-
వందశాతం లక్ష్యంగా హోమ్ ఓటింగ్
రాయచోటి: జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది. శుక్రవారం నుంచి పలువురు వృద్ధులు ఇంటి వద్ద నుంచి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ హోమ్ ఓటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. హోమ్ ఓటింగ్ ఆప్షన్ను ఎంచుకున్న 714 మంది ఓట్ల వివరాలను సేకరించి ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది. హోమ్ ఓటింగ్ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృందం వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9782 మంది వృద్ధులు, పీడబ్ల్యుడీలు 18,153 మంది హోమ్ ఓటింగ్ అర్హత కలిగి ఉన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 9782 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 18,153 మంది ఉన్నట్లు వారు తెలిపారు. వీరిలో కేవలం 714 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్ర, శనివారాలలో 458 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. -
పసుపు–కుంకుమ తప్ప ఏమీ ఇచ్చింది లేదు: మహిళలు
ఉదయం 7 గంటల సమయంలో హైవే పక్కనే దుంపలగట్టు వద్ద కనకాంబరాలు పూలు కోస్తున్న మహిళలను సాక్షి బృందం పలకరించింది. ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండమని టక్కున ముక్త కంఠంతో జవాబు చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బు మూడు సార్లు వచ్చింది. అమ్మఒడి వచ్చింది. మా అత్త సుబ్బమ్మకు పింఛన్ వచ్చింది...ఇలా చెకచెక నందిరెడ్డి స్వరూప చెప్పుకొచ్చింది. ఆడోళ్లకు ప్రభుత్వ పథకాలు జగన్ ప్రభుత్వంలోనే వచ్చాయని, చంద్రబాబు హయాంలో పసుపు–కుంకుమ పథకం తప్పా ఇంకేమీ రాలేదని నాగులు, శివమ్మ అనే మహిళలు గొంతు కలిపారు. అది కూడా ఎన్నికల ముందు ఇచ్చారన్నారు. మళ్లీ జగనే రావాలని చెప్పారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటరుగా నమోదై ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని గాంధీనగర్ హైస్కూలులో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులకు జయనగర్ కాలనీ జెడ్పీ బాలికల హైస్కూలులో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఓటర్లు ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్లేందుకు, ఓటు వినియోగం తర్వాత వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గాంధీనగర్ హైస్కూలులో 3222 మంది తమ ఓటును సజావుగా వినియోగించుకోవడం కోసం 12 ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. -
నేడు పోలీసులు, అత్యవసర ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
కలెక్టర్ విజయరామరాజు కడప సెవెన్రోడ్స్: పోలీసు పర్సనల్స్, అత్యవసర సర్వీసులకు చెందిన వారికి సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అలాగే హోమ్ ఓటింగ్ సోమ, మంగళ వారాల్లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశానికి ఎస్పీ హాజరవుతారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఆయనకు తెలియజేయాలన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, శనివారం సాయంత్రం 4.00 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతోపాటు ఎన్సీసీ, స్కౌట్ సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటివరకు 1101602 (67.2 శాతం) ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 3.61 లక్షల మందికి ఓటరు గైడ్స్ కూడా పంపిణీ చేశామన్నారు. ఈనెల 10వ తేదీకి ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. కోడ్ ఉల్లంఘనలు సంభవిస్తే సి–విజిల్ యాప్ లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబరు 1950కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
మైదుకూరు : మైదుకూరు నాయకుడు బీఎన్ మాదన్న పెద్దకుమారుడు బీఎన్ మాధవరాయుడు ఆదివారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘు రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అంతకుముందు బీఎన్ మాధవ రాయుడు ఇంట్లో నిర్వహించిన తేనీటి విందులో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. మదీనా దస్తగిరి, శ్రీమన్నారాయణరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఇరగంరెడ్డి శంకర్రెడ్డి, దండు రామయ్య, భూమిరెడ్డి సుబ్బరాయుడు, కేపీ లింగన్న, గల్లా నరసింహారెడ్డి, బండి నాగేంద్ర ప్రసాద్, గోశెట్టి లక్షుమయ్య తదితరులు పాల్గొన్నారు. 50 కుటుంబాల చేరిక చింతకొమ్మదిన్నె : కడప నగర పరిధిలోని 17వ డివిజన్లో గల అంగడి వీధిలో ఆదివారం కార్పొరేటర్ చంద్రహాస్ రెడ్డి, డివిజన్ ఇంచార్జ్ మట్లీ శ్రీనివాసులు రెడ్డిల ఆధ్వర్యంలో ఎర్రగుళ్ల వెంకటయ్య, ఎర్ర గొల్ల వెంకట శివకుమార్ నేతత్వంలో ఆదివారం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎర్రగుళ్ల శివప్రసాద్, దాసరి గణేష్, దాసరి వెంకటరమణ, ఇల్లపల్లి కార్తీక్, నాగ శివ, నాగవేణి, మల్లీశ్వరి, కష్ణ ప్రసాద్, గంగాధర్, హరి, శరత్ కుమార్, రాజు, పెంచలమ్మ, సుధారాణి, తదితరులు పార్టీలో చేరారు ఓబుళంపల్లె నుంచి.. చింతకొమ్మదిన్నె మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో ఆదివారం ఎమ్మెల్యే పి వీంద్రనాథ్ రెడ్డి, సీకే దీన్నే జెడ్పీటీసీ పి. నరేన్ రామాంజుల రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కార్యాలయంలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎన్, నాగార్జున రెడ్డి, జి.విశ్వనాథరెడ్డి, బి. మహేశ్వర్ రెడ్డి, బి.సురేష్ రెడ్డి, బి.రామకష్ణారెడ్డి, పి. శివ రెడ్డి, పి. నాయబ్ ఖాన్, ఎస్. సయ్యద్ హుస్సేన్, ఎస్. మౌలాలి, ఎస్. రహమతుల్లా, ఎస్. రసూల్ , ఎస్. నాయబ్, ఎస్. సద్దాం, పి. రసూల్, పి. నాగమల్లారెడ్డి, పి,రహమత్ ఖాన్, పి.మల్లేష్, పి. శివ చంద్రారెడ్డి , పి.శివ శంకర్ రెడ్డి ఉన్నారు. మండల కన్వీనర్ గూడా ప్రభాకర్ రెడ్డి, మాజీ కన్వీనర్ గుత్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గజ్జల సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు 40 కుటుంబాల చేరిక బద్వేలు అర్బన్: మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం, గాండ్లతిమ్మాయపల్లె, ఎత్తిరాజుపల్లె గ్రామాల నుంచి బిజివేములరామసుబ్బారెడ్డి, దుంపలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 40 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, మండల కన్వీనర్ మల్లేశ్వర్రెడ్డి, సర్పంచ్ సుబ్బనరసింహ, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు జగన్మోహన్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చంద్రఓబుల్రెడ్డి, రామసుబ్బయ్య, వెంకటేష్, రామచంద్ర, శ్రీను, సామేలు, రమణయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రాజుపాలెంలో 10 కుటుంబాలు చేరిక మండల పరిధిలోని రాజుపాలెం పంచాయతీ రాజుపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన వాకమళ్ల సురేష్రెడ్డి, బుట్టివిజయనరసింహారెడ్డిలతో పాటు 10 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ సుధ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బుట్టినరసింహారెడ్డి, ఆయా పంచాయతీల సర్పంచ్లు, ఇన్చార్జిలు రమాదేవి, వెంకటసుబ్బారెడ్డి, రమణారెడ్డి, చిదానందంరెడ్డి, మల్లెంకొండంరాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక ప్రొద్దుటూరు : మండలంలోని చౌటపల్లె గ్రామానికి చెందిన టీడీపీ వారు ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. చౌటపల్లె గ్రామానికి చెందిన దేవిరెడ్డి హరిబాబురెడ్డి, గండ్లూరు రాంప్రసాద్రెడ్డి, దేవిరెడ్డి లక్ష్మిరెడ్డి, దేవిరెడ్డి మనోహర్రెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, మోపూరు ఉదయ్ కుమార్రెడ్డి, మోపూరు ఓబులరెడ్డి, గుమ్మల సుబ్బారెడ్డితోపాటు 30 కుటుంబాల వారికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కండువాలు వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాదరెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాష్రెడ్డి విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. వైఎస్సార్సీపీలోకి 60 కుటుంబాల చేరిక పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లి పంచాయతికి చెందిన కొత్తకోట హరిప్రసాద్ ఆద్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలోకి చేరారు. తంబళ్ళపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి వైఎస్సార్సీపీ కండువాలతో వారిని సత్కరించారు. మండల బీసీ సంఘం అధ్యక్షుడు కే.ఓబులేసు, మాజీ ఎంపీటీసీ అంజప్ప, గ్రామ అధ్యక్షుడు భీమా, బూత్ కమిటి ఇన్చార్జ్ రవీంద్ర, శంకరప్ప, మణి, నాగరాజు, గుప్తా, ఆదినారాయణ,వెంకటేష్, అప్పిరెడ్డి, సురేష్, వెంకట్రమణ,మారుతి, సత్యం, మాబూ, అగ్గిరాముడు, శివన్న, రామచంద్ర, శ్రీనివాసులుతో పాటు మరో 40 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమానికి వందలాదిగా జనం తరలి వచ్చి ద్వారకనాథ్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు ఆకర్షితులై కొందరు.. సీఎం జగన్ పాలన నచ్చి మరికొందరు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement