-
ఓటు హక్కును వినియోగించుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. ఆదివారం స్వీప్ ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు 5కే రన్, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో మెప్మా సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు్, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, రెవెన్యూ ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లు సుమారు 600 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’, ‘ఓటు హక్కు.. ప్రజల హక్కు’, ‘ఓటేసే బాధ్యత మనందరిది’, ‘బుల్లెట్ కన్నా.. బ్యాలెట్ మిన్న’ అని నినాదాలు చేశారు. అలాగే ఓట్ల పండుగపై కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్లో 18 ఏళ్లు దాటిన వారందరూ తమ ఓటును తప్పక వేయాలన్నారు. ఏ ఒక్క ఓటూ వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనేలా కృషి చేయాలన్నారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ సుమన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
పక్కాగా పరిశీలన..
సాధారణంగా ఎన్నికలంటే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్రజాస్వామ్యాన్ని అరికట్టేందుకు, ఎన్నికల్లో పారదర్శకత ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఖర్చులపై నిబంధన విధించింది. ప్రతి రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఈసీ వ్యయ పరిశీలనతో పాటు కేంద్రం, రాష్ట్ర ఎన్పోర్స్మెంట్ సంస్థలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో సర్వేలైన్స్ బందాలు సమాచారాన్ని సేకరిస్తాయి. అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభలతోపాటు ర్యాలీలు, రోడ్షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి భోజనం, టీ, కాఫీ వరకు అంతా లెక్కిస్తారు. అభ్యర్థుల ఖర్చు వివరాలపై పరిమితి ఉన్నా ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అనే విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. -
జనజాతర సభ సైడ్లైట్స్
● సాయంత్రం 4.42 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్లో పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 4.48 గంటలకు ప్రత్యేక కాన్వాయ్లో సభా ప్రాంగణానికి బయల్దేరారు. ● 5 గంటలకు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైకి చేరుకున్నారు. ● ముందుగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించిన తర్వాత చివరలో రాహుల్గాంధీ మాట్లాడారు. ● రాహుల్గాంధీ ప్రసంగం 5.50 గంటలకు ముగిసింది. ● హెలీకాప్టర్లో 5.55 గంటలకు రాహుల్గాంధీ తిరిగి వెళ్లిపోయారు. ● జై కాంగ్రెస్ అని గట్టిగా నినదిస్తే బంగ్లాలో గుండెలు దద్దరిళ్లాలని సీఎం రేవంత్రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. – అలంపూర్ /ఎర్రవల్లి చౌరస్తా/ మానవపాడు/ ఉండవెల్లి -
హోం ఓటింగ్ పరిశీలన
జడ్చర్ల టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న హోం ఓటింగ్ ప్రక్రియను ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా పరిశీలించారు. 85 ఏళ్లు దాటిన, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు జడ్చర్ల మండలంలో 29 మంది ఓటర్లు హోం ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఓటర్ల వద్దకు రెండు బృందాలు వెళ్లి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ చేయించారు. ఈ ప్రక్రియను నిమ్మబావిగడ్డలో ఓటరు ఇంటి వద్ద ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు, ఓటు వేసే విధానాన్ని పరిశీలకులు భూటియా పరిశీలించారు. ఓటర్లను కలిసి మాట్లాడారు. హోం ఓటింగ్ వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. రూట్ల వారీగా జరుగుతున్న హోం ఓటింగ్ వివరాలను అసిస్టెట్ రిటర్నింగ్ అధికారి మోహన్రావు ఆయనకు వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement