-
నిబంధనలు పాటించకుంటే చర్యలు
● జిల్లా వైద్యాధికారి ధనరాజ్ నిర్మల్చైన్గేట్: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో పలు ఆస్పత్రులు, ల్యాబ్లను శనివారం తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వాగ్బత ఆయుర్వేద హాస్పిటల్, సుప్రియ డయాగ్నస్టిక్ ల్యాబ్, లక్ష్మీనరసింహ డయాగ్నస్టిక్ సెంటర్, సాధన నర్సింగ్ హోమ్కు నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, పాలి క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, ఫీజుయోథెరపీ కేంద్రాలు, ఐ క్లినిక్లు, ఆయుర్వేద, యనానీ, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంరిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పత్రులు గడువు ముగిసే సమయాని మూడు నెలల ముందే రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవల వివరాలు, చార్జీలు, ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల వివరాలు ప్రదర్శించాలని వివరించారు. డీఎంహెచ్వో వెంట డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై జెడ్పీ సీఈవోకు వినతినిర్మల్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ సీఈవో గోవింద్కు పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం తదితర అవసరాల కోసం దాచుకున్న డబ్బులు సకాలంలో రాక ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. మిస్సింగులు వారివారి ఖాతాల్లోకి సకాలంలో జమయ్యేలా చూడాలని కోరారు. సీఈవో సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్నాల రవి రాజ్, జిల్లా నాయకులు చక్రాల హరి ప్రసాద్, గంగాధర్, వొజ్జల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
కొనుగోలు వివరాలు ట్యాబ్లో ఎంటర్ చేయాలి
నిర్మల్చైన్గేట్: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ట్యాబ్లో ఎంటర్ చేయాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివిధ అంశాలపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించారు. మండలాల వారీగా ధాన్యం కొనుగోలు వివరాలు, రైతుల సంఖ్య, మిల్లులకు తరలించిన లారీల వివరాలు, ట్యాబ్ ఎంట్రీ చేసిన సంఖ్య, పెండింగ్ ట్యాబ్ ఎంట్రీ వివరాలు, ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. రైతులకు డబ్బులు జమచేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకళ, డీసీవో నర్సయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిసారంగపూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ సూచించారు. మండలంలోని ఆలూరు, బోరిగాం, జామ్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష సూచనల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. గన్నీబ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రాలకు రైతులు తెచ్చిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటి వరకు తరలించిన ధాన్యం వివరాలు, ఇంకా ఉన్న నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది ఉన్నారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
నిర్మల్చైన్గేట్: ఐటీఐ కాలేజీల్లో 2024 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడినట్లు నిర్మల్ ఐటీఐ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు ititelangana.gov.in వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలన్నారు. స్థానిక రాజీవ్గాంధీ ఐటీఐ కళాశాలలో 2024 విద్యా సంవత్సరంలో ఎలక్ట్రీషియన్ 80, ఫిట్టర్ 20, రిఫ్రిజిరేష్, ఏసీ కోర్సులో 24, వెల్డర్ 40, డీజిల్ మెకానిక్ 18, కంప్యూటర్ ఆపరేటింగ్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 48, డ్రెస్ మేకింగ్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతి మెమో, బోనఫైడ్ (4 నుంచి 10 వరకు) ఆధార్ జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రము, కలర్ ఫొటో, ఈ మెయిల్ ఐడీ, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఆప్షన్స్ ఎంచుకోవాలన్నారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీ ఉందని పేర్కొన్నారు. -
గ్రూప్ –1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి నిర్మల్చైన్గేట్: గ్రూప్ –1 పరీక్ష అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నత అధికారులతో గ్రూప్–1 పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ మాస్ కాపీయింగ్, లీకేజీలకు తావులేకుండా పరీక్ష నిర్వహించాలన్నారు. జిల్లాలో పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తిచేసి, నిర్వహణ బాధ్యతలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు. సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేయాలన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ పత్రాల తరలింపు సమయంలో పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పోలీసు భద్రతను కల్పించాలని, పరీక్ష కేంద్రాల్లోకి సిబ్బంది, అభ్యర్థులు మొబైల్ ఫోన్, ఏ ఇతర ఎలక్టాన్రికి వస్తువులు తీసుకురాకుండా చూడాలి వివరించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని తెలిపారు. కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సిబ్బంది, మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జూన్ 9న నిర్వహించే గ్రూప్–1 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 13 పరీక్షా కేంద్రాల్లో 4,608 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పటు చేయడంతోపాటు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫిసర్లను నియమిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు టోల్ ఫ్రీ నంబర్ 6305646600లో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ పి.గంగారెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, డీఎంహెచ్వో ధనరాజ్, ఆర్టీసీ డీఎం ప్రతిమారెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్, కలెక్టరేట్ ఏవో సూర్యరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోత లేకుండా ధాన్యం కొనాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి నూతన్కుమార్నర్సాపూర్ (జి): కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యంలో కోత విధించడం ఆపాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి నూతన్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధాన్యం తూకంలో కోతలు ఉండవని రైతులు ఆశించారని, కానీ గత పాలకుల హయాంలో కోత విధించినట్లుగానే కోత విధిస్తున్నారని ఆరోపించారు. 40 కిలోలకు బదులు 42 కిలోలు తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు 40 కిలోలకే లెక్క కడుతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి, నాయకులు చందుల సాయికిరణ్, మన్నారి లక్ష్మణ్ పాల్గొన్నారు. -
● పచ్చని పందిళ్లువేసి.. ● ధాన్యపు కుచ్చులు కట్టి.. ● ‘ఉపాధి’కి మార్గాన్ని చూపి.. ● ‘ఆదర్శం’గా నిలిచిన అధికారులు
పచ్చదనంతో ఆదర్శ పోలింగ్ కేంద్రంఇంట్లో శుభకార్యంలా..తమ ఇంట్లో శుభకార్యం ఉంటే ఎలా పనిచేస్తారో.. అలా ఆదర్శ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఆమె బృందం పనుల్లో భాగమయ్యారు. మామిడి తోరణాలను అల్లడంలో అధికారితోపాటు సిబ్బంది తలోచేయి వేశారు. దశాబ్దం క్రితం వరకు కనిపించిన కొబ్బరి ఆకుల పందిళ్లను అల్లేవారిని వెతికి పట్టుకువచ్చారు. పెద్దగా ఖర్చు లేకుండా స్థానికంగా కొబ్బరి, మామిడిి ఆకులు, పొరకను సేకరించారు. వెదురు కర్రలను మాత్రం అద్దెకు తీసుకువచ్చి పందిళ్లు వేయించారు.నిర్మల్: గృహప్రవేశం.. పెళ్లి.. ఇలా ఇంట్లో ఏ శుభకార్యమున్నా పచ్చని పందిళ్లు వేస్తుంటాం. మామిడాకుల తోరణాలు కడుతుంటాం. ఒకప్పుడైతే.. పెళ్లిళ్లు కొబ్బరి ఆకులతో వేసిన మండపాల్లోనే జరిగేవి. మామిడాకులు, బంతిపూల తోరణాలతోపాటు అతిథులకు ధాన్యపు సిరులు స్వాగతం పలికేందుకు వరి కుచ్చులను అందంగా అలంకరించి ఆహ్వానించేవారు. కాలక్రమంలో అవన్నీ మాయమైపోయాయి. ఇప్పుడెన్ని రంగుల లైట్లున్నా.. ఒకదాన్ని మించి ఒక హంగులున్నా.. అప్పటి ఆ పచ్చదనం ఇచ్చే అనుభూతి కలుగడం లేదు. నాటి అనుభూతిని ఎన్నో ఏళ్ల తర్వాత మన జిల్లా అధికారులు ఓటర్లకు కలిగించారు. ప్రత్యేకంగా ముస్తాబు.. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా అధికారులు వివిధ ప్రయత్నాలు చేశారు. ఈసారి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సహకారంతో ‘స్వీప్’(సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఇన్చార్జిగా ఉన్న డీఆర్డీవో విజయలక్ష్మి వినూత్న ప్రయోగాలు చేశారు. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో ఒక ఆదర్శ పోలింగ్ కేంద్రం కచ్చితంగా ఉండాలి. ఈమేరకు జిల్లాలోనూ మూడు నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఎన్నికల్లో టెంట్లు, మంచినీళ్లు, రెడ్కార్పెట్లు ఇలాంటి వాటితో ఓటర్లను ఆకట్టుకునేవారు. ఈసారి మాత్రం ప్రత్యేకంగా నిలిపారు. నిర్మల్లో పూర్తిగా కొయ్యబొమ్మలతో, కుంటాల మండలం లింబా(కె)లో పూర్తిగా రైతులతో.. ఇలా థిమాటిక్ పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటారు. పెళ్లింట్లోకి వచ్చినట్లే.. ‘అసలు ఇది పోలింగ్ కేంద్రంలా లేనేలేదు.. పెళ్లింటికి వచ్చినట్లు ఉంది..’ అంటూ ఈనెల 13న ఓటర్లంతా సంబురంగా వచ్చి ఓట్లేశారు. ఎప్పుడో 10–15 ఏళ్ల క్రితం కళకళలాడిన పచ్చని కొబ్బరి ఆకుల పెళ్లిపందిరిని మళ్లీ తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం ఎదుట మామిడి ఆకుల తోరణాలు కట్టి చలువ పందిళ్లు వేశారు. పోలింగ్ కేంద్రం గేట్ల వద్ద కొబ్బరి, అరటి కొమ్మలను కట్టారు. మొత్తం మీద ఓ పెళ్లింటికో.. ఓ శుభకార్యానికో.. వచ్చామన్న ఫీలింగ్ను ఓట్లరకు కల్పించారు. ఎర్రటి ఎండలో వచ్చినవాళ్లంతా ఆ చలువ పందిళ్ల నీడలో సేదదీరుతూ ఓటేయడం కనిపించింది. ‘ఉపాధి’ మార్గంలో.. ఓట్ల పండుగరోజున తీర్చిదిద్దిన ఆదర్శ పోలింగ్ కేంద్రాల కాన్సెప్ట్ డీఆర్డీవోకు ‘ఉపాధి’ మార్గాన్ని చూ పాయి. ఈ కేంద్రాల అలంకరణలో భాగంగా ప్రధానంగా ఆకట్టుకున్న వరికుచ్చులను చాలామంది తమకు కావాలని అడిగారు. దీంతో వీటిని పెద్దమొత్తంలో తయారు చేయించి మహిళా సమాఖ్యల ద్వా రా విక్రయించి ఉపాధిని అందించేలా డీఆర్డీవో ఆలోచన చేశారు. సోషల్ మీడియాలో చూసి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం వాటిని కావాలంటున్నారు. ఇంటి ముందు వేలాడదీస్తే మంచిదని అనుకోవడం, పిచ్చుకలకు ఆహారంగా వడ్లగింజలు ఉపయోగపడుతుండటంతో చాలామంది ముందుకు వస్తున్నా రు. మహిళా సమాఖ్య ద్వారా వాటి తయారీని చేపడుతున్నారు. ఇలా ఓట్ల పండుగ సంబురంగా సాగడమే కాకుండా.. మహిళలకు ఉపాధి చూపింది.వరికుచ్చులు.. స్పెషల్..ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటర్లను ప్రత్యేకంగా ఆకర్షించినవి.. వరికుచ్చులు. వడ్లతో కూడిన ఈ ధాన్యపు సిరులను చక్కగా అల్లి.. అలా.. తోరణాలు వేలాడదీసిన తీరు సాధారణ ఓటర్లతోపాటు కలెక్టర్ను, ఉన్నతాధికారులనూ ఆకట్టుకుంది. చూసినవారంతా.. ‘వావ్..’ అనేలా వాటిని తయారు చేశారు. ఇందుకోసం డీఆర్డీవో విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వాటి తయారీ విధానాన్ని మొదటి తాను యూట్యూబ్లో చూసి నేర్చుకుని చేశారు. అనంతరం మిగితా సిబ్బందికి నేర్పించారు. అలా తయారు చేసిన వాటిని అందంగా పోలింగ్ కేంద్రాల్లో అలకరించారు.చాలామంది అడుగుతున్నారు..పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో దాదాపు ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా పచ్చని ఆకులతోనే అలంకరణలు చేశాం. ప్రధానంగా వరికుచ్చులు ఓటర్లను, అధికారులను ఆకట్టుకున్నాయి. కలెక్టర్, ఎస్పీగారు కూడా మెచ్చుకున్నారు. ఇక వీటిని మహిళ సమాఖ్యలు ఉపాధి పొందేలా పెద్దమొత్తంలో తయారు చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. – విజయలక్ష్మి, డీఆర్డీవోచాలాబాగా చేశారు..పార్లమెంట్ ఎన్నికలు జిల్లాలో విజయవంతంగా పూర్తిచేయడంలో అధికారులందరూ సహకరించారు. సమష్టి కృషితో పూర్తిచేశాం. పోలింగ్శాతం పెంచడానికి ఆదర్శ పోలింగ్ కేంద్రాలను చాలా బాగా తీర్చిదిద్దారు. స్వీప్ ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా తయారు చేశారు. ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో చాలా మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్ -
ఇనాం భూముల వేలం
తానూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధీనంలో ఉన్న ఇనాం భూములను 2024–25 సంవత్సరానికి సాగుకోసం వేలం వేయనున్నట్లు తహశీల్దార్ లింగమూర్తి తెలిపారు. తానూరులో ఉన్న 165.35 ఎకరాలకు ఈనెల 20న తహశీల్దార్ కార్యాలయంలో, బామ్నిలో 3.18 ఎకరాల భూమికి 21న గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మహలింగిలో 32 గుంటల భూమికి 22న గ్రామ పంచాయతీ కార్యాలయంలో, బెంబరలో 11.33 ఎకరాలకు 23న గ్రామ పంచాయతీ కార్యాలయంలో, తొండాలో ఉన్న 8.11 ఎకరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈనెల 24న వేలం వేయనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. -
జిల్లాకు చేరుతున్న యూనిఫాం వస్త్రం
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే యూనిఫామ్ వస్త్రం మొదటి విడతగా శనివారం జిల్లాకు వచ్చాయి. చేనేత వస్త్రపరిశ్రమ శాఖ నుంచి 150 బేళ్లతో కూడిన వస్త్రం జిల్లాకు చేరుకుంది. వీటిని జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో అధికారులు భద్రపరిచారు. ఇందులో మూడు రకాల వస్త్రం మాత్రమే వచ్చిందని, ఇంకా రెండు రకాల వస్త్రం రావాల్సి ఉందని డీఈవో ర వీందర్రెడ్డి పేర్కొన్నారు. రెండు మూడురో జుల్లో మండలాలవారీగా విభజించి ఆయా పా ఠశాలలకు అందజేస్తామని తెలిపారు. జూన్ 5లోపు కుట్టించి పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు అందేలా చూడాలని స్వయం సహాయక సంఘం సభ్యులకు తెలిపారు. -
సదర్మాట్ను సందర్శించిన సీపీఎం నాయకులు
మామడ: మండలంలోని పొనకల్ గ్రామ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ మినీ బ్యారేజీని సీపీఎం జిల్లా బృందం పభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం నూతన్కుమార్ మాట్లాడుతూ.. సదర్మాట్ బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభమైనా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికై నా కాలయాపన చేయకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సదర్మాట్ను సందర్శించిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డాకుర్ తిరుపతి, నాయకులు నాగెల్లి నర్సయ్య, సుంచుల నారాయణ ఉన్నారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డినిర్మల్ఖిల్లా: విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూటీఎస్ కృషి చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టెట్ తో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే పదోన్నతులతో కూడిన బదిలీలు చేపడుతుందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 50 శాతం ఫిట్మెంట్ ఇచ్చే విధంగా పీఆర్సీ కమిటీకి ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు, మెరుగైన ఈహెచ్ఎస్ విధానం అమలు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వివరించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యావలంటీర్లు, స్కావెంజర్లు నియమించాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అనంతరం ఏప్రిల్, మే నెలలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, రమణారావు, కార్యవర్గ సభ్యులు నరసయ్య, గంజారాం, శిరీష్, మారెన్న, భూమారెడ్డి, వెంకటరమణ శ్రీనివాస్, పరమేశ్వర్రెడ్డి, కొబ్బయి శంకర్ సంజీవరావు, వెంకటేశ్వర్ లింగన్న, కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, రాఘవేందర్ రజనీకాంత్, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
సకాలంలో పాఠశాలల పనులు పూర్తి చేయాలి లక్ష్మణచాంద: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల పనులను సకా లంలో పూర్తి చేయాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అఽధికారులను ఆదేశించారు. మండలంలోని పీచ ర ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులను శుక్రవారం పరిశీలించారు. జూన్ 5 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణకు గ్రామంలోని మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రం పరిశీలించి, చిన్నారులు, గర్భిణుల వివరాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డీఈ వో రవీందర్రెడ్డి, పౌరసరఫరాల డీఎం శ్రీకళ, జిల్లా సహకార శాఖ అధికారి నర్సయ్య, ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ జానకి, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి ఎలక్షన్ బొనాంజా..!
● 14న రికార్డుస్థాయిలో ఆదాయం ● నిర్మల్, భైంసా డిపోలకు రూ.60.72 లక్షలుభైంసాటౌన్: ఓటర్లలో పెరిగిన చైతన్యంతో పోలింగ్ శాతం పెరగడమేకాదు.. ఆర్టీసీకి ఆదాయమూ గణనీయంగా తెచ్చిపెట్టింది. అదేంటి.. ఎన్నికలకు, ఆర్టీసీకి ఆదాయానికి సంబంధమేంటని అనుకుంటున్నారా.. అవునండి..! ఈనెల 13న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, నిజామాబాద్, ఇతర ప్రాంతాల్లో వృత్తిరీత్యా వలస వెళ్లినవారు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువత ఓటేసేందుకు స్వగ్రామాలకు చేరుకున్నారు. ఎన్నికల తేదీకి రెండు, మూడు రోజుల ముందే చేరుకోవడం, అనంతరం ఓటు హక్కును వినియోగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీకి ఎన్నికలు బంపర్ ఆదాయం తెలిచ్చిపెట్టింది. తిరుగు ప్రయాణం రోజైన 14న ఒక్కరోజే జిల్లా ఆర్టీసీకి రూ.60.72 లక్షల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరడంతో సంస్థ ఎండీ సజ్జనార్ ఉద్యోగులందరికీ స్వీట్లు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నిర్మల్, భైంసా డిపోల్లో ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుస్థాయిలో ఆదాయం.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని ఓటర్లు స్వగ్రామాలకు రావడం, తిరిగి 14న తిరుగు ప్రయాణం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. 14వ తేదీ ఒక్కరోజే నిర్మల్ డిపోకు రూ.44.23 లక్షలు, భైంసా డిపోకు రూ.16.49 లక్షల ఆదాయం చేకూరింది. సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశాం. – ప్రతిమారెడ్డి, డీఎం, నిర్మల్/భైంసాఆర్టీసీ ఉద్యోగులకు మిఠాయిలు పంపిణీ భైంసాటౌన్:పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు శుక్రవారం మిఠాయిలు పంచారు. ఈనె ల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు కలిపి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.24.23 కోట్ల ఆ దాయం సమకూరింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ స్వీట్లు పంచాలని ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు డీఎం ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పనిచేసి సంస్థ ఆదాయం పెంపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఎఫ్ఎల్ చందు, సూపర్వైజర్స్ కేకే.రెడ్డి, గోపాల్, ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్మల్, భైంసా డిపోలకు ఆదాయమిలా(రూ.లక్షల్లో...) తేదీ నిర్మల్ భైంసా 10 39.20 15.43 11 41.12 16.45 12 39.00 15.65 13 33.00 13.05 14 44.23 16.49 -
ఓవర్ డోస్!
నిర్మల్శనివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2024ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి నిర్మల్చైన్గేట్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా రైతులకు సరిపడా టార్పాలిన్లు, ధాన్యం సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలు ఏరోజుకరోజు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్వో శ్రీకళ, సివిల్ సప్లయిస్ డీఎం నందిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, డీసీవో నర్సయ్య, ఏడీ మార్కెటింగ్ ఆష్పక, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: ‘సార్.. రెండ్రోజుల నుంచి జరం పరేషాన్ చేస్తోంది. జర.. ఏవన్న మంచి గోలీలో.. ఇంజక్షన్లో ఇయ్యుండ్రి సార్..’అని పేషంట్ అనడమే ఆలస్యం.. జిల్లాలో చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు, కొంతమంది వైద్యులు మోతాదుకు మించి మందులు ఇస్తున్నారు. దెబ్బకు జ్వరం ఒక్కరోజుకే తగ్గిపోతోంది. తొలిదశలోనే పేషెంట్ కోలుకోవాలన్న ఏకై క లక్ష్యంతో యాంటీబయాటిక్స్తోపాటు ఏకంగా స్టెరాయిడ్స్ ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి షాకింగ్ విషయాలన్నీ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ), తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ)చేపడుతున్న తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో మోతాదుకు మించి మందులు ఇస్తున్న పరిస్థితిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మోతాదుకు మించి వాడుతున్న మందులతో జిల్లాలో ఎన్నడూ లేనంతగా కిడ్నీ సంబంధిత, ఇతర వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదకరంగా.. జిల్లాలో ప్రధానంగా సరైన వైద్యఅవగాహన లేని ఆర్ఎంపీలు, పీఎంపీలు అందిస్తున్న వైద్యం ప్రమాదకరంగా ఉందని మెడికల్ కౌన్సిల్ బాధ్యులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలో తనిఖీలు చేసిన సందర్భంలో చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు, కొంతమంది వైద్యులు కూడా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటి కారణంగా జిల్లాలో చాలామంది కిడ్నీ, ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం అనుభవంతోనే.. అర్హత కలిగిన వైద్యులు తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఒక క్రమబద్ధమైన కోర్సును ఇచ్చి రోగం నయం చేస్తారు. వారు చదివిన చదువుతోపాటు అనుభవం, ప్రస్తుతం రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వారు ట్రీట్మెంట్ కొనసాగిస్తుంటారు. ఏ మందులు ఇస్తే.. ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత పేషెంట్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది.. అనే విషయాలనూ వారు పరిగణనలోకి తీసుకుంటూ చికిత్స కొనసాగిస్తారు. మందులనూ అదేవిధంగా ఇస్తుంటారు. కానీ.. కేవలం అనుభవం ఆధారంగా తెలిసిన వైద్యాన్ని ఆర్ఎంపీలు అందిస్తున్నారు. చాలామంది రేపొద్దున్న పేషెంట్ పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఆలోచించడం లేదని, ప్రస్తుతం రోగాన్ని నయం చేయడమే చూస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. రోగనిరోధకతకు దెబ్బ.. త్వరగా అనారోగ్యం, వ్యాధి నయం కావాలన్న తొందరలో అనుభవం/అర్హతలేని వైద్యులు, ఆర్ఎంపీలు ఏమేం మందులు ఇస్తున్నారో.. కూడా చాలామంది పేషెంట్లకు తెలియవు. అందులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా ఉంటున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల సంబంధిత రోగం త్వరగానే నయమవుతుంది. కానీ.. వాటి ప్రభావం దీర్ఘకాలం భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా మనిషి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. కిడ్నీతోపాటు వివిధ అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. జిల్లాలో గురువారం చేసిన తనిఖీల్లో చాలామంది అర్హతలేని వాళ్లు ఇలాంటి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అర్హతలు చూసి వెళ్లాలి.. పేషెంట్ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. కచ్చితంగా వైద్యం చేయించుకునే ముందు సదరు వైద్యుడు అర్హత కలిగినవారా..లేదా.. చూసుకుని వెళ్లాలి. అర్హత లేకుండా వైద్యం చేయడం చట్టప్రకారం నేరం. –డాక్టర్ మురళీధర్, అధ్యక్షుడు ఐఎంఏ నిర్మల్ఇష్టారీతిన మందులు.. నిర్మల్ జిల్లాలో చేసిన తనిఖీల్లో చాలామంది ఆర్ఎంపీలు, కొంతమంది వైద్యులు ఇష్టారీతిన మోతాదుకు మించి మందులు ఇస్తున్నట్లు వెల్లడైంది. కొంతమంది యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వాటిపై తనిఖీలు కొనసాగిస్తాం. చర్యలనూ తీసుకునేలా చేస్తాం. –డాక్టర్ శ్రీనివాస్యెగ్గన, టీఎస్ఎంసీ ఎథికల్ కమిటీ ఉమ్మడిజిల్లా చైర్మన్న్యూస్రీల్ మోతాదు మించుతున్న మందులు అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ ప్రాణాల మీదుకు తెస్తున్న స్టెరాయిడ్స్ క్రమంగా పడిపోతున్న రోగనిరోధక శక్తి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ, ఇతర బాధితులు అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు -
సిరాల ఇలా.. సాగునీరెలా?
● గత వానాకాలంలో కొట్టుకుపోయిన ప్రాజెక్టు ● ఏడాది కావస్తున్నా మరమ్మతుకు నోచుకోని వైనం.. ● నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు ● మరో 20 రోజుల్లో వర్షాలు ప్రారంభం ● ఆయకట్టుకు ఈసారి కూడా క్రాప్ హాలిడే? ● ఆందోళనలో అన్నదాతలు భైంసా: జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టుల్లో ఒకటైన సిరాల.. ఈసారి కూడా ఆయకట్టు నిరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది జూలై 27న కురిసిన భారీ వర్షంతో వచ్చిన వరదకు ప్రధాన కట్ట తెగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సిరాల బాట పట్టారు. అక్కడి వారిని కలిసి రైతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పటి కలెక్టర్ వరుణ్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు, వేణుగోపాలచారి బాధిత రైలును ఓదార్చారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ జనవరిలోనే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరాల ప్రాజెక్టును త్వరగా పునర్నిర్మించి వానాకాలంలో ఆయకట్టు రైతులకు సాగునీరందించాలని సూచించారు.అధికారులు ప్రాజెక్టు కట్ట నిర్మాంతోపాటు ఇతర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రాజెక్టుకు రూ.12.36 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ప్రారంభంకాలేదు. మరో 20 రోజుల్లో వర్షాకాలం ప్రారంభంకానుంది. ఈ సమయంలో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియడంలేదు. గతేడాది భారీ వర్షాలతో... గతేడాది కురిసిన భారీ వర్షాలకు సిరాల ప్రాజెక్టు ప్రధాన ఆయకట్టు తెగి నీరంతా ఖాళీ అయ్యింది. గత జూలై 27న కట్ట పైనుంచి నీరు కిందికి రావడంతో గమనించిన గ్రామస్తులు పక్కనే ఉన్న మహాదేవ్ ఆలయానికిచేరుకున్నారు. పిల్లాపాపలతో ఊరంతా ఆలయంపైనే జాగరణచేశారు. సాయంత్రం దేవుని మందిరానికి అంతాచేరుకునేలోపే ప్రధాన తూము వద్ద కొంత భాగం గండిపడి నీటి శబ్దంవచ్చింది. మరో గంటకు కట్టపై ఉన్న రామస్వామి ఆలయం వద్ద ఇంకో గండి పడింది. అంతా చూస్తుండగానే రామస్వామి ఆలయం నీటిలోకొట్టుకుపోయింది. మరో గంటసేపటికి పాత తూము ప్రాంతం పెద్ద మొత్తంలోనే గండిపడింది. చూస్తుండగానే నీరంతా సిరాల చుట్టు ప్రవహిస్తూ పంటపొలాల్లోకి వెళ్లిపోయింది. ఎటుచూసిన నీరే కనిపించింది. ఊళ్లోకి వరద వచ్చే అవకాశం.. సిరాలవాసుల్లో మళ్లీ భయం కనిపిస్తుంది. ఈయేడు కూడా మళ్లీ వర్షాలు కురిస్తే గతంలో ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరంతా నేరుగా గ్రామాన్ని ముంచెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే మహారాష్ట్ర నుంచి సిరాల ప్రాజెక్టులోకి నీరుచేరుతుంది. కట్ట లేని కారణంగా వచ్చిన నీరు వచ్చినట్లే గ్రామంలోకి వెళ్లి పక్కనే ఉన్న పంటపొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు తెగడంతో ఇప్పటికే సిరాల ఆయకట్టు రైతులు రెండు పంటలు నష్టపోయారు. అంతా బండరాళ్లే... గతేడాది సిరాల ప్రాజెక్టు తెగిపోవడంతో పంట భూ ముల్లో పెద్ద పెద్ద బండరాళ్లు, ఇసుకమేటలు ఇప్పటి కీ కనిపిస్తున్నాయి. సిరాల, ఇలేగాం, దేగాం, వాలేగాం, కామోల్ వరకు ఈ ప్రాజెక్టు నీటిలో 800 ఎకరాల భూములు నీటమునిగాయి. 300 ఎకరాలు పూర్తిగా బండరాళ్లు, ఇసుకమేటలు వెలిశాయి. నీట మునిగిన పంటలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. నష్టపోయిన రైతుల భూములను ఇప్పటికీ బాగుచేసి ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన 4 కిలోమీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్ కొట్టుకుపోయింది. ప్రస్తుతం సీసీ కెనాల్ ఎక్కడికక్కడ తెగి ఉంది. వర్షాలు కురిస్తే నీరంతా సీసీ కెనాల్ కింద ఉండే పంటభూములను ముంచెత్తనుంది. త్వరలో పనులు ప్రారంభం.. గతేడాది భారీ వర్షాలకు సిరాల ప్రాజెక్టు ప్రధానకట్ట, తూము కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యింది. ఆ సమయంలో ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరిచేసింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. సిరాల ఆయకట్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. – అనిల్, ఇరిగేషన్ డీఈకనుమరుగైన చరిత్ర.... 1902లో సిరాల ప్రాజెక్టు నిర్మించారు. 121 ఏళ్ల కింద నిర్మించిన ఈ చెరువు ప్రధాన కట్టపైనే రా మస్వామి ఆలయం ఉంది. సిరాల ప్రాజెక్టు అప్ప ట్లో అతి తక్కువ ఖర్చుతో రెండు గుట్టల మధ్య నిర్మించారు. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఈ ప్రాజె క్టు ఎండిపోయింది. ఎప్పుడు నీటితో ఉండే ఈ ప్రాజెక్టు కింద అప్పట్లో ఏడు గ్రామాల్లోని 4 వేల ఎకరాలకు నీరందేది. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 1,400 ఎకరాలకే నీటిని అందిస్తుంది. 121 ఏళ్ల ఈ ప్రాజెక్టు గతేడాది భారీ వర్షాలకు పూర్తిగా కనుమరుగైపోయింది. -
రాష్ట్రస్థాయి శిక్షణలో జిల్లా తపస్ నేతలు
నిర్మల్ఖిల్లా: హైదరాబాద్లోని శ్రీనీలకంఠ విద్యాపీఠంలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్రస్థాయి అభ్యాసవర్గంలో జిల్లాకు చెందిన పలువురు జిల్లాశాఖ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తపస్ నాయకులు పేర్కొన్నారు. ఇందులో జిల్లా బాధ్యులు టి.నవీన్కుమార్ జి.రాజేశ్వర్, అజయ్, ఆర్.రాజేశ్వర్, విఠల్రెడ్డి, దత్తురాం పటేల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కిక్బాక్సింగ్ క్రీడాకారిణికి ఆర్థికసాయం
ఖానాపూర్: మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేత యువతి కార్కురి నాగలక్ష్మి జాతీ యస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై ంది. పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తుంది. ఈ విషయం తె లుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బుక్యా జాన్సన్నాయక్ క్రీడాకారిణికి బాక్సింగ్ కిట్ కొనుగోలుకు కావాల్సిన రూ.10 వేలు అందజేశారు. ఈనెల 21న పుణెలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులతోపాటు గ్రామానికి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. -
‘గుండేగాం’ కష్టం తీరేదెప్పుడో!
గుండేగాం ముంపు సమస్యకు పాలకులు ఇప్పటికీ పరిష్కారం చూపడంలేదు. వానాకాలం వస్తుందంటే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. 8లోu ఏకంగా హాస్పిటల్సే.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు ఏకంగా ఆస్పత్రులను నడుపుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ బాధ్యులు చెబుతున్నారు. కేవలం ఫస్ట్ఎయిడ్ సెంటర్గా ఉండాల్సిన చోట.. ఏకంగా బెడ్లు, మెడికల్, ల్యాబ్లతోసహా ఓ పెద్దాస్పత్రిలో ఉండే అన్నిసదుపాయాలు పెట్టి వైద్యం చేస్తున్నారని వెల్ల డించారు. ఇదంతా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. జిల్లాకేంద్రంలో పలువురు ఆర్ఎంపీలు కలిసి ఏకంగా ఆస్పత్రులు పెట్టడం గమనార్హం. అందులో ఒకదాంట్లో వైద్యులు లేనప్పుడు సదరు ఆర్ఎంపీలే చికిత్స ఇస్తున్నట్లు వెల్ల డైంది. వీరికి ఓ వైద్యాధికారి అండ ఉందని మెడికల్ కౌన్సిల్ సభ్యులు పేర్కొనడం గమనార్హం. -
గడువులోగా పాఠశాల పనులు పూర్తి చేయాలి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్మల్చైన్గేట్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపడుతున్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఇతర అధికారులతో శుక్రవారం అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, పెండింగ్ ధరణి దరఖాస్తులు, సీఎం ప్రజా వాణి దరఖాస్తుల వివరాలు, వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సరఫరా ప్రక్రియ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు, మరమ్మతులు కొనసాగుతున్నాయని వివరించారు. జూన్ 5లోపు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీఎంఆర్ సరఫరాను వేగవంతం చేశామన్నారు. గడువులోపు ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పూర్తికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీఆర్వో భుజంగ్రావ్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
గుడిహత్నూర్/ఇంద్రవెల్లి: మండల కేంద్రంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా వీచిన గాలితో రహదారిపై చెట్లు పడిపోగా, హనుమాన్ నగర్లోని పలు ఇళ్లు, దుకాణాల పైకప్పు రేకులు లేచి పోయి దూరంగా పడ్డాయి. దీంతో నిత్యావసర సరుకులు, సామగ్రి తడిసిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ అరుణ్ బాధిత ఇళ్లను సందర్శించి నష్టం అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మండలంలోని ఈశ్వర్నగర్ సమీపంలో ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో సుమారు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ ఎంపీ గోడం నగేష్ వాహనం కూడ ఆగిపోయింది. ఎస్సై దుబ్బక సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో చెట్టును తొలగించారు. -
ఉపాధికోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
క్లుప్తంగా
కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ఎదులాపురం: కుమారుడిపై తండ్రి ఫిర్యాదు చేసిన సంఘటన పట్టణంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై లాల్సింగ్ కథనం ప్రకారం పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన పవన్ అనుమానంతో భార్యపై చేయి చేసుకున్నాడు. కోడలిని ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకున్నాడు. దీంతో అతని తండ్రి నాగోరావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్యను వేధించిన కేసులో 18 నెలల జైలు కై లాస్నగర్: భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్రావు గురువారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి ఎం. గంగాసింగ్ తెలిపారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన మహిళ, మహారాష్ట్రలోని సరత్ తాలూకా ఘటంజి గ్రామానికి చెందిన సావాపురే దీక్షిత్ భార్యాభర్తలు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో దీక్షిత్పై జైనథ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పీసీఆర్ కోర్టులో విచారణ జరుపగా నిందితుడికి 18నెలల జైలు, రూ.2500 జరిమానా విఽధిస్తూ పీసీఆర్ కోర్టు తీర్పునిచ్చింది.పేకాట రాయుళ్ల అరెస్ట్ తానూరు: మండలంలోని హంగిర్గా గ్రామ శివారులో గురువారం పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వారి నుంచి రూ.11,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
● పలువురికి గాయాలుభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భైంసా ఆస్పత్రికి తరలించారు. -
సినిమా థియేటర్లకు విశ్రాంతి
● పది రోజులపాటు ప్రదర్శనల నిలిపివేతకు ఎగ్జిబిటర్ల నిర్ణయం ● చిన్న సినిమాలకు తగ్గుతున్న ప్రేక్షకాదరణ ● సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లు వెళ్లలేని పరిస్థితులు ● వేసవిలో విడుదలకు నోచుకోని అగ్రహీరోల సినిమాలు బెల్లంపల్లి: సామాన్య, సగటు ప్రేక్షకులకు అతి తక్కువ ధరలో వినోదం అందిస్తున్న సినిమా థియేటర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలోని పలు థియేటర్లు ప్రేక్షకులు రాక.. ఆటలు ప్రదర్శించే పరిస్థితులు లేక నష్టాలు చవి చూస్తున్నాయి. కాసులు రాబట్టుకునే సమయంలో ఈసారి కొత్త సమస్య ఎదుర్కొంటున్నాయి. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత వరుసగా అగ్రహీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల కావాల్సి ఉండగా ఈ దఫా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు మూడు నెలల నుంచి ప్రముఖ నటుల సినిమాలు కానరాకుండా పోగా, కొందరు హీరోల సినిమాలు నిర్మాణ దశల్లో, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నూతనంగా నిర్మిస్తున్న సినిమాల విడుదలకు ప్రతిబంధకాలు ఏర్పడగా థియేటర్లలో ప్రదర్శనలు జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో మంచిర్యాల, సీసీసీ, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్, జన్నారంలో మొత్తంగా 13 సినిమా థియేటర్లు ఉన్నాయి. మంచిర్యాలతోపాటు ఇతర ప్రాంతాల థియేటర్లలో సినిమాల ప్రదర్శలు సరిగా జరగక సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో కొన్నాళ్ల క్రితం నుంచే థియేటర్లు మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, సీసీసీ నస్పూర్, లక్సెట్టిపేట, మ్యాదరిపేటలో ఉన్న 8 థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకాదరణ లేక, లాభాలు రాకపోగా కనీసం సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు సైతం చెల్లించేందుకు ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తలెత్తి అనివార్యంగా మూసి వేశారు. వీటిలో కొన్నింటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చగా, మరికొన్ని వృథాగా మారి నాటి దర్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజా పరిస్థితుల ప్రభావం కొత్త సినిమాల జాడ లేకపోవడంతో తాజాగా పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చే యాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆయా థి యేటర్ల గేట్లకు తాళం పడనుంది. చిన్నాచితక సి నిమాలను ప్రదర్శించినా సరిగా కలెక్షన్లు రాక నష్టాలపాలయ్యే కన్నా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యాకనే తెరవాలని నిర్ణయం తీసుకుంది. సాంకేతికత పెరిగి.. సాంకేతిక రంగం విస్తరించి ఇళ్లలో ఓటీటీలు, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో సినిమా థియేటర్లకు ఆదరణ కరువవుతోంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి ముందే బెల్లంపల్లిలో ఓ ప్రముఖ సినిమా థియేటర్ గత వారం నుంచే ప్రదర్శనలు నిలిపివేసింది. చిన్న సినిమాలు నడవడం లేదు సినిమా టాకీసుల్లో చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండడం లేదు. సరైన కలెక్షన్లు రావడం లేదు. రోజుకు గరిష్టంగా కనీసం రూ.8 వేలకు తగ్గకుండా ఆదాయం రావాలి. కానీ రూ.5 వేలకు లోబడి వస్తున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించలేని, కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నాయి. కలెక్షన్లు లేక మా థియేటర్లో వారం రోజుల క్రితం నుంచి ప్రదర్శనలు నిలిపేశాం. డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీతో థియేటర్లకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బంది వీధిన పడకుండా ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అవకాశం కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – సయ్యద్ కమర్ పాషా, సినిమా థియేటర్ మేనేజర్, బెల్లంపల్లి కనీస ఖర్చులు రావడం లేదు సినిమా థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. రోజువారీగా సినిమా వేస్తే కనీస ఖర్చులు కూడా రావడం లేదు. లాభం రాకపోగా నష్టాలను చవి చూడాల్సి వస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షోలను నిలిపి వేయాల్సి వస్తోంది. నష్టాల బాట పట్టిన థియేటర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలి. – ఎర్ర సంపత్, రాఘవేంద్ర థియేటర్ యాజమాని, జన్నారం -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన అడిగం నగేష్ జాతీయ రహదారి పక్కనుంచి వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుబోథ్: మండలంలోని పొచ్చెర బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన ఆడె లక్ష్మణ్, విష్ణు బోథ్ మండలంలోని కంటెగాంలో ఓ పెళ్లి వేడుకకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో పొచ్చెర బ్రిడ్జి వద్ద కారును తప్పించబోయి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా బోథ్లోని ప్రధాన ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి కడెం: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మ్యాడరపు అనిల్ (25) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్ గ్రామానికి చెందిన అనిల్ లక్ష్మీపూర్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. బైక్పై గ్రామ శివారులోకి వచ్చిన అనిల్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
స్విమ్మింగ్పూల్లో స్విచ్ల ధ్వంసం
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రి యదర్శిని క్రీడా మైదానంలో గల స్విమ్మింగ్ పూల్ కు విద్యుత్ సరఫరా చేసే బోర్డులను గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం మధ్యాహ్నం రేకుల తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు స్విమ్మింగ్ ఫూల్కు నీటిని సరఫరా చేసే మోటార్లకు అనుసంధానమైన స్విచ్ బోర్డులు, ప్యూజ్లను ధ్వంసం చేసి చెల్లాచెదురుగా పడేశారు. వైర్లను సైతం కత్తిరించారు. కాగా అక్కడి అధికారులు, సిబ్బంది దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై డీఎస్డీఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement