రాహుల్‌కు చిత్రపటం అందజేత | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు చిత్రపటం అందజేత

Published Mon, May 6 2024 6:45 AM

రాహుల్‌కు చిత్రపటం అందజేత

మమాడ: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జనజాతర సభకు హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి మండల కేంద్రానికి చెందిన చిత్రకారుడు సలీం తాను గీసిన రాహుల్‌ చిత్రపటాన్ని అందించాడు. దీంతో సలీంను రాహుల్‌ అభినందించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. తనకు రాహుల్‌గాంధీని కలిసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

పోలింగ్‌ సమయం పెంచినా..

భైంసాటౌన్‌: ఎండల నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్ని కల పోలింగ్‌ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 1న ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. పోలింగ్‌ శాతం పెంపే లక్ష్యంగా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. కాగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పిదాలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. బీఎల్వోలు, ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఇస్తున్న ఓటరు సమాచార చీటీలో పోలింగ్‌ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు అని ముద్రించి ఉంది. గంట సమయం పెంచినట్లు ఓటర్లకు అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement