-
రాహుల్కు చిత్రపటం అందజేత
మమాడ: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జనజాతర సభకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి మండల కేంద్రానికి చెందిన చిత్రకారుడు సలీం తాను గీసిన రాహుల్ చిత్రపటాన్ని అందించాడు. దీంతో సలీంను రాహుల్ అభినందించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. తనకు రాహుల్గాంధీని కలిసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పోలింగ్ సమయం పెంచినా.. భైంసాటౌన్: ఎండల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్ని కల పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 1న ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. పోలింగ్ శాతం పెంపే లక్ష్యంగా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. కాగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పిదాలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. బీఎల్వోలు, ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఇస్తున్న ఓటరు సమాచార చీటీలో పోలింగ్ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు అని ముద్రించి ఉంది. గంట సమయం పెంచినట్లు ఓటర్లకు అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అ‘పూర్వ’ం.. ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్: వారంతా.. 18ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత పైచదువుల కోసం ఎవరి దారిలో వారు వెళ్లారు. వివిధ ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు. మళ్లీ.. ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నారు. బడిలో చదివిన జ్ఞాపకాలు నెమరువేసుకు న్నారు. అప్పటి గురువులను సన్మానించారు. వారికి పాదాభివందనం చేశారు. జిల్లాకేంద్రంలోని బాగులవాడ శ్రీసరస్వతీ శిశుమందిర్లో 2006–07 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వవిద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం పేరిట జిల్లాకేంద్రంలోని సిరి బంకె ట్ హాల్ ఆదివారం కలుసుకున్నారు. కలిసి భోజనా లు చేసి, మళ్లీ కలుద్దామంటూ వెళ్లిపోయారు. కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూ ల్లో 2007–08 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్నవారంతా ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుపుకొన్నారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోగల ఓ ఫంక్షన్హాల్లో వీరంతా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రోజంతా సరదాగా గడిపారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. -
రాహుల్ సభ విజయవంతమైంది
● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావునిర్మల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్లో ఆదివారం నిర్వహించిన జనజాతర సభ విజయవంతమైనట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. సభ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకునేందుకు పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ వచ్చిన సభను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాహుల్గాంధీతోపాటు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క పాల్గొన్న సభకు మండుటెండను లెక్కచేయకుండా లక్షకుపైగా జనాలు వచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు. సభను విజయవంతం చేసినట్లే పార్టీ అభ్యర్థి సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
‘గల్ఫ్ కార్మికుల మద్దతు మోదీకే’
ఖానాపూర్: ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక స్థా నం కల్పించడంలో ముందు వరుసలో ఉన్న నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని గల్ఫ్ కార్మికులు తెలిపా రు. ఆదివారం దుబాయ్లోని అబుదాబిలోగల బీఏ పీఎస్ హిందూమందిరంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఇరు దేశాల దౌత్యపరమైన సంబంధాలను పెంచడం, దుబాయ్లో మంచి ఆలయాలు నిర్మించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇండియాలోని తమ కుటుంబీకులు, బంధువులందరికీ ఫోన్ చేసి బీజేపీకి ఓటు వేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లా వాసులు మహేందర్రెడ్డి, శరత్గౌడ్, తెనుకుల అశోక్, పవన్సాయి, శ్రీను, ప్రశాంత్, సాయి, దేవ న్న, తిరుపతి, రమేశ్, నవీన్ తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్లో ప్రతిభ
నిర్మల్టౌన్: ఈనెల 3నుంచి 5వరకు హైదరా బాద్లోని లాలాగూడలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి కొండూరు రిషిక 63–66 కేజీల విభాగంలో పాల్గొంది. ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ రవీందర్ రిషికకు ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లా ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ స్వామి అభినందించారు. న్యూస్రీల్అడెల్లిలో భక్తుల సందడి సారంగపూర్: శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆల యం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
రోల్స్ అమ్ముతున్న జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర సాయం
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
అహ్మదాబాద్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement