-
ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కడప అర్బన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరుగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. శనివారం కడప వన్టౌన్ పోలీస్స్టేషన్లో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 1 నుంచి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతందని వివరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, ఎస్బీ ఇన్స్పెపెక్టర్ జి. రాజు, కడప వన్టౌన్ సీఐ సి. భాస్కర్రెడ్డి, చిన్నచౌక్ సీఐ నరసింహారెడ్డి, కడప టూటౌన్ సీఐ ఇబ్రహీం, తాలూకా సీఐ తిమ్మయ్య, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి భద్రతసార్వత్రిక ఎన్నికల పోలింంగ్ అనంతరం ఈవీఎం బాక్స్లను కడపలోని మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘స్ట్రాంగ్ రూమ్’లో ఉంచారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ సి. గణేష్కుమార్తో కలిసి సంయక్తంగా పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని, సిబ్బంది, అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (ఏ.ఆర్) ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, ఏ.ఆర్ డిఎస్పీ మురళీధర్, కడప రిమ్స్ పిఎస్ సీఐ కె. రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జూన్ 1నుంచి 6 వరకు ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం జమ్మలమడుగు: ఎన్నికల కౌటింగ్ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకూడదని, వాటిని పూర్తిగా నిషేధించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అర్బన్ స్టేషన్ను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. ఏ పార్టీలకు కొమ్ము కాయొద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యశ్వంత్ ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజు, సీఐలు కరుణాకర్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆట.. సరికొత్త బాట
జాతీయ స్థాయిలో రాణించగలం కడప స్టేడియంలో ఆస్ట్రోటర్ఫ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. మేము సాధన చేసే సమయంలో టర్ఫ్ కోర్టు లేకపోవడం కొంత లోటుగా ఉన్నా, ఉన్నంతలో రాణిస్తూ వచ్చాం. టర్ఫ్ కోర్టు ఉండి ఉంటే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించేవాళ్లం. టర్ఫ్ ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా నుంచి క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించగలరు. – కుమార్బాబు, కడప హాకీ క్రీడాకారుడు, సాయ్, చైన్నె అదృష్టంగా భావిస్తున్నాం.. కడపలో ఆస్ట్రోటర్ఫ్ ఏర్పాటు చేయడం క్రీడాకారులకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాం. టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దపెద్ద క్యాంపులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఉత్తమశ్రేణి హాకీ ఆడేందుకు అవకాశం లభిస్తుంది. భవిష్యత్తు తరాల వారికి ఈ టర్ఫ్ మైదానం ఒక వరంగా ఉపయోగపడుతుంది. అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు. – వేణుమాధవరెడ్డి, కడప హాకీ క్రీడాకారుడు, సాయ్, హైదరాబాద్ కడప స్పోర్ట్స్: కడప నగరంలోని జిల్లా క్రీడాప్రాధికారసంస్థ మైదానంలో ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇండియా మార్గదర్శకాల మేరకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వాటర్ బేస్డ్ ఆస్ట్రో టర్ఫ్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో మైదానం ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో హాకీ క్రీడకు ఎనలేని ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో సైతం రాణించిన వారు ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థానాల్లో ఉన్న క్రీడాకారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఆస్ట్రో టర్ఫ్ ఏర్పాటు చేయాలన్న క్రీడాకారుల కోరిక ఎట్టకేలకు ఫలించబోతోంది. ఇందులో భాగంగా ఇటీవలే పనులు ప్రారంభించడంతో పాటు అక్టోబర్ నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 101 మీటర్ల పొడవు, 61 మీటర్ల వెడల్పుతో టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా మ్యాచ్లను వీక్షించేందుకు గ్యాలరీని నిర్మిస్తున్నారు. టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా జాతీయస్థాయి మ్యాచ్ల నిర్వహణతో పాటు ఇక్కడ సాధన చేసే క్రీడాకారులు జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి మ్యాచ్ల్లో రాణించేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు సాధారణ కోర్టుల్లో ఆడు తున్న క్రీడాకారులు ఒక్కసారిగా జాతీయస్థాయిలో టర్ఫ్కోర్టులో ఆడాల్సి రావడం కాస్త ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో కడప గడపలో ఆస్ట్రోటర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయడం క్రీడాకారుల్లో సరికొత్త జోష్ నింపింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కేవలం రెండు మాత్రమే ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఉండగా, తాజాగా కడప గడపలో ఏర్పాటు చేస్తుండటం పట్ల హాకీ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా హాకీ క్రీడామైదానం ఏర్పాటు చేయడాన్ని క్రీడాకారులు స్వాగతిస్తుండటంతో పాటు ఫుట్బాల్, హ్యాండ్బాల్ తదితర ఇతర క్రీడలకు స్థలం కేటాయింపుతో పాటు ఆధునీకరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. జాతీయక్రీడ హాకీకి జవసత్వాలు కల్పించడమే లక్ష్యంగా కడపలోని డీఎస్ఏ క్రీడామైదానంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వాటర్ బేస్డ్ ఆస్ట్రోటర్ఫ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.8 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. మైదానం అందుబాటులోకి వస్తే జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించే అవకాశం ఉంది. కడప గడపలో అంతర్జాతీయస్థాయి హాకీ మైదానం రూ.8కోట్ల నిధులతోప్రారంభమైన పనులు మూడునెలల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా వేగవంతం -
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసింది. రెండు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో అకాశమంతా మేఘామృతమైంది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి ఆవర్తనంతో వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నిత్యాన్నదానానికి విరాళం చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శనివారం రూ.1,00,116లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు.దువ్వూరు మండలం పెద్ద భాకరాపురానికి చెందిన ఉమ్మడి ఆంజనేయులు, ఆయన సతీమణి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు విరాళం అదజేశారని చెప్పారు.ఈసందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజారమేష్ దాతలకు తీర్థప్రసాదాలను అందజేశారు.స్వామి వారి చిత్రపటం అందించారు.వారిని శేషవస్త్రంతో సత్కరించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, దాతల కుటుంబసభ్యులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. రోలర్ స్కేటింగ్లో ధ్రుతికి పతకం కలసపాడు: మండలంలోని దిగువ తంబళ్ళపల్లె గ్రామానికి చెందిన పల్లెశివక్రిష్ణారెడ్డి, పావనిల కుమార్తె పల్లె ధ్రుతికి జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్లో అండర్–7, అండర్–9లలో ద్వితీయ స్థానం లభించింది. ధ్రుతి చిన్నప్పటి నుండి స్కేటింగ్లో ఆసక్తి చూపడంతో అనంతపురం జిల్లాలో గ్రామీణ నీటిపారుదలశాఖలో ఏఈగా పనిచేస్తున్న తండ్రి శివక్రిష్ణారెడ్డి ప్రోత్సహించారు. ఈ క్రమంలో తాలూకా, డివిజన్ స్థాయిలో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని పలు ర్యాంకులు సాధించింది. గతేడాది నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రోలర్ స్కేటింగ్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రస్తుతం గోవాలో వివిధ కేటగిరీలలో మూడు రోజులుగా జరిగిన జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్లో ధ్రుతి ద్వితీయ స్థానం సాధించింది. నిర్వాహకులు మెడల్ను అందజేశారు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి ధృతికి అభినందనలు తెలిపారు. -
●నైరుతిపై అశలు...
కడప అగ్రికల్చర్: వరుణుడి కరుణతో పుడమి పులకించింది. జిల్లావ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన వర్షం దంచికొట్టింది. దీంతో రైతులు ఖరీఫ్సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 75,189 హెక్టార్లలో పంటలసాగు లక్ష్యంగా అధికారులు నిర్దేశించారు. దీంతో రైతులు చాలా చోట్ల పొలాలను దుక్కి దున్నుతున్నారు.ప్రభుత్వం కూడా సబ్సిడీ విత్తనాలతోపాటు ఎరువులను కూడా సిద్ధం చేసింది.అన్నదాతలు విత్తనాల కోసం తమ పరిధిలో ఉన్న రైతుభరోసా కేంద్రాలకు(ఆర్బీకే) వెళ్లి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ పక్రియ జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ఆర్బీకేల్లో మొదలైంది. జిల్లాలో 75,189 హెక్లార్లు సాగు లక్ష్యం.. ఖరీఫ్ సాగకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లాలోని 36 మండలాల్లో 77,105 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలను సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ఆధారంగా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో 5323 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 5849 క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయడానికి ఆర్బీకేల్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ మొత్తానికి కావాల్సిన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎంఓపీ రకాల ఎరువులు 73,583 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఇప్పటి వరకు జిల్లాలో 38,739,93 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వీటిని అవసరాన్ని బట్టి ఆయా ఆర్బీకేలా ద్వారా రైతులకు అందించనున్నారు. ట్రాక్టర్తో దుక్కిదున్నతూ సాగుకు సమాయత్తమవుతున్న రైతు ●పంటలసాగు ఇలా... ఖరీఫ్ –2024 సాధారణ విస్తీర్ణం 75,189 హెక్టా ర్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుకావచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇందులో కేసీ కెనాల్తోపాటు నీటి ఆధారంగా ఈ ఏడాది అత్యధికంగా 31,171 హెక్లార్టలో వరిపంట సాగుకానుంది. 24086 హెక్లార్లలో పత్తిపంట, 5971 హెక్టార్లలో వేరుశనగ, 3894 హెక్లార్లలో కంది, 1126 హెక్టార్లలో సన్ఫ్లవర్, 2642 హెక్టార్లలో మినుము, 1407 హెకార్లలలో జొన్న, 1039 హెక్టార్లలో సజ్జ, 976 హెక్టార్లలో కొర్ర, 963 హెక్టార్లలో సోయాబీన్, 821 హెక్టార్లలో ఆముదం, 637 హెక్టార్లలో మొక్కజొన్న, 250 హెక్టార్లు పెస ర పంటలను రైతులు సాగు చేయనున్నారు. సర్వం సిద్ధం చేశాం.. ఖరీఫ్ సీజన్లో రైతుల సాగుకు కావాల్సిన విత్తనాలను ,ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ పక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీంతోపాటు ఎరవులను కూడా ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆయా ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచుతున్నాం. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రైతులకు విత్తనాల పంపిణీ ప్రారంభిస్తాం. ఈ ఏడాది సాధారణం కంటే అధిక విస్తీర్ణంలో పంటలను సాగు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారిజిల్లాకు మంజూరైన సబ్సిడీ విత్తనాల వివరాలు ఇలా... ఖరీఫ్ సీజన్కు ఎరువుల కేటాయింపు ఇలా... నెల యూరియా డీఏపీ ఎంఓపీ కాంప్లెక్స్ ఎస్ఎస్పి మొత్తం విత్తనాలు మంజూరైనవి సబ్సిడీ (క్వింటాళు) (శాతం) ఏప్రిల్ 1827 214 142 1927 243 4353 మే 1453 437 197 1827 333 4246 జూన్ 3550 1160 393 6094 651 11847 జులై 3355 1614 569 5912 925 12375 ఆగస్టు 4909 1857 672 7853 915 16207 సెప్టెంబర్ 6113 3943 818 12750 930 24553 జీలుగలు 4780 50 జనుములు 463 50 పిల్లపెసలు 80 50 వేరుశనగ 5849 40ఖరీఫ్ సీజన్ త్వరలో మొదలు కానుండటం, నైరుతీ రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రానికి రానుండటంతో రైతుల్లో ఆశలసాగు మొదలైంది. ఇప్పటికే వారికి కావాల్సిన విత్తనాలను సబ్సిడీతో పంపిణీ చేయనున్నారు. రైతులు కూడా పశువుల ఎరువులను భూమిలకు తొలుతూ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పదును వర్షం కురిస్తే దుక్కులు దున్ని పంటలను సాగు చేసుకోనున్నారు. ఇప్పటికే నీటి ఆధారిత ప్రాంతాల్లో పలువురు రైతులు జీలుగలు, జనుములను సాగు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. -
No Headline
పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు వచ్చి చేరుతోంది. ఆనకట్ట నుంచి కుందూనదిలో 862 క్యూసెక్కులు పోతున్నట్లు కేసీ కెనాల్ అధికారులు తెలిపారు. 20 రోజుల కిందట అవుకు రిజర్వాయర్ నుంచి పాలేరు వాగు ద్వారా రాజోలి ఆనకట్ట నుంచి కుందూనదికి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి కుందూ నదిలో నీరు అరకొరగా ప్రవహిస్తోంది. ఆ నీటితో పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటి అవసరాలు తీరాయని రైతులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం నీటితో శనివారం రాజోలి ఆనకట్ట నుంచి కుందూ నదిలోకి నీరు పోవడంతో జలకళ సంతరించుకుంది. –రాజుపాళెం -
●అడుగడుగునా అండ
రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తోంది దీంతోపాటు పంటలసాగకు సాయంగా రైతుభరోసాను అందిస్తూ ఆదుకుంటుంటోంది. అలాగే విత్తనం మొదలు పంట దిగుబడుల విక్రయం వరకు ఉన్న ఉర్లోనే ఆర్బీకేల ద్వారా సేవలను అందిస్తూ అడుగడుగునా అండగా నిలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభౖమైయ్యే ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల సాగుకు అవసరమైన ఎరువులు, వేరుశనగ, పచ్చిరొట్టె విత్తనాల ముందస్తుగా కేటాయించింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు, వేరుశనకాయలు కోసం రిజిస్ట్రేషన్ను చేసుకుంటున్నారు. -
బ్రహ్మరథోత్సవం
భక్తజనసంద్రం..అశేష జన వాహిని మధ్య జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది భక్తులు బ్రహ్మంగారిమఠం తరలిరావడంతో వీధులు కిక్కిరిసిపోయాయి. ‘వీర బ్రహ్మ జై.. గోవిందమాంబ జై’ గోవింద నామస్మరణతో వీధులు మారుమ్రోగాయి.బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శనివారం గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మరథోత్సవం, ఆరాధన ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఐదో రోజు తెల్లవారు జామున వీరబ్రహ్మ సుప్రభాతం, నామసంకీర్తన కార్యక్రమాల అనంతరం అర్చనామూర్తులను అభిషేకించి అంలంకరించారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. అనంతరం స్వామి, అమ్మవారిని ఉత్సవ పీఠంపై ఆశీనులను చేసి ఊరేగించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని విశ్వబ్రాహ్మ ఇండస్ట్రీస్కు చెందిన తుర్లపాటి సాంబశివారావు, ఆయన సతీమణి పద్మావతి ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం మహా నైవేద్యం జరిగింది. రథానికి ప్రత్యేక పూజలు శనివారం సాయంత్రం బ్రహ్మ రథోత్సవం కమనీయంగా సాగింది. ముందుగా మఠం పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రయ్య స్వామి, గోవిందస్వామి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, వరదరాజస్వామితోపాటు కుటుంబ సభ్యులు, జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం మఠాధిపతులు వీరశివకుమారస్వామి, మఠం పెద్దాచార్యులు భద్రయ్యస్వామి, దేవస్థానం ఫిట్ పర్సన్ శంకర్బాలాజీ, ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, ఎంపీడీఓ మల్లేశ్వరప్ప రథానికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితు మంత్రోచ్ఛరణ మధ్య స్వామి, అమ్మవారిని రథంపై కొలువుంచారు. 5.50 గంటలకు రథాన్ని కదిలించగా.. ‘వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై ’.. అంటూ భక్తులు ముందుకు లాగారు. ‘బ్రహ్మ’ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది జనం తరలివచ్చారు. రథంపై స్వామి, అమ్మవారి వైభవాన్ని కనులారా వీక్షించి ఆనంద భరితులయ్యారు. రథం పురవీధులలో తిరిగి యథా స్థానానికి చేరుకుంది. దాతలు విరివిగా అన్నదానాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మఠం ఫిట్ పర్సన్ శంకర్బాలాజి, మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది, స్వామి శిష్యులు ఏర్పాట్లు చేపట్టారు. భారీ బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలతోపాటు 400 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. దాతలకు సన్మానం బ్రహ్మరథ నిర్మాతలు వంకమర్రి వెంకటరెడ్డి, పునర్నిర్మాణ దాతలు బూదగిరికి చెందిన రాజగోపాలాచార్యులు, రథోత్సవ తాత్కాలిక ఉభయదాతలు కడపకు చెందిన మునగా బద్రినారాయణ, సునీత దంపతులు, అలంకరణ దాతలు కర్నూలుకు చెందిన రేవల్లి కన్నా సోదరులను ఘనంగా సన్మానించారు. ఆకట్టుకున్న గజవాహనోత్సవం రాత్రి నిర్వహించిన హరికథా కాలక్షేపం భక్తులను అలరించింది. అనంతరం మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి గజ వాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపుగా చేరుకుని తిరిగి పెద్దమఠం చేరుకుంది. సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు పాలేటమ్మ, సుబ్బిరెడ్డి, బాలహుసేన్రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కిటకిటలాడిన బ్రహ్మంగారిమఠం వీధులు కమనీయంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు మార్మోగిన ‘గోవింద’ నామస్మరణ -
శేష వాహనంపై అగస్త్యేశ్వరుడు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో గంగారాజరాజేశ్వరీ సమేత అగస్త్యేశ్వరస్వామి శేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున అగస్త్యేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి శేష వాహనంపై ఊరేగించారు. పాండురంగసాయి, కాశినాయన మౌనస్వామి బృందాల భజన ఆకట్టుకుంది.నీ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి కూలీ మృతి రాజుపాళెం : మండలంలోని టంగుటూరులొ ఉపాధి పనులకు వెళ్తూ కిందపడి వేంపల్లె సుబ్బరాయుడు(60) శనివారం మృతి చెందాడు. సుబ్బరాయుడు ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు ట్రాక్టర్ ట్రాలీలో కూర్చుని వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ట్రాలీ డోర్కు ఉన్న కడ్డీ విరగడంతో ఒరికి సుబ్బరాయుడు కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలకు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి భార్య మౌలాలమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏపీడీ ఆనందం, ఏపీఓ లక్ష్మీనారాయణ, గ్రామస్థులు పరామర్శించారు. -
రెండు దుకాణాల్లో చోరీ
పోరుమామిళ్ల : పట్టణంలోని ప్రధాన రహదారిలోని రెండు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి దొరికింది దోచుకెళ్లారు. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ప్రభుత్వ కళాశాలకు ఎదురుగా ఉన్న ‘ఓంకార్ ఎలక్ట్రానిక్స్’ షాపు షట్టర్ పైకి లేపి.. లోపలున్న దాదాపు రూ.90 వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు యజమాని ఆర్.వెంకటసుబ్బయ్య తెలిపారు. రెండో అంతస్తులోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తీగలు కోసి తీసుకెళ్లారు. సంఘటన జరిగిన తీరు గమనిస్తే దొంగలు రెక్కీ నిర్వహించి ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుకాణంలో టీవీలు, ఇతర విలువైన వస్తువులు పోలేదని, డబ్బు కోసమే చోరీ చేశారని బాధితుడు వెంకటసుబ్బయ్య వివరించారు. రహదారిపై సీసీ కెమేరాలను పరిశీలిస్తే ముగ్గులు వ్యక్తులు వచ్చినట్లు రికార్డయిందని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ‘ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్’ షట్టర్ను పైకి లేపి పెట్టెలోని రూ.7 వేల నగదు తీసుకున్నారు. దీంతోపాటు రెండు స్ప్రే బాటిల్లు, పిస్తా పాకెట్ తీసుకెళ్లారని, ఇతర వస్తువులు, సామగ్రి ఏవీ పోలేదని యజమాని దాదాపీర్ తెలిపారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ కట్ చేసి తీసుకెళ్లారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భక్తి శ్రద్ధలతో చండీహోమం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో శనివారం వాసవీమాత జయంతి ఘనంగా నిర్వహించారు. వేకువ జామున అమ్మవారి మూల విరాట్కు పంచామృతాభిషేకం, కుంకుమార్చన చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, బెంగళూరు నుంచి తెప్పించిన గజమాలలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం లోక కల్యాణార్థం గణపతి, నవగ్రహ, రుద్రహోమం, చండీహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్ను వజ్రపు చీర, కిరీటంతో అలంకరించారు. మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు లక్ష కుంకుమార్చన జరిపారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు, కార్యదర్శి నాగేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.ఘనంగా వాసవీమాత జయంతి -
అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ముద్దనూరు : స్థానిక ఘాట్ రోడ్డులోని ఎత్తులేటి కట్ట వద్ద నుంచి అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో జమ్మలమడుగుకు చెందిన లారీ డ్రైవర్ రాయల భాషా(37)దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. దాల్మియా సిమెంట్ కర్మాగారం నుంచి ఓ లారీ పుంగనూరుకు బయలుదేరింది. ముద్దనూరు ఘాట్ రోడ్డు మలుపులో లోతట్టు ప్రాంతానికి చేరగానే.. వేగం పుంజుకొని అదుపు తప్పి రైల్వే గేట్ను బలంగా ఢీకొనడంతో విరిగి ఎగిరిపడ్డాయి. అనంతరం అదే వేగంతో మసీదు వద్ద మలుపులోని ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో పైకప్పు ధ్వంసమైంది. పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఇంటి యజమాని తెలిపారు. ప్రమాదంలో లారీలో చిక్కుకున్న డ్రైవర్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే గేట్ను ఢీకొనే సమయంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తోంది. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరి తెలిపారు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం -
ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేసవి సెలవుల్లో తమ బంధువుల ఇంటికి పంపలేదని ఓ విద్యార్థి మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన ఓ మైనర్ బాలుడు(15) కురబలకోట చేనేత నగర్లోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో వాల్మీకిపురంలోని పిన్ని ఇంటికి పంపించమని తల్లిదండ్రులను కోరాడు. వారు వద్దని చెప్పడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించి బాలుడిని 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు రెఫర్ చేశారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
●ఓట్ల లెక్కింపు దృష్ట్యా 144 సెక్షన్
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అఽధికారి విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం జిల్లాలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను మూడంచెల భద్రత మధ్య భద్రపరిచామన్నారు. ప్రత్యేక బలగాలతో 24 గంటలపాటు నిఘా ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ శాంతియుతంగా సాగేందుకు సహేతుకమైన ఆంక్షలు అమలు చేయడం అత్యవసరమైందని పేర్కొ న్నారు. అందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల రేడియస్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని 144 సెక్షన్ అమలులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఈనెల 18వ తేది నుంచి జూన్ 4వ తేది వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారని చెప్పారు. -
దైవదర్శనానికి వచ్చి.. భక్తుడు మృతి
బ్రహ్మంగారిమఠం : బి.మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న అతడు.. రోడ్డు ప్రమాదంలో ఇంద్రబాబు(58) అశువులు బాశాడు. విజయవాడ ఆర్టీసీ వారి అన్నదాన సత్రం వద్ద పడుకున్న అతడిపై కారు వెళ్లడంతో శనివారం అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంద్రబాబు భార్య జయలక్ష్మి వివరాల మేరకు.. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం మండలం పార్లపాడు గ్రామానికి చెందిన ఇంద్రబాబు, ఆయన సతీమణి విజయలక్ష్మి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు చూసేందుకు శుక్రవారం ఉదయం బి.మఠానికి వచ్చారు. రాత్రి దర్శనం చేసుకుని స్థానిక బద్వేల్ రోడ్డులోని వేంకటేశ్వర డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న అన్నదాన సంత్రం వద్ద సేద తీరాలనుకున్నాడు. సత్రం వద్ద పడుకుని ఉండగా, హైదరాబాద్కు చెందిన కారు డ్రైవర్ కారు ఆన్చేసి కిందకు దిగాడు. కారులో ఉన్న బాలుడు గేర్ వేయడంతో కారు ఇంద్రబాబు పైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య విజయలక్ష్మికి గాయాలయ్యాయి. బి.మఠం పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
కడప అర్బన్ : మోటార్ సైకిల్ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడడంతో శేషం ఈశ్వర ప్రసాద్(12) మృతి చెందాడు. కడప నగర శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని ఆర్పీఎస్ నగర్లో నివాసముంటున్న శేషం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రసాద్, సోదరుడితో కలిసి మోటార్ సైకిల్పై ఈ నెల 17న ఎర్రముక్కపల్లికి వచ్చారు. తిరిగి అదే వాహనంలో తిరిగి వస్తుండగా, పీఎఫ్ కార్యాలయం వద్ద మరో మోటార్ సైకిల్ను తప్పించబోయి వారి వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలుడు, అతని తండ్రిని కడప రిమ్స్కు 108లో తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈశ్వరప్రసాద్ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్టౌన్ ఎస్ఐ రంగస్వామి తెలిపారు. కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పీ సీరియస్కడప అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున రాత్రి 8 గంటల సమయంలో కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్లో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కఠిన చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్ల వర్షం కురిపించుకున్నా.. చర్యలు తీసుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నారని.. వన్టౌన్ సీఐ సి భాస్కర్రెడ్డి, ఎస్ఐలు తిరుపాల్నాయక్, ఎర్రన్న, మహమ్మద్రఫీ, ఆలీఖాన్, రంగస్వామిలకు ఛార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. కడప వపోలీసు అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అప్రమత్తతతోనే.. ప్రమాదాలకు చెక్
నిత్య జీవితంలో విద్యుత్తు ఎంతో అవసరం. వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాల బారిన పడాల్సిందేనని విద్యుత్తు అధికారులు హెచ్చరిస్తున్నారు. గంట కరెంట్ లేకపోతే ఊపిరాడదు... అయితే విద్యుత్తుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, జాగ్రత్తలు తీసుకోకపోతే అన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెబుతున్నారు. ఈదురుగాలులతో వర్షాలు కురిసినపుడు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు విద్యుత్తు శాఖ సిద్ధమవుతోంది. కడప కార్పొరేషన్ : విద్యుత్తు ప్రమాదాలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) నడుం బిగించింది. సంస్థలో పని చేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది, వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తోంది. సబ్ స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలు, రైతుల్లో చైతన్యం పెంచేందుకు చర్యలు చేపడుతోంది. వైఎస్సార్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. సిబ్బందికి సూచనలు వైఎస్సార్ జిల్లాలో 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 41 విద్యుత్తు ప్రమాదాలు జరిగాయి. 2023–24లో 29 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొందరు విద్యుత్తు ఉద్యోగులు ఐదు నిముషాల పనే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సేఫ్టీ పరికరాలు వాడకపోవడంతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే మేలు ● ఇళ్లలో అంతర్గత వైరింగ్కు ఉపయోగించే విద్యుత్తు వైర్లు, స్విచ్లు, హోల్డర్లు, ఇతర పరికరాలు ఐఎస్ఐ మార్కు కలిగినవే ఉండాలి. ● ఇంట్లో స్విచ్ బోర్డులను తగినంత ఎత్తులో అమర్చుకుని మోటార్ల స్విచ్లు(స్టార్టర్) ఆన్, ఆఫ్ చేసేటపుడు విధిగా కాళ్లకు, చేతులకు రబ్బరు తొడుగు ధరించాలి. తేమ లేకుండా చూసుకోవాలి. ● విద్యుత్ సర్వీసు వైర్ తగిన కెపాసిటీ ఉండేది వాడినట్లయితే సరఫరాలో అంతరాయం, ఓల్టేజ్లో హెచ్చుతగ్గులను నివారించవచ్చు. ● ప్రతి ఇంటా విద్యుత్ సర్వీసుకు, పొలాల వద్ద అమర్చే స్టార్టర్లకు ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ● వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు తాకరాదు. తడిచేతులతో, తడి కాళ్లతో ఉన్నప్పుడు స్విచ్లు ఆన్ ఆఫ్ చేయరాదు. ● ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు తక్కువ ఎత్తులో విద్యుత్ లైన్లు, స్తంభాలున్నచో విద్యుత్ శాఖ ిసిబ్బందికి తెలియజేసి నిబంధనల ప్రకారం దూరం పాటించాలి. ● బహిరంగ ప్రదేశాలు, పంట పొలాల్లో జంతువుల బారిన పడకుండా కట్టెలపై విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా ఇవ్వడం చట్టారీత్యా నేరం. ● పొలాల్లో, ఇతర ఏ ప్రదేశంలోనైనా విద్యుత్ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బంది, 1912కు గానీ తెలియజేయాలి. ● గ్రామాలలో కొంతమంది విద్యుత్తును కొక్కెముల ద్వారా తీసుకుంటే అవి తెగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. స్తంభం నుంచి మాత్రమే కనెక్షన్ తీసుకోవాలి. ● విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, ఫీజులు వేయడం వంటి పనులు సొంతంగా నిర్వహించకుండా సిబ్బందికి తెలియజేయాలి. ● ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగినట్లు గమనిస్తే ఆ వ్యక్తిని గానీ, విద్యుత్ పరికరాన్ని గానీ నేరుగా తాకరాదు. పరికరాలు మరమ్మతు చేసేటపుడు భద్రతా నియమాలు పాటించాలి. విద్యుత్తు ప్రమాదాలపై అవగాహనా సదస్సులు జాగ్రత్తలపై విద్యుత్తు శాఖ విస్తృత ప్రచారం ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలువిద్యుత్తు ప్రమాదాలపై అవగాహన అవసరం ప్రమాదాల నివారణకు ప్రీ మాన్సూన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యుత్తు ప్రమాదాలపై ప్రజలను నిరంతరం చైతన్య పరిచేందుకు అవగాహన కల్పిస్తున్నాం. పోల్ నుంచి వైర్ను స్టార్టర్కు తీసుకు పోవడంలో ఎక్కడా జాయింట్లు ఉండరాదు. కచ్చితంగా స్టార్టర్కు ఎర్తింగ్ చేసుకోవాలి. విద్యుత్తు సిబ్బంది ఎల్సీ తీసుకొని కరెంటు లేదని నిర్ధారించుకున్న తర్వాతే పనులు చేయాలి. – ఎల్.నరసింహప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కడప డివిజన్, ఏపీఎస్పీడీసీఎల్ -
వేధింపులపై ఫిర్యాదు
ప్రొద్దుటూరు క్రైం : భర్త నిత్యం తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన పెద్దబాబు, అనితలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. లైన్మెన్గా పని చేసే పెద్దబాబు నిత్యం మద్యం తాగి తనను కొడుతూ వేధిస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసేది. తాజాగా మళ్లీ కొట్టడంతో ఆమె శుక్రవారం సాయంత్రం టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అబ్దుల్నజీర్ తెలిపారు. ఆర్టీపీపీ కార్మికుడి ఆత్మహత్య ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో నివాసముంటున్న ఆర్టీపీపీ కాంట్రాక్ట్ కార్మికుడు వల్లెపురెడ్డి సుదర్శన్రెడ్డి(38) ఇంట్లోనే ఉరి వేసుకుని శుక్రవారం ఆత్యహత్య చేసుకున్నట్లు యర్రగుంట్ల హెడ్ కానిస్టేబుల్ రాఘవరెడ్డి తెలిపారు. వల్లెపురెడ్డి సుధర్శన్రెడ్డి ఆర్టీపీపీలోని కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య ఉమామహేశ్వరితోపాటు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్రెడ్డి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి...ఎర్రగుంట్ల : రైలు కింద పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుంట్ల–ప్రొద్దుటూరు రైల్వే మార్గంలో రైలు కింద పడి ఎలగటూరు లక్ష్మీదేవి(35) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు యర్రగుంట్ల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజారాంరెడ్డి శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలానికి చెందిన ఎలగటూరు లక్ష్మీదేవికి మానసిక స్థితి సరిగా లేక గత ఆరేళ్లుగా చికిత్స చేయించు కుంటున్నారు. మృతిరాలి భర్త వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన లక్ష్మీదేవి ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో విజయవాడ–ధర్మవరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి నియామకం
వేంపల్లె : MýSyýlç³ hÌêÏ fÐ]l$ÃÌS-Ð]l$-yýl$VýS$ ç³rt-×ê-°MìS ^ðl…¨¯]l AíÜ-òÜt…sŒæ {´÷òœçÜÆŠ‡ yéMýStÆŠ‡ ò³¯]l$Vö…yýl Æý‡Ñ-MýS$-Ð]l*-ÆŠ‡¯]l$ Cyýl$-ç³#-ÌS´ëĶæ$ BÆó‡P ÐéÅÎ {sìæç³#ÌŒæ Isîæ ç³Ç-´ëÌS¯é-«¨-M>-ÇV> °Ä¶æ$-Ñ$-çÜ$¢-¯]l²r$Ï OyðlÆð‡MýStÆŠ‡ yéMýStÆŠ‡ MýS$Ð]l*-Æý‡-ÝëÓÑ$ VýS$´ë¢ K {ç³MýS-r-¯]lÌZ ™ðlÍ-´ëÆý‡$. yéMýStÆŠ‡ ò³¯]l$Vö…yýl Æý‡ÑMýS$-Ð]l*ÆŠ‡ f´ë¯ŒS ĶæÊ°Ð]l-ÇÞsîæ B‹œ AƇ$$k ¯]l…§ýl$ ï³òßæ-^Œlyîl ç³NÇ¢-^ólíÜ, Cyýl$-ç³#ÌS-´ëĶæ$ {sìæç³#ÌŒæ IsîæÌZ MýS…ç³NÅ-rÆŠ‡ OòܯŒSÞ Ñ¿ê-VýS…ÌZ AíÜ-òÜt…sŒæ {´÷òœçÜÆŠ‡V> Ñ«§ýl$Ë$ °Æý‡Ó-íßæ-çÜ$¢-¯é²Æý‡$. 糧ólâýæÏ ¯]l$…_ ĶæÊ°-Ð]l-ÇÞsîæÌZ G…sñæMŠS Mø BÇz¯ól-rÆŠ‡V>, Isîæ C¯ŒS-bé-ÇjV>, yìl´ëÆý‡Šె-r-Ã…sŒæ {MýSÐ]l$-Õ-„ýS×æ MýSÑ$sîæ çÜ¿¶æ$ÅË$, ™èl¨-™èlÆý‡ »ê«§ýlÅ-™èl-ÌS¯]l$ °Æý‡Ó-íßæ…_ {MìSĶæ*-ÖÌS-MýS…V> Ð]lÅÐ]lçßæ-Ç…-^éÆý‡$. Æý‡Ñ-MýS$-Ð]l*ÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* ™èl¯]lOò³ ¯]lÐ]l$Ã-MýS…™ø C_a¯]l »ê«§ýlÅ-™èl¯]l$ {MìSĶæ*-Ö-ÌS-MýS…V> °Æý‡Ó-íßæ…_ ĶæÊ°-Ð]lÇÞsîæ AÀ-Ð]l–-¨®MìS MýS–íÙ ^ólÝë¢-¯]l-¯é²Æý‡$. -
సింహ వాహనంపై అగస్త్యేశ్వరుడు
ప్రొద్దుటూరు కల్చరల్ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో శుక్ర వారం రాత్రి స్వామి సింహ వాహనంపై ఊరేగారు. వేకువ జామున అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చన చేసి ప్రత్యేకంగా అలంకరించారు. 200 మంది భక్తులకు సామూహికంగా ఐదుసార్లు లలితా సహస్రనామాన్ని లోకకల్యాణార్థం పఠించారు. రాత్రి గంగా, రాజరాజేశ్వరీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను సింహ వాహనంపై కొలువుదీర్చి శివనామస్మరణ మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల వాహనం బోల్తా వేముల : మండల కేంద్రమైన వేములలో శుక్రవారం గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న వాహనం డివైడర్ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి సంఘటన జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వాహనం బోల్తాపడి గ్యాస్ సిలిండర్లులీకై ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
టీడీపీ దుశ్చర్యలకు సహకరించవద్దు
కడప కార్పొరేషన్ : పల్నాడు ప్రాంతాన్ని రావణ కాష్టం చేస్తున్న టీడీపీ నాయకులు అదే పంథా కడపలో అనుసరించాలని ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి ఎస్బి.అంజద్బాషా ఓ ప్రతికా ప్రకటనలో ఆరోపించారు. టీడీపీ మాయలోపడి, వారి దుశ్ఛర్యలకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. 2014, 2019లో లేని ఘర్షణలు ఇప్పుడు వస్తున్నాయంటే టీడీపీ కుట్రేనని ప్రజలు గ్రహించాలన్నారు. కడప ఎమ్మెల్యేగా తనను గెలిపించడానికి అవిశ్రాంతంగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల అనంతరం పల్నాడులో టీడీపీ రౌడీలు చేసిన అరాచకం ప్రజలకు తెలుసునన్నారు. ఇపుడు ప్రశాంతమైన కడప నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాదరణతో ఎమ్మెల్యేగా గెలిచానని, మూడోసారి తాను హ్యాట్రిక్ సాధించబోతున్నానని తెలిపారు. కడపలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్బాషా -
విద్యుత్ షాక్తో ఏడు గేదెలు మృతి
బి.కోడూరు : మండలంలోని టమటంవారిపల్లె గ్రామానికి చెందిన మడతల సుబ్బలక్ష్మమ్మకు చెందిన 4, ద్వారకచర్లరమాదేవికి చెందిన 2 గేదెలు, బొల్లాగురివిరెడ్డికి చెందిన గేదె పుల్లివీడు పొలాలకు మేతకు తీసుకెళ్లారు. అక్కడ 11 కె.వి. విద్యుత్తు తీగల తగలడంతో షాక్కు గురై ఏడు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులు తమను ఆదుకోవాలని వారు కోరారు. పిచ్చి కుక్క వీరంగం – ఆరుగురు చిన్నారులకు గాయాలు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్కాలేజి రోడ్డు, ఖాదర్హుస్సేన్ మసీదు వీధుల్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. శుక్రవారం రాత్రి కుక్క దాడి చేయడంతో ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయ పడిన చిన్నారులను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చిన్నారులను ఇంటికి తీసుకెళ్లారు. ఒకే సారి ఆరుగురు పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ తనిఖీ – కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు కడప అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం నగర శివారులోని ‘మౌలానా అజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ’లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వుండాలన్నారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో వుంటుందన్నారు. ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నలుగురు అంతకుమించి గుంపులుగా వుండరాదని, అనుమ తులు లేకుండా ఎక్కడా సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏఆర్) ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, ‘దిశ’ డీఎస్పీ రమాకాంత్, డి.టి.సి డీఎస్పీ రవికుమార్, రిమ్స్ పిఎస్ సీఐ కె. రామచంద్ర, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరుకల్లా విద్యాకానుక
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా అందించే విద్యాకానుక ఈ నెలాఖరుకంతా అన్ని మండల కేంద్రాలకు చేరుతా యని సమగ్రశిక్ష ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ చల్లా విశ్వనాథరెడ్డి, ఏసీఎంఓ దశరథరామిరెడ్డి తెలిపారు. విద్యాకానుకలో భాగంగా శుక్రవారం కడప మండలానికి సంబంధించిన నోట్ బుక్స్ కడపలోని సీఎస్ఐ స్కూల్లోని స్టాక్ పాయింట్కు చేరాయి. కడప సీఎస్ఐ స్కూల్ స్టాక్ పాయింట్కు చేరిన విద్యాకానుకలోని నోట్ బుక్స్ను సమగ్రశిక్ష ఏఎల్ఎస్ కో – ఆర్డినేటర్ చల్లా విశ్వనాథ రెడ్డి, ఏసీఎంఓ దశరథరామిరెడ్డి కడప ఎంఈఓ–1 పాలెం నారాయణ, ఎంఈఓ–2 ఇర్షాద్ అహ్మద్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలాఖరు కంతా విద్యాకానుకలోని అన్ని వస్తువులు ఆయా మండలాల్లోని స్టాక్ పాయింట్లకు చేరతాయని తెలిపారు. కడప మండలంతో పాటు మైదుకూరు, దువ్వూరు మండలాలకు సంబంధించిన విద్యాకానుకలోని నోట్బుక్స్ ఆయా మండల కేంద్రాలకు వచ్చాయని తెలిపారు. సమగ్రశిక్ష సిబ్బంది బాస్కర్,సీఆర్పీలు కృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లకు చేరుతున్న నోట్బుక్స్ కడపతోపాటు పలు మండల కేంద్రాలకుచేరుతున్న కానుక వస్తువులు -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప రామాంజనేయపురంలోని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5,6,7,8 తరగతులలో మిగిలిన సీట్లలో ప్రవేశానికి ముస్లిం మైనారిటీ, దూదేకుల విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి దరఖాస్తులు ఇవ్వాలని ప్రిన్సిపాల్ పెతకంశెట్టి సోమ సత్యశేఖర్ తెలిపారు. వివరాలకు 77801 79446, 9059500173 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి జూన్ 10వ తేదీ వరకు గడువు ఉందని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://iti.ap.gov.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరడానికి ఎలాంటి ఫీజులు, డోనేషన్స్ కట్టవలసిన అవసరం లేదని తెలిపారు. డీఎల్టీసీ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్టు, మోటార్ మెకానిక్, టర్నర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ ట్రేడ్లలో సీట్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ అన్ని సర్టిఫికెట్లు, ఒక ఫొటో, ఆధార్, తల్లి, తండ్రి ఆధార్కార్డు తీసుకుని నేరుగా కడప ఐటీఐ సర్కిల్లోని ప్రభుత్వ డీయల్టీసీ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 8555958200, 9948827811 నెంబర్లను సంప్రదించాలని డిఎల్టీసీ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ పరిశీలనవైవీయూ: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్)–2024 జరుగుతున్న పరీక్షా కేంద్రాలని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఆచార్య చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన కడపలోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలు, పరీక్షలకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాల గురించి నిర్వాహకులతో మాట్లాడారు. రేపు క్రికెట్ జట్ల ఎంపిక కేవీపల్లె: వచ్చే నెల గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ పోటీకు ఆది వారం జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు ఏపీ టీ20 క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అద్వైత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మండలంలోని గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠ శాల క్రీడా మైదానంలో అండర్ 16, అండర్ 19, సీనియర్స్ విభాగంలో జిల్లా జట్లను ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 97015 15415, 8309365583 నంబర్లలో సంప్రదించాలన్నారు. రక్తపోటు నియంత్రణతో మెరుగైన ఆరోగ్యం కడప రూరల్: రక్తపోటు నియంత్రణతో జీవన ప్రమాణాలను పెంపొందించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించడం, దానిని అదుపులో ఉంచుకోవడం, తద్వారా జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో దాదాపుగా 30 శాతం మంది ప్రజలు రక్తపోటుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. అధిక ఒత్తిడి, ఆహరపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలు రక్తపోటుకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.30 ఏళ్లు దాటిన వారు కనీసం నెలకు ఒకసారి రక్తపోటును పరీక్షించుకోవడం మంచిదన్నారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సూచనల ప్రకారం మందులను వాడి జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరకుమార్, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్, జిల్లా కంటి వెలుగు కో ఆర్డినేటర్ డాక్టర్ సునీత, జిల్లా మలేరియా అధికారి మనోరమ, భారతి, రమణమ్మ పాల్గొన్నారు. -
రారండోయ్.. వేడుక చూద్దాం!
రాజుపాళెం: రాజుపాళెం మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వెల్లాలలో శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలు 19వ తేది ఆదివారం నుంచి 27వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా 20న కల్యాణోత్సవం, 22న హనుమంతోత్సవం, 23న గరుడోత్సవం, 25న రథోత్సవం (తిరుణాల) కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానముల చైర్మన్ బుక్కసముద్రం జగదీశ్వర రెడ్డి, ఈఓ బీవీ నరసయ్య తెలిపారు. 23న గురువారం రాత్రి మాధవ్ మ్యూజికల్స్ వారిచే ఆర్కెస్ట్రా ఉందన్నారు. రాష్ట్రంలోని వివిద జిల్లాల్లోని భక్తులే కాక ఇతర దేశాల నుంచి భక్తులు కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని చైర్మన్ చెప్పారు. 25న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు 25వ తేదీన శనివారం రథోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సీనియర్ వృషభరాజములకు బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ బహుమతులుగా రూ.1,10,000, రూ.75,000, రూ.50,000, రూ.30,000, రూ.20,000, రూ.10,000, మిగిలిన ఎడ్లకు ప్రోత్సాహక బహుమతుల కింద రూ.5 వేలను అందజేస్తామన్నారు. వెల్లాలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు వెల్లాల పుణ్యక్షేత్రంలో బ్రహోత్సవాలు జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. –బి. జగదీశ్వర రెడ్డి, దేవస్థానాల చైర్మన్ -
క్రికెట్ ఎంపికలకు చక్కటి స్పందన
● సీనియర్స్, అండర్–23, 19, 15 మహిళల విభాగాల్లో ఎంపికలు కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో శుక్ర వారం జిల్లాస్థాయి మహిళల క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. సీనియర్స్ విభాగం, అండర్–23, అండర్–19, అండర్–15 విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 85 మంది క్రీడాకారిణులు విచ్చేశారు. ఈ ఎంపికలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్లో మహిళలకు చక్కటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రీడాకారిణులు బాగా సాధన చేసి జిల్లా జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. త్వరలో జిల్లాజట్టుకు ఎంపికయ్యే క్రీడాకారిణుల జాబితాను ప్రకటిస్తామని సీఏవైడీ ప్రతినిధులు పేర్కొన్నారు. మహిళల క్రికెట్ కోఆర్డినేటర్ కె. విష్ణుమోహన్రావు, ఏసీఏ సౌత్జోన్ హెడ్కోచ్ పి.మధుసూధన్రెడ్డి, సీఏవైడీ ప్రతినిధులు ఎల్. మునికుమార్రెడ్డి, శివప్రసాద్, కోచ్లు ఇలియాస్, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement