-
భవన నిర్మాణ కార్మికులకు వైద్య శిబిరం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది కార్మికులకు వైద్యులు, సిబ్బంది వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి మందులతో పాటు తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, డీసీఎల్ చంద్రశేఖర్గౌడ్, మహబూబ్నగర్, గద్వాల ఏఎల్ఓలు అల్తాఫ్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ సన్నిధిలో ఐటీ శాఖ అదనపు డైరెక్టర్
అలంపూర్ రూరల్/ఎర్రవల్లిచౌరస్తా: ఐదో శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను శనివారం కేంద్ర ఐటీ శాఖ అదనపు డైరెక్టర్ సంతోష్కుమార్ పాండే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈఓ పురేందర్కుమార్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులతో కలిసి ఈఓ ఆయనను శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని అదనపు డైరెక్టర్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల, ఈఓ రామన్గౌడ్, సిబ్బంది మాసూంబాషా పాల్గొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ
మహబూబ్నగర్ క్రీడలు: మలేషియాలో ఇటీవల నిర్వహించిన 20వ అంతర్జాతీయ ఒకినావా గోజోరియో కరాటే ఓపెన్ చాంపియన్షిప్లో జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్కు చెందిన అలంపల్లి సాన్విచంద్ర అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. కటాస్లో బంగారు పతకం, కుమితేలో కాంస్య పతకం సాధించింది. బంగ్లాదేశ్, సింగాపూర్, మలేషియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి కరాటే మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ఇప్పటి వరకు సాన్విచంద్ర 9 మెడల్స్, జాతీయ స్థాయిలో 18 మెడల్స్ సాధించింది. హైదరాబాద్లోని షోభూకే షిటో రియో కరాటేడూ కోచ్ కలిమెల శామ్యుల్ వద్ద మార్షల్ ఆర్ట్స్లో సాన్విచంద్ర శిక్షణ తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాన్పూర్, బెంగళూరులలోని భారత వాయుసేన విభాగంలో సంగీతకారుడి నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహ్మద్ జానీపాషా ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://agnipathvayu.cdac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. తాత్కాలికంగా అడ్మిట్ కార్డు జారీ చేసిన నమోదిత అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారని, ముఖ్యంగా రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డులో ఉంటుందని తెలిపారు. -
రాజీ అయ్యే కేసులపై దృష్టిపెట్టాలి
పాలమూరు: వచ్చే నెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో శనివారం కలెక్టర్ రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ క్రిమినల్, డ్రంకెన్ డ్రైవ్, ఈ పెట్టీ కేసులు, ఎన్ఐ యాక్ట్, భూ తగాదాలు, సివిల్ కేసులను అధికంగా పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వాహకులు మోటార్ వెహికల్ ప్రమాద కేసులలో కక్ష్యిదారులు రాజీ అయ్యే చర్యలు చేపట్టాలన్నారు. రాజీ అయ్యేలా ఉన్న కేసుల్లో కక్ష్యిదారులు లోక్ అదాలత్కు తప్పక హాజరయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్స్టేషన్ నుంచి పెండింగ్లో ఉండి రాజీ అయ్యే కేసులను గుర్తించాలని చెప్పారు. న్యాయవాదులు సైతం లోక్ అదాలత్పై అవగాహన కలిగించి ఎక్కువగా కేసులు రాజీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జైలు పరిశీలన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి జిల్లా జైలును సందర్శించారు. జైలులో ఉన్న వంట గది, భోజన సదుపాయం, నీటి వసతి, బ్యారక్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, జిల్లా జైలు సూపరింటెండెంట్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు అంతంతే..
మహబూబ్నగర్ (వ్యవసాయం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతుంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు 191 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ధాన్యం సేకరణ లక్ష్యం మాత్రం ముందుకు సాగడం లేదు. మరోదిక్కు మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతుంది. యాసంగి సీజన్కు గాను అధికారులు ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నా.. వ్యాపారుల డిమాండ్ను తట్టుకోలేక కనీసం 12.07 శాతం లక్ష్యం కూడా దాటలేకపోవడం విశేషం. వ్యాపారులు వరి ధాన్యానికి మంచి రేటు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుండటంతో దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల పంట ఇప్పటికే అమ్ముడుపోయింది. అయితే జిల్లావ్యాప్తంగా 191 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా 94 కేంద్రాలకు మాత్రమే ధాన్యం విక్రయించడానికి తీసుకువచ్చారు. మిగతా కేంద్రాలకు ధాన్యం విక్రయానికి రాక వెలవెలబోయాయి. వ్యాపారులు వరి ధాన్యానికి ఎక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించడానికి ఆసక్తి చూపలేదు. ఎప్పటికప్పుడు నమోదు.. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో నమోదు చేయడంతో సేకరణ త్వరితగతిన పూర్తవుతుంది. 2,895 మంది రైతుల నుంచి 16,014 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రూ.23.23 కోట్లు 1,854 మంది రైతులకు చెల్లించారు. సీఎంఆర్ భర్తీ కోసమేనా.. జిల్లాలో రైస్ మిల్లర్లకు అప్పగించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి ఇవ్వకుండా తమకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ధాన్యం భర్తీ చేసేందుకు రైస్ మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ప్రభుత్వానికి 2023– 24 వానాకాలం సీజన్కు సంబంధించి 31,010 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇంకా పెండింగ్లోనే ఉంది. తేమశాతంతో పని లేదు.. వరి కోతలు మొదలు కాగానే మిల్లర్లు రైతులను నేరుగా కలిసి ప్రభుత్వ మద్దతు ధరకు రూ.142 ఎక్కువ చెల్లించి.. తేమ శాతంతో పని లేకుండా కొనుగోలు చేస్తున్నారు. రైతులు మిషన్ల ద్వారా వరి కోతలు కోసి ట్రాక్టర్లలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. ఏ–గ్రేడ్ రకానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,208 ఉండగా.. మిల్లర్లు రూ.2,350 నుంచి పైకి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు పూర్తిగా పనిభారం తగ్గుతుంది. ధాన్యం ఆరబోయడం, హమాలీ చార్జీలు, బస్తాలు నింపడం, మిల్లులకు తరలించడం వంటి ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడంతో లాభాలు వస్తున్నాయి. జిల్లాలో లక్ష్యం చేరనివరిధాన్యం సేకరణ జిల్లాలో 191 కేంద్రాల ఏర్పాటు..అందుబాటులో 94 మాత్రమే.. మద్దతు ధరకు మించి కొంటున్నప్రైవేట్ వ్యాపారులు ప్రయోజనం పొందుతున్న అన్నదాతలు -
గ్రూప్–1కు 36 పరీక్ష కేంద్రాలు
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో వచ్చే నెల 9న జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఈ విషయమై శనివారం కలెక్టరేట్లో ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 15,199మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష జరిగే రోజున ఉదయమే తగిన భద్రత మధ్య ఓఎంఆర్ షీ ట్లు, ప్రశ్నపత్రాలను తరలించాలని సూచించా రు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఉదయం తొమ్మిది గంటల నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ పరిశీలించి లోపలికి అనుమతించాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పది గంటలకల్లా ప్రధాన గేట్లు మూసివేయాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. 22న హైదరాబాద్లో శిక్షణ హైదరాబాద్లో ఈనెల 22న పోలీసు, నోడల్ అధికారులకు శిక్షణ ఉంటుందని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. దివ్యాంగులు, అంధ అభ్యర్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దన్నారు. ఇదే విషయమై అంతకుముందు హైదరాబాద్ నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పలు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీసీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రాములు, డీఆర్ఓ కేవీవీ రవికుమార్ పాల్గొన్నారు. జడ్చర్ల: వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్ అన్నారు. శనివారం ఆయన జడ్చర్లలోని విత్తన, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తన నిల్వలు తదితర రికార్డులు, బిల్లులను పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లులపై విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాయాలన్నారు. ఎమ్మార్పీకి మించి విక్రయించినా.. నాసిరకమైన విత్తనాలను రైతులకు అంటగట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్ణీత ధరల వివరాలను దుకాణాల్లో బోర్డులపై పెద్ద అక్షరాలతో రైతులకు అర్థమయ్యేలా రాయించాలని సూచించారు. ప్రధానంగా బీటీ 3 విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ప్రధానంగా పత్తి, ఆముదాలు, మొక్కజొన్న, జొన్న, కంది, వరి విత్తనాలకు సంబంధించి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ఎస్టీ గురుకులాల్లోస్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల ఆర్సీఓ నాగార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. 23న బాలురకు, 25న బాలికలకు జిల్లాకేంద్రంలోని తిరుమల హిల్స్ వద్ద ఉన్న గురుకులంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నా రు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.83339 25369కు ఫోన్ చేయాలని సూచించారు. సోనామసూరి ధర రూ.2,419 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,419, కనిష్టంగా రూ.2,000 ధరలు నమోదయ్యాయి. సీజన్ తగ్గడంతో మార్కెట్కు సుమారు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. హాజరుకానున్న 15,199 మందిఅభ్యర్థులు సమీక్ష సమావేశంలోకలెక్టర్ రవినాయక్ -
మంచి ధరే వచ్చింది..
ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు పచ్చి ధాన్యానికి రూ.2,350 చెల్లించి కొనుగోలు చేసిండ్రు. ఈ యాసంగి సీజన్లో నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తే 103 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట మొత్తాన్ని ప్రభుత్వ కేంద్రాలకు తరలించకుండా వ్యాపారులకే అమ్ముకున్నా. దీంతో క్వింటాల్పై రూ.142 ఎక్కువ లాభం వచ్చింది. కాబట్టి ఈ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కాకుండా వ్యాపారులకు విక్రయించారు. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ అంచనాలు చేరుకోవడంకష్టమే.. జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలకు రైతులు తక్కువ మొత్తంలో ధాన్యం తీసుకువస్తున్నారు. సన్నరకం ధాన్యం మద్దతు ధరలకు వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేయడంతో బీ– గ్రేడ్ ధాన్యం కేంద్రాలకు వస్తుంది. తూకాలు పూర్తయినే వెంటనే వివరాలు ట్యాబ్లో నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఈసారి అంచనాలు చేరుకోవడం కష్టంగా ఉంది. – ప్రవీణ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ -
‘వాగ్దేవి’ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వాగ్దేవి కళాశాలకు ఐఎస్ఓ(ఇంటర్నేషనల్ స్టాండర్డ్డైజేషన్ ఫర్ ఆర్గనైజేషన్) లభించింది. ఈ మేరకు శనివారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డికి ఎస్ఓఎస్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల నుంచి వాగ్దేవి కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, మానవతా విలువలను పెంపొందిస్తూ సామాజిక స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ కళాశాలకు ఈ గుర్తింపు రావడం ఇదే మొదటిసారి అన్నారు. డీఐఈఓ శ్రీధర్సుమన్ మాట్లాడుతూ వాగ్దేవి కళాశాలలకు అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు పత్రం రావడం అభినందనీయమని, ఈ గుర్తింపుతో కళాశాల మరింత ముందుకు వెళ్తుందన్నారు. ఇంటర్మీడియట్లో ఇలాంటి గుర్తింపు పత్రం వచ్చినందుకు కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. తరగతి గదులు, ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్ వంటివి నిర్వహణ పూర్తిస్థాయిలో ఉండడం వల్ల సంస్థ నుంచి గుర్తింపు లభించిందన్నారు. మంచి నాణ్యతా ప్రమాణాలతో విద్య అందిస్తే విద్యార్థులు భవిష్యత్ బాగుంటుందన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, డీఐఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ సందీప్రెడ్డి, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, పావని, జ్యోతిచందన్, శివకుమార్, నాగేందర్, రాఘవేందర్రావు, మేగ్యనాయక్, రఘువరన్రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నవాబుపేట: మండల పరిధిలోని గురుకుంట సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గురుకుంట సమీపంలో పలుగుమర్రి వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అతడి చేయి విరిగి కొంత దూరంలో పడిపోయింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలియజేశారు. మృతికి సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ అభిషేక్రెడ్డి తెలియజేశారు. ఉరేసుకుని యువకుడు బలవన్మరణం ఊట్కూరు: మండలంలోని నిడుగుర్తి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిడుగుర్తికి చెందిన అరుణ, రఘువీర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన మణికంఠ(27) నారాయణపేట ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహించేవాడు. మూడు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఉదయం రైతులు పొలాలకు వెళ్తుండగా గ్రామ శివారులో చెట్టుకు మృతదేహం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. మృతుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై హెడ్కానిస్టేబుల్ రమేష్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలియజేశారు. యువతి ఆత్మహత్య అడ్డాకుల: మండల కేంద్రానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సులెమాన్ కుమార్తె రాధిక(24) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే యువతి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డు కాలనీలో ఓ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి దుకాణంలో పనిచేస్తున్న వారికి సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి సంబంధించి ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా అగ్నిప్రమాదంపై ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తల్లి కిడ్నాప్పై కూతురి ఫిర్యాదు బిజినేపల్లి: తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన తన తల్లి హంసమ్మను కిడ్నాప్ చేశారని ఆమె కూతురు శిరీష శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దరేవల్లి నుంచి హంసమ్మ స్వగ్రామానికి వస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు వాహనంలో తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
జడ్చర్లలో భారీ వర్షం
జడ్చర్ల టౌన్: పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ థియేటర్ ఎదురుగా ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లకుంట, ఆపై నుంచి వచ్చిన వరదనీరు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులు, వీధి వ్యాపారులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుండటంతో పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల– కల్వకుర్తి మార్గంలో 167వ నంబరు జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల సమీపంలో వరద నీరు నిలిచి తీవ్ర అసౌకర్యం కలిగింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటం, వరద నీరు ఎటు పోలేక రోడ్డుపైనే నిలిచిపోయి.. బురదగా మారింది. అలాగే 4వ వార్డులోనూ వరద నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. సాయినగర్, పలు కొత్త కాలనీల్లో రోడ్లు బురదమయంగా మారాయి. ఈ కారణంగా పాదచారులు, వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షంతో 11వ వార్డులో వరద నీటి తాకిడికి గంజ్ (వ్యవసాయ మార్కెట్) ప్రహరీ దెబ్బతింది. వరదనీటి తాకిడికి ప్రహరీ నెర్రెలు బారడాన్ని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అయితే వేసవితాపం నుంచి వర్షం ఉపశమనం కలిగించిందని పలువురు అభిప్రాయపడ్డారు. నిలిచిన విద్యుత్ సరఫరా జడ్చర్లలో భారీ వర్షం కురవడంతో మహబూబ్నగర్ నుంచి బాదేపల్లి సబ్స్టేషన్కు వచ్చే విద్యుత్ సరఫరా రెండుగంటలపాటు నిలిచిపోయింది. మహబూబ్నగర్– బాదేపల్లి మధ్య విద్యుత్ లైన్లో ఏర్పడిన అంతరాయం కారణంగా బాదేపల్లి, చర్లపల్లి, బూర్గుపల్లి, కిష్టంపల్లి, ఆలూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ అధికారులు స్పందించి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నుంచి సరఫరాను పునరుద్ధరించారు. జలమయమైన ప్రధాన రోడ్లు..వాహనదారుల ఇక్కట్లు -
ఎంసెట్లో ‘వాగ్దేవి’ విజయకేతనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవీ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ మేరకు విద్యార్థులు అగ్రికల్చర్ విభాగంలో అఖిల 2,039వ ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో అన్విత 2,243, నవ్యశ్రీ 2,528, వంశీకృష్ణ 2,541, స్వాతి 3,478, కీర్తన 4,893, శశాంక్ 6,197, కావ్య 6,637వ ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఇంటర్ చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని, దీంతోనే ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటీ, నీట్ అకాడమిక్ ఇన్చార్జి పావని, ఎంసెట్ ఇన్చార్జి షాకీర్, జ్యోతినందన్రెడ్డి, రాఘవేందర్రావు, కోట్ల శివకుమార్, నాగేందర్, మేగ్యనాయక్, నరేష్, సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
అలంపూర్: సాగు ఆరంభంలో చేసే కొన్ని పనులు దిగుబడిపై ప్రభావం చూపుతాయి. అటువంటి వాటిలో వేసవి దుక్కిలు ప్రధానమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవి దుక్కిల లాభాల గురించి వ్యవసాయ అధికారులు ఈ విధంగా వివరిస్తున్నారు. వేసవి దుక్కితో లాభాలు : ● నేల గుళ్లబారి నీటి నిల్వ శాతం పెరుగుతుంది. ● భూమి లోపల ఉండే వివిధ రకాల పురుగుల గుడ్లు, ప్వూపాలు చనిపోతాయి. ● కలుపును నివారించ వచ్చును. వేసవి దుక్కి అంటే.. ఖరీఫ్ సాగుకు ముందుగా వేసవిలో పొలాన్ని లోతుగా దున్నే విధానాన్ని వేసవి దుక్కి అంటారు. పోషకాల పెంపు నేలలోపలి గట్టి పొరలను పగులగొట్టడం వలన మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వస్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వలన మొక్కల ఎదుగుదలకు కావాల్సినంత తేమ పోషకాలు సమకూరుతాయి. దీని వలన నాణ్యమైన దిగుబడి వస్తాయి. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల చర్యలను కూడా అభివృద్ధి చేసేందుకు ఈ వేసవి దుక్కీలు తోడ్పడతాయి. కలుపు నివారణ లోతు దుక్కుల వలన పొలంలో ఉండే మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ వంటి మొదలగు దుంపలతో సహా పెగిలించవచ్చును. దీని వలన ఎండిపోయి కలుపు సమస్య తగ్గుతుంది. పురుగుల నిర్మూలన తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్ని కింది నేలను పైకి వచ్చేటట్లు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న వివిధ పురుగుల గుడ్లు, ప్యూపాలు సూర్యరశ్మి తాకిడికి చనిపోతాయి. వేసవి దుక్కిల వలన వరి పైరును ఆశించే కాండం తొలుచు పురుగు మొక్కజొన్నలో వచ్చే పురుగుల ఉధృతిని తగ్గింవచ్చును. తెగుళ్ల నివారణ సాగుకాలంలో పైరును ఆశించే వివిధ రకాల శీలింధ్రాలు వేసవిలో చేపట్టే లోతు దుక్కుల వలన ఎండ తాకిడికి చనిపోతాయి. తర్వాత పంట కాలంలో ఈ తెగుళ్ల తీవ్రత తగ్గుతుంది. ఉదాహరణకు వివిధ పంటల్లో వచ్చు ఎండు తెగుళ్లును వేసవి దుక్కుల వలన తగ్గు ముఖం పట్టించవచ్చు. దుక్కులతో ఇతర ప్రయోజనాలు ● ప్రాథమికంగా వేసవి దుక్కుల వలన తొలకరిలో పడే వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. దీంతోపాటు నేలలో తేమ నిల్వ శాతం వృద్ధి చెందుతుంది. ● నీరు బాగా ఇంకడం వలన నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వార మొలక శాతం పెరుగుతుంది. -
అక్రమ రిజిస్ట్రేషన్పై కలెక్టర్ సీరియస్
అమరచింత: పట్టణంలోని 20 గుంటల గ్రామకంఠం స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంపై శనివారం ఆత్మకూర్ సబ్ రిజిస్ట్రార్పై కలెక్టర్ తేజస్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను రద్దు చేయాలని సబ్రిజిస్ట్రార్కు పుర కమిషనర్ విన్నవించినా నాలుగు నెలలుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి నివేదిక పంపాలని కమిషనర్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కందకాన్ని కొన్నేళ్లుగా మహిళలు మరుగుదొడ్లకు వినియోగిస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే దయాకర్రెడ్డి నిధులు మంజూరు చేసి స్థలం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు. ప్రస్తుతం గ్రామకంఠంలో ఉన్న 20 గుంటల విలువైన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని పుర అధికారులు భావించారు. ఇదే సమయంలో జి.శ్రీనివాస్ ట్రస్ట్ పేరిట స్థలం అక్రమంగా రిజిస్ట్రేషన్ కావడంతో విషయం వెలుగుచూసింది. దీంతో కలెక్టర్ వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు ఏర్పాటు చేయాలని పుర అధికారులను ఆదేశించారు. నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరోమారు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సబ్రిజిస్ట్రార్ను ప్రశించినట్లు తెలుస్తోంది. జిల్లా రిజిస్ట్రార్కు నివేదించామని.. నివేదిక వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి సమాచారం ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ బదులిచ్చినట్లు తెలిపారు. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై కేసు నమోదు
తెలకపల్లి: మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ నారమళ్ల వెంకటయ్య ఆత్మహత్య ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఓ వృద్ధురాలి బంగారు నాను ఆటోలో పోయిందన్న అనుమానంతో నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు స్టేషన్కు పిలిపించి మందలించారని పేర్కొన్నారు. అయితే తన భర్త వెంకటయ్యను పోలీసులు అన్యాయంగా ఈనెల 15వ తేదీన స్టేషన్కు తరలించి చితకబాదారని.. మళ్లీ 16న స్టేషన్కు రావాలని చెప్పడంతో భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి భార్య అలివేల ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తన భర్తను అకారణంగా కొట్టిన పోలీసులపై చర్య తీసుకొని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా, ఆటో డ్రైవర్ వెంకటయ్యను పోలీసులు మందిలించారే తప్ప, కొట్టలేదని ఎస్ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీకి ఫిర్యాదు నాగర్కర్నూల్ క్రైం: పోలీసులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కు తెలకపల్లికి చెందిన అలివేలు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. తెలకపల్లికి చెందిన అలివేల తన భర్త వెంకటయ్య దొంగతనం చేశాడని నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి అకారణంగా పోలీసులు కొట్టడంతో దెబ్బలకు తాళలేక శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. తన భర్తను అకారణంగా కొట్టిన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
మామిడికి మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరలకు మామిడిని కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్లో మార్కెట్ నిర్మాణానికి రెండేళ్ల కిందట నిధులు మంజూరు అయినప్పటికీ స్థల సేకరణ సమస్యగా మారింది. దీంతో రైతులు మామిడిని అమ్ముకునేందుకు హైదరాబాద్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో మామిడి సాగు ఇలా.. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 34,712 ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. అందులో అధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 25,237 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్ మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఇక్కడి పండ్లకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. ఇక్కడ మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మేరకు రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ. 5.45 కోట్లు మంజూరు చేయడంతో పాటు స్థల సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. స్థల సేకరణ సమస్య.. కొల్లాపూర్ మండలంలోని మాచినేనిపల్లి శివారులోగల దేవాదాయశాఖ భూమిలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు మొదట అధికారులు శ్రీకారం చుట్టారు. 19 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఏర్పాటుచేసి, అందులోనే కొనుగోళ్లు, మామిడి కాయలు నిల్వ ఉంచేందుకు గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేవిధంగా ప్రతిపాదనలు తయారు చేయించారు. స్థల సేకరణ కోసం దేవాదాయశాఖకు ప్రభుత్వం ద్వారా లేఖ పంపించారు. అయితే భూబదలాయింపునకు దేవాదాయ శాఖ అధికారులు ముందుకు రాలేదు. లీజు ప్రకారం ఇస్తామని చెప్పారు. అదీ కూడా రెండేళ్లకోసారి రెన్యువల్ చేసుకునేలా ప్రతిపాదనలు చేశారు. దీనిపై మార్కెటింగ్ శాఖ అధికారులు విముఖత వ్యక్తంచేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గోదాములు, కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి, రెండేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని దేవాదాయశాఖ అధికారుల ప్రతిపాదనలను తిరస్కరించారు. కనీసం 20 నుంచి 30 సంవత్సరాలపాటు లీజుకు ఇస్తేనే మార్కెటింగ్ నిర్మాణాలు చేపడతామని స్పష్టంచేశారు. రామాపురం శివారులోని గుట్టపై మార్కెట్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. అయితే అక్కడ మార్కెట్ నిర్మాణానికి స్థలం అనువుగా లేదని ఇంజినీరింగ్ అధికారులు నివేదిక ఇవ్వడంతో అక్కడ కూడా నిర్మాణం జరగలేదు. చివరగా కొల్లాపూర్లోని ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మార్కెట్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన స్థల సర్వే ప్రారంభమయ్యేలోపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మామిడి మార్కెట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పండ్ల విక్రయానికి రైతుల అవస్థలు వ్యాపారుల సిండికేట్తో నష్టాలు కొల్లాపూర్లో ముందుకుసాగని మార్కెట్ నిర్మాణం మార్కెట్ నిర్మించాలి.. కొల్లాపూర్లో మామిడి సాగు చేసే రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. పాలకులు వారిని పట్టించుకోవడం లేదు. మామిడి మార్కెట్ నిర్మాణం కొన్నేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది. ఈఅంశంపై ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అన్ని మండలాల రైతులకు అందుబాటులో ఉండేవిధంగా, అన్ని వసతులతో మార్కెట్ నిర్మాణం చేపట్టాలి. ఈఏడాది పంట నష్టపోయిన ౖమామిడి రైతులను ఆదుకోవాలి. – సాయికృష్ణగౌడ్,బీజేపీ నాయకుడు, కొల్లాపూర్ అనువైన స్థలం కోసం చూస్తున్నారు.. మామిడి మార్కెట్ నిర్మా ణం మార్కెటింగ్ శాఖ పరిధిలోని అంశం. మార్కె ట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొన్ని నెలల కిందట చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందు కు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు మార్కెట్లకు వెళ్తున్నారు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
వైన్స్ ఘటనలో 8 మంది రిమాండ్
మహబూబ్నగర్ క్రైం: మద్యం దుకాణం దగ్గర జరిగిన గొడవలో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు కారకులైన వ్యక్తులు రూరల్ పోలీస్స్టేషన్లో లొంగిపోవడంతో వారందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ గాంధీనాయక్ వెల్లడించారు. అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(25) మార్చి 25న స్నేహితులతో కలిసి అల్లీపూర్లో జరిగిన ఓ గృహ ప్రవేశం ఫంక్షన్ కోసం వచ్చాడు. ఈ క్రమంలో మద్యం కోసం బండమీదిపల్లిలో ఉన్న మల్లికార్జున వైన్స్ దగ్గరకు రాగా.. వైన్స్లోని కౌంటర్పై ఉన్న రవికుమార్రెడ్డిని బీరు ఇవ్వాలని శ్రీకాంత్ కోరాడు. అయితే రవికుమార్రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో శ్రీకాంత్ అల్లీపూర్ వెళ్లి అక్కడ ఉన్న స్నేహితులకు విషయం చెప్పడంతో అందరూ కలిసి అడగటానికి వచ్చారు. దీంతో వైన్స్ నిర్వాహకులను అడగటానికి వెళ్లిన శ్రీకాంత్ అతని స్నేహితులను వైన్స్ యజమాని కోట్ల అరుణ్కుమార్రెడ్డి మీకు ఎంత ధైర్యం రా.. మమ్మల్ని వచ్చి అడుగుతారా.. మిమ్మల్ని కొడితే ఇంకా ఎవరూ కూడా ఇక్కడ గొడవ చేయరంటూ అతనితోపాటు రవికుమార్రెడ్డి, రాకేష్, కోట్ల ప్రవీణ్కుమార్రెడ్డి, శివశంకర్, కోట్ల కృష్ణారెడ్డి, వెంకటేష్, చెన్నమ్మ, చంద్రప్రకాష్గౌడ్, రఘుపతిరెడ్డి కలిసి శ్రీకాంత్ను విచక్షణ రహితంగా.. అతి కిరాతకంగా కొట్టడంతోపాటు తలను గోడకు బలంగా గుద్దారు. స్థానికులు కేకలు వేయడంతో వదిలేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ చికిత్స పొందుతూ యశోద ఆస్పత్రిలో ఈ నెల 14న మృతిచెందాడని సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై శ్రీకాంత్ తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా.. దాడి చేసిన వారు లొంగిపోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. ఇందులో ఏ1 రవికుమార్రెడ్డి, ఏ2 అరుణ్కుమార్రెడ్డి, ఏ3 రాకేష్, ఏ4 కోట్ల ప్రవీణ్కుమార్రెడ్డి, ఏ6 కోట్ల కృష్ణారెడ్డి, ఏ7 వెంకటేష్, ఏ8 చెన్నమ్మ, ఏ9 చంద్రప్రకాష్గౌడ్ అరెస్టు చేయగా ఏ5 శివశంకర్, ఏ10 రఘుపతిరెడ్డి ఇద్దరూ పరారీలో ఉన్నారు. వీరి నుంచి సెల్ఫోన్లు, దాడి చేసిన కట్టెలు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా హత్య జరిగినప్పుడు కేసు విచారణ చేయడానికి కొంత సమయం పడుతుందని, ఇంతలోనే పట్టణంలో కొన్ని సంఘాలు ఏదో జరిగినట్లుగా.. నేరస్తులను తప్పిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. పోలీస్ శాఖపై నమ్మకం ఉంచాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరారీలో మరో ఇద్దరు నిందితులు వివరాలు వెల్లడించిన సీఐ గాంధీనాయక్ -
No Headline
● ఐపీఎల్కు ధీటుగా సాగుతున్న దందా ● చేతులు మారుతున్న రూ.లక్షలు ● జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.. మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఒకవైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుంటే.. మరోవైపు రాజకీయ అభిమానులకు మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు అనే ఫీవర్ పట్టుకుంది. నిన్న.. మొన్నటి వరకు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీగా జరిగిన మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో విజేత ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటు రాజకీయ నేతలతోపాటు.. ఓటర్ల వరకు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న విజేత ఎవరో తేలనుండగా.. ఈ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ కడుతున్నారు. పందెం పేరిట ఒక్కొక్కరు రూ.లక్షల మేర బెట్టింగ్ కాస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, యువత ఈ బెట్టింగ్పై దృష్టిపెట్టారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజేతగా నిలుస్తాడు అనే అంశంపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఎన్నికలు ముగియడం.. అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. -
సత్తాచాటిన ‘ప్రతిభ’ విద్యార్థులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబర్చారు. ఇంజినీరింగ్ విభాగంలో గణేష్ 970, అనిరుధ్గౌడ్ 2,296, శ్రీకాంత్ 2,577, అభిత్ 2,781, సాయి ఈశ్వర్ 2,923, నవ్యశ్రీ 3,416, చరణలాల్ 5,024, సాగసాయిచేతన్ 5,195, నమిత 5,425, తదితరులు ర్యాంకులు సాధించారు. వీరితో పాటు అగ్రికల్చర్లో వెంకటేష్ 1,585, మౌనశ్రీ 2,053, చంద్రిక 2,635, సుప్రియ 3,052, రక్షిత 3,338, ప్రణీత 3,555, సపూరతంకిన్ 3,758, సంధ్యారాణి, 4,665, మౌనిక 4,760, ప్రణ న్సిక 5,198, అక్షయ 5,231వ ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్, ఇంజినీరింగ్లో 10వేల లోపు 78 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్దన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో మహిళకు రిమాండ్
నాగర్కర్నూల్ క్రైం: చోరీ కేసులో మహిళను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్టుకూరుకు చెందిన బాలమ్మ ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులోని కావలి నాగయ్య ఇంట్లో 22 తులాల వెండి, అరతులం బంగారం చోరీ చేసింది. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులు అదుపులోకి తసుకుని విచారించారు. దీంతో ఆమె నేరాన్ని ఒప్పుకొన్నట్లు తెలిపారు. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. మద్యం దుకాణంలో చోరీ గోపాల్పేట: మండల కేంద్రంలోని కనకదుర్గ మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైంది. ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాలు పూర్తి ఇలా ఉన్నాయి. వైన్స్లో పనిచేస్తున్న యుగంధర్ గౌడ్ ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి పది గంటలకు మూసివెళ్లాడు. శనివారం ఉదయం వచ్చి దుకాణం తెరిచి చూడగా.. కౌంటర్ తెరిచి కనిపించింది. కౌంటర్లోని రూ.25వేలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్లూస్టీంను పిలిపించి వివరాలు సేకరించారు. పైభాగాన రేకు కత్తిరించి నగదు, ఫుల్బాటిల్ తీసుకుని వెళ్లారు. మొత్తం రూ.27వేలు చోరీ జరిగిందని వైన్స్ సిబ్బంది తెలియజేశారు. -
ఎంసెట్ ఫలితాల్లో ‘రిషి’ ప్రభంజనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. అగ్రికల్చర్ విభాగంలో అనన్య 502, దానియా నాజీష్ 510, శ్రీజ చిన్ని 1,031, సాయి కీర్తన 1,069, గణేష్ 1,118, యశస్వీ 1,142, అమూల్య 1,317, వినూత్న 1,373, పరిపూర్ణ 1,457, అర్నవ్ వసిస్ట 1507, శ్రావణ్ సందేష్ 1,519, పూర్జా దావే 1,653, తేజశ్వని 1,789, సుమేదాచంద్ర 2,115ర్యాంకులు సాధించారు. మొత్తం కళాశాలల 380 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరితో పాటు ఎంసెట్ ఇంజినీరింగ్లో సాకేత్సింగ్ 1,559, సిద్ధార్థ 3,259, దివ్య యశోద 5,191, సతీష్ 6,098, చంద్రన 6,142, ప్రసన్నలక్ష్మి 7,564, మోహన్ 9,443, మానస 9,700, త్రిశాల్ 9,732, సరస్వతి 12,190 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, గౌరవ సలహాదారు వెంకటయ్య పాల్గొన్నారు. -
అంతటా అదే చర్చ
పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతిఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారు. టీకొట్లు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు ఇలా ఎక్కడికి వెళ్లిన చూసినా ఫలితాలపైనే ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఫలానా వ్యక్తి గెలవబోతున్నారని ఒకరంటే.. కాదు.. కాదు ఇంకో వ్యక్తి గెలుస్తారంటూ వాదనలకు దిగుతున్నారు. ఏదేమైనా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల నాడి తెలియడానికి జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచిచూడాల్సిందే. -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
జోగుళాంబ శక్తిపీఠం: అలంంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి విలువైన భూములను క్రీడా మైదానంగా మార్చే కుట్రను ఈఓ పురేందర్కుమార్ అడ్డుకున్నారు. వివరాలిలా.. ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం సర్వే నం.346/1, 346/3లో 15.35 ఎకరాలు ఉండగా.. దేవస్థానం వారు వ్యవసాయం నిమిత్తం లీజుకు ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చిట్టచివర ఊల్చాలకు వెళ్లే దారిలో ఉండటంతో కొంతమంది క్రీడాకారులు టోర్నమెంట్ కోసం ఈ భూమిపై కన్నేశారు. ఈ మేరకు క్రికెట్ గ్రౌండ్గా మార్చేందుకు మూడు రోజుల క్రితం 8 అడుగుల వెడల్పు 22 అడుగుల పొడవుతో సిమెంట్ బెడ్ వేశారు. దీంతో ఈ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆలయం వారికి సమాచారం ఇవ్వడంతో ఈఓ పురేందర్కుమార్ శుక్రవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. వెంటనే జేసీబీతో ఆలయ భూమిలో వేసిన సీసీ బెడ్ను తొలగించారు. అయితే కొంతమంది క్రీడాకారులు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పూర్తిగా తొలగించి వేయించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీ బెడ్ను తొలగించిన ఈఓ పురేందర్కుమార్ -
ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఓటింగ్ అనంతరం మూడు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించామని, మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. దేశంలో బీజేపీ తుడుచుపెట్టుకుపోతుందని, ఇండియా కూటమీ 300 సీట్లతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, జూన్ 9న రాహుల్గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. పదేళ్లపాటు అధికారంలోకి ఉన్న బీజేపీ తప్పుడు ప్రచారాలతో రెచ్చగొట్టిందని, ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 సీట్లు విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఏకమై రేవంత్రెడ్డిని దెబ్బతీయడానికి చూశాయని, కానీ ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు రాత్రి వరకు తమ పార్టీకి ప్రచారం చేసుకొని ఓటింగ్ రోజు బీజేపీకి ఓట్లు వేయాలని కోరారని ఆరోపించారు. పాలమూరులో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, బీఆర్ఎస్కు ఇక మనుగడ లేదన్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, నాయకులు లక్ష్మణ్యాదవ్, అజ్మత్అలీ, రాములుయాదవ్, కొండా జగదీశ్వర్రెడ్డి, చంద్రశేఖర్, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
ప్రేమ పేరిట యువతి మోసం
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
పట్టించుకుంటలేరు
స్ట్రాంగ్రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలి
సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలి
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement