకి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి. ● ప్రభుత్వం డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ● వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి నేడు అవగాహన ర్యాలీ జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రజ లకు అవగాహన కల్పించడానికి గురువారం అ వగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. దోమల నివా రణకు ప్రతి శుక్రవాం డ్రైడేగా పాటిస్తున్నాం. – తుకారాం రాథోడ్, ఇన్చార్జి డీఎంహెచ్వో -
కుల బహిష్కరణపై విచారణ
మోపాల్: మండల కేంద్రంలోని గోపు మహేశ్ను కుల బహిష్కరణ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గంగాధర్ బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. బాధితుడు మహేశ్ మాట్లాడుతూ.. సుమారు 25 ఏళ్ల క్రితం తాను అరి సందు(ఖాళీ స్థలం) వదిలి ఇళ్లు కట్టుకున్నానని చెప్పారు. ఇంటి వెనకాల గల మున్నూరుకాపు సంఘానికి ప్రహరీ నిర్మించేందుకు కుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తాను వదిలిన స్థలంలో (అరి సందు) తన గోడకు ఆనుకుని ప్రహరీ నిర్మిస్తామనడంతో అడ్డు చెప్పినట్లు తెలిపాడు. వారు చెప్పినట్లు వినడం లేదని సంఘం పెద్దలు కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన తన తండ్రి గంగాధర్ మే 6న మృతి చెందాడన్నారు. ఈ విషయం కులం పెద్ద మనుషులకు సమాచారమిచ్చినా.. అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. తన అక్కను గ్రామానికి చెందిన లచ్చన్నకు ఇచ్చి వివాహం చేశామని, వారిని కూడా అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారని మహేశ్ చెప్పాడు. రూ.50వేలు జరిమానా విధిస్తామని బెదిరించడంతో అక్క మాత్రమే అంత్యక్రియలకు వచ్చిందన్నారు. తనను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఆలయ మాన్యాలను పరిరక్షించాలి
నిజామాబాద్ రూరల్: ఆలయ మాన్యాలను పరిరక్షించాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ సూచించారు. భూములను ఫొటోలు తీయించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని ఆలయ అర్చకులకు సూచించారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో బుధవారం కోటగిరి, వర్ని, రుద్రూర్, ఇందల్వాయి, మాక్లూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, నందిపేట్, మోస్రా, నందిపేట్ మండలలోని గ్రామాలకు చెందిన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధూపదీప నైవేధ్య పథకం ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గుర్తింపు కార్డులు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెక్షన్ 43 ప్రకారం ఆయా ఆలయాలను రిజిస్ట్రేషన్, పబ్లికేషన్ చేయించుకోవాలని సూచించారు. -
18న ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్పై అవిశ్వాసం
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఈనెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్తో కలిపి 12 మంది కౌన్సిలర్లున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న చైర్మన్ కుడుముల సత్యనారాయణ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్లో చేరిన రోజే అంటే గతనెల 24న 11 మంది కౌన్సిలర్లు కలెక్టర్ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందించారు. దీంతో ఎల్లారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్లంతా క్యాంపునకు తరలారు. ఏడాది కాలంగా మున్సిపల్ చైర్మన్పై కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. అప్పట్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయి క్యాంపునకు వెళ్లారు. అయితే పార్టీ నాయకులు కౌన్సిలర్లను సముదాయించి అవిశ్వాసం ఆలోచనను విరమింపజేశారు. ఇటీవల చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో కౌన్సిలర్లు మరోసారి అవిశ్వాసానికి ప్రయత్నించారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన తరువాత 11 మంది క్యాంపునకు తరలివెళ్లారు. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లందరూ ఒక్కటిగా ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి నేరుగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు క్యాంపులో 11 మంది కౌన్సిలర్లు -
జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల మధ్య గొడవ
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల మధ్య పది రోజుల క్రితం గొడవ జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ డాక్టర్లు, బయట వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. జూనియర్ వైద్యుల మధ్య గొడవ జరగ్గా.. దీనిలోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. దీంతో గంటపాటు వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది, నర్సులు ఆపే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు. గొడవలో మహిళా జూనియర్ డాక్టర్లు కూడా ఉండడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తులతో ఉన్న సాన్నిహిత్యంతో గొడవ జరిగినట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణ లేకనే జీజీహెచ్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువలు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైస్మిల్ యజమానులు వెంటవెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, రవాణా కోసం లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని పలువురు సింగిల్ విండో చైర్మన్ కోరారు. మంగళవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో వేల సంఖ్యలో బస్తాలు తూకం పూర్తి చేసుకుని మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. లారీలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే లారీలను తెప్పించి, ధాన్యాన్ని తరలించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు నల్లవెల్లి అశోక్, తిరుపతి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశం -
రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: మే నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ శుక్రవారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సెలవులు వచ్చినందున రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా.. పంపిణీని రెండు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి తుది షోకాజ్ నోటీస్ జారీ కామారెడ్డి టౌన్: విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశాలకు వెళ్లిన బీబీపేట మండలం శివరాంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీరంగం సుహాసినికి తుది షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. ఈ విషయాన్ని డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరంగం సుహాసిన 2021 అక్టోబర్ నుంచి 2023 జూలై వరకే అనుమతి తీసుకున్నారని పేర్కొన్నారు. జూలైనుంచి విధులలో చేరాల్సి ఉన్నా.. ఇప్పటివరకు చేరకపోవడంతో చట్టపరమైన చర్యల కోసం తుది షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి బాన్సువాడ రూరల్: డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి 30వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని పట్టణంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ సూచించారు. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసిందన్నారు. ముందుగా ప్రకటించన ప్రకారం బుధవారం నుంచే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్లో సవరణలు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మెప్మా ఆర్పీ రాజీనామాఆర్మూర్టౌన్: ఆర్మూర్కు చెందిన మెప్మా ఆర్పీ గంగామణి తన ఉద్యోగానికి రాజీనా మా చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్ని కల్లో భాగంగా ఈనెల 13న పట్టణంలోని బాలుర పాఠశాలలోని బూత్ నంబర్ 54లో విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి వచ్చి తన పై ఆగ్ర హం వ్యక్తం చేశారని, కించపరిచేలా మాట్లా డారని.. అందుకే ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు రాజీనామా లేఖను అందజేశారు. అందరి ముందు తనతో దురుసుగా ప్రవర్తించి బయటకు పంపడంతో అవమానకరంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. -
మద్యం వ్యాపారుల సిండికేట్ దందా
కామారెడ్డి క్రైం: ఓవైపు వేసవి తాపం, మరోవైపు ఎన్నికల హడావుడితో మద్యం దుకాణాలు, బార్లకు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి, నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడే కంపెనీలవి కాకుండా ఎక్కువ లాభం వచ్చే కంపెనీల బీర్లను దొడ్డిదారిన విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కమీషన్లు ఎక్కువగా ఇచ్చే కంపెనీలకు చెందిన మద్యం బాటిళ్లు మాత్రమే చాలావరకు వైన్షాప్లు, బార్లలో దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని బార్లు బీర్ ధరలు అమాంతం పెంచేశాయి. దీంతో బీరుప్రియుల జేబుకు చిల్లు మరింత పెరిగింది. అప్పటికీ కోరుకున్న బ్రాండ్ బీరు దొరక్క తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా ఎకై ్సజ్ శాఖ చోద్యం చూస్తూ కూర్చుందనే విమర్శలున్నాయి. అమ్మిందే తాగాలి.. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు కింగ్ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించడం లేదని అక్కడి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఫిర్యాదు వరకు వెళ్లకపోయినా కామారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా కింగ్ ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లనే యువత ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వైన్షాప్లు, బార్లలో ఈ బ్రాండ్ బీర్లను అందుబాటులో ఉంచడం లేదు. చాలావరకు మద్యం దుకాణాలలో బీర్లకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నారు. దీంతో వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే బీర్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయని, గోదాం నుంచి తక్కువ స్టాక్ ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో జనం ఇష్టపడని కంపెనీల బీర్లను అంటకడుతున్నారు. కింగ్ ఫిషర్ కంపెనీ బీర్లు దొరక్క యువత బేజారవుతోంది.అడ్డదారుల్లో.. కొరత పేరిట వైన్షాప్లలో నోస్టాక్ బోర్డులు ధరలు పెంచేసి ఇష్టారాజ్యంగా విక్రయాలు లాభం ఎక్కువగా వచ్చే బీర్ల అమ్మకానికి ప్రాధాన్యత మద్యంప్రియుల జేబులకు చిల్లు చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ అధికారులువైన్షాప్లకంటే బార్లలో చార్జీల పేరిట గతంలో ఒక్కో బీర్ బాటిల్పై రూ.20 అదనంగా వసూలు చేసేవారు. ప్రస్తుతం కొరత సాకుతో ఎమ్మార్పీపై రూ.30 నుంచి రూ. 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మద్యం దుకాణాలకు వచ్చే బీర్లను అదే దుకాణంలో విక్రయించాలి. కామారెడ్డిలో కొందరు వ్యాపారులకు బార్లతో పాటు వైన్షాప్లు కూడా ఉన్నాయి. వైన్షాప్లకు వచ్చే సరుకును అక్కడి నుంచి గుట్టుగా బార్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బార్లలో అధిక ధరకు విక్రయించి అదనపు సొమ్ము సంపాదించవచ్చని ఇలా చేస్తున్నారు. అంతేకాకుండా బార్లలోని మద్యం బాటిళ్లను బయటకు విక్రయించకూడదు. కానీ కామారెడ్డిలో బార్లనుంచి యథేచ్ఛగా బయటికి ఇస్తున్నారు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత కూడా బార్లనుంచి ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుగుతున్నాయి. అయినా ఎకై ్సజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.కొరత ఉన్నది వాస్తవమే ò³§ýlª MýS…ò³-±ÌS ¯]l$…_ çÜÆý‡$MýS$ ™èlMýS$P-Ð]lV> Æ>Ð]lyýl…, ÐólçÜÑÌZ ½ÆŠ‡-ÌSMýS$ yìlÐ]l*…yŠæ ò³Æý‡VýS-yýl…™ø MöÆý‡™èl E¯]l²¨ ÐéçÜ¢-Ð]lÐól$. Ð]l_a¯]l ÝëtMŠS¯]l$ A°² §ýl$M>-×êÌSMýS$ çÜÐ]l*-¯]l…V> ç³…^èl$-™èl$-¯é²…. yìlÐ]l*…yŠæ E¯]l² ½ÆŠ‡ÌS ÑçÙ-Ķæ*°² E¯]l²-™é-«¨-M>-Æý‡$ÌS §ýl–íÙŠ-ి- ¡çÜ$MýS$Ððl-âêÏ…. »êÆŠ‡ÌS ¯]l$…_ Ð]l$§éÅ°² ºÄ¶æ$-rMýS$ AÐ]l$Ã-MýS*yýl§ýl$. °º…«§ýl-¯]l-ÌS¯]l$ GÐ]lÆý‡$ A†{MýS-Ñ$…-_¯é ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê…. – విక్రం కుమార్, ఎకై ్సజ్ ఎస్సై, కామారెడ్డి -
రోడ్డెక్కిన అన్నదాత
● ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో ● గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్నిజాంసాగర్: ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. బుధవారం మహమ్మద్నగర్ మండల కేంద్రంతో పాటు కోమలంచ గేటు వద్ద రాస్తారోకో చేశారు. బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రెండు చోట్ల రైతులు సుమారు గంటన్నర పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజులుగా ధాన్యం తూకం వేయడం లేదని ఆరోపించారు. ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రావడం లేదని, దీంతో కొనుగోలు కేంద్రంలో నిల్వలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కడ్తా పేరిట రైస్మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు పంపాలని, ధాన్యం తూకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై సుధాకర్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. విషయాన్ని ఫోన్ ద్వారా జిల్లా సివిల్ సప్లై అధికారి, బాన్సువాడ ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బస్తాల తరలింపునకు కావాల్సిన లారీలు పంపిస్తామని పేర్కొన్నారు. మహమ్మద్నగర్ తహసీల్దార్ క్రాంతికుమార్ రైతుల వద్దకు వచ్చి, తాను దగ్గరుండి తూకం వేయిస్తానని, లారీల్లో ధాన్యం బస్తాలను తరలించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో రైతులతోపాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సాదుల సత్యనారాయణ, గంగారెడ్డి, విఠల్గౌడ్, రవి గౌడ్, పోలీస్ రాజు, మిడుత సాయిలు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాలవారీగా పోలైన ఓట్ల వివరాలు..
నియోజక వర్గం పురుషులు పోలైన మహిళలు పోలైన ఇతరులు పోలైన మొత్తం మొత్తం శాతం ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు పోలైన ఓట్లు జుక్కల్ 99,524 77,140 1,03,354 76,715 09 00 2,02,887 1,53,855 75.83 ఎల్లారెడ్డి 1,06,881 82,590 1,16,144 90,337 02 01 2,23,027 1,72,928 77.54 కామారెడ్డి 1,22,474 86,121 1,32,514 96,198 19 06 2,55,007 1,82,325 71.50 బాన్సువాడ 93,762 72,850 1,03,051 78,660 13 06 1,96,826 1,51,516 76.98 నారాయణ్ఖేడ్ 1,18,859 88,921 1,18,373 83,584 09 03 2,37,241 1,72,508 72.71 అందోల్ 1,22,668 96,859 1,28,187 94,461 05 00 2,50,860 1,91,320 76.27 జహీరాబాద్ 1,37,694 1,03,616 1,37,866 96,981 02 00 2,75,562 2,00,597 72.80 మొత్తం 8,01,862 6,08,097 8,39,489 6,16,936 59 16 16,41,410 12,25,049 74.63 -
బిడ్డ కోసం బీజేపీతో ఒప్పందం
● మాజీ సీఎం కేసీఆర్పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శలు ● జహీరాబాద్లో కాంగ్రెస్దే గెలుపని ధీమాకామారెడ్డి టౌన్ : మాజీ సీఎం కేసీఆర్ తన కూతు రు కవిత బెయిల్ కోసం బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ బీజేపీకి అమ్మేశారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారని ఆరోపించారు. దీంతో ఆ రెండు పార్టీలు ఒకటేనని తేలిపోయిందన్నారు. కేసీఆర్కు సెక్యులరిజంపై మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవబోయే 11 స్థానాల్లో జహీరాబాద్ ఉంటుందని సీఎం చెప్పార న్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు కామారెడ్డిలో బంపర్ మెజారిటీ వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కామారెడ్డి నియోజకవర్గంలో 10,420 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని షబ్బీ ర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.10 కోట్లకుపైగా కామారెడ్డి రైతులకు అందనుందన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రాంత సమస్యలపై వినతి పత్రం ఇచ్చానని, వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, నాయకులు పాల్గొన్నారు. -
ఎగిరేది కాషాయ జెండానే
● జహీరాబాద్లో లక్ష మెజారిటీ ఖాయం ● పార్లమెంట్ ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి బిచ్కుంద : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గంలో బీజేపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా అధ్యక్షురా లు అరుణతార పేర్కొన్నారు. మంగళవారం బి చ్కుందలోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ గెలుపును అడ్డుకోవడాని కి కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయించారని, కేసులు నమోదు చేయించా రని ఆరోపించారు. అయినా దాడులకు భయపకుండా బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రజలు కాషా య పార్టీకే మద్దతుగా నిలిచారన్నారు. కార్యకర్తల కృషితో బీబీ పాటిల్ లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి శ్రీధర్ పంతు లు, మండల అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు శివాజీ, విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement